విషజ్వరంతో బాలుడి మృతి
Published Tue, Feb 28 2017 11:59 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
తాడిపత్రి రూరల్: తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో లక్ష్మీదేవి, తిరుపాలు దంపతులకు చెందిన ఓబులేసు(4) విష జ్వరంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలతిపారు. మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కుమారుడిని తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా కోలుకోలేక మృతి చెందినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు విషజ్వరంతో మృతి చెందడంతో వారు తల్లడిల్లిపోయారు. వారిని ఓదార్చాడం ఎవరివల్లా కాలేదు.
Advertisement
Advertisement