Flag
-
Republic Day 2025: జెండా ఎగురవేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని తన అధికారిక నివాసంలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.ఈ రోజున భారతదేశం తన రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా సార్వభౌమ, సంపన్న, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత దేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రం దక్కించుకుంది. భారతదేశం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్ను రూపొందించే బాధ్యత బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్కు అప్పగించారు. ఆయన 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభకు ముసాయిదాను సమర్పించారు. 1950 జనవరి 26న భారతదేశం సొంత రాజ్యాంగాన్ని అమలు చేసిందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
ఆరు వందేభారత్లకు మోదీ పచ్చ జెండా
న్యూఢిల్లీ: ఆరు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల రాకతో 54గా ఉన్న వందేభారత్ రైళ్ల సంఖ్య 60కి చేరిందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రధాని మోదీ ఆదివారం నాడు జార్ఖండ్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఆరు నూతన వందేభారత్ రైళ్లు టాటా నగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటా నగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మధ్య నడుస్తాయి.ఈ కొత్త వందే భారత్ రైళ్లు దేవఘర్లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, కాళీఘాట్, కోల్కతాలోని బేలూర్ మఠం వంటి మతపరమైన ప్రదేశాలకు త్వరగా చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది కాకుండా ఈ రైళ్లు ధన్బాద్లో బొగ్గు గనుల పరిశ్రమను, కోల్కతాలోని జనపనార పరిశ్రమను, దుర్గాపూర్లో ఇనుము, ఉక్కు పరిశ్రమను చూపిస్తాయి.ఇది కూడా చదవండి: కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లుమొదటి వందే భారత్ రైలు 2019, ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యింది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యేక ప్రయాణ అనుభూతిని అందజేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు వందే భారత్ మొత్తం సుమారు 36,000 ప్రయాణాలను పూర్తి చేసింది. 3.17 కోట్ల మంది ప్రయాణీకులకు ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. #WATCH | PM Modi virtually flags off the Tatanagar-Patna Vande Bharat train at Tatanagar Junction Railway Station.He will also lay the foundation stone and dedicate to the nation various Railway Projects worth more than Rs. 660 crores and distribute sanction letters to 20,000… pic.twitter.com/vNiDMSA6tK— ANI (@ANI) September 15, 2024 -
Bangladesh: నిరసనల మధ్య.. జెండాల విక్రేత కథ వైరల్
సాధారణంగా ఎక్కడైనా నిరసన ప్రదర్శనలు జరిగినప్పుడు దానిలో పాల్గొన్నవారు జెండాలను, ప్లకార్డులను పట్టుకోవడాన్ని మనం చూస్తుంటాం. వీటిని ప్రదర్శించడం ద్వారా వారు తమ వాదనను బలంగా వినిపిస్తుంటారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో విద్యార్థులు స్థానిక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రతిరోజూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. వీరికి జెండాలను, హెడ్ బ్యాండ్లను విక్రయిస్తూ ఓ వ్యాపారి అత్యధికంగా సంపాదిస్తున్నాడు.ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య రాజధాని ఢాకాలో జాతీయ జెండాలు, హెడ్బ్యాండ్లకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. దీనిని గుర్తించిన సుమన్(35) అనే వ్యాపారి నిరసనకారులకు అవసరమైన జెండాలను, హెడ్ బ్యాండ్లను విక్రయిస్తున్నాడు. 1989లో ఢాకాలో జన్మించిన సుమన్, బంగ్లాదేశ్ జెండాలతో పాటు మూడు వేర్వేరు సైజుల హెడ్బ్యాండ్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తాను రూపొందిస్తున్న బంగ్లాదేశ్ జాతీయ జెండాలకు, గ్రీన్ హెడ్బ్యాండ్లు విద్యార్థులు విరివిగా కొనుగోలు చేస్తున్నారని తెలిపాడు.సుమన్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఢాకాలోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాను. నా పేరు విన్నవాళ్లంతా నా తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందిన వారని అనుకుంటారు. అయితే అది నిజం కాదు. మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు, మా ఇంటిపక్కన ఉండే ఓ హిందూ మహిళ నాకు సుమన్ అనే పేరు పెట్టింది. భారతీయ సంతతికి చెందిన నా తండ్రి 1971లో కలకత్తా నుండి ఢాకాకు వచ్చి, ఇక్కడ స్థిరపడ్డారు. నేను పెరిగి పెద్దయ్యాక జాతీయ జెండాలు రూపొందిస్తూ, వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాను. ఇటీవలి కాలంలో తాను 1,500 జెండాలు, 500 హెడ్బ్యాండ్లను విక్రయించానని’ తెలిపారు. సుమన్ తన జీవనోపాధి కోసం 2018 నుండి జెండాలు విక్రయిస్తున్నాడు. ఢాకాలో క్రికెట్ మ్యాచ్ల సమయంలో కూడా సుమన్ జాతీయ జెండాలను విక్రయిస్తుంటాడు. STORY | Meet Mohd Suman: Flag-seller who saw #Dhaka protests up, close and personalREAD: https://t.co/X303wK81Nj(PTI Photo) pic.twitter.com/Ux18GikLbg— Press Trust of India (@PTI_News) August 27, 2024 -
నటుడు విజయ్ ‘పొలిటికల్ పార్టీ’ జెండా ఆవిష్కరణ (ఫొటోలు)
-
టీవీకే జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్, స్టార్ హీరో విజయ్ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా, గుర్తును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో ఆయన తల్లిండ్రులు, మద్దతుదారులు, ఫ్యాన్స్ పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ కసరత్తు చేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.#WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay unveils the party's flag and symbol today.(Source: ANI/TVK) pic.twitter.com/J2nk2aRmsR— ANI (@ANI) August 22, 2024 #WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay takes pledge along with party workers and leaders at the party office in Chennai "We will always appreciate the fighters who fought and sacrificed their life for the liberation of our country… pic.twitter.com/amiti3rBC2— ANI (@ANI) August 22, 2024 -
Pakistan: జెండాలు విక్రయిస్తున్న దుకాణంపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
పాకిస్తాన్ ఈరోజు(ఆగస్టు 14)న 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటోంది. అయితే ఈ సమయంలోనూ పాక్లో విషాదం చోటుచేసుకుంది. కొందరు ఉగ్రవాదులు బలూచిస్తాన్ ప్రావిన్స్లో జాతీయ జెండాలు విక్రయిస్తున్న దుకాణంతో పాటు ఒక ఇంటిపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఈ గ్రూప్ జాతీయ జెండాలను విక్రయించవద్దని, ఆగస్టు 14న సెలవుదినాన్ని జరుపుకోవద్దని దుకాణాల యజమానులను హెచ్చరించింది. కాగా ఈ దాడిలో గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ సహకారం అందించాలన్నారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దాడులు తీవ్రమయ్యాయి. 2022, 2023లలో కూడా పాక్ జెండాలను విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు జరిగాయి. -
Independence Day 2024: ఎర్రకోటపై జెండా ఎగురవేయని ఇద్దరు ప్రధానులు
అది 1947.. ఆగస్టు 15.. భారతదేశం బ్రిటీషర్ల బానిసత్వం నుంచి విముక్తి పొందింది. 200 ఏళ్లుగా బ్రిటిష్ పాలనకు చిహ్నంగా ఉన్న యూనియన్ జాక్ జెండా అవనతం అయ్యింది. భారత జాతీయ జెండా రెపరెపలాడింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా స్వతంత్ర భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవాన భారత ప్రధాని ఎర్రకోట ప్రాకారాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇక్కడి నుంచి అత్యధికంగా 17 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు.అయితే స్వతంత్ర భారతంలో ఇద్దరు ప్రధానులు తమ హయాంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయారు. మాజీ ప్రధానలు గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్ ఈ జాబితాలో ఉన్నారు. గుల్జారీలాల్ నందా 13 రోజుల చొప్పున రెండుసార్లు ప్రధాని అయ్యారు.1964 మే 27 నుండి జూన్ 9 వరకు మొదటిసారి, 1966 జనవరి 11 నుండి జనవరి 24 వరకు రెండవసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని చంద్రశేఖర్ విషయానికొస్తే ఆయన 1990 నవంబర్ 10 నుండి 1991, జూన్ 21 వరకు 8 నెలల పాటు ప్రధానిగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ వీరిద్దరి పాలనా కాలాలలో రాకపోవడంతో వీరికి ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం దక్కలేదు. -
ఇళ్లపై జాతీయజెండా ఎగురవేయాలి: కిషన్రెడ్డి పిలుపు
సాక్షి,హైదరాబాద్: ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురేవయాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కోరారు. ఆదివారం(ఆగస్టు11) హైదరాబాద్లోని రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీని కిషన్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.‘జెండా పండుగ ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని తిరంగా యాత్రను నిర్వహిస్తాం. గత ఆగస్టు 15న సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మళ్లీ ఈసారి అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు’అని కిషన్రెడ్డి తెలిపారు. -
Independence Day 2024: 16 రాష్ట్రాలకు గ్వాలియర్ త్రివర్ణ పతాకాలు
కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్లో తయారైన త్రివర్ణ పతాకాలను 16 రాష్ట్రాల్లో ఎగురవేయనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి 14 రాష్ట్రాలకు అందించేందుకు త్రివర్ణ పతాకాలను తయారు చేసేవారు. ఇప్పుడు కేరళ, కర్నాటక రాష్ట్రాలకు అందించేందుకు కూడా ఇక్కడే జాతీయ జెండాలను తయారుస్తున్నారు. గ్వాలియర్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎనిమిది వేల త్రివర్ణ పతాకాలను పంపించారు.తాజాగా మరో రెండు వేల త్రివర్ణ పతాకాలకు ఆర్డర్లు అందాయి. ఈ సందర్భంగా కేంద్ర భారత ఖాదీ యూనియన్ కార్యదర్శి రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం అనే ప్రభుత్వ నినాదం చురుగ్గా సాగుతున్నదన్నారు. గ్వాలియర్కు చెందిన 196 మందితో కూడిన బృందం త్రివర్ణ పతాకాలను రూపొందిస్తోంది. -
Paris Olympics 2024: ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా మనూ భాకర్
పారిస్ ఒలింపిక్స్లో తన అద్భుత ప్రదర్శన ద్వారా దేశానికి రెండు పతకాలు అందించిన స్టార్ షూటర్ మనూ భాకర్కు మరో గౌరవం దక్కింది. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గా రికార్డుల్లోకెక్కిన మనూ... ‘పారిస్’ క్రీడల ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరించ నుంది. ఈనెల 11న జరగనున్న ముగింపు వేడుకల్లో మనూ.. జాతీయ జెండా చేబూని భారత బృందాన్ని నడిపించనుంది. ‘ముగింపు వేడుకల్లో మనూ ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనుంది. దీనికి భాకర్ పూర్తి అర్హురాలు’ అని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకల్లో ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనున్న పురుష అథ్లెట్ పేరు తర్వాత ప్రకటించనున్నారు. -
పతాకధారిగా శరత్ కమల్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరిస్తాడు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల శరత్ ఐదోసారి ఒలింపిక్స్లో పోటీపడనున్నాడు. మహిళల బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ భారత జట్టుకు ‘చెఫ్ డి మిషన్’గా వ్యవహరిస్తుందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. -
10 ‘వందే భారత్’లకు ప్రధాని మోదీ పచ్చ జెండా!
దేశంలోని ప్రజలకు మరో పది నూతన వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 10 నూతన వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అలాగే ఇతర రైల్వే సేవలను కూడా స్వాగతించారు. ‘రైల్వేని నరకం నుంచి బయటపడేశాం’ ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతీయ రైల్వేలను నరకం లాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. తమ సంకల్ప శక్తికి సజీవ నిదర్శనం రైల్వేల అభివృద్దేనని అన్నారు. దేశంలోని యువత ఎలాంటి దేశం, ఎలాంటి రైళ్లు కావాలో నిర్ణయించారన్నారు. తమ ఈ పదేళ్ల కృషి కేవలం ట్రైలర్ మాత్రమేనని, మనం మరింత ముందుకు సాగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ కూడా పాల్గొన్నారు. 10 రైళ్ల వివరాలు ఇవే.. అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ సికింద్రాబాద్-విశాఖపట్నం మైసూరు- డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై) పాట్నా- లక్నో న్యూ జల్పాయిగురి-పాట్నా పూరీ-విశాఖపట్నం లక్నో – డెహ్రాడూన్ కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు రాంచీ-వారణాసి ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్) మరోవైపు.. కొత్తవలస-కోరాపుట్,.. కోరాపుట్-రాయగఢ్ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్లో కొన్ని పనులు ప్రారంభించారు మోదీ. మొత్తం 85వేల కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. Honourable PM @narendramodi ji virtually flags off Second Vande Bharat Express between Secunderabad & Visakhapatnam, facilitating swift connectivity between #Telangana & #AndhraPradesh.#VandebharatExpress #ModiKiGuarantee pic.twitter.com/t8nDqOlqzi — Dr K Laxman (Modi Ka Parivar) (@drlaxmanbjp) March 12, 2024 ప్రారంభించిన కిషన్రెడ్డి సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా... సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య రెండో రైలు కాగా... మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది. Live: Flagging off 4th Vande Bharat Train From Telangana, Secunderabad - Visakhapatnam (Train Number 20707), Secunderabad Railway Station. https://t.co/wkmmWP0wth — G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 12, 2024 మహాత్మునికి ప్రధాని మోదీ నివాళులు అహ్మదాబాద్లోని సబర్మతిలోగల మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొచరబ్ ఆశ్రమాన్ని, గాంధీ ఆశ్రమం మెమోరియల్ మాస్టర్ ప్లాన్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. నేడు (మంగళవారం) ప్రధాని మోదీ గుజరాత్, రాజస్థాన్లలో పర్యటిస్తున్నారు. #WATCH | Prime Minister Narendra Modi offers floral tributes to Mahatma Gandhi at Mahatma Gandhi Ashram at Sabarmati, in Ahmedabad, Gujarat. He will inaugurate Kochrab Ashram and launch the Master plan of Gandhi Ashram Memorial here. pic.twitter.com/x95WUUF7Tt — ANI (@ANI) March 12, 2024 -
స్టాలిన్ బర్త్డే.. బీజేపీ ‘కౌంటర్’ విషెస్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ, అందులో ఆయనకు కౌంటరే వేసింది. ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ యాడ్పై రాష్ట్ర మత్స్య మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ వివరణ కూడా ఇచ్చారు. ‘ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. మాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది’ తెలిపారు. అయితే.. వివాదాన్ని కొనసాగిస్తూ.. సీఎం స్టాలిన్కు మాండరీన్ భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు(స్టాలిన్కు) ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ‘ఎక్స్’(ట్విటర్)లో బీజేపీ కౌంటర్ వేసింది. On behalf of @BJP4Tamilnadu, here’s wishing our Honourable CM Thiru @mkstalin avargal a happy birthday in his favourite language! May he live a long & healthy life! pic.twitter.com/2ZmPwzekF8 — BJP Tamilnadu (@BJP4TamilNadu) March 1, 2024 అంతకు ముందు.. తిరునెల్వేలిలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ డీఎంకేపై విమర్శలు సంధించారు. ‘ప్రస్తుతం హద్దులు దాటేశారు. ఇస్రో లాంచ్ చేసే రాకెట్కు చైనా స్టిక్కర్ను అతికించారు. ఇది మన అంతరిక్ష శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని అవమానించడమే. ప్రజల పన్ను, డబ్బు, దేశాన్ని అవమానించటమే’అని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు డీఎంకే ఊరుకోలేదు.. కౌంటర్ ఇచ్చింది. తూర్పు లడఖ్లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా చొరబాట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటి చూపు కూడా సన్నగిల్లిందేమో.. మోదీ చైనా జెండాను పేపర్ యాడ్లో నిశిత దృష్టితో చూడగలరు. కానీ, గత పదేళ్లలో భారత భూభాగంలో చైనా జెండా పాతిందనే నివేదికలు ఆయన కళ్లను కప్పేశాయయేమో అని డీఎంకే ఎంపీ పి విల్సన్ విమర్శించారు. -
ఇమ్రాన్ ఖాన్ పార్టీ జెండా ఎగురవేసినందుకు.. కన్న కొడుకునే హత్య
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ముందు ఓ కుటుంబంలో పార్టీ జెండా చిచ్చు పెట్టింది. ఆ చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తనకు నచ్చని పార్టీకి సంబంధించిన జెండాను ఇంటిపై ఎగురువేసినందుకు ఓ తండ్రి తన కన్న కొడుకునే హతమార్చాడు. ఈ ఘటన పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని పెషావర్ శివార్లలో ఉన్న ఓ కుటుంబంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెషావర్ శివార్లలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి ఎంత వద్దని చెప్పినా కొడుకు తనకు నచ్చిన పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి చెందిన జెండాను ఇంటిపై ఎగురవేశాడు. దీంతో తండ్రీ కొడుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన తండ్రి తుపాకితో కొడుకును కాల్చాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేదు. మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కొడుకును చంపిన తండ్రి పారారీలో ఉన్నారుని చెప్పారు. కొడుకును హత్య చేసిన తండ్రి కోసం వెతుకుతున్నామని పోలీసు అధికారి నసీర్ ఫరీద్ మీడియాకు వెల్లడించారు చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు -
Ayodhya: రాముని గుడి బయట గొడవ.. కాంగ్రెస్ జెండా ధ్వంసం
అయోధ్య: రామ మందిరం ముందు ఘర్షణ చోటు చేసుకుంది. గుడి బయట కొంత మంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ జెండాను చించి వేశారు. జెండాను చించి వేసిన వ్యక్తులకు, కాంగ్రెస్ నేతల మధ్య గొడవ పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈ నెల 22న జరిగే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాబోమని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు, జాతీయ పార్టీ సీనియర్ నేతలు కొందరు మాత్రం మకర సంక్రాంతి పర్వదినాన సోమవారం అయోధ్య రామ మందిరానికి వెళ్లారు. వీరు అక్కడికి చేరుకోక ముందే గొడవ జరిగింది. కాంగ్రెస్ జెండాను కొంత మంది ధ్వంసం చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ మతం పేరుచెప్పి చెత్త రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినేట్ మండిపడ్డారు. #WATCH | Few people seen vandalising Congress flag outside Ayodhya Ram temple A Congress delegation comprising Ajay Rai and Deepender Hooda is on Ayodhya visit today pic.twitter.com/fTSOSUurpI — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఇదీచదవండి.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు -
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు?
ప్రపంచంలోని ప్రతి దేశానికి సొంత జాతీయ జెండా ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల జెండాలు ఇతర దేశాల జెండాలకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ జెండాలలో ఓ ప్రత్యేకత ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలకు ఒక మూలన బ్రిటిష్ జెండా కనిపిస్తుంది. ఈ విధంగా ఏ దేశ జాతీయ జెండా కూడా ఉండదు. మరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల జెండాలు ఎందుకు ఇలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాల మూలన యూనియన్ జాక్ ఎందుకు కనిపిస్తుందంటే..ఈ రెండు దేశాలు బ్రిటిష్ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. ఇవి బ్రిటిష్ కామన్వెల్త్ దేశంలో భాగంగా ఉన్నాయి. యూనియన్ జాక్ దీనికి చిహ్నంగా నిలుస్తుంది. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. యూనియన్ జాక్ అనేది న్యూజిలాండ్ చారిత్రక పునాదిని గుర్తిస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ జెండాలో ఆరు తెల్లని నక్షత్రాలు ఉన్నాయి. న్యూజిలాండ్ జెండాలో నాలుగు ఎరుపు నక్షత్రాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని యూనియన్ జాక్ను మొదటిసారిగా 1770, ఏప్రిల్ 29న కెప్టెన్ కుక్ స్టింగ్రే హార్బర్లో ఎగురవేశారు. ఈ రెండు దేశాలకు సంబంధించిన పలు అంశాలు బ్రిటన్ను పోలివుంటాయి. ఇది కూడా చదవండి: చదువు ఎలా మొదలయ్యింది? ఎందుకు అవసరమయ్యింది? -
ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? వారిని ఎలా కాపాడుతుంది?
ఇజ్రాయెల్ జెండాలో మనకు కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని అంటారు. 14వ శతాబ్దం మధ్యకాలం నుండి యూదులు తమ జెండాపై ఈ గుర్తును ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కారణంగా చాలామంది ఇజ్రాయెల్తో పాటు యూదుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు. ఇదేవిధంగా కొందరు జుడాయిజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ జెండాపై ఉన్న నీలి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ గుర్తును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గుర్తుతో వారి చరిత్రకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇజ్రాయెల్ జెండాలో కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని చెబుతారు. 14వ శతాబ్దం నుండి యూదులు ఈ గుర్తును తమ జెండాపై ముద్రిస్తున్నారు. తరువాతి కాలంలో అది యూదుల మత చిహ్నంగా మారింది. దీనితో పాటు 1896 సంవత్సరంలో జియోనిస్ట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ జెండాను చేతబట్టారు. యూదులు అధికారికంగా 1948, అక్టోబర్ 28న దీనిని ఇజ్రాయెల్ జెండాగా స్వీకరించారు. భూమిపై ప్రళయం వచ్చినప్పుడు ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదు మతానికి చెందిన ప్రజలు గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ నక్షత్రాన్ని డేవిడ్ షీల్డ్ అని కూడా అంటారు. చరిత్రకారులు ఈ నక్షత్రాన్ని 3500 సంవత్సరాల క్రితమే యూదులు స్వీకరించారని భావిస్తారు. హిబ్రూ, ఇజ్రాయెల్ బానిసలు తాము ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు ఈ నక్షత్రాన్ని స్వీకరించారు. ఈ నక్షత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది నక్షత్రం కాదని, రెండు త్రిభుజాల కలయిక అని అనిపిస్తుంది. కిందునున్న త్రిభుజం డేవిడ్ రాజు చిహ్నం అని, పైన కనిపించేది డేవిడ్ పట్టుకున్న డాలు అని చెబుతారు. ఇది కూడా చదవండి: భారత రైతులు ఇజ్రాయెల్పై ఎందుకు ఆధారపడుతున్నారు? -
పార్టీ ఏదైనా..జెండా తయారయ్యేది అక్కడే
-
దశాబ్దాల స్వప్నం సాకారమైంది!
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సిద్దిపేట– సికింద్రా బాద్ రైలును నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి హరీశ్రావు జెండా ఊపి ప్రారంభించి.. అనంతరం రైలులో ప్రయా ణించారు. కొండపాక మండలం దుద్దెడ స్టేషన్లో దిగి కొండపాక మండలంలో ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రైలులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు. బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నినాదాలు.. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ది పేట రైల్వే స్టేషన్కు బీఆర్ఎస్, బీజేపీ కార్య కర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు వల్లే సిద్దిపేటకు రైలు వచ్చిందని, బీజేపీ కార్యకర్తలు మోదీ వలనే సిద్దిపేటకు రైలు వచ్చిందని పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు, తమ పార్టీకి చెందిన జెండాలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్రావు రైలు ప్రారంభించేందుకు అక్కడకు చేరుకున్నారు. ప్లెక్సీలో సీఎం కేసీఆర్, స్థానిక ఎంపీ ఫొటోలను ఏర్పాటు చేయకపోవడంతో రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహసనం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రాలను ప్రదర్శిస్తున్న ఎల్ఈడీ టీవీని పక్కన పెట్టించారు. అప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రి క్తత నెలకొంది. స్టేజీ పైన మోదీ చిత్రంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేశారు. దీంతో కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగారు. కుర్చీలు, పార్టీల జెండాలను విసురుకోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి తదితరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రైల్వే పోలీసు చంద్రశేఖర్కు తలకు కూడా గాయమైంది. సొమ్ము ఒకడిది...సోకు ఒకడిది: హరీశ్ సిద్దిపేటకు రైల్వే లైన్ కోసం రూ. 310 కోట్ల వ్య యంతో 2,508 ఎకరాల భూమిని సేకరించి రైల్వే శాఖకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.330 కోట్లను చెల్లించామని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇంత కష్టపడితే కనీసం సీఎం ఫొటోను పెట్టకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దెడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొండపాక ఐవోసీ బిల్డింగ్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీజేపీ వాళ్లు రైలు వాళ్ల వల్లే వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. -
ఇంటిపై పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్
ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్లోని ఒక ఇంటిపై పాకిస్తాన్ జండా ఎగురవేసిన ఉదంతం వెలుగు చూసింది. ఎవరో దీనికి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంగతి పోలీసుల వరకూ చేరడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆ పాక్ జెండాను అక్కడి నుంచి తొలగించడంతో పాటు ఇంటి యజమానితో పాటు అతని కుమారునిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఈ ఉదంతం భగత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుఢాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఒక వస్త్రవ్యాపారి ఇంటిపై పాక్ జండా ఎగురుతున్నదని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పాక్ జెండాను గమనించి దానికి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేశారు. అనంతరం జండాను తొలగించారు. అదే ఇంటిలో ఉంటున్న రయూస్(45), అతని కుమారుడు సల్మాన్(25)లను అరెస్టు చేశారు. వీరిద్దరిపై 153ఏ, 153బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి, విచారించిన అనంతరం కోర్టుకు అప్పగించారు. ఈ ఉదంతం గురించి ఎస్ఎస్పీ హెమరాజ్ మీణా మాట్లాడుతూ నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, కేసు దర్యాప్తులో ఉన్నదని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ అంటే ఏమిటి? మణిపూర్ అల్లర్లను ఎలా నియంత్రించనున్నారు? -
వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే..
స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంటే ఆగస్ట్ 15న చాలా మంది తమ వాహనాలపై త్రివర్ణ పతాకం పెట్టుకోవడాన్ని చూసేవుంటాం. అయితే ఇది చట్టవిరుద్ధం. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని వివరాల ప్రకారం కొందరు ప్రముఖులకు మాత్రమే తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్న ఉంచే హక్కు ఉంది. వీరుకాకుండా మరెవరైనా తమ కారుపై త్రివర్ణ పతాకాన్ని తగిలించడం చట్టవిరుద్ధం అవుతుంది. అయితే ఇంతకీ తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచే అర్హత కలిగినవారెవరో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా- 2002లోని సెక్షన్ IX ప్రకారం కొందరు ప్రముఖులు మాత్రమే తమ వాహనాలపై జాతీయ జెండాను ప్రదర్శించే హక్కును కలిగి ఉంటారు. ఈ జాబితాలోని వారు వరుసగా.. రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ విదేశాల్లోని భారతీయ మిషన్లు/ప్రతినిధులు, వారు నియమితులైన దేశాల్లో.. ప్రధాన మంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉప మంత్రులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ముఖ్యమంత్రులు, ఇతర క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర మంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉప మంత్రులు స్పీకర్, లోక్సభ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, లోక్సభ రాష్ట్రాలలోని శాసన మండలి స్పీకర్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల స్పీకర్లు రాష్ట్రాలలోని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల డిప్యూటీ స్పీకర్లు భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుల న్యాయమూర్తులు ఇది కూడా చదవండి: ‘ఇసుకపై చంద్రయాన్-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు -
రుషికొండలో బ్లూ ఫ్లాగ్ రెపరెపలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అందాల తీరానికి అంతర్జాతీయ హంగులద్దుతున్నారు. స్వచ్ఛత, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యావరణ హితంగా.. పర్యాటక స్వర్గధామంగా ఉన్న బీచ్లకు విదేశీ గుర్తింపు లభిస్తోంది. డెన్మార్క్కు చెందిన అధ్యయన సంస్థ అందించే ఈ ధ్రువపత్రం వస్తే చాలు.. ఆ బీచ్లకు విదేశీయులు క్యూ కడతారు. అంతర్జాతీయ సాగరతీరంగా గుర్తింపు పొందుతూ.. సురక్షితమైన బీచ్ల జాబితాలో భారత్కు చెందిన 12 ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడుతున్నాయి. వరుసగా మూడో ఏడాది రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎలా వస్తుందంటే.. బ్లూ ఫ్లాగ్ బీచ్లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టీఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక దేశాన్ని సందర్శించేందుకు వెళ్లే విదేశీ పర్యాటకులు ఆ దేశంలో బీచ్ల గురించి శోధించినప్పుడు ముందుగా బ్లూ ఫ్లాగ్ గురించే సెర్చ్ చేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్లు ఉంటే.. ఆ ప్రాంతాన్ని కచ్చితంగా విదేశీ పర్యాటకులు పర్యటిస్తారు. బ్లూ ఫ్లాగ్ ధ్రువ పత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు, జల కాలుష్యం ఉండకూడదు. పర్యావరణ హితంగా ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పరిశ్రమల వ్యర్థాలు కలవకూడదు. సముద్రంలో స్నానం చేసేటపుడు ఆరోగ్యపరమైన భద్రత ఉండాలి. నీటిలో బ్యాక్టీరియా ఉండకూడదు. 150 మీటర్ల వరకు తీరం నుంచి లోపలకు ఇసుక తిన్నెలుండాలి. సముద్రంలో బోటింగ్ సదుపాయం ఉండాలి. ఈ ప్రాజెక్టుకు ఎంపికైన బీచ్లలో ఆయా అంశాల్లో పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టీఫికెట్ ఇస్తారు. బీచ్లో బ్లూ ఫ్లాగ్ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఎవరు ఇస్తారు? 1985లో డెన్మార్క్లో ప్రారంభించిన ’ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’(ఎఫ్ఈఈ) ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్లను అందిస్తోంది. ప్రపంచంలో తొలిసారి ఈ సర్టీఫికెట్ పొందిన దేశం స్పెయిన్. బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్ అందిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ స్పెయిన్ దేశానికి చెందిన సాగరతీరాలు ఎక్కువ సంఖ్యలో బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్స్ను సొంతం చేసుకున్నాయి. స్పెయిన్లో ఇప్పటి వరకు మొత్తం 566 బీచ్లు ఈ సర్టీఫికెట్ పొందగా, గ్రీస్ 515, ఫ్రా న్స్ 395 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ పొందాయి. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్లకు ఈ సర్టీఫికెట్ లభించింది. బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరణ కొమ్మాది(భీమిలి): రానున్న కాలంలో మరిన్ని బీచ్ లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. రుషికొండ బీచ్లో శనివారం బ్లూ ఫ్లాగ్ను జేసీ కె.ఎస్.విశ్వనాథన్, బ్లూ ఫ్లాగ్ ఇండియా ఆపరేటర్ డాక్టర్ కురూప్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్, సమాచారశాఖ జేడీ వి.మణిరామ్ పాల్గొన్నారు. మన దేశంలో 2018లో తొలిసారిగా.. భారతదేశంలోనే కాదు.. ఆసియా ఖండంలో ఈ సర్టీఫికెట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని ’చంద్రబాగ్’ బీచ్. ఇది 2018లో ఈ సర్టిఫికెట్ పొందింది. ఆ తర్వాత ఇండియాలో మరో 12 తీర ప్రాంతాలను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ పొందే స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని పర్యావరణశాఖ ఆధ్వర్యంలో పని చేసే సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్ మెంట్కు అప్పగించింది. తొలి సారిగా భారత్కు చెందిన 13 బీచ్లు ఇందుకు అర్హత సాధించగా.. ఇప్పటి వరకూ 12 బీచ్లలో బ్లూ ఫ్లాగ్ ఎగురుతోంది. ఇవీ బ్లూ ఫ్లాగ్ బీచ్లు.. మొత్తంగా 12 బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉండగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క తీరంలో నీలి జెండా రెపరెపలాడుతోంది. 2020 అక్టోబర్ 10న రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ దక్కింది. అప్పటి నుంచి వరుసగా మూడేళ్లు ఎఫ్ఈఈ రుషికొండకు బ్లూ ఫ్లాగ్ను రెన్యువల్ చేస్తోంది. ఇంకా మనదేశంలో చంద్రబాగ్, రుషికొండతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. పుదుచ్ఛేరిలోని ఈడెన్ బీచ్, గుజరాత్లోని శివరాజ్ పూర్, డయ్యూలోని ఘోఘ్లా, కర్ణాటకలోని కసర్కోడ్, పడుబిద్రి బీచ్లు, కేరళలోని కప్పడ్, ఒడిశా నుంచి పూరి గోల్డెన్ బీచ్, అండమాన్ నికోబార్ దీవుల నుంచి రాధానగర్ బీచ్, లక్షద్వీప్ నుంచి మినికోయ్ తుండి, కద్మత్ బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టీఫికేషన్ దక్కించుకున్నాయి. -
బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ సమీపంలో జెండాలను తొలగించాం
-
రెండు వర్గాల మధ్య ఘర్షణ..జంషెడ్పూర్లో ఉద్రిక్తత..
జార్ఘండ్లోని జంషెడ్పూర్లో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. శనివారం శ్రీరామ నవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఇరు గ్రూప్లు ఘర్షణకు దిగాయి. నిందితులను పట్టుకోవాని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్లు అదికారులు తెలిపారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లను నియంత్రించేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు శాస్త్రి నగర్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. గుమిగూడి ఉన్నవారిని అక్కడ నుంచి పంపించి.. ఆ ప్రాంతం మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. ఈ మేరకు సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. అల్లర్లుకు సంబంధించిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సాధారణ స్థితికి తీసుకురావడానికి శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరూ సంఘ వ్యతిరేకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, పౌరులు అప్రమత్తమై సహకరించాలని విజయ్ అన్నారు. అలాగే శాంతి భ్రదతల రక్షణ కోసం తగినంత పోలీసు బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీం, ఒక మేజిస్ట్రేట్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు సిబ్బందిని నియమించామని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు. పుకార్లను నమ్మవద్దదని ఎమ్మెల్యే జాదవ్ ప్రజలను కోరారు. పుకార్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా సందేశాలు వస్తే పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. #WATCH | Security forces conduct flag march in Jamshedpur's Kadma police station area following an incident of stone pelting and arson, in Jharkhand Section 144 CrPc is enforced in the area and mobile internet is temporarily banned. pic.twitter.com/NhPnWtkQhR — ANI (@ANI) April 10, 2023 (చదవండి: కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అప్రమత్తంగా ఉండాల్సిందే!) -
ఆరేళ్ల బాలుడి అద్భుత ప్రతిభ.. రెండున్నర నిమిషాల్లోనే..
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన ఒకటో తరగతి బాలుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించాడు. ఆరు సంవత్సరాల నాలుగు నెలల వయసు గల నాదెళ్ల దియాన్‡్ష 128 దేశాల జాతీయ జెండాలను చూసి రెండు నిమిషాల 25 సెకన్లలో గుర్తించి చెప్పాడు. గత నెల 12వ తేదీన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షలో దియాన్‡్ష ఈ ఘనత సాధించాడు. ఆ బాలుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పిస్తూ సర్టిఫికెట్, మెడల్ను రెండు రోజుల క్రితం పంపారు. ఈ విషయాన్ని దియాన్‡్ష తల్లిదండ్రులు ప్రియాంక, గౌతంకృష్ణ శనివారం వెల్లడించారు. తమ కుమారుడు ఇప్పుడు 135 దేశాల జాతీయ జెండాలను గుర్తిస్తున్నాడని తెలిపారు. -
చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను శుక్రవారం భద్రత లోపాల దృష్ట్యా సడెన్గా నిలిపివేసిన సంగతి తెలిసింది. ఆ తదనంతరం శనివారం జమ్మూకాశ్మీర్లోని పుల్వామ జిల్లాల కట్టుదిట్టమైన భద్రత నడుమ పునః ప్రారంభమైంది. ఇక ఈ యాత్ర ముగుస్తున్న తరుణంలో రాహుల్ శ్రీనగర్లోని లాల్చౌక్లో చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా తోపాటు జమ్మూ కాశ్మీర్కు చెందిన పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు కేటాయించిన భద్రతను కాంగ్రెస్ నేతలకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతేగాదు గత రాత్రి నుంచే లాల్ చౌక్కు వెళ్లే అన్ని రహదారులను మూసివేసి, వాహానాల రాకపోకలను నియంత్రించారు. ఈ యాత్ర బౌలేవార్డ్ ప్రాంతంలోని నెహ్రు పార్క్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఎంఏ రోడ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఎస్కే స్టేడియంలో బహిరంగ ర్యాలీ నిర్వహిస్తారు. దీనికి 23 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యూకుమారి నుంచి ప్రారంభమై సుమారు 75 జిల్లాలు పర్యటించి దాదాపు 3,570 కి.మీ పాదయాత్ర చేశారు రాహుల్. #WATCH | Jammu and Kashmir: Congress MP Rahul Gandhi unfurls the national flag at Lal Chowk in Srinagar. pic.twitter.com/I4BmoMExfP — ANI (@ANI) January 29, 2023 (చదవండి: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం) -
జెండా పండుగలో విషాదం
యశవంతపుర: జెండా పండుగ వేళ పలుచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. గుండెపోటుతో ఒకరు, జెండా కడుతూ కిందపడి మరొకరు ప్రాణాలు విడిచారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా కుట్రుపాడి గ్రామ పంచాయతి ఆఫీసులో సోమవారం ఉదయం జెండాను ఎగురవేస్తుండగా మాజీ జవాన్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మాజీ జవాన్ గంగాధర గౌడను ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించారు. అతిథి ప్రసంగిస్తుండగా గంగాధరగౌడ కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జారిపడి గాయాలతో టెక్కీ మృతి హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటిపై జెండా కడుతూ కిందపడి టెక్కీ చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరు హెణ్ణూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. దక్షిణకన్నడ జిల్లా సుళ్యకు చెందిన విశ్వాస్కుమార్ భట్ (33) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. హెచ్బీఆర్ లేఔట్ ఐదో బ్లాక్లో భార్య వైశాలితో కలిసి రెండేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఆదివారం ఇంటి మీద పతాకాన్ని కడుతూ అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ సోమవారం మృతి చెందాడు. (చదవండి: కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం ) -
జాతీయ జెండాపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జెండాకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లాగ్ కోడ్కు స్వల్ప మార్పులు చేసింది. ఇకపై మువ్వన్నెల జెండాను పగలే కాకుండా రాత్రివేళ కూడా ఎగురవేయవచ్చు. అలాగే కేవలం చేతితో తయారు చేసిన కాటన్ జెండాలనే కాకుండా.. మెషీన్లతో చేసే పాలిస్టర్ జెండాలను కూడా ఉపయోగించవచ్చు. ఈమేరకు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971కు సవరణలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా జాతీయ జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఎగురవేసేందుకు అనుమతి ఉంది. పాలిస్టర్, మెషీన్లతో తయారు చేసిన జెండాలను ఉపయోగించడానికి వీల్లేదు. అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమానికి పిలుపునిచ్చింది కేంద్రం. దేశంలోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫ్లాగ్ కోడ్కు మార్పులు చేసింది. చదవండి: అందుకే నా కూతుర్ని టార్గెట్ చేశారు: స్మృతి ఇరానీ -
పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్
-
మంచు ఖండాన.. గ్రీన్ చాలెంజ్ జెండా
సాక్షి, హైదరాబాద్: పర్యా వరణ హితాన్ని కోరుతూ, పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండా ఎగిరింది. ప్రపంచ పర్యా వరణ పరిరక్షణ, కర్బన ఉద్ఘారాలు తగ్గించాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్ ఇండియా వలంటీర్కు స్థానం దక్కింది. పర్యావరణ మార్పులపై 35 దేశాలకు చెందిన 150 మంది సభ్యుల బృందం చేపట్టిన అధ్యయనంలో భాగంగా గ్రీన్ఇండియా అంటార్కిటికాకు ప్రయాణించింది. ఫౌండేషన్–2041 నెలకొల్పి పర్యావరణం కాపాడాలనే ఉద్యమం చేపట్టిన రాబర్ట్ స్వాన్ను అక్కడ గ్రీన్ ఇండియా వాలంటీర్ కలిశారు. తమ ఉద్యమం తీరును వివరించారు. దీన్ని ప్రశంసించిన రాబర్ట్ స్వాన్ స్వయంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండాను అంటార్కిటికాలో ప్రదర్శించారు. అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న వాలంటీర్ అభిషేక్ శోభన్నను ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ అభినందించారు. -
పోలీసులకు షాక్.. అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు.. సీఎం ఫైర్
సిమ్లా: వేర్పాటువాద ఖలిస్తాన్ జెండాలు హిమాచల్ప్రదేశ్లో కలకలం రేపాయి. ఏకంగా అసెంబ్లీ ప్రధాన గేటు, గోడపై ఖలిస్తాన్ జెండాలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ధర్మశాలలో ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై ఖలిస్తాన్ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి గానీ లేక ఆదివారం ఉదయం గానీ ఈ జెండాలను పాతినట్టు తెలిపారు. ఆదివారం ఉదయం జెండా చూసిన వెంటనే తొలగించామన్నారు. అయితే, ఈ జెండాలను పంజాబ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులేనని పెట్టి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ సీరియస్ అయ్యారు. జెండా పాతిన వారికి ధైర్యం ఉంటే రాత్రి కాదు.. పగలు వచ్చి జెండా పెట్టండి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కారకాలను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. Flags of #Khalistan & #Khalistqn written on walls of #dharamshala #VidhanSabha #HimachalPradesh when @himachalpolice take action against these goons put UAPA then so called "s_kh" jathebqndi will say "sadde naal Dhaka hunda" #Shame pic.twitter.com/A4KY5DFhmb — Porus ਪੋਰਸ (@porusofpanjab) May 8, 2022 -
గడ్డకట్టే చలిలో 1500 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ
భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది బుధవారం మంచుతో కప్పబడిన లడఖ్ సరిహద్దుల్లో జాతీయ జెండాను ఎగరువేసింది. దాదాపు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 15000 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు భారత్లో వివిధ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న జవాన్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతేకాదు వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సైనికులు గడ్డకట్టే చలిలో ధైర్యంగా ఎలా ఎదుర్కొంటున్నారో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సైనికులను ఇండో టిబెటన్ హిమవీర్స్ అని కూడా పిలుస్తారు. సైనిక సిబ్బంది భారత్ మాతాకి జై, వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ మేరకు 73వ గణతంత్ర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గౌరవ వందనంతో రాజ్పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. దేశ సామార్థ్యాన్ని, గౌరవాన్ని, సాంస్కృతిని చాటి చెప్పేలా కవాతు ప్రదర్శన, శకటాల ప్రదర్శన వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. -
సోనియాకు చేదు అనుభవం.. ఒక్కసారిగా కిందపడ్డ జెండా.. ‘ఒట్టి’ చేతులతో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం లేక ఇబ్బందులు పడుతోంది. తల్లి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని పార్టీని ముందుండి నడిపిస్తాడనుకున్న రాహుల్ గాంధీ మధ్యలోనే కాడి వదిలేశారు. రాహుల్కే తిరిగి పగ్గాలు అప్పగించాలని కొందరు, లేదు ఫుల్ టైమ్ అధ్యక్షుడు కావాలంటు ‘జీ–23’ (సీనియర్ నేతల అసమ్మతి బృందం) నేతలు అధిష్టానంపై ‘పోరు’పెట్టారు. ఇక ఈ పంచాయితీని పెంచడం ఇష్టం లేక యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీయే తాత్కాలికంగా పార్టీ అధ్యక్ష స్థానంలో కొనసాగుతున్నారు. ఇలా పార్టీ అధిష్టానంలో సఖ్యత కొరవడటంతో శ్రేణులు నీరుగారిపోతున్నాయి. ఈ క్రమంలోనే భారత్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ 137వ ఆవిర్భావ (డిసెంబర్ 28) దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే, పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన అటు సోనియాకు, సీనియర్ నేతలకు, కార్యకర్తలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. (చదవండి: మదర్ థెరిసా సంస్థ బ్యాంకు ఖాతాల స్తంభన) ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం జెండా ఎగురవేస్తున్నప్పుడు అది ఒక్కసారిగా కిందపడిపోయింది. జెండా ఆవిష్కరణ చేయాల్సిన సోనియా దాన్ని నేలపై పడకుండా చేతులతో పట్టుకున్నారు. అక్కడున్న సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసిన ఆమె జెండాను చేతులతో పైకెత్తి పార్టీ శ్రేణులకు చూపించి మిగతా కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (చదవండి: రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్ కన్నుమూత) #WATCH | Congress flag falls off while being hoisted by party's interim president Sonia Gandhi on the party's 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC — ANI (@ANI) December 28, 2021 -
పతాకానికి పరాభవమా?
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): మహారాష్ట్ర కొల్లాపురలో కన్నడ ధ్వజాన్ని దగ్ధం చేయడంపై విధానసభలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. జెండాను దగ్ధం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టాయి. దీంతో గురువారం బెళగావి విధానసభలో కొంత సమయం ఈ ఘటనపై గందరగోళ వాతావరణం నెలకొనింది. ఆ తర్వాత అసెంబ్లీలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ అనంతరం ముక్త కంఠంతో ఈ చర్యను తప్పుపట్టారు. అన్ని పక్షాలు కన్నడ ధ్వజం తగులబెట్టడాన్ని తప్పుపడుతూ సభ ముందుకు వచ్చిన ఖండన తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ సమయంలో రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ ఎమ్మెల్యే ప్రశ్నలకు బదులివ్వబోతుండగా విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. కన్నడ ధ్వజాన్ని దగ్ధం చేసిన దుండగులకు సరైన సందేశాన్ని పంపాలని జేడీఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. మరాఠా మండలి కోసం యత్నాళ్ గళం మరోవైపు బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యత్నాల్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా మరాఠా అభివృద్ధి నిగమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మొగలు చక్రవర్తులకు వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ పోరాడి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు. మంత్రి ఆర్.అశోక్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మరాఠ అభివృద్ధి నిగమ సాధ్యం కాదని చెప్పారు. అతి త్వరలో రూ. 50 కోట్లను విడుదల చేసి మరాఠా సముదాయ అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు. -
శివసేనపై హోంమంత్రి ఆగ్రహం
సాక్షి, బనశంకరి(కర్ణాటక): శివసేన కార్యకర్తలు కన్నడ పతాకాన్ని కాల్చివేయడం సరైన చర్య కాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నమని హోంమంత్రి అరగజ్ఞానేంద్ర మండిపడ్డారు. బుధవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ... మరాఠీలు, కన్నడిగులు అనే భేదభావం లేకుండా ప్రజలు ఉన్నారన్నారు. కానీ కొందరు శాంతికి భంగం కలిగించేందుకు యత్నిస్తున్నారు, దీనిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామన్నారు. ఈ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అనేక ధర్నాలు జరుగుతున్నాయని, వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. కాగా, పోలీసుల వసతి, వేతన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్సభ -
TANA: పింగళి వెంకయ్య కుమార్తెకు సన్మానం
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సన్మానించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘము (తానా) అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గుంటూరు జిల్లా మాచర్లలోని సీతామహాలక్ష్మీ ఇంటికి వెళ్లి ఆమెను పరామార్శించారు. ఆ తర్వాత తానా తరఫున జ్ఞాపిక అందించి పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సంధర్భంగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న భారతీయులందరూ మన త్రివర్ణ పతాకాన్ని వినువీధుల్లో రెపరెపలాడిస్తూ.. భారత దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో జరుపుకునేందుకు సమాయత్తం అవుతున్నారని తెలిపారు. ఈ తరుణంలో భారత జాతీయ పతాక రూపకల్పన జరిగి 100 ఏళ్లు పూర్తైన సంధర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సన్మానించామన్నారు. ఈ సన్మానం తన తండ్రికే స్వయంగా జరిగినట్టు భావిస్తున్నట్లు సీతామహాలక్ష్మీ స్పందించారు. తానాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా బోర్డు సభ్యులు జనార్ధన్ నిమ్మలపూడి, పింగళి వెంకయ్య మనుమడు జీవీఎన్ నరసింహంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, మాచర్లలోని మీనాక్షి కంటి ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ చిరుమామిళ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం
సాక్షి, అమరావతి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి, విఎస్ఎమ్ (రిటైర్డ్), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి సీఎం జగన్కి జ్ఞాపిక అందజేశారు. (చదవండి: ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: సీఎం జగన్) ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి.వెంకట రాజారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్ వరం... స్పాట్లో రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ -
క్రికెట్ మ్యాచ్లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..?
కాబూల్: అగస్ట్ 15న అఫ్గానిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత తొలిసారిగా జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ అత్యద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పీస్ డిఫెండర్స్, పీస్ హీరోస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో అఫ్గాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చాలామంది క్రికెటర్లు పాల్గొన్నారు. దీంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి జనం పోటెత్తారు. మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు తాలిబన్, అఫ్గాన్ జెండాలను పక్క పక్కనే ఉంచి ఊపడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. తామంతా ఐక్యంగా ఉన్నామని చాటేందుకే ప్రజలు ఇలా జెండాల ప్రదర్శన చేశారని తాలిబన్ అధికారులు పేర్కొనడం గమనార్హం. తాలిబన్ల ఆధిపత్య ప్రాంతమైన చమన్ ఉజురి సమీపంలోని స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కు దాదాపు 4 వేల మంది ప్రేక్షకులు హాజరు కాగా, వారిలో మహిళలు లేకపోవడం గమనార్హం. సాధారణ ప్రేక్షకుల కంటే తాలిబన్లే ఈ మ్యాచ్ను ఆసక్తిగా తిలకించడం విశేషం. ఈ మ్యాచ్లో పీస్ డిఫెండర్స్ జట్టు 62 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు సీఈవో హమీద్ షిన్వరి తెలిపారు. కాగా, తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్న తర్వాత క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతారన్న వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడీ మ్యాచ్ జరగడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లు క్రికెట్కు ఆమోదం తెలపడం శుభసూచకమని, తాలిబన్లలో మార్పుకు ఇది నాంది అని తాలిబన్ సానుభూతిపరులు చెప్పుకుంటున్నారు. చదవండి: కోహ్లీ సరికొత్త రికార్డు.. క్రికెట్లో అనుకుంటే పొరపాటే..! -
ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’
రామడుగు (చొప్పదండి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్రావుపేట ప్రధాన చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెతో పాటు వారం క్రితం నిర్మించిన వైఎస్సార్టీపీ జెండా గద్దెను సోమవారం స్థానిక సర్పంచ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న పంచాయతీ సిబ్బందితో తొలగించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై వివేక్, ట్రెయినీ ఎస్సై నరేశ్, సిబ్బంది గోపాల్రావుపేటకు చేరుకొని టీఆర్ఎస్ నాయకులతోపాటు సర్పంచ్కు నచ్చ జెప్పి పంపించారు. (చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం) అనంతరం కూల్చిన స్థలంలోని టీఆర్ఎస్ నాయకులు గద్దె నిర్మించి జెండా ఎగురవేశారు. కాగా ఘటనపై వైఎస్సార్టీపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కో-కన్వీనర్ తడగొండ సత్యరాజ్వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై గోపాల్రావుపేట సర్పంచ్పై కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేస్తామని జితేందర్రెడ్డి తెలిపారు. వైఎస్సార్టీపీ జెండాను కూల్చివేసిన సర్పంచ్ను తక్షణం అధికారులు సస్పెండ్ చేయాలని సత్యరాజ్వర్మ ప్రకటనలో డిమాండ్ చేశారు. గద్దె కూల్చివేత, సర్పంచ్ అవినీతిపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు గ్రామంలో వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. చదవండి: కాపురానికి రావడం లేదని సెల్టవర్ ఎక్కి భర్త హల్చల్ -
రావిచెట్టుపై రాత్రికి రాత్రే జెండా ఎగిరింది.. పెద్ద హంగామా..
సాక్షి, భానుపురి (నల్లగొండ): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నిజాం రాజు ఇంకా ప్రత్యేక దేశంగా ఉండేందుకే మొగ్గు చూపారు. ఈ సమయంలో కొందరు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంకా నిజాం పోలీసులు, రజాకార్లదే పెత్తనం. అప్పుడు నా వయస్సు 9 ఏళ్లు. 1947 ఆగస్టు 15న గుర్తుతెలియని వ్యక్తులు రావిచెట్టు బజారు (ప్రస్తుత బొడ్రాయిబజారు)లో ఓ పెద్ద రావిచెట్టుపై రాత్రికి రాత్రే జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల భయం ఎక్కువగా ఉన్న ఆ సమయంలో జెండా ఎవరూ కట్టారో తెలుసుకునేందుకు పెద్ద హంగామే జరిగింది. పోలీసులు సోదాలు చేయడం, అనుమానం ఉన్న వారిపై లాఠీలు ఝుళిపించారు. పెద్ద ఘర్షణ వాతావరణమే నెల కొంది. నిజాంరాజు లొంగిపోయిన తర్వాత కూడా జెండా పండుగకు ప్రజలు పోలీసుల భయంతో పెద్దగా వచ్చేవారు కాదు. ఆర్య సమాజ్కు చెందిన యామ రామచంద్రయ్య (కన్నయ్య), విశ్వమిత్ర పండిత్జీ లాంటి వారు ముందుండి నడిపేవారు. రామాలయం పక్కనే ఉన్న గ్రంథాలయంలో జెండా ఎగురవేసేది. రానురాను మొదటగా గాంధీపార్క్, పబ్లిక్ క్లబ్ ఇలా అన్నిచోట్ల జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. -
రాజన్న సంక్షేమ పాలనే అజెండా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అజెండా అని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. గురువారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో రాజన్న యాదిలో జెండా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను షర్మిల ఆవిష్క రించారు. కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశ మయ్యారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమానికి చెరగని సంతకం వైఎస్సార్ అని చెప్పారు. ఆ మహానేత సంక్షేమ పాలన నుంచే పార్టీ జెండా పుట్టుకొచ్చిందని తెలిపారు. పాలపిట్ట రంగు సంక్షేమాన్ని సూచిస్తుందన్నారు. ఇక నీలి రంగు సమానత్వాన్ని సూచిస్తుందని, సమానత్వం కోసం పోరాటం చేసిన అంబేడ్కర్ నినాదమే పార్టీ సిద్ధాంతమని చెప్పారు. గ్రామగ్రామాన పార్టీ జెండా ఎగరాలి ‘గ్రామగ్రామాన వైఎస్సార్టీపీ జెండా ఎగరేసి సంక్షేమ పాలన మళ్లీ తిరిగి రాబోతుందని అందరికీ చెప్పాలి. వైఎస్సార్ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతిఒక్క కుటుంబానికీ వైఎస్సార్టీపీ జెండా చేరాలి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం గురించి ప్రజలకు వివరించాలి. ఈ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 5 వరకు జెండా పండుగను ఊరూరా, గ్రామగ్రామాన నిర్వహించాలి. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆశ్వీర్వదిం చాల్సిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాలి..’ అని షర్మిల చెప్పారు. ప్రజల పక్షాన పోరాడాలి ‘మనం ప్రజల పక్షాన పోరాడితేనే వారు మనల్ని ఆదరిస్తారు. మనం వారి పక్షాన నిలబడితేనే వాళ్లు మన పక్షాన నిలబడతారు. మన చేతిలో అధికారాన్ని పెడతారు. అందువల్ల నియోజకవర్గాలు, గ్రామాలు, మం డలాల్లోని సమస్యలను సొంత సమస్యలుగా భావించి ప్రజల పక్షాన పోరాటం చేయాలి..’ అని షర్మిల పిలుపునిచ్చారు. జెండా పండు గకు సంబంధించిన ఫొటోలను 83741 67039 నంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. -
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ
-
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ)ఆవిర్భవించింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభించారు. దీనిలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. నాయకుడంటే ప్రజలతో మమేకమై నడవాలని, తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్ అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్కు ఎవరిపైనా వివక్ష లేదన్నారు. తన బిడ్డ షర్మిలను ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్ కోసమే షర్మిల వస్తోందని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకే షర్మిల పార్టీ పని చేస్తుందని, ఈ క్రమంలో షర్మిల చేయికి.. ప్రజల చేయి ఊతం కావాలని తాను కోరుకుంటున్నట్లు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. పార్టీ జెండా అవిష్కరణ అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ఆర్ నాయకత్వాన్ని నిలబెడతానని, తెలంగాణలో వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానన్నారు. నాన్న మాట ఇస్తే.. బంగారు మూట ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత మన వైఎస్ఆర్ అని కొనియాడారు. ఐదేళ్ల వైఎస్ఆర్ పాలనలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు.. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించారన్నారు. సీఎం కేసీఆర్ అధికారం ఉండగానే ఫాంహౌస్ను చక్కబెట్టుకుంటున్నారని, మాటల గారడీతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే పేదలకు భరోసా కలిగేది.. తరాలు మారుతున్నాయి.. కానీ ప్రజల తలరాతలు మారడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టించడం అంటే ఉపాధి కల్పించడమని, ఉద్యోగాల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉపఎన్నికలొచ్చినప్పుడే ఉద్యోగాల భర్తీని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. స్వయం సమృద్ధి గ్రామాలను తయారు చేయడమే మా లక్ష్యమన్నారు. వైఎస్ఆర్ టీపీలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుపుతూ.. చట్టసభల్లో సగం సీట్లు మహిళలకే కేటాయిస్తామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తామని హామి ఇచ్చారు. దళితులకు, ఎస్టీలకు భూమి ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందిని సూటిగా ప్రశ్నించారు. -
వైఎస్ షర్మిల కొత్త పార్టీ జెండా వివరాలివే..
సాక్షి, హైదరాబాద్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల కొత్తగా ఏర్పాటు చేయనున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఖరారైంది. పార్టీని ఈనెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట రంగులో రూపొందించడం గమనార్హం. జెండాలో 80 శాతం మేరకు పాలపిట్ట రంగు, మిగిలిన 20 శాతం నీలం రంగు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా రూపొందించినట్టు శనివారం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ ఉత్సవాన్ని హైదరాబాద్ ఫిలింనగర్లోని జేఆర్సీ సెంటర్లో నిర్వహించడానికి పార్టీ వర్గాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం లోటస్పాండ్లోని షర్మిల కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించనున్నారు. 8వ తేదీన నూతన పార్టీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాలను పూలతో అలంకరించాలని వైఎస్ విగ్రహాల పరిరక్షణ కమిటీ కోఆర్డినేటర్ నీలం రమేశ్ పిలుపునిచ్చారు. -
నవరత్నాల జెండాను హిమాలయాలపై ఎగురవేసిన యువకుడు
-
టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్’ జెండా!
సాక్షి, తిరుపతి/కుప్పం: కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాను ఆదివారం అభిమానులు ఆవిష్కరించారు. ఈ పరిణామం టీడీపీలో కలకలం రేపింది. ఇక్కడ నుంచి జూనియర్ పోటీ చేయాలంటూ పోస్టర్లు, ఫెక్సీలు వెలుస్తుండడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబుకు కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ను బరిలో దించాలని శ్రేణుల నుంచి డిమాండ్ వినిపించింది. దీంతో దిక్కుతోచని చంద్రబాబు కిమ్మనకుండా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరోసారి అభిమానులు వినూత్నంగా తమ డిమాండ్ను జెండా రూపంలో ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం టీడీపీవి డైవర్షన్ పాలిటిక్స్ -
లోదుస్తులపై కన్నడ జెండా
సాక్షి, బనశంకరి: కన్నడ భాషను తక్కువ చేసిన గూగుల్ ఉదంతం మరువకముందే ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ కూడా కన్నడను అవమానించింది. పసుపు– ఎరుపు రంగులతో ఉండే కన్నడ పతాకాన్ని ముద్రించిన లోదుస్తుల్ని అమెజాన్ వెబ్సైట్, యాప్లో విక్రయిస్తున్నారు. పైగా ఆ దుస్తుల మీద జాతీయ జెండాపై ఉండే అశోక చక్రాన్ని సైతం ముద్రించి పైత్యం చాటుకున్నారు. ఇది కన్నడిగులను అమెజాన్ కంపెనీ అవమానించడమేనని పలు కన్నడ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అమెజాన్ తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సోషల్మీడియాలోనూ నెటిజన్లు తీవ్ర ఆక్రోశం వ్యక్తంచేశారు. -
పూరీ ఆలయంలో అపశ్రుతి, భక్త జనంలో కలవరం
భువనేశ్వర్/ పూరీ: రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరం శిఖరాన పతిత పావన పతాకం కొయ్య ఒరిగింది. కాల వైశాఖి ప్రభావంతో మంగళవారం బలంగా వీచిన గాలులకు ఆలయ శిఖరాన నీల చక్రానికి బిగించిన పతిత పావన పతాకం కొయ్య బిగువు కోల్పోయి పక్కకు ఒరిగింది. ఈ సంఘటన జగన్నాథుని భక్తుల హృదయాల్ని కలిచివేసింది. పతితుల్ని పావనం చేసే ఈ పతాకం ఒరగడం కరోనా సంక్రమణ వంటి విపత్కర పరిస్థితుల్లో ఏ వైపరీత్యానికి దారితీస్తోందోనని భక్త జనం తల్లడిల్లుతోంది. ఈ సంఘటన శ్రీ మందిరంలో దైనందిన నిత్య సేవలకు ఏమాత్రం అంతరాయం కలిగించలేదని శ్రీ మందిరం దేవస్థానం అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పూరీ పట్టణంలో సుమారు అరగంట సేపు కాల వైశాఖి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పట్టణ వాసులకు వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం లభించింది. చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ -
జెండా వివాదం: చిన్నమ్మకు చెక్
సాక్షి, చెన్నై: తమ జెండా ఉపయోగించకుండా చిన్నమ్మ శశికళకు చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించింది. దీనిని అడ్డుకోవాలని కోరుతూ డీజీపీ త్రిపాఠికి అన్నాడీఎంకే నేతలు, మంత్రులు గురువారం ఫిర్యాదు చేశారు. ఇక చిన్నమ్మను ఆహ్వానించేందుకు భారీ ఏర్పాట్లపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళం నిమ్నగమైంది. వేలూరులో అయితే, హెలికాప్టర్ ద్వారా పువ్వుల వర్షం కురిపించేందుకు ఏకంగా కలెక్టర్ అనుమతి కోరడం గమనార్హం. అక్రమాస్తుల కేసు నుంచి విడుదలైన శశికళ ఈనెల 8న చెన్నైకి రానున్నారు. ఆమెకు ఆహ్వానం పలికేందుకు అమముక వర్గాలు భారీగానే ఏర్పాట్లపై దృష్టిపెట్టాయి. వేలూరులో అయితే, జిల్లా సరిహద్దు మాదనూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పువ్వులవర్షం కురిపించేందుకు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ కళగం జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి జయంతి పద్మనాభన్ కలెక్టర్ షణ్ముగసుందరానికి గురువారం విన్నవించుకున్నారు. (చదవండి: రాళ్లు వేయించాడు.. కాళ్లు పట్టుకుంటున్నాడు..) జెండాకు చెక్.. ఆహ్వాన ఏర్పాట్లు ఓ వైపు సాగుతుంటే, ఎక్కడ అన్నాడీఎంకే జెండాలతో చిన్నమ్మ దూసుకొస్తుందో అన్న బెంగ ఆ పార్టీ వర్గాల్లో నెలకొన్నట్టుంది. జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో చిన్నమ్మ పయనించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఫిర్యాదులు కూడా హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ తమ పార్టీ జెండా ఊపయోగించకుండా చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించింది. ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, సంయుక్త కన్వీనర్లు కేపీ మునుస్వామి, వైద్యలింగం, మంత్రులు సీవీ షణ్ముగం, జయకుమార్, తంగమణి, వేలుమణి గురువారం సాయంత్రం డీజీపీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు.(చదవండి: షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. యడ్డీ కుర్చీకి ఎసరు!) తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీ జెండాను ఉపయోగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. కేపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ అ న్నాడీఎంకే జెండాను ఉపయోగించే అర్హత పార్టీ కార్యకర్తలు, నాయకులకు మాత్రమే ఉందన్నారు. అయితే, తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి జెండాను ఉపయోగించే అర్హత లేదని, అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మంత్రి సీవీ షణ్ముగం మాట్లాడుతూ అన్నాడిఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని సమన్వయ కమిటీకే చెందుతుందని, ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని, కోర్టులు సైతం స్పందించాయని గుర్తు చేశారు. ఇప్పటికే జయలలిత సమాధి వద్దకు చిన్నమ్మ వెళ్లకుండా పనుల పేరిట అడ్డుకట్ట వేసిన పాలకులు, తాజాగా జెండా వాడకానికి చెక్ పెట్టే పనిలో పడడం గమనార్హం. నేడు వదినమ్మ విడుదల.. శశికళతో పాటు ఆమె వదినమ్మ ఇలవరసి, అక్కకుమారుడు సుధాకరన్ జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగియడంతో వదినమ్మ శుక్రవారం ఉదయం జైలు నుంచి బయటకు రానున్నారు. నేరుగా ఆమె చిన్నమ్మ బస చేసి ఉన్న ఫామ్ హౌస్కు వెళ్లనున్నారు. ఈ ఇద్దరు విడుదలైనా, సుధాకరన్ విడుదలలో జాప్యం తప్పడం లేదు. ఇందుకు కారణం, ఆయన చెల్లించాల్సిన జరిమానా ఇంకా కోర్టుకు చేరలేదు. -
ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా
సాక్షి, న్యూఢిల్లీ: తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన రైతులు 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటవైపుగా దూసుకొచ్చారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత రెండు నెలలుగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికపై తమ ఉద్యమ జెండాను ఎగురవేశారు. బారికేడ్లు, లాఠీలు, టియర్ గ్యాస్ ఆందోళనల మధ్య ట్రాక్టర్ పరేడ్ ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు వీటన్నిటినీ అధిగమించి వేలాదిగా ఎర్రకోటకు చేరుకోవడం విశేషం. (బ్రేకింగ్: రైతులపై విరిగిన లాఠీలు)మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం సహా తమ డిమాండ్ల సాధనకోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా రిపబ్లిక్ డే సందర్భంగా వేలాది ట్రాక్టర్లతో రైతులు చేపట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సెంట్రల్ ఢిల్లీలోకి ఆందోళనకారులు చొచ్చుకురావడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. పోలీసులు రైతులపై బాష్ప వాయువు ప్రయోగించారు. లాఠీలతో విరుచుకు పడ్డారు. ఈ ఘర్షణలో అటు పోలీసులు, ఇటు రైతులు గాయపడిన సంగతి తెలిసిందే.#WATCH A protestor hoists a flag from the ramparts of the Red Fort in Delhi#FarmLaws #RepublicDay pic.twitter.com/Mn6oeGLrxJ— ANI (@ANI) January 26, 2021 -
యూఎస్ తర్వాత ఆ రికార్డు చైనాదే..
బీజింగ్: చంద్రుడిపై మొదట జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన దేశం అమెరికా. ఆ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశంగా చైనా నిలిచింది. డ్రాగన్ దేశానికి చెందిన అంతరిక్ష నౌక చాంగె–5 చంద్రుడి మీద కాలుమోపిన సంగతి తెలిసిందే. జాబిల్లి మీద నుంచి మట్టిని సేకరించిన ఈ నౌక చంద్రుడి ఉపరితలం మీద తన జెండాను పాతింది. శనివారం ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆ దేశ స్పేస్ ఏజెన్సీ రిలీజ్ చేసింది. 1970 తర్వాత మొదటి ప్రయత్నంలోనే చంద్రుడి మీద మట్టిని సేకరించిన దేశంగా చైనా రికార్డు సృష్టించింది. 21 వ శతాబ్దంలో చంద్రుడి నుంచి శాంపిళ్లను సేకరించిన మూడో దేశంగా అమెరికా, రష్యాల సరసన చైనా నిలిచింది. ఇక చంద్రుడిపై జెండా ఎగురవేసిన తొలి దేశంగా అమెరికా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆ మట్టి ఖరీదు రూ.11 లక్షలు) 1969లో చేపట్టిన అపోలో మిషన్లో భాగంగా మొదటిసారి అమెరికా తన జాతీయ జెండాని చంద్రుడి ఉపరితలం మీద రెపరెపలాడించింది. మనుషులను జాబిల్లిపైకి తీసుకెళ్లేందుకు రూపొందించిన ఈ మిషన్లో భాగంగా అమెరికా 12 మంది వ్యోమగాములను చంద్రుడి మీదకు తీసుకెళ్లింది. 1969 నుంచి 1972 వరకు ఆరు స్పేస్క్రాఫ్ట్ల్లో వీరిని చంద్రుడిపైకి తీసుకెళ్లారు. ఇక తిరిగి వచేటప్పుడు వీరు చంద్రుడి ఉపరితలం మీద నుంచి 382 కిలోగ్రాముల రాళ్లు, మట్టిని తమతో తీసుకొచ్చారు. చైనాకు చెందిన చాంగె-5 స్పేస్క్రాఫ్ట్ గత నెల 23న చంద్రుడి మీద ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం చాంగె -5 అంతరిక్ష నౌక ఒక జత ల్యాండింగ్, అసెండింగ్ వెహికల్స్ని చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా మోహరించింది. 2 కిలోల (4.4 పౌండ్ల) నమూనాలను సేకరించింది. మట్టిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు పటిష్టమైన కంటెయినర్ను వాడాల్సి ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. -
‘ముందెన్నడూ లేని ఉపద్రవం’
బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య నెలకొన్న దౌత్య యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. కాన్సులేట్ మూసివేత ఆదేశాలతో రాజుకున్న వేడి ‘పతాక’స్థాయికి చేరుకుంది. అమెరికాలోని హ్యూస్టన్లో గల చైనా కాన్సులేట్ను మూసివేయించడంతో ఇప్పటికే ప్రతీకార చర్యలు ప్రారంభించిన డ్రాగన్.. మరింత దూకుడుగా ముందు సాగుతోంది. అగ్రరాజ్యానికి ఎంతో వ్యూహాత్మకమైన చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్ మూసివేతకు ఆదేశించిన చైనా.. సోమవారం ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ జెండాను అవనతం చేస్తున్న దృశ్యాలు అధికార మీడియాలో ప్రసారమయ్యాయి. అదే విధంగా చెంగ్డూలోని కాన్సులేట్లో పనిచేసే సిబ్బందిని అక్కడి నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకే ఖాళీ చేయించారని.. అలాగే కాన్సులేట్కు చేరుకునే రోడ్డు మార్గాన్ని కూడా పోలీసులు దిగ్బంధనం చేసినట్లు మీడియా వెల్లడించింది.(దెబ్బకు దెబ్బ.. ) 21వ శతాబ్దం అంధకారంగా మారే అవకాశం ఇక ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన యుద్ధానికి అమెరికా నిర్ణయాలే కారణమన్న డ్రాగన్.. యూఎస్ తన తప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని శనివారం ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా జాతీయ మీడియా గ్లోబల్ టైమ్స్ సోమవారం నాటి ఎడిటోరియల్లో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పర్యవసానాలు ఘోరంగా ఉంటాయని, ఊహించని ఉపద్రవం ముంచుకు వస్తుందని అభిప్రాయపడింది. ‘‘చైనా- అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను మరింత దిగజార్చే ప్రయత్నాలు జరిగితే.. 21వ శతాబ్దం అంధకారంగా మారే అవకాశం ఉంది. ప్రచ్చన్న యుద్ధం నాటి పరిస్థితుల కంటే మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని తన కథనంలో హెచ్చరించింది. (‘చైనాను మార్చకుంటే అది మనల్ని మింగేస్తుంది’) కాగా హ్యూస్టన్లో చైనా కాన్సులేట్ గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. 72 గంటల్లోగా కాన్సులేట్ను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఇందుకు స్పందించిన చైనా అగ్రరాజ్యంపై అదే తరహా ఆరోపణలు గుప్పించింది. చెంగ్డూ అమెరికా కాన్సులేట్లో పనిచేసే సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకుంటూ దేశ భద్రతా ప్రయోజనాలకు హాని తలపెడుతున్న కారణంగా.. కాన్సులేట్ను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇందుకు ఎటువంటి గడువు విధించనప్పటికీ సోమవారం భవనాన్ని ఖాళీ చేయించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
కరెంట్ షాక్తో ఐదుగురు విద్యార్థులు మృతి
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని కొప్పళ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రభుత్వ బీసీ విద్యార్థుల హాస్టల్లో విద్యుత్ షాక్తో అయిదుగురు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేళ జెండా ఎగురవేసేందుకు దేవరాజ్ ఉర్స్ రెసిడెన్షియల్ స్కూల్ వసతిగృహంపై ఇనుప పైపును అమర్చారు. ఆదివారం ఉదయం దానిని విద్యార్థులు తొలగిస్తుండగా చేతికందేంత ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు పైప్ తాకింది. దీంతో ఒక విద్యార్థికి షాక్ కొట్టింది, అతడిని రక్షించేందుకు మిగతా వాళ్లు ప్రయత్నించడంతో అయిదుగురూ అక్కడికక్కడే మరణించారు.మృతులను మల్లికార్జున్, కుమార్, గణేష్, బసవరాజ్, దేవరాజ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్, ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దుర్ఘటనపై ముఖ్యమంత్రి యడియూరప్ప విచారణకు ఆదేశిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా వసతి గృహం నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డలను కోల్పోయామని మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ వసతి గృహాన్ని ఓ ప్రయివేట్ భవనంలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
ధ్వజస్తంభం...ఆలయ మూలస్తంభం
ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం. ఆలయంలో నెలకొని ఉన్న స్వామివారి కీర్తి పతాకను రెపరెపలాడిస్తూ, చిరుగంటల సవ్వడితో, తల ఎత్తి చూసేంత ఎత్తులో కనిపిస్తుంది ధ్వజస్తంభం. ధ్వజం అంటే పతాకం (జెండా). ధ్వజాన్ని కట్టి ఎగురవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఆలయపురుషునిలో ఉన్న షట్చక్రాలలో మొదటిదైన మూలాధారచక్రంపై ఇది ప్రతిష్ఠించబడుతుంది కనుకనే ఇది ఆలయానికి మూలస్తంభంగా పేర్కొనబడుతోంది. ప్రాచీన యాగశాలలే కాలాంతరంలో ఆలయాలుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో యూపస్తంభం ధ్వజస్తంభంగా రూపుదిద్దుకుంది. ఒక్కసారి ధ్వజస్తంభం ఆకారాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు త్రిమూర్తుల (ఆత్మ, విద్యా, శివ తత్త్వాల)సమిష్టితత్త్వం దర్శనమిస్తుంది. అలాగే ధ్వజస్తంభం పై భాగాన మూడు పలకలు, మూడు శిఖరాలు ఉంటాయి. మూడు పలకలను పట్టి ఉంచే నిలువు కొయ్యలు 3 ఉంటాయి. ఇలా ఈ స్తంభ నిర్మాణమంతా మూడుతో ముడిపడి ఉంది. దక్షిణ భారతమంతటా గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే ధ్వజస్తంభం ఉత్తరాదిన మాత్రం ఆలయ విమానంపైనే స్థాపించబడుతుంది. ధ్వజస్తంభంపై అడుగడుగునా పట్టికలు(పర్వాలు) కనబడతాయి. అవేంటంటే పూర్వం తాత్కాలికంగా వెదురు కర్రతోనే ధ్వజస్తంభం నిలబెట్టి ధ్వజారోహణ చేసేవారు. రానురానూ స్థిరంగా ప్రతిష్ఠిస్తున్నందువలన అదే ఆకారంలో వెదురు కొయ్యకు గణుపులున్నట్లు పట్టీలను పెట్టడం జరుగుతోంది. ఈ గణుపులు బేసిసంఖ్యలో ఉంటాయి. ఈ ధ్వజస్తంభం ఎత్తు ఎంత ఉండాలనేది నాలుగు రకాలుగా చెప్పబడింది. గోపురమంత ఎత్తు, ఆలయవిమానమంత ఎత్తు, శిఖరమంత ఎత్తు, ఆలయ పైకప్పు సమానంగా ధ్వజస్తంభం ఎత్తు ఉండవచ్చు. సాధారణంగా ఈ ధ్వజస్తంభాన్ని చందనం, దేవదారు, ఎర్రచందనం, టేకు కొయ్యతో నిర్మిస్తారు. శివాలయాలలో బలిపీఠం తర్వాత, విష్ణ్వాలయాలలో బలిపీఠానికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయానికి ముందు భాగంలో, వెనుకవైపు రెండు ధ్వజస్తంభాలున్నాయి. పూర్వం నాలుగుదిక్కులా నాలుగు ధ్వజస్తంభాలుండేవని శాసనాలు చెబుతున్నాయి. అమరావతి అమరేశ్వర స్వామి ఆలయంలో నలుదిక్కులా ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. శ్రీరంగానికి దగ్గరలోని జంబుకేశ్వరంలో ఎనిమిది ధ్వజస్తంభాలు ఉన్నాయి. వీటిని దిక్ ధ్వజస్తంభాలంటారు. ధ్వజస్తంభ దర్శనం వలన ధర్మకార్యాచరణపై మనసు లగ్నమవుతుంది. కీర్తి, యశస్సు కలుగుతాయి. కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య, ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
అరుదైన శబ్దాలను రికార్డ్ చేసిన నాసా
తంపా : ఇప్పటివరకూ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ అనంత విశ్వంలో మానవ మనుగడకు అనుకూలంగా ఉన్న ఏకైక ప్రదేశం భూ గ్రహం మాత్రమే. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఈ భూమి పరిమాణం మాత్రం పెరగడం లేదు, పెరగదు కూడా. దాంతో మానవ మనుగడకు అవసరమైన మరో గ్రహాన్ని అన్వేషించాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో శాస్త్రవేత్తల చూపు అరుణగ్రహం(మార్స్) మీదకు వెళ్లింది. అరుణ గ్రహం మనుషుల ఆవాసానికి అనుకూలంగా ఉందా, లేదా తెలసుకునేందుకు శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. తొలిసారి శాస్త్రవేత్తలు అంగారకుడి మీద వచ్చే శబ్ద తరంగాలను రికార్డ్ చేశారు. నాసా అంగారకుడి పైకి పంపిన ఇన్సైట్ ల్యాండర్ అనే స్పేస్క్రాఫ్ట్ మార్స్పై వచ్చే గాలి తరంగాల శబ్దాలను రికార్డు చేసింది. ఇంత వరకూ మార్స్ పరిసరాలకు సంబంధించిన ఫోటోలను మాత్రమే పంపిన ఇన్సైట్ తొలిసారిగా అంగారకుడిపై వచ్చే గాలి శబ్దాలను రికార్డు చేసిందని నాసా తెలిపింది. గంటకు 10 నుంచి 15 మైళ్ల వేగంతో వీస్తున్న గాలి తరంగాలను ఇన్సైడర్ ల్యాండర్ రికార్డు చేసింది. స్పేస్క్రాఫ్ట్లోని రెండు సెన్సార్లు గాలి తరంగాల శబ్దాలను నమోదు చేశాయని.. ఈ శబ్దాలు గాలిలో జెండా ఎగుతున్నప్పుడు వచ్చిన శబ్దాల మాదిరిగా ఉన్నాయని లండన్కు చెందిన పరిశోధకులు థామస్ పైక్ వెల్లడించారు. అంగారకుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ఈ స్పేస్క్రాఫ్ట్ నవంబరు 26న మార్స్పై విజయవంతంగా దిగింది. అయితే గతంలో మాదిరి కాకుండా చాలా అధునాతన టెక్నాలజీతో ఈ స్పేస్క్రాఫ్ట్ను నాసా రూపొందించింది. అంగారకుడి గ్రహంలోని రాతి పొరల నిర్మాణాల గురించి, అక్కడ వచ్చే భూకంపాలను అధ్యయనం చేయడం కోసం, దాని ఉపరితలం నుంచి వెలువడే వేడి గురించి అధ్యాయనం చేయడం కోసం ఈ స్పేస్ క్రాఫ్ట్లో అత్యాధునిక భూకంప శాస్త్రపు సాధనాలను వినియోగించినట్లు నాసా తెలిపింది. -
ఆసీస్కు బదులు కివీస్
దుబాయ్: ‘ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడచూడ రుచుల జాడ వేరు’ ప్రస్తుతం ఈ పద్యం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం అధికారులు చదువుకుంటున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తప్పిదం చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండు దేశాలు జెండాలు ఎగరేయడం ఆనవాయితీ. కానీ ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జెండా బదులు న్యూజిలాండ్ జెండా ఎగరేశారు. దీనిని ఎవ్వరూ గమనించకపోవడం విడ్డూరం. అయితే ఆసీస్ జర్నలిస్టు ఈ విషయాన్ని పసిగట్టి ట్వీటర్లో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ అయి దుబాయ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడ పట్ల ఆసీస్ అభిమానులు విమర్శించారు. దీంతో తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన స్టేడియం నిర్వాహకులు.. రెండు దేశాల జెండాలు ఒకే రీతిలో ఉండటంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. క్రికెట్లో ఇలాంటి సంఘటనలు జరగటం కొత్తేం కాదు. గతంలో కూడా ఓ మ్యాచ్లో భారత జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. మ్యాచ్ మధ్యలో ఆ విషయాన్ని గుర్తించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంపైర్లకు చెప్పి సరిచేపించాడు. ఇక ఈ మ్యాచ్లో ఆసీస్ను కష్టాలు వెంటాడుతున్నాయి. పాక్ సిరీస్లో రాణించి పునర్వైభవం సాధించాలనుకున్న ఆసీస్కు శుభారంభం లభించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 482 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పసతగ్గిన ఆసీస్ బౌలింగ్పై పాక్ బ్యాట్స్మెన్ పైచేయి సాధించారు. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (126), హారీస్ సోహైల్ (110) శతకాలతో రెచ్చిపోయారు. వీరికి తోడుగా ఇమాముల్ హక్(76), ఆసద్ షఫీఖ్(80) అర్థసెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో సిడిల్ మూడు వికెట్లు పడగొట్టగా, లియాన్ రెండు వికెట్లు, హోలండ్, స్టార్క్, ల్యాబస్చేంజ్ తలో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో ఆసీస్ ఓపెనర్లు ఖవాజా (17), ఫించ్(13)లు ఉన్నారు. -
పారా ఏషియాడ్లో భారత పతాకధారిగా తంగవేలు
రియో పారాలింపిక్స్ చాంపియన్ తంగవేలు మరియప్పన్ పారా ఆసియా క్రీడల్లో భారత పతాకధారిగా జట్టును నడిపించనున్నాడు. ఇండోనేసియాలోని జకార్తాలో ఈ నెల 6 నుంచి 13 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈసారి పారా క్రీడల్లో ఎన్నడూ లేని విధంగా భారత్ జంబో బృందంతో బరిలోకి దిగుతోంది. అథ్లెట్లు, సహాయ సిబ్బంది సహా మొత్తం 302 మందితో కూడిన భారత బృందం పతకాల వేటకు సిద్ధమైంది. తొలి విడతగా వెళ్లిన కొంత మంది భారత జట్టు సభ్యులకు సోమవారం క్రీడాగ్రామం వద్ద చేదు అనుభవం ఎదురైంది. బస ఏర్పాట్లకు నిర్దేశిత ఫీజు రూ. కోటి 80 లక్షలు చెల్లించకపోవడంతో అథ్లెట్లను గేమ్స్ విలేజ్లోకి అనుమతించలేదు. చివరకు 4వ తేదీకల్లా చెల్లిస్తామన్న హామీతో నిర్వాహకులు ఆలస్యంగానైనా అనుమతించారు. -
తొలి స్వాతంత్య్ర పతాక
‘చూడండి! స్వతంత్ర భారత పతాకం ఆవిర్భవించింది. దేశ ప్రతిష్టను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన భారతీయ యువకుల నెత్తురుతో పునీతమైన జెండా. ఆ జెండా సాక్షిగా ప్రపంచ స్వేచ్ఛా ప్రియులందరినీ నేను వేడుకుంటున్నాను, ఈ పోరాటానికి చేయూతనివ్వండి!’ఇంత విశ్వాసం నిండిన గొంతు, ఇంతటి ఆత్మ స్థైర్యం నిండిన గుండె, ఒకే కలని అన్ని దశాబ్దాల పాటు భద్రంగా దాచుకున్న కళ్లు బహుశా ప్రపంచ చరిత్రలోనే మనకు తారసపడవు. మేడమ్ భికాజీ రుస్తోంజీ కామాకే ఆ ఖ్యాతి దక్కుతుంది. అది మేడమ్ కామా గొంతు. 1907లో ఎక్కడో జర్మనీలో ప్రపంచ విప్లవ యోధులు, మహా రచయితలు, మేధావులు పాల్గొన్న సభలో మేడమ్ కామా ఆ పిలుపునిచ్చారు. ఆమె స్వప్నం సాకారమై నలభై ఏళ్ల తరువాత భారతదేశం మీద స్వతంత్ర పతాకం రెపరెపలాడింది. పరాయి పాలనలోని ౖ§ð న్యం భారతీయుల గుండెను తడుతున్న కాలమది. అలాంటి సమయంలో మేడమ్ కామా (సెప్టెంబర్ 24,1861–ఆగస్ట్ 13,1936) పుట్టారు. తండ్రి సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్. బొంబాయిలోనే కోటీశ్వరులనదగ్గ పార్శీల కుటుంబం వారిది. పారిశ్రామికవేత్తల వర్గం. నాటి చాలామంది పార్శీల మాదిరిగానే కామా కూడా ఇంగ్లిష్ విద్యను అభ్యసించారు. పలు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనం నుంచి ఆమెలో ఒక తిరుగుబాటు తత్వం ప్రస్ఫుటంగా ఉండేది. పైగా తిరుగులేని జాతీయవాది. జాతీయవాదం పునాదిగా ఉండే రాజకీయాలంటే అపారమైన ఆసక్తి. ఆమె జాతీయవాదం ఎంత గాఢమైనదంటే అందుకోసం ఆమె వైవాహిక జీవితాన్ని త్యాగం చేశారు. 1885లో ఆమె రుస్తోంజీ కేఆర్ కామాను వివాహం చేసుకున్నారు. రుస్తోంజీ కామా పూర్తిగా ఆంగ్లేయ పక్షపాతి. వారి సంస్కృతి అంటే మోజు. వారి ఆలోచనలే ఆయనకు శిరోధార్యం. భారతదేశానికి ఆంగ్లేయులు చేసిన మేలు అసాధారణమైనదని రుస్తోంజీ వాదన. భికాజీ కామా ఇందుకు పూర్తి విరుద్ధం. అణచివేత, దోపిడీ ఆంగ్ల జాతి మౌలిక లక్షణమని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఫలితం–ఆ దంపతులు విడిపోయారు. అప్పటికే భికాజీ కామా సమాజ సేవకురాలిగా మారిపోయారు. కానీ తన పేరులో నుంచి భర్త పేరును ఆమె తొలగించలేదు. 1890లో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో బ్యుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబలింది. అదొక భయంకరమైన అంటువ్యాధి. ఒళ్లంతా బొబ్బలతో నరకయాతన అనుభవిస్తూ కొన్ని గంటలలోనే వ్యాధిగ్రస్థులు చనిపోయేవారు. ఒక్క బొంబాయి నగరంలోనే ఆ మహమ్మారికి 22 వేల మంది మరణించారు. వ్యాధి సోకిన వారికి మేడమ్ కామా రాత్రీపగలూ సేవలు చేశారు. ఆ వ్యాధి ఆమెకు కూడా సోకింది. కానీ అతికష్టం మీద బతికారు. అప్పుడే పూర్తిగా కోలుకోవడానికి యూరప్ వెళ్లవలసిందని వైద్యులు సూచించారు. అలా ఆమె 1902లో ఇంగ్లండ్ చేరుకున్నారు. అనుకున్నట్టే అక్కడ భికాజీ కామా కోలుకున్నారు. ఆమె అక్కడ కాలు పెట్టే సమయానికి బ్రిటిష్ వ్యతిరేక తీవ్ర జాతీయవాదులకు లండన్ కేంద్రంగా ఉండేది. లాలా హరదయాళ్, శ్యాంజీ కృష్ణవర్మ, వినాయక్ దామోదర్ సావర్కర్ అక్కడే పనిచేసేవారు. వారితో పరిచయం కలిగింది. ఆంగ్ల జాత్యహంకారం గురించి హైడ్ పార్క్లో ఉపన్యాసాలు ఇచ్చేవారామె. అప్పటికి భారత జాతీయ కాంగ్రెస్ మితవాద నాయకుడు దాదాభాయ్ నౌరోజీ అక్కడే ఉన్నారు. ఆయన బ్రిటిష్ పార్లమెంట్కు మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు (తరువాత పోటీ చేసి నెగ్గారు). అప్పుడు ఆయనకు కార్యదర్శిగా భికాజీ పనిచేశారు. బ్రిటిష్ దోపిడీ సంస్కృతి మీద ఆ ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. ఇద్దరూ పార్శీలే. తరువాత ఆమె స్వదేశానికి రావాలని ప్రయత్నించారు. భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది. అందుకు ఆమె నిరాకరించి లండన్, పారిస్ నగరాలలోనే స్థిరపడ్డారు. అక్కడే ఉండి బ్రిటిష్ వ్యతిరేకోద్యమం చేస్తున్న సంస్థలకు ఆర్థిక సాయం అందించేవారు. భారత స్వాతంత్య్రోద్యమ సాహిత్యాన్ని వెలువరించేవారు. ఇంగ్లిష్ పాలనలో భారతీయులు పడుతున్న ఇక్కట్లు, దేశంలో నశించిన హక్కులు వంటి వాటి గురించి భికాజీ కామా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు. సింగ్ రేవాభాయ్ రాణా, మంచేర్షా బుర్జోర్జీ గోద్రెజ్, మేడమ్ కామా కలసి పారిస్ ఇండియన్ సొసైటీ స్థాపించారు. ‘వందేమాతరం’, ‘తల్వార్’ అనే పత్రికలను నడిపారు. ఏది చేసినా దేశ స్వాతంత్య్రమే ఆమె లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తయితే, భారత జాతికి తొలిసారిగా ఒక ఉమ్మడి పతాకాన్ని తయారు చేసిన ఘనత మేడమ్ కామాకే దక్కుతుంది. మూడు రంగులతో–ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులతో ఆమె పతాకాన్ని తయారు చేశారు. ఆకుపచ్చ రంగు మీద కొన్ని కలువలను చిత్రించారు. పసుపు రంగు మీద ‘వందేమాతరం’ అని రాయించారు. కింద ఎరుపు రంగు భాగంలో సూర్యచంద్రులను చిత్రించారు. ఇవి హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకలు. ఇవన్నీ భారతీయతకీ, హిందూ ముస్లిం ఐక్యతకీ, త్యాగనిరతకీ ప్రతీకలే. ఈ పతాకాన్ని ఆమె ఆగస్టు 22, 1907న జర్మనీలోని స్టట్గార్ట్లో ఎగురవేశారు. ఆ సందర్భం ప్రపంచ చరిత్రలోనే గొప్పది. అది అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశం. లెనిన్ కూడా అందులో పాల్గొన్నారు. ఆసియా దేశాలలో సమానత్వం, స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆ సభ నుంచి ఆమె నినదించారు. ఆ వేదిక మీద నుంచే తొలిసారి భారతీయ పతాకం ఆమె ఎగురవేశారు. అక్కడ నుంచే ఆమె అమెరికా వెళ్లారు. ఆ తరువాత ఈజిప్ట్ వెళ్లారు. భారత స్వాతంత్య్రోద్యమంతో పాటు, మహిళల హక్కుల గురించి కూడా ఆమె ప్రచారం చేశారు. ఈజిప్ట్లో కామా ఆ కాలంలోనే వేసిన ప్రశ్న ఒక అద్భుతం. ‘మిగిలిన సగం ఈజిప్ట్ ఎక్కడ? ఇక్కడ నేను పురుషులని మాత్రమే చూస్తున్నాను. కానీ వీరు దేశంలో సగమే. తల్లులు ఎక్కడ ఉన్నారు? చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు? ఉయ్యాలలు ఊపిన చేతులు మనుషులను కూడా అంటే జాతిని తయారు చేస్తాయన్న సంగతి విస్మరించరాదు’ అన్నారామె. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కామా నిర్వహించిన పాత్ర అసాధారణమైనది. యుద్ధాన్ని ఆసరా చేసుకుని వలసలలోని ప్రజలు తిరుగుబాటు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కానీ భారతదేశంలో ఆంగ్లేయులకు మద్దతు దొరికింది. ‘మీరు ఎవరి కోసం పోరాడతారు? భారతీయులకు సంకెళ్లు వేసినవాళ్ల తరఫున పోరాడతారా?’ అని నిలదీశారు కామా. భారతదేశంలో గాంధీజీకీ, అనిబీసెంట్, జిన్నా, తిలక్ శిబిరానికీ మధ్య ఇదే విషయం మీద విభేదాలు ఉన్నాయి. గాంధీజీ యుద్ధంలో ఉన్న ఆంగ్లేయులకు మద్దతు ఇవ్వాలని గుజరాత్లో ప్రతి గ్రామం తిరిగి ప్రచారం చేశారు. తిలక్ శిబిరం స్వయంప్రతిపత్తి గురించి చెప్పి, భారతీయ సైన్యాన్ని ఉపయోగించుకోవాలని హోమ్రూల్ లీగ్ తరఫున ఉద్యమించింది. విదేశాలలో ఉన్న భారతీయ ఉద్యమకారులు గ్రేట్వార్ కాలంలో చెల్లాచెదురై పోయారు. అందుకు కారణం– అప్పటిదాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇంగ్లండ్, ఫ్రాన్స్ యుద్ధంతో ఏకమయ్యాయి. దీనితో ఫ్రాన్స్లో ఆశ్రయం పొందుతున్న బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమకారులకు నీడ కరువైంది. ఇంగ్లండ్లో కూడా వేట మొదలైంది. పారిస్లోని భికాజీ కామా గృహం గదర్ వీరులకు, ఇతర భారతీయ తీవ్ర జాతీయవాదులకు నిలయంగా ఉండేది. వినాయక్ దామోదర్ సావర్కర్ రచన ‘భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం–1857’ను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అప్పుడు నాసిక్ కలెక్టర్ జాక్సన్ హత్య కేసును సావర్కర్ ఎదుర్కొంటున్నారు. నాసిక్లోనే ఒక నాటకం చూస్తున్న జాక్సన్ అనంత్ కన్హేరీ అనే యువకుడు కాల్చి చంపాడు. ఇది సావర్కర్ కుట్ర అని ప్రభుత్వ ఆరోపణ. ఆ కేసులోనే ఆయనను లండన్లో అరెస్టు చేసి, భారత్కు తీసుకు వెళుతుండగా, మార్సెల్స్ రేవులో తప్పించాలని మేడమ్ కామా, వీవీఎస్ అయ్యర్ పథకం వేశారు. అనుకున్నట్టే ఓడ పాయఖానా రంధ్రం నుంచి వీర సావర్కర్ సముద్రంలోకి జారిపోయి, మార్సెల్స్ రేవులోకి ఈదుకు వచ్చారు. కానీ కామా, అయ్యర్ రావడం కొన్ని నిమిషాలు ఆలస్యమైంది. ఇంతలోనే ఫ్రాన్స్ పోలీసులను తప్పించి, ఇంగ్లిష్ భద్రతా సిబ్బంది సావర్కర్ను పట్టుకుని తీసుకుపోయింది. ఇండియాలో సావర్కర్ను అండమాన్ జైలులో పెట్టారు. రెండు జీవితకాలాల శిక్ష విధించారు. ఆయనను విడుదల చేయించడానికి కామా బ్రిటన్, ఫ్రాన్స్ దౌత్య కార్యాలయాల చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు. నిరంతర ప్రయాణాలు, నిరంతర ఉద్యమంతో భికాజీ ఆరోగ్యం దెబ్బ తిన్నది. 1935లో ఆమెకు పక్షవాతం సోకింది. ఒకసారి గుండెపోటు వచ్చినా బయటపడింది. అప్పుడు మళ్లీ భారతదేశం వెళ్లిపోవాలన్న కోరికను వ్యక్తం చేశారామె. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం ఉండబోదన్న నమ్మకంతో ఆంగ్ల ప్రభుత్వం అనుమతించింది. స్వదేశానికి చేరుకున్న తొమ్మిది మాసాలకే ఆగస్టు 13, 1936న ఆ విప్లవ మహిళ తుది శ్వాస విడిచారు. కొందరు పేర్కొన్నట్టు ఆమె ‘భారత విప్లవోద్యమ మాత.’భికాజీ రాజనీతిజ్ఞత విశిష్టమైనది. తీవ్ర జాతీయవాదులు, భారత జాతీయ కాంగ్రెస్తో మమేకమైన నౌరోజీ వంటి మహనీయులు–ఈ రెండు శిబిరాల ఉద్దేశం, లక్ష్యం భారత స్వాతంత్య్రమేనన్న వాస్తవాన్ని తొలిసారిగా గుర్తించినవారిలో మొదటిగా గుర్తుకు వచ్చే వ్యక్తి భికాజీ కామా. కానీ స్వదేశంలో మితవాద కాంగ్రెస్ నాయకులు ఈ విధమైన ఆలోచనకే సుదూరంగా ఉండిపోయారు. దీని ఫలితమే దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో కొన్ని చోట్ల శూన్యం కనిపిస్తుంది. పరాయి గడ్డ మీద అంతకాలం ఉద్యమించడం దాదాపు ఆమెకు మాత్రమే సాధ్యమైంది. మేడమ్ కామా పరాయి గడ్డ మీద ఉండి స్వతంత్ర భారతదేశం కోసం అద్భుతమైన ఉద్యమం సాగించారు. ఆమె రూపొందించిన పతాకాన్ని ఇందులాల్ యాగ్నిక్ అనే గుజరాత్ ప్రాంత సోషలిస్టు ఉద్యమకారుడు స్వదేశానికి చేర్చాడు. కానీ ఆమె త్యాగనిరతి గాధ ఇప్పటికీ స్వదేశానికి చేరలేదు. స్వాతంత్య్రానికి ముందు ఉన్న 37 ఏళ్ల విప్లవ జీవితం, స్వతంత్ర భారతదేశ చరిత్ర పుస్తకాలలో తగిన స్థానం కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పటికైనా నెరవేరుతుందా? డా. గోపరాజు నారాయణరావు -
పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం
-
‘ప్రత్యేక జెండా ఉండకూడదన్న నిబంధన లేదు’
కర్ణాటక, బెంగళూర్ : కర్ణాటకలోని సిద్ధ రామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం అన్నంత పని చేసింది. రాష్ట్రం కోసం కొత్త జెండాను రూపకల్పన చేసిన అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు దానిని ఆవిష్కరించింది. గురువారం ఉదయం విధాన సౌధాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో ఉన్న నాడా ద్వజ(జెండా) రాష్ట్ర చిహ్నం గంఢ బెరుండను, రెండు తలల పక్షిని కలిగి ఉంది. ప్రత్యేక జెండాకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయగా.. ఆవిష్కరణానంతరం ఏర్పాటు చేసిన కమిటీని సిద్ధరామయ్య అభినందించారు. ఈ జెండాను కేంద్రం ఆమోదం కోసం పంపనున్నారు. ‘రాష్ట్రాలకు ప్రత్యేక జెండా ఉండకూదన్న నిబంధన రాజ్యాంగంలో పొందుపరచలేదు. అలాంటప్పుడు కర్ణాటకకు ప్రత్యేక జెండా ఉంటే తప్పేం కాదు’ అని ఈ సందర్భంగా సిద్ధరామయ్య మీడియాకు తెలిపారు. అప్పట్లో ఈ ప్రతిపాదనపై ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకత ప్రదర్శించగా.. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర జెండాకు ఆమోదం లభించటం అనుమానమే. అయితే త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. -
విలువలకు కంచె ఉండదు
‘‘యుద్ధంలో నీకు అత్యంత విలువైనది ఏది?’ అని అడిగినప్పుడు ఏ దేశ సైనికుడైనా ‘రైఫిల్’ అనే చెబుతాడు. అతడికి రైఫిల్ విలువైనదే కావచ్చు. కానీ దేశ పౌరులకు అతడి ప్రాణం విలువైనది. అందుకే దేశానికీ, దేశాధినేతలకూ ఇచ్చినంత గౌరవాన్ని మనం సైనికుడికీ ఇవ్వాలి. శత్రు దేశ సైనికుడు అయినా సరే అతడికుండే గౌరవం అతడికి ఉంటుంది. ఆ గౌరవాన్ని ఇరు దేశాల సైనికులు ఇచ్చిపుచ్చుకోవాలి. ఇక్కడ ‘గౌరవం’ అంటే అవతలి సైనికుడు బందీగా దొరికినప్పుడు యుద్ధనీతిని మరిచి ప్రవర్తించకుండా ఉండటం.’’ రెండో ప్రపంచ యుద్ధ కాలపు బ్రిటన్ సేనాని మాంట్ గొమరీ అన్న మాటలివి. ‘పీపుల్స్ జనరల్’ అని ఆయనకు పేరు. ఆదేశాలతో కాకుండా, సైనికుల మీద నమ్మకంతో ఆయన తన సైన్యాన్ని నడిపించాడు. లొంగిపోయిన శత్రుదేశ సైనిక అధికారిని విందుకు ఆహ్వానించి వీర సైనికుల మంచీ చెడుల గురించి మాట్లాడిన యుద్ధ ‘దళపతి’ చరిత్రలో బహుశా ఆయన ఒక్కరేనేమో! దేశాల మధ్య కంచె ఉంటుంది. దేశాల సైనికుల మధ్య దేశభక్తి అనే కంచె ఉంటుంది. కానీ మనిషిగా మనం పాటించవలసిన విలువలకు కంచె ఉండదు. జవహర్లాల్ నెహ్రూలో మాంట్ గొమరీ పోలికలు కొన్ని కనిపిస్తాయి. భారత ప్రధానిగా నెహ్రూ 1954 నవంబరు చివరివారంలో ఇండో–చైనా సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి మన సైనికులలోని స్నేహశీలతను, సరిహద్దు గ్రామాల్లోని ప్రజలతో వారు కలిసిపోయిన తీరును చూసి నెహ్రూ అబ్బురపడ్డారు. ప్రతికూల పరిస్థితులలో సైతం వివేకం కోల్పోకుండా, నిగ్రహంతో మనవాళ్లు తమ విధులలో నిమగ్నమై ఉండటం ఆయనకు నచ్చింది. పైగా ఇటువాళ్లు గానీ, అటువాళ్లు గానీ కయ్యానికి కాలు దువ్వుతుండే వాతావరణానికి భిన్నంగా.. ఎవరి దేశానికి వారు కాపలా కాస్తూనే, ఎవరి పరిధితో వారు ఉండి రెండో వారితో కలుపుగోలుగా ఉండటం.. ప్రపంచవ్యాప్త సైనికులపై నెహ్రూకు గౌరవభావం కలిగేలా చేసింది. ఇదే విషయాన్ని బోర్డర్ నుంచి తిరిగి వచ్చాక డిసెంబర్ 7న నెహ్రూజీ బహిరంగంగా ప్రకటించారు! సైనికుడు దేశాన్ని కాపాడితే, సైనికుడి కుటుంబాలను దేశ పౌరులు కాపాడాలి అని పిలుపు కూడా ఇచ్చారు. ఆ పిలుపును ప్రతి తరం అందుకోవాలి. ఎదురు పడిన సైనికుడికి వందనం చేసి ఊరుకోకండి. నేను మీకెలాగైనా సహాయపడగలనా? అని అడగండి. (నేడు భారత సైనిక దళాల పతాక దినోత్సవం. ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే). -
బలక్కివారిపల్లిలో జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
అపశ్రుతులు-వివాదాలు-విషాదాలు
-
బదిలీలు.. ప్రభుత్వ వ్యవహారం- సీఎం
బెంగళూరు: పరప్పన అగ్రహార జైలులో అవినీతి బయటకు రావడం, ఐపీఎస్ బదిలీల నుంచి దృష్టి మళ్లించడానికే జెండా తతంగమని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఖండించారు. పరిపాలన కోసమే బదిలీ చేశామని, ఏ అధికారిని ఎక్కడికి, ఏ సమయంలో బదిలీ చేయాలో ప్రభుత్వానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. అందులో ప్రతిపక్షాలు తల దూర్చడమేంటని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్ర జెండాకు రాజ్యాంగబద్దత కల్పించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సీఎం సమర్ధించుకున్నారు. బుధవారం ఆయన రాష్టానికి చెందిన సివిల్స్ ర్యాంకర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక జెండా తేవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ జెండాను అవమానిస్తోందని బీజేపీ, జేడీఎస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. జాతీయ జెండాకు ఎటువంటి అవమానం కలిగించకుండానే దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించకుండానే రాష్ట్ర పతాకానికి రాజ్యాంగ బద్దత కల్పించాడానికి ప్రయత్సిస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ విమర్శించారు. రాష్ట్రాలకు ప్రత్యేక జెండా ఉండకూడదంటూ లేదా ఉండాలంటూ రాజ్యాంగంలో కూడా ఎక్కడ ప్రస్తావించలేదన్నారు. ‘అన్ని రాష్ట్లాల్లోనూ జాతీయ గీతం ఆలపించడానికి ముందు ఆయా రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తారు. దీని వల్ల జాతీయ గీతానికి ఎటువంటి అవమానం కలగదు. అదే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక జెండా కలిగి ఉండడం జాతీయ జెండాను ఎలా అవమానించినట్లువుతుంది' అని సీఎం ప్రశ్నించారు. సీనియర్ సాహితీవేత్త పాటిల్ పుట్టప్ప సలహా మేరకు రాష్ట్ర జెండాకు రాజ్యాంగబద్దత కల్పించడానికి ఎదురయ్యే చిక్కులు తదితర అంశాలపై నివేదికలు అందించడానికి సీనియర్ సాహితీవేత్తలతో సమితిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సమితి తమకు నివేదికలు అందించిన అనంతరం సాదకబాధలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
భవిష్యత్ వైఎస్ఆర్సీపీదే
– 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం – ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం – జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): భవిష్యత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, 2019లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు ఎంపీ బుట్టారేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి మురళీకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాంపుల్లయ్య యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజవిష్ణువర్దన్రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమణ తదితరులు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం కేకును కట్ చేసి కార్యకర్తలక పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందని, సీఎం చంద్రబాబునాయుడు..వైఎస్ఆర్సీపీని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. త్వరలో జరగబోయే కర్నూలు మునిసిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, వచ్చే ఏడాది జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ కార్యకర్తలు, నాయకులు దృష్టిసారించాలన్నారు. గెలుపుకోసం ప్రణాళికలు రచించి ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నరసింహులు యాదవ్, సురేందర్ రెడ్డి, రమణ, జహీర్ అహ్మద్ఖాన్, గోపీనాథ్యాదవ్ పర్ల శ్రీధర్, కర్నాటి పుల్లారెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, రెహ్మన్, మద్దయ్య, మంగమ్మ, సలోమి, విజయలక్ష్మీ, కటారి సురేష్ తదితరు పాల్గొన్నారు. హోలీ వేడుక వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అనంతరం నాయకులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. తమ పార్టీ భవిష్యత్ రంగ కేళిగా ఉంటుందని ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు. -
విజయవాడలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
ఎగసిన దేశభక్తి తరంగం
- రాజమహేంద్రవరంలో 4 వేల మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన - పాల్గొన్న 10 వేల మంది - వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ శ్రీహరిని అభినందించిన ప్రముఖులు సాక్షి, రాజమహేద్రవరం : గోదావరి తీర నగరం రాజమహేంద్రవరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి తరంగాలు ఉవ్వెత్తున ఎగిశాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ నాలుగో డివిజన్ కార్పొరేటర్ బొంతా శ్రీహరి గురువారం 4 వేల మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద ఈ ప్రదర్శనను అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలవల్ల ప్రజల్లో దేశభక్తి, ఐక్యత పెరుగుతాయని వారన్నారు. అనంతరం ఈ ప్రదర్శన టీటీడీ కల్యాణ మండపం, నందం గనిరాజు జంక్షన్, కంబాలచెరువు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా పుష్కర ఘాట్ వరకూ సాగింది. జాతీయ పతాకాలు చేబూని స్కేటింగ్ చేస్తూ చిన్నారులు, బుల్లెట్లపై సాగుతూ యువకులు ఈ ప్రదర్శనలో పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాదాపు 10 వేల మంది విద్యార్థులు, నగర యువత, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నగర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, సుధారాణి, పిల్లి నిర్మల, బొండేసి మాధవి, మెర్సీప్రియ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఏఎస్పీ గంగాధర్, డీఎస్పీలు జి.శ్రీకాంత్, జె.కులశేఖర్, రామకృష్ణ, పలువురు సీఐలు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. జాతీయ భావం వెల్లివిరిసేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ బొంతా శ్రీహరిని నగర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. -
అమెజాన్ మరో పైత్యం
చండీఘడ్: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన పైత్యాన్ని మరోసారి చాటుకుంది. ఎన్ని హెచ్చరికలు చేసినా.. తప్పులు మీద తప్పు లు చేస్తూ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదిర్శిస్తోంది. తాజాగా ఏకంగా వినాయకుడి బొమ్మలున్న స్కేట్ బోర్డులను విక్రయానికి పెట్టింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ తీరుకు నిరసనగా చండీగఢ్కు చెందిన న్యాయవాది అజయ్ జగ్గా స్పందించారు. స్కేట్ బోర్డులపై గణపతి బొమ్మలను ముద్రించడంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే అమెజాన్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెబ్సైట్ నుంచి వాటిని తొలగించాలని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ చర్య భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 295 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. భారతీయుల మనోభావాలనుదెబ్బతీసిన అమెజాన్పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కాగా ఇటీవల అమెజాన్ భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తూ వెబ్ సైట్ లో వస్తువులను విక్రయానికి పెట్టింది. జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్మ్యాట్లలు ఆ తర్వాత మహాత్మాగాంధీ ఫొటో ముద్రించిన చెప్పులను వెబ్సైట్లో పెట్టింది. దీనిపై కేంద్ర విదేశామంత్రి సుష్మా స్వరాజ్ సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. -
సాయుధ దళాల సేవలు జాతి మరువదు
జేసీ సత్యనారాయణ కాకినాడ క్రైం: దేశ భద్రత కోసం సాయుధ దళాలు చేస్తున్న వీరోచిత సేవలు జాతి ఎన్నటికీ మరువదని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సత్యనారాయణ తెలిపారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని çపురస్కరించుకుని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జెడ్పీ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద çపూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశరక్షణలో ఎంతోమంది వీరజవానులు తమ ప్రాణాలనుసైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల కోసం, దేశం కోసం పనిచేస్తున్న సాయుధ దళాలు, అమర జవానుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం అందరూ తోడ్పాటునందించాలని కోరారు. ప్రజలు ఇచ్చే విరాళాలు దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, మాజీ సైనికులు, వితంతువుల సంక్షేమం కోసం వెచ్చిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సాయుధ దళాల సిబ్బంది, కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం విద్యార్థులు, సిబ్బంది జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ఫోర్స్ అధికారి కపుల్ ఎస్కే యాదవ్, కేడెడ్ సార్జంట్ ఎస్.సాయిచరణ్రాజ్, కాకినాడ ఆర్డీవో అంబేడ్కర్, విశ్రాంత సైనికోద్యోగుల హెల్ప్లైన్ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.శంకరరావు, ఏ. సూర్యారావు, ఉపాధ్యక్షుడు ప్రసాద్, సంయుక్త కార్యదర్శి ఎస్.రామారావు, కోశాధికారి బి.శంకర్ పాల్గొన్నారు. -
బాలాజీ జెండాకు వీడ్కోలు..
మద్నూర్ : మండల కేంద్రంలో తొమ్మిది రోజులుగా కొలువుదీరిన తిరుమలేశుడి జెండాకు భక్తులు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాలాజీ జెండా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా తిడుగుతూ భక్తుల ప్రత్యేక పూజలు అందుకుంది. గోవిందుడి నామస్మరణతో వీధివీధి మారుమోగింది. ప్రతి ఏడాది బాలాజీ జెండా 9 రోజుల పాటు ప్రతిష్టాపించిన అనంతరం కోడిచిరలో ఐదు రోజుల పాటు కొలువుదీరుతుందని జెండా కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు జెండా తరలివెళ్తుందన్నారు. జెండా వెంట భక్తులు గ్రామ పొలిమేర వరకు భజనలు చేస్తూ వెళ్లారు. -
టోక్యో చేరిన ఒలింపిక్ పతాకం
టోక్యో: ఒలింపిక్ పతాకం తదుపరి ఆతిథ్య నగరం టోక్యో చేరుకుంది. జపాన్ రాజధానిలో 2020 ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. రియో ముగింపు వేడుకల్లో ఒలింపిక్ జెండాను లాంఛనంగా అందుకున్న టోక్యో గవర్నర్ యురికొ కొయికె అక్కడి నుంచి బుధవారం ఇక్కడి హనెడా విమానాశ్రయానికి వచ్చారు. జెండాతో స్వదేశంలో దిగగానే ఆమె మాట్లాడుతూ ‘మేం పెద్ద బాధ్యతనే తీసుకున్నాం. 52 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్ జెండా మా దేశానికి వచ్చింది’ అని అన్నారు. జపాన్ చివరిసారిగా 1964లో మెగా ఈవెంట్కు ఆతిథ్యమిచ్చింది. రియో నుంచి టోక్యోకు ఒలింపిక్ ఫ్లాగ్ రావడంపై సరదాగా ఓ వీడియోగేమ్ రూపొందింది. ఇందులో జపాన్ ప్రధాని షింజో ఏబ్ సూపర్ మారియోగా... రియోలోని భూభాగాన్ని తొలుస్తూ టోక్యోలో భూమిని చీల్చుకుంటూ వస్తాడు. ఈ కామికల్ విడియోగేమ్పై జపాన్ ప్రజల ఆసక్తిని తాను తెలుసుకోవాలనుకుంటున్నట్లు ప్రధాని షింజో ఏబ్ చెప్పారు. -
తిరంగా.. ఘనంగా..
పి.గన్నవరం : ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడిన మహనీయులను ఎల్లవేళలా స్మరించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంభొట్ల సుధీష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మానేపల్లి అయ్యాజీ వేమా అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యాన పి.గన్నవరంలో శనివారం తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. 700 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని మెయిన్ రోడ్డులో ఊరేగించారు. తొలుత అక్విడెక్టు వద్ద పి.గన్నవరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు అడ్డగళ్ల అచ్యుతరామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి పోలీస్ స్టేషన్ వరకూ ఆయన ఫ్లెక్సీతో పాటు, జాతీయ పతాకాన్ని ఊరేగించారు. సిద్ధార్థ కళాశాల విద్యార్థులు జాతీయ పతాకాన్ని చేతబట్టి ‘భారత్మాతాకీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. మూడు రోడ్ల సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు సీతారామయ్య కుమారుడు అడ్డగళ్ళ నారాయణమూర్తిని నాయకులు అభినందించారు. బీజేపీ మండల అధ్యక్షుడు వులిశెట్టి గంగాధర్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమాల్లో ఆల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకూరి గోపాలకృష్ణ, బెల్లంపూడి సర్పంచ్ చీకరమెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మువ్వన్నెల రెపరెపలు
-
త్రివర్ణ జెండా రూపకల్పన ఇక్కడే
– నడిగూడెం కోటలో పింగళి రూపకల్పన నడిగూడెం: జాతీయ త్రివర్ణ పతాకాన్ని నడిగూడెంలోని జమీందారు రాజా బహుద్దూరు నాయిని వెంకటరంగారావు కోటలోనే పింగళి వెంకయ్య రూపొందించారు. పింగళి వెంకయ్య స్వగ్రామం మచిలీపట్నం వద్ద ఓ కుగ్రామం. 1910లో అమెరికాలోని బావిస్టన్లో పింగళి వెంకయ్య, రాజా నాయిని వెంకటరంగారావు కలిసి చదువుకున్నారు. పింగళి వెంకయ్య వ్యవసాయం, వెంకటరంగారావు ఎల్ఎల్బీలో అక్కడే పట్టభద్రులయ్యారు. నాడు రాజా నాయిని వెంకటరంగారావు అప్పటి క్రిష్ణా జిల్లా నందిగామ తాలూకా మునగాల పరగణాను పాలిస్తున్నారు. పింగళి వెంకయ్యకు వ్యవసాయంలో ప్రావీణ్యం ఉండడంతో ఈ పరగణాలో పత్తి సాగు కోసం, ఆ పంట విస్తరణ కోసం రాజావారు పింగళి వెంకయ్యను తన ఆస్థానంలో వ్యవసాయాధికారిగా నియమించుకున్నారు. 1910లో స్వాతంత్ర పోరాట ఉద్యమం ఉదృతంగా జరుతున్నది. జాతిపిత మహాత్మా గాంధీ అంటే పింగళి వెంకయ్య బాగా ఇష్టం. పింగళి వెంకయ్య రాజావారి వద్ద విధులు నిర్వహిస్తూనే నాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేవాడు. నాడు అనేకసార్లు గాంధీజీని కలిసేవారు. పలుసార్లు గాంధీ మన జాతికి జాతీయ జెండా కావాలని అడగడంతో 1926లో పింగళి వెంకయ్య మూడు రంగుల్లో ఒక జాతీయ జెండాను రూపొందించారు. కశాయం రంగు ఉద్యమ స్పూర్తి కోసమని, తెలుపు శాంతి కోసమని, ఆకుపచ్చని రంగు దేశం నిత్యం పచ్చని పైరులతో ఉండాలనేది దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. ఈ మూడు రంగులో మధ్యలో గాంధీజీ నూలు వడికంచు రాట్నం పటంతో ఈ జాతీయ జెండాను రూపొందించారు. 1926లోనే తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని గాంధీజికి ప్రదర్శించారు. అప్పటికే దేశ నలుమూలల నుంచి 16 నమూనాలు గాంధీజీకి అందాయి. పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో 1930లో రాట్నంను తొలగించి ఆశోక చక్రంతో రూపొందించి పింగళి వెంకయ్య రూపొందించిన జెండానే గాంధీజీ ఖరారు చేశారు. తర్వాత ఈ స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ఈ జాతీయ జెండాను పట్టుకొని ఉద్యమకారులు ఉద్యమాన్ని నిర్వహించారు. నాడు నడిగూడెంలోనే పింగళి వెంకయ్య దేశం గర్వించపడేలా జాతీయ జెండాను రూపొందించడం పట్ల నడిగూడెం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పాకిస్థాన్ జెండా కలకలం!
నలందః బీహార్ లో పాకిస్థాన్ జెండాను ఎగురవేయడం కలకలం రేపింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత నియోజకవర్గం నలంద జిల్లాలోని ఓ ఇంటిపై రెపరెపలాడుతున్న పాక్ జెండా స్థానికంగా ఆందోళనను కలిగించింది. ఓ వ్యక్తి ఇంటిపై ఎగురుతున్న జెండాను చూసిన స్థానికులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులనుంచీ జెండాను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. బీహార్ నలంద జిల్లా ఖరాదీ కాలనీలోని ఓ ఇంటిపై పాక్ జెండా ఎగరడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి తన ఇంటిపై ఎగురవేసిన పాకిస్థాన్ ఫ్లాగ్ చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చేలోపే సమాచారం అందుకున్నస్థానిక ప్రైవేట్ ఛానల్స్ అన్వరుల్ ఇంటిపై నెలవంక ఉన్న ఆకుపచ్చ జెండా ఎగరడాన్ని ప్రసారం చేశాయి. ఛానల్స్ లో సైతం ఆకుపచ్చ జెండా ప్రసారం కావడంతో విషయాన్ని తెలుసుకున్న ఎస్డీఓ సుధీర్ కుమార్, డిఎస్పీ మొహ్మద్ సైఫుర్ రెహ్మాన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే కుటుంబ సభ్యులు జెండాను తొలగిచడంతో వారి ఇంట్లో సోదాలు జరిపి కుటుంబ సభ్యులనుంచీ జెండాను స్వాధీనం చేసుకున్నారు.అయితే తన ఇంటిపై జెండాను ఎగురవేసిన నిందితుడు అన్వరుల్ హక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరిపి, నిజంగా ఆ జెండా పాకిప్థాన్ జాతీయ పతాకమా కాదా అన్నవివరాలను సేకరిస్తామని ఎస్డీవో సుధీర్ కుమార్ తెలిపారు. అయితే మొహర్రం సందర్భంలో తమ ఇంటిపై ఈ జెండాను ఐదేళ్ళుగా ఎగురవేస్తున్నట్లు అన్వరుల్ హక్ కుమార్తె షబానా తెలిపింది. అన్వరుల్ హక్ ప్రత్యేక వేడుకలకు, వివాహాల సందర్భాల్లోనూ టెంట్లు, ఫర్నిచర్ సప్లై చేసే వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో నిందితుడు.. ప్రస్తుతం పరారీలో ఉన్న హక్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం గాని, ఇతరులెవర్నీ అరెస్టు చేయడం గానీ జరగలేదని ఎస్డీవో వెల్లడించారు. ఇదిలా ఉంటే... ఛానల్స్ లో వార్త ప్రసారం అవ్వడమే తడవుగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. అయితే ఈ సంఘటనపై ఆరా తీసి, దోషులను శిక్షించాలని సీనియర్ బీజేపీ నాయకుడు సీపీ ఠాకూర్ డిమాండ్ చేశారు. బీహార్ ను మరో జమ్మూ కాశ్మీర్ లా మార్చే ప్రయత్నం చేయొద్దని, బీహార్ లో ఇటువంటి జాతి వ్యతిరేక చర్యలకు కేంద్రం వెంటనే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. -
చెన్నై ఇంజనీరే ఆ.. జెండా రూపకర్త!
న్యూఢిల్లీః భారత్ లో ఐసిస్ భావజాలానికి ఆకర్షితులౌతున్న వారు ఇటీవలి కాలంలో పెరిగిపోతుండటం ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. సిరియా ఇరాక్ లలో తమ ఉగ్రవాద కార్యకలాపాలకోసం వందలాది మందికి ఇస్లామిక్ స్టేట్ శిక్షణ కూడ ఇస్తున్న విషయం తెలిసిందే. తీవ్రవాద సంస్థ ఐసిస్ తో కలిసి నడిచేందుకు సిద్ధమౌతున్న భారతీయుల సంఖ్య కూడ తక్కువేం కాదు. ప్రస్తుతం ఆ ఉగ్రమూక తమకు గుర్తుగా వాడుకునే జెండా భారతీయుడే రూపొందించాడన్న విషయం వెలుగులోకి రావడం ఇప్పుడు అందర్నీ విస్మయపరుస్తోంది. ఐసిస్ ఆనవాళ్ళు ఇండియాలో అప్పుడప్పుడూ బయట పడుతూనే ఉన్నాయి. అయితే ఇస్లామిక్ స్టేట్ కు గుర్తుగా వారి జెండాను భారత పౌరుడు రూపొందించాడన్న నిజం మాత్రం ఇప్పుడు అందర్నీ మరింత బాధపెడుతోంది. చెన్నైకు చెందిన 23 ఏళ్ళ మహ్మద్ నజీర్ ఐసిస్ జెండాను తయారు చేసినట్లు తాజాగా నేషనల్ ఇంటిటిజెన్స్ ఏజెన్సీ బయట పెట్టడం ఆందోళన రేకెత్తించింది. ఇస్లామిక్ స్టేట్ కోసం జెండాను, లోగోలను రూపొందించిన నజీర్.. చెన్పై కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసి, ఉద్యోగం కోసం 2014లో దుబాయ్ వెళ్ళాడు. కొన్నాళ్ళు అక్కడ వెబ్ డిజైనర్ గా పని చేసిన అతడు.. అనంతరం ఐసిస్ ప్రచార వీడియోలకు ఆకర్షితుడయ్యాడు. గతేడాది సూడాన్ మీదుగా సిరియా వెళ్ళడానికి ప్రయత్నించి నజీర్ పోలీసులకు దొరికిపోయాడు. దేశభక్తుడైన నజీర్ తండ్రి అమిర్ మహ్మద్... నజీర్ ఐసిస్ లో చేరడానికి వెడుతున్నాడన్న వార్త తెలుసుకొని భద్రతాదళాలకు సమాచారం ఇవ్వడంతో... ఎన్ ఐ ఏ నజీర్ ను అదుపులోకి తీసుకుంది. అతడిపై ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. నజీర్ సూడాన్ వెడుతున్న క్రమంలో తాను ఐసిస్ లో చేరేందుకు వెడుతున్నానని, తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలంటూ తండ్రికి సమాచారం ఇవ్వడంతో.. విషయం తెలిసిన ఆయన.. ఇంటిలిజెన్స్ వర్గాలకు తెలిపారు. సూడాన్ అధికారులతో సంప్రదించిన ఎన్ ఐఏ నజీర్ ను పట్టుకొని ఇండియాకు తెచ్చి విచారిస్తుండగా... ఐసిస్ జెండాను నజీరే రూపొందించినట్లు కూడ తెలిసింది. -
’మహమ్మనా’ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని
-
నివాసంలో జెండా ఎగురవేసిన హోంమంత్రి
న్యూఢిల్లీ : 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జెండా పండుగలో పాల్గొన్నారు. ఆయన శనివారం ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించి... గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు సిబ్బందిని స్వీట్స్ ఇచ్చి స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా ఢిల్లీలోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, గౌరవ వందనం చేశారు. అలాగే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ శనివారం ఉదయం జాతీయ జెండా ఆవిష్కరించారు. -
జెండా ఎగురవేసిన హోం మంత్రిరాజ్నాథ్
-
ముస్తాబైన గోల్కొండ కోట