బాలాజీ జెండాకు వీడ్కోలు..
Published Tue, Sep 27 2016 5:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
మద్నూర్ :
మండల కేంద్రంలో తొమ్మిది రోజులుగా కొలువుదీరిన తిరుమలేశుడి జెండాకు భక్తులు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాలాజీ జెండా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా తిడుగుతూ భక్తుల ప్రత్యేక పూజలు అందుకుంది. గోవిందుడి నామస్మరణతో వీధివీధి మారుమోగింది. ప్రతి ఏడాది బాలాజీ జెండా 9 రోజుల పాటు ప్రతిష్టాపించిన అనంతరం కోడిచిరలో ఐదు రోజుల పాటు కొలువుదీరుతుందని జెండా కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు జెండా తరలివెళ్తుందన్నారు. జెండా వెంట భక్తులు గ్రామ పొలిమేర వరకు భజనలు చేస్తూ వెళ్లారు.
Advertisement
Advertisement