obulesu
-
తగువులు వద్దన్నందుకు తమ్ముడినే చంపేశాడు..
రుద్రవరం: చిన్న చిన్న విషయాలకు ఇతరులతో గొడవపడొద్దని సూచించిన తమ్ముడిని.. అన్న కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెలో జరిగింది. శిరివెళ్ల సీఐ వంశీధర్, ఎస్ఐ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. బి.నాగిరెడ్డిపల్లెలో గురువారం రాత్రి సురేంద్ర అనే వ్యక్తి మోటార్ సైకిల్పై వేగంగా వెళ్తుండగా పెద్ద ఓబులేసు అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. దాడి విషయం తెలుసుకున్న ఓబులేసు కుటుంబ సభ్యులు.. నువ్వు మద్యం మత్తులో రోజూ ఏదో ఒక సమస్య తెస్తున్నావు.. పద్ధతి మార్చుకోవాలి.. అని చెప్పారు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఓబులేసు.. కత్తితో తమ్ముడు కర్రెన్న అలియాస్ ఇసాక్(40)ను పొడిచాడు. అడ్డు వచ్చిన తండ్రిపైనా దాడి చేశాడు. క్షతగాత్రులిద్దరినీ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. శుక్రవారం తెల్లవారు జామున ఇసాక్ మృతి చెందాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్చేశారు. -
సోమిరెడ్డిపై కేసు నమోదు
పొదలకూరు: ఎన్నికల వేళ ప్రచారంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మహిళలకు నగదు పంపిణీ చేసిన వ్యవహారంపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డి అప్పట్లోనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా.. మానవతా దృక్పథంతో సాయం చేశారంటూ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి తోసిపుచ్చారు. వీడియో విజువల్స్లో స్పష్టంగా సోమిరెడ్డి మహిళలకు నోట్లు ఇవ్వడం కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు.దీనిపై కాకాణి పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మూడు రోజుల క్రితం కాకాణి మీడియా సమావేశం నిర్వహించి సోమిరెడ్డి ప్రలోభాల పర్వంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా సర్వేపల్లి రిటర్నింగ్ అధికారి చినఓబులేసు పొదలకూరు పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.ఏప్రిల్ 12వ తేదీన శుక్రవారం సోమిరెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్రెడ్డి పొదలకూరు మండలం చెర్లోపల్లి గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు పంపిణీ చేశారు. సోమిరెడ్డి అనుచరులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పట్లో ఎన్నికల అధికారులు దీనిపై మండలస్థాయి అధికారులతో విచారణ జరిపించి.. మానవతా దృక్పథంతో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు అందజేసినట్టు నివేదిక సమర్పించి మమ అనిపించారు. ఎట్టకేలకు కాకాణి హెచ్చరికలతో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై ఐపీసీ 173–ఈ, ఆర్పీ యాక్ట్ 123 క్లాజ్–1 సెక్షన్ల కింద పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. -
వేషం మార్చి.. పేరు మార్చి.. జనాన్ని ఏమార్చి! రూ.10 కోట్ల వరకూ..
సాక్షి, పుట్టపర్తి: మహా మాయగాడి బండారం బయట పడింది. ఊరికో పేరు మార్చుకుంటూ చెలామణి అవుతూ అమాయకులను మోసం చేస్తోంది.. ఒక్కడే అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన బెస్త చిన్న ఓబులేసు అధిక వడ్డీ ఆశ చూపి ఇప్పటికే పలు చోట్ల జనాలను నిలువునా మోసం చేసిన ఘటనలు వెలుగు చూశాయి. ఒక్కో చోట ఒక్కో పేరుతో చెలామణి అవుతుండటంతో ప్రజలు పసిగట్టలేకపోయారు. రోజుల వ్యవధిలోనే రూ.లక్షకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి కొన్ని రోజుల పాటు ఠంఛన్గా సొమ్ము చెల్లించేవాడు. ఆ తర్వాత ఉడాయిస్తాడు. ఇప్పటికే నంద్యాల జిల్లా అవుకు, అనంతపురం జిల్లా కణేకల్లు, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించారు. ఆ తర్వాత బెయిల్పై వచ్చి ఊరు మార్చి.. కొత్త పేరుతో దందా కొనసాగిస్తున్నాడు. గత రెండేళ్లలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డట్టు తేలింది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మనోహర్రెడ్డి పేరుతో రూ.1.7 కోట్లతో పరారయినట్లు బాధితులు ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ భాస్కర్రెడ్డిగా.. ఇక్కడ మనోహర్రెడ్డిగా.. గతేడాది మేలో నంద్యాల జిల్లా అవుకులో భాస్కర్రెడ్డిగా పరిచయమయ్యాడు. అక్కడే ఓ షాపు అద్దెకు తీసుకుని వంటనూనె, చక్కెర, సిగరెట్ల వ్యాపారం చేస్తానని నమ్మబలికాడు. స్టాక్ కోసం పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు కావాలని, రూ.లక్ష తనకిస్తే రోజుకు రూ.5 వేల చొప్పున వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అధిక వడ్డీకి ఆశపడి చాలామంది అతనికి డబ్బులిచ్చారు. అక్కడ సుమారు రూ.3 కోట్ల వరకూ వసూలు చేసుకుని పరారయ్యాడు. అవుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గాలించి గాలివీడులో పట్టుకుని జైలుకు పంపారు. అవుకు కేసు నుంచి బయటికొచ్చాక శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి మకాం మార్చాడు. అక్కడ షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మబలికాడు. అధిక వడ్డీ ఇస్తానని కొన్ని రోజుల పాటు నమ్మించాడు. రూ.లక్షకు రోజుకు రూ.వెయ్యి ఇస్తానని చెప్పాడు. సుమారు రూ.1.7 కోట్లు వసూలయ్యాక పరార్ అవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అంతకుముందు అనంతపురం జిల్లా కణేకల్లు.. ఆత్మకూరులో కూడా అధిక వడ్డీ ఆశ చూపి కొందరితో డబ్బులు వసూలు చేసి పరారైనట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. మొదట్లో జులపాలు.. ఆ తర్వాత గుండు రైల్వే కమ్మీలు చోరీ చేసిన కేసులో కూడా బెస్త చిన్న ఓబులేసే నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు గాలించి అరెస్టు చేసి జైలుకు పంపినా.. ఆ తర్వాత అనంతపురంలోని నాయక్ అనే ఓ లాయర్ను అడ్డు పెట్టుకుని సులువుగా బయటికొచ్చేస్తున్నాడు. చిన్న ఓబులేసు పేర్లు మార్చుకున్నట్లే వేషం కూడా మార్చేస్తాడు. మొదట్లో జులపాల జుట్టుతో ఖద్దర్ చొక్కా వేసి.. చేతికి ఉంగరాలు, మెడలో బంగారు చైన్లు వేసుకుని దర్జాగా తిరుగుతాడు. డబ్బులున్న వారితో టచ్లోకి వెళ్లి అధిక వడ్డీ ఆశ చూపి లూఠీ చేసి పరారవుతాడు. ఆ తర్వాత విహార యాత్రలకు వెళ్లి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు. పోలీసులకు పట్టుబడే సమయానికి గుండుతో ఉంటాడు. నిత్యం డ్రెస్ కోడ్, బాడీ లాంగ్వేజ్ మార్చి విందు, వినోదాల్లో మునిగితేలుతుండాడు. విహార యాత్రల్లో ఉండగానే లాయర్లతో టచ్లోకి వెళ్లి.. కేసులకు సంబంధించి లాబీయింగ్ చేస్తాడని సమాచారం. -
సీఎం రమేషూ దీక్షా పురుషుడేనా?
అభిప్రాయం ‘‘అల్లా మెహర్భాన్ రహేతో గధాబి పైల్మాన్ బనేగా’’ (దేవుడి దయ ఉంటే బలహీనుడు కూడా బలవంతుడు అవుతాడు) ఇప్పుడు టీడీపీ అండ, దాన్ని బలపర్చే మీడియా దన్నుతో సీయం రమేష్ నాయుడు రాజకీయ నేతగా ఎదగజూస్తున్నారు. ఒకప్పుడు సారా వ్యాపారంతో డబ్బులు ఆర్జించి ఆపైన సివిల్ కాంట్రాక్టరుగా పెరిగి పెద్దవాడై నేడు రుత్విక్ అనే బడా కాంట్రాక్టు కంపెనీ యజమానిగా ఎదిగిపోయారు. ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించి దాన్ని చంద్రబాబు చేపట్టిన తర్వాత హైదరాబాద్ సచి వాలయంలో, సీఎం పేషీలో రమేష్ నాయుడి హవా అంతాఇంతా కాదు. సెక్యూరిటీ పాసు లేకపోయినా, ముందస్తు అనుమతి లేకపోయినా సిఎం పేషీలోకి ప్రవేశించగల సన్నిహిత సంబంధం రమేష్ది. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తొలి నాళ్ళలో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటిదశ ఉత్పత్తిని జాతికి అంకితం చేయడానికి, రెండో దశ నిర్మాణం శంకుస్థాపన చేయడానికి కల్లమల్ల వద్ద గల ఆర్టీపీపీకి వైఎస్సార్ వచ్చినప్పుడు జరిగిన మేళా కార్యక్రమాన్ని సీయం రమేష్నాయుడు తన స్వంత ఖర్చులతో అంతా తానై నిర్వహించాడు. ఎంత విచిత్రం. అది వరకు బాబుకు అత్యంత దోíస్తీగా ఉండిన రమేష్ అధికార పదవి అటు నుండి ఇటు మారగానే తన ఆర్థిక అవసరార్ధం వైఎస్సార్తో కలసిపోయారు. థర్మల్ కేంద్రంలో, నీటిపారుదల ప్రాజెక్టులలో కాంట్రాక్టు పదవులూ పొందారు. ఆ అంకం ముగిసి బాబు జమానా మొదలవగానే కోట్లు ఇచ్చి రాజ్యసభ స్థానాన్ని పొందగలిగారు. కానీ కడప జిల్లా ప్రజలు, సీయం రమేష్ను వ్యాపారవేత్త, కాంట్రాక్టరుగానే చూస్తున్నారు తప్ప రాజకీయ నాయకుడిగా చూడ్డం లేదు. ఇందుకు కలత చెందారేమో కానీ అమాంతంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికై నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. 2007 జూలై 10న బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి జమ్మలమడుగు వద్ద శంకుస్థాపన రోజు వైఎస్సార్ సరసన నిలబడి నాడు చిలకపలుకులు పలికిన నాయకులంతా ప్రత్యర్ధి పార్టీలో చేరి పోయి నేడు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. 2009లో వైఎస్సార్ ప్రమాదవశాత్తు చని పోయారు. తదనంతర పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ సమయంలోనే కడపజిల్లాలో మొట్ట మొదట ‘‘కడప ఉక్కు రాయలసీమ హక్కు’’ నినాదం పేరుతో 2011లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఆహ్వానించి సదస్సు నిర్వహించడమైంది. ఇదిసీమ అంతటా అభ్యుదయ, ప్రగతి శీల శక్తులకు గొప్ప ప్రేరణ ఇచ్చింది. 2011 నుండి 2018 మే వరకూ ఈ ఉద్యమంలో సీఎం రమేష్ నాయుడు, మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎక్కడున్నారో? బాబును ఏ గ్రహæణం ఆవరించిందో? అధికారమత్తులో ప్రజల కోర్కెలను మరచిపోయి ఇపుడు ఎన్నికలు దగ్గరపడేటప్పటికీ పొంతన లేని ప్రకటనలతో, శాపనార్ధా్దలతో ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారట. టీడీపీ వారంతా 2018 మార్చి వరకూ అంటే బీజేపీతో అంటకాగినంత వరకూ కడప స్టీల్ ఫ్యాక్టరీ చెల్లుబాటు కాదని, ఫిజుబిలిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఇపుడు అంతా కట్టగట్టుకొని కడపలో వాలిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చిన్న నిప్పురవ్వలా నాడు ఎగిసిన ఉద్యమం నేడు అగ్నిపర్వతంలా తయారైంది. ఇక బ్రద్దలై లావా పొంగి పారుతుందని సీఎం రమేష్ బహిరంగ లేఖ రాశారు. నిజమే.. ప్రజల్లో టీడీపీ, బీజేపీ పట్ల ఉన్న అసంతృప్తి నిరసనల రూపంలో నిన్నటి వరకూ వ్యక్తమవుతూ వచ్చింది. ఇక తీవ్రమైన వ్యతిరేకత రూపంలో పెల్లుబికి ఆ రెండు పార్టీలను 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారు. రమేష్ నాయుడి ఆశలు, బాబు అండ్ కో ఆశలు అడియాసలు కాకమానవు. ‘చిత్తశుద్ధిలేని శివపూజలేల’ అని వేమన చెప్పిన మాటలు టీడీపీ నాయకులు ఇకనైనా స్ఫురణకు తెచ్చుకుంటే మంచిది. జి. ఓబులేసు వ్యాసకర్త సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు -
సర్కార్ చదువుతోనే గ్రూప్–1
పుట్టింది ఓ కుగ్రామం.. వారిది సన్నకారు వ్యవసాయ కుటుంబం.. చదివింది ప్రభుత్వ పాఠశాలల్లో.. అయినా ఎంచుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతం.. చిన్నతనంలోనే అంబేడ్కర్ ప్రభావం.. అకుంఠిత దీక్ష.. గుండెల నిండా ఆత్మవిశ్వాసం.. ప్రణాళికాబద్ధంగా చదువు.. ఫలితంగా మొదట కేంద్ర ప్రభుత్వంలో ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగం.. అనంతరం గ్రూప్–1లో 15వ ర్యాంక్.. ప్రస్తుతం గూడూరు పురపాలక సంఘం కమిషనర్.. ఆయనే ఎద్దుల ఓబులేసు.. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఆయన గురించి ‘సాక్షి’ కథనం. గూడూరు : ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమర్ల గ్రామానికి చెందిన ఎద్దుల నమ్మయ్య, నాంచారమ్మల కుమారుడు ఓబులేశు. చిన్ననాటి నుంచి ఓబులేశు ఎంతో క్రమశిక్షణ గల విద్యార్థిగా గ్రామంలో పేరు తెచ్చుకున్నారు. పుట్టిన గ్రామంలోనే 5వ తరగతి వరకూ చదివి, అనంతరం పామూరులో 8వ తరగతి వరకూ, కనిగిరిలో 10వ తరగతి వరకూ విద్యనభ్యశించారు. ఇంటర్మీడియట్ మార్టూరులోనూ, బీటెక్ ఈసీఈ విజయవాడలోనూ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పూర్తి చేశారు. 2011వ సంవత్సరంలో వచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యారు. 2013లో గ్రూప్–1 ఫలితాల్లో ఎంపికయ్యారు. కొన్ని కారణాలతో కొందరు కోర్టును ఆశ్రయించగా అవి రద్దయిపోయాయి. దీంతో మళ్లీ 2016లో గ్రూప్–1 పరీక్ష రాసి 15వ ర్యాంకు సాధించారు. 2017లో జరిగిన ఇంటర్వ్యూలో ఓబులేసు గ్రూప్–1 అధికారిగా ఎంపికయ్యారు. ఈ మేరకు గూడూరు పురపాలక సంఘం కమిషనర్గా జూన్ 4న నియమితులై బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు బడుల్లో చదివినవారే ఎక్కువ శాతం మంది ఐఏఎస్లు, ఐపీఎస్లతోపాటు గ్రూప్–1, గ్రూప్–2 అధికారులుగా ఉన్నారని, తమ గ్రామంలో తనే మొదటి గ్రాడ్యుయేట్నని తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకు కృషి చేస్తాం గూడూరు పట్టణంలోని మున్సిపల్ పాఠశాలల్లో విద్యను బోధించే ఉపాధ్యాయులంతా కచ్చితంగా ప్రతిభ ఉన్నవారే ఉంటారు. ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే దిశగా కృషి చేస్తా. లక్ష్యాలను ఎంచుకుని క్రమశిక్షణతో చదివితే కచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. – ఓబులేశు, గూడూరు మున్సిపల్ కమిషనర్ -
ఆగని మరణాలు
= వడదెబ్బకు మరో ముగ్గురి మృత్యువాత = అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య = పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్న కుటుంబాలు సూర్యుడు భగబట్టినట్లున్నాడు. వడదెబ్బ రూపంలో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. రోజుకు కనీసం ముగ్గురు, నలుగుర్ని చొప్పున బలవుతున్నారు. తాజాగా బుధవారం మరో ముగ్గురు చనిపోయారు. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్యతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటి వరకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారు వడదెబ్బతో అకాల మృత్యువాతపడుతుండడంతో ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి, బజారున పడుతున్నాయి. నల్లమాడ(పుట్టపర్తి): నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో బి.ఓబులేసు(58) వడదెబ్బ బారిన పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, కర్నూలుకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. కర్నూలుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడన్నారు. మృతునికి భార్య రామకృష్ణమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్రెడ్డి, మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, స్థానిక సర్పంచ్ సూర్యనారాయణ, గ్రామ కమిటీ అ«ధ్యక్షుడు టీడీ కేశవరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకుడు నాగప్ప, పట్టణాధ్యక్షుడు షంషీర్ తదితరులు ఓబులేసు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మారెంపల్లి తండాలో మరొకరు గుమ్మఘట్ట(రాయదుర్గం): గుమ్మఘట్ట మండలం మారెంపల్లి తండాలో లల్యానాయక్(61) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఖరీఫ్ దగ్గరపడుతుండడంతో పొలంలోని కంపచెట్లను తొలగించేందుకు వెళ్లగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడన్నారు. ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడని వివరించారు. విషయం తెలియగానే వైద్యాధికారి రమేశ్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. వై.టి.చెరువులో ఇంకొకరు గుంతకల్లు రూరల్: మండలంలోని వై.టి.చెరువులో లక్ష్మీదేవి(58) వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వంట చెరుకు కోసం అడవికి వెళ్లిన ఆమె వడదెబ్బకు గురైనట్లు వివరించారు. ఒక్కసారిగా వాంతులతో పాటు నీరసపడిపోవడంతో గుంతకల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. -
విషజ్వరంతో బాలుడి మృతి
తాడిపత్రి రూరల్: తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో లక్ష్మీదేవి, తిరుపాలు దంపతులకు చెందిన ఓబులేసు(4) విష జ్వరంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలతిపారు. మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కుమారుడిని తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా కోలుకోలేక మృతి చెందినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు విషజ్వరంతో మృతి చెందడంతో వారు తల్లడిల్లిపోయారు. వారిని ఓదార్చాడం ఎవరివల్లా కాలేదు. -
సోషియల్, బయాలజీ పోస్టులు భర్తీ చేయాలి
అనంతపురం న్యూసిటీ : తమ పాఠశాలలో ఖాళీగా ఉన్న సోషియల్, బయాలజీ పోస్టులను భర్తీ చేయాలని శారద మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం రమాదేవి కమిషనర్ చల్లా ఓబులేసును కోరారు. ఈ మేరకు గురువారం కమిషనర్కు కలిసిన హెచ్ఎం, అధ్యాపక బృందం ఓ వినతి పత్రం అందజేశారు. అందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. -
అస్మా మృతదేహం వెలికితీత - పోస్టుమార్టం
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంకొప్పర్తికి చెందిన అస్మా(6) అనే చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. అస్మా మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం తహశీల్దార్, రూరల్ సీఐ ఆధ్యర్యంలో వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామానికి చెందిన నాయబ్ రసూల్, మస్తానీ దంపతుల కుమార్తె అస్మా(6) ఈనెల 6వ తేదీ అదృశ్యమైంది. ఎక్కడ వెదికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చిన్నారిని తన భర్తే హత్యచేసి పూడ్చిపెట్టాడని అదే గ్రామానికి చెందిన ఓబులేశు బార్య పోలీసులకు చెప్పడంతో కేసు మలుపు తిరిగింది. ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం మధ్యాహ్నం తను పూడ్చిపెట్టిన చోట తవ్వి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
తాగుబోతు తండ్రిని చంపిన కొడుకు
-
తాగుబోతు తండ్రిని చంపిన కొడుకు
మద్యం మత్తులో వేధిస్తున్న తండ్రిని ఓ తనయుడు ఇనుపరాడ్తో మోది హత్య చేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని గన్నవారిపల్లి కాలనీలో ఈ ఘటన జరిగింది. ఓబులేసు (60) మద్యానికి బానిసై ఐదేళ్ల క్రితం తన పెద్ద కుమారుడు రాజును హత్య చేశాడు. భార్య రాజమ్మ, చిన్న కుమారుడు సురేష్ (16)ను కూడా తరచూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రాజమ్మతో గొడవపడ్డాడు. తల్లిని కూడా చంపేస్తాడేమోనన్న ఆందోళనతో సురేష్ రాడ్ తీసుకుని తన తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఓబులేసు ప్రాణాలు విడిచాడు. తానే తండ్రిని చంపానని ఒప్పుకుని సురేష్ పోలీసులకు లొంగిపోయాడు. సురేష్ ఐటీఐ చదువుతున్నాడు. -
నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు
-
నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా కంపెనీ వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసుపై తుది తీర్పును నాంపల్లి కోర్టు గురువారం వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కానిస్టేబుల్ ఓబులేశుకు జీవిత ఖైదు విధించింది. గతేడాది నవంబర్ 14వ తేదీన బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్లో ఉదయపు నడకను ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు కారు ఎక్కుతున్న నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు ఏకే 47తో కాల్పులు జరిపాడు. ఆ వెంటనే తేరుకున్న నిత్యానందరెడ్డి తనవద్ద ఉన్న తుపాకీతో ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఆగంతకుడు ఏకే 47 వదిలి పరారైయ్యాడు. నిత్యానందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వదిలిన ఏకే 47 తుపాకీ ఆధారంగా కేసు విచారణ ప్రారంభించారు. ఆ తుపాకీ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేశుదని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. -
ప్రజలకు మీరు చేసిందేమిటి..?
కడప ఎడ్యుకేషన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందని అప్పటి నుంచి నేటి వరకూ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిం చారు. కడప జిల్లా పరిషత్తులోని సభాభవనంలో శని వారం సీపీఐ ఆధ్వర్యంలో రాయలసీమ సమగ్రాభివృద్ధిపై రాయలసీమ జిల్లాలకు సంబంధిం చిన ప్రతినిధులతో సదస్సు జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేసు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు లో రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమం త్రి చంద్రబాబు హామీలు తప్ప ప్రజలకు చేసిం దేమీ లేదన్నారు. రాయలసీమ వరుస కరువులతో అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాయలసీమ 4 జిల్లాలకు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ప్రత్యేక ప్రాకేజీతోపాటు ప్రత్యేక హోదాను ఇస్తామన్న ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలే దన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకూ చేసిందేమీలేదన్నా రు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తికి 13 వందల కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు రూ. 620 కోట్లు ఖర్చుచేశారన్నారు. కానీ 4 కిలోమీటర్ల పైపు లై న్ కూడా పూర్తి చేయలేదన్నారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు తప్ప రాయలసీమకు నీళ్లు రావన్నారు. సీపీఐ రాష్ట్ర సహా య కార్యదర్శి సీవీ సత్యనారాయణ, శాసనమండలి సభ్యుడు జీజే చంద్రశేఖర్రావులు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కోసం ఖర్చు చేసిన నిధులతో రాయలసీమ ప్రజలను ఆదుకొని ఉండొచ్చన్నారు. ఇటీవల కుప్పంలో నిర్వహించిన సభలో హంద్రీనీవాకు 2 టీఎం సీల నీటిని ఇస్తామని హామీ ఇచ్చారన్నా రు. హంద్రీనీవా ప్రాజె క్టు పూర్తి కాకుం డానే నీరు ఎలా ఇస్తారన్నారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న కేసీ కెనాల్కు చుక్కనీరు ఇవ్వలేని చంద్రబాబు కుప్పంకు ఎలా నీరు ఇస్తారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 14 ఏళ్లు అవుతోందని అప్పటి నుంచి ప్రధానమంత్రిని చంద్రబాబు 8 సార్లు కలిశారని కానీ రాష్ట్రానికి ప్రయోజనమేమీ లేదన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో సీమకు అన్యాయం రాయలసీమకు నీటి కేటాయింపుల్లో పాల కులు తీవ్ర అన్యాయానికి పాల్పడ్డారని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశే ఖర్రెడ్డి, సాగునీటి సాధన సమితి క న్వీనర్ బొజ్జా దశర థరామిరెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీరామ్రెడ్డిలు విమర్శించారు. రాయలసీమకు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తామని 16 వందల కోట్లు ఖర్చు చేశారన్నారు. దీని ద్వారా రాయలసీమకు ఒరి గేది ఏమీ లేదన్నారు. రాజశేఖర్రెడ్డి ము ఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టులు అంతోఇంతో అభివృద్ధి చెందాయన్నారు. 1962లో గౌహతి కమిషన్ గోదావ రి బేసిన్ నుంచి క్రిష్ణా బేసిన్కు 160 టీఎంసీలు నీటిని కేటాయిస్తే దాని గురించి పట్టించుకునే వారే లేరన్నా రు, శ్రీశైలం ప్రాజెక్టును 1963లో పవర్ప్రాజెక్టుగా ప్రకటిస్తే దానిపై ఏ ఒక్కరూ మా ట్లాడలేదన్నారు. శ్రీశైలంలో 854 టీఎం సీల మేర నీటి మట్టం నిల్వ ఉండాలని మాట్లాడే పరిస్థితి ఈ పాలకులను అస లు లేదన్నారు. పట్టిసీమకు కేటాయిం చిన నిధులను పెండింగ్ ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే కొంతమేరైనా పనులు జరుగుతాయన్నారు. ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, అనంతపు రం, చిత్తూరు. కర్నూలు, వైఎస్సార్ జి ల్లాల సీపీఐ కార్యదర్శులు జగదీష్, రా మానాయుడు, రామాంజనేయులు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఓబులేసు’ బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ‘అరబిందో ఫార్మా’ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపేందుకు యత్నించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేసు బెయిల్ పిటిషన్ను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజని మంగళవారం కొట్టివేశారు. ఓబులేసుకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరింపులకు గురిచేసే అవకాశం ఉందని, మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడొచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలబుచ్చయ్య కోర్టు దృష్టికి తెచ్చారు. అభియోగాలు నమోదు చేస్తే రోజూ వారీ పద్దతిలో తుది విచారణ (ట్రయల్) చేపట్టేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. ఈ వాదనతో సెషన్స్ జడ్జి ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. -
ఓబులేసు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ప్రొద్దుటూరు : తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో హత్యకు గురయిన ఓబులేసు కుటుంబాన్నివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి శనివారం పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సహించబోమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా కాపాడుకుంటామని తెలిపారు. కడప జిల్లా చాపాడు మండలం చిన్నవరదాయపల్లె గ్రామ సర్పంచ్ భర్త ఓబులేసు గత జూలైలో హత్యకు గురయ్యారు. ఓబులేసు స్కూటర్పై వెళ్తుండగా దారి కాచిన ప్రత్యర్థులు కళ్లల్లో కారం కొట్టి ప్రొద్దుటూరు దగ్గర నరికి చంపిన విషయం తెలిసిందే. -
జ్యుడీషియల్ కస్టడీకి ఓబులేసు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన ఏఆర్ కానిస్టేబుల్ పుల్లా ఓబులేసును అయిదు రోజుల కస్టడీ అనంతరం బంజారాహిల్స్ పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. ఈ అయిదురోజుల్లో ఓబులేసును కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లాలోని ఆయన స్వగ్రామం పోరుమామిళ్ల, గండిపేట సమీపంలోని గ్రేహౌండ్స్ కార్యాలయం, సంఘటన జరిగిన కేబీఆర్ పార్కు వద్ద విచారించారు. గతంలో చేసిన నేరాలపై కూడా ఆరాతీశారు. -
ఓబులేసుపై కొనసాగుతున్న విచారణ
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై ఏకే 47 తుపాకితో కాల్పులు జరిపి పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసును లోతుగా విచారించే నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులు గురువారం గండిపేట సమీపంలోని గ్రేహౌండ్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ రోజు ఏకే 47ను ఎలా దొంగిలించింది, అక్కడి నుంచి ఎక్కడ దాచిపెట్టింది తదితరాలతో పాటు ఈ చోరీ వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే అంశాలపై ఈ విచారణ జరిగింది. -
ఓబులేసును కర్నూలు తీసుకెళ్లిన పోలీసులు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపి పోలీసు కస్టడీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కర్నూలు తీసుకెళ్లారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ఐ.సంతోషం నిందితుడు ఓబులేసును కర్నూలుకు తీసుకె ళ్లి ఆరోజు జరిగిన సంఘటనపై ఆరా తీశారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయన్న దానిపై దర్యా ప్తు చేస్తున్నారు. ఓబులేసు ఇంట్లో పలు రకాల ఆయుధాల తూటాలు దొరికిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కర్నూలుకు ఓబులేసు తరలింపు
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల కేసులో నిందితుడు ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు కర్నూలు తరలించారు. న్యాయస్థానం అనుమతితో అతడిని అయిదు రోజులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కాల్పులకు ఉపయోగించిన ఏకే-47ను దాచిన ప్రదేశమైన కర్నూలులోని ఓర్వకల్లుకు ఓబులేసును పోలీసులు తీసుకువెళ్లారు. కాల్పుల అనంతరం ఓబులేసును పోలీసులు కర్నూలులోనే అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈనెల 19న అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఓబులేసు కాల్పులకు పాల్పడ్డాడు. కాగా నార్సింగిలోని ఓబులేసు ఇంటి నుంచి ఖాళీ తూటాలను పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. ఈ తూటాలు గ్రేహౌండ్స్లో చోరీ చేసిన ఏకే-47వేనా లేక ఇతర ఆయుధానివా అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉంది. -
పోలీసు కస్టడీకి ఓబులేసు
సాక్షి, హైదరాబాద్: కేబీఆర్ పార్కు వద్ద ఈ నెల 19న అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపిన కేసులో రిమాండ్లో ఉన్న కానిస్టేబుల్ ఓబులేసు (37)ను పోలీసు కస్టడీకి అప్పంచాలని నాంపల్లి కోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు చంచల్గూడ జైలులో ఉన్న ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే వీరు ఓబులేసుపై కిడ్నాప్ కేసు (సుమోటో) నమోదు చేశారు. నార్సింగిలోని అతని ఇంటి నుంచి ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తూటాలు గ్రేహౌండ్స్లో చోరీ చేసిన ఏకే-47వేనా లేక ఇతర ఆయుధానివా అనే విషయాన్ని ఇంకా తేల్చుకోవాల్సి ఉంది. -
జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే..
-
జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే.. ఇలా చేశా: ఓబులేసు
ఓబులేసు రిమాండ్ రిపోర్టు 'సాక్షి' చేతికి చిక్కింది. తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని, చివరిక్షణాల్లో జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నానని.. అందుకే డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని ఓబులేసు అంగీకరించాడు. 12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్లో విధులు నిర్వర్తించానని చెప్పాడు. ప్రముఖులను కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలనుకున్నానని, అందుకోసమే ఏకే 47ను చోరీ చేశానని ఓబులేసు పోలీసు విచారణలో అంగీకరించాడు. కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం వచ్చే డబ్బున్నవాళ్లు, పెద్దపెద్ద కార్లలో వచ్చేవాళ్లను గమనించేవాడినన్నాడు. డ్రైవర్ లేని కార్లలో ఓనర్లు ఎక్కిన తర్వాత తాను వెంటనే దూరాలని పథకం వేశానన్నాడు. నిత్యానందరెడ్డి సీటుబెల్టు పెట్టుకుంటున్న సమయంలో తాను సీట్లోకి వెళ్లానని, ఏకే 47తో బెదిరించానని విచారణలో అంగీకరించాడు. అంతకుముందు 2014 ఫిబ్రవరి 19న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడిని అపహరించానని, యువకుడి తల్లిదండ్రుల నుంచి 10 లక్షలు తీసుకున్నానని, తర్వాత అతడిని వదిలేసి నార్సింగిలోని తన ఇంటికి వచ్చానని చెప్పాడు. -
ఓబులేసు ఇంట్లో 22 తూటాలు స్వాధీనం
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా నిందితుడు ఓబులేసు...నివాసం ఉంటున్న ఇంట్లో వివిధ తుపాకులకు చెందిన 22 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపయోగించిన 6 బుల్లెట్ షెల్స్, 2 డమ్మీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. -
ఓబులేసుకు ప్రాణాంతక వ్యాధి!
జల్సాల కోసమే అపహరణ యత్నం అరెస్టుకు ముందు ఆత్మహత్యకు ప్రణాళిక గతంలో ఓ మాజీ ఐఏఎస్ మనవడి కిడ్నాప్ చంచల్గూడ జైలుకు తరలింపు హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డి అపహరణకు యత్నించిన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు(37) ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. శుక్రవారం మీడియా సమావేశానికి ముందు అతన్ని పోలీసులు కిడ్నాప్ యత్నంపై విచారించారు. ఈ సందర్భంగా నిందితుడు పలు వివరాలను వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 19న కేబీఆర్ పార్కు వద్ద ఘటన తరువాత ఓబులేసు రాత్రి 11 గంటలకు కర్నూలుకు చేరుకుని ఓ లాడ్జిలో బసచేశాడు. తన తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్న ఘటనను టీవీలో చూశాడు. దీంతో తనను పోలీ సులు ఎలా అయినా పట్టుకుంటారని భావించి ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. రాత్రి 11.30 సమయంలో బజారుకు వెళ్లి పురుగుల మందు తెచ్చుకున్నాడు. తర్వాత సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. కొద్ది సేపటికే పోలీసులు వలపన్ని అతన్ని పట్టుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా నిందితుడిని ప్రాణాలతో పట్టుకునే అవకాశం దక్కేది కాదని అధికారులు పేర్కొన్నారు. జల్సాల కోసం బ్యాంకాక్.. ఓబులేసు ఎక్కువ కాలం జీవించలేని ఓ వ్యాధి తో బాధపడుతున్నాడు. బతికినన్ని రోజులు ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతో జల్సాలకు అలవాటుపడ్డాడు. గత ఫిబ్రవరిలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి మనవడిని కిడ్నాప్ చేసి వసూలు చేసిన రూ. 10 లక్షలు అయిపోవడంతో మళ్లీ అపహరణకు యత్నించాడు. ఈసారి వసూలు చేసిన డబ్బుతో బ్యాంకాక్ వెళ్లి జల్సా చేయాలని భావించినట్లు విచారణలో వెల్లడైంది. చంచల్గూడ జైలుకు ఓబులేసు.... ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ అతనికి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఏకే-47 లో పోలీసులకు 17 బుల్లెట్లు మాత్రమే లభ్యమవగా, మిగతా వాటి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ కోసం బంజారాహిల్స్ పోలీసులు ఓబులేసును ఏడు రోజులు పోలీసు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఫిబ్రవరిలో కిడ్నాప్ ఉదంతంపై బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, లేనిపక్షంలో సుమోటోగా కేసు నమోదు చేస్తామన్నారు. మరోపక్క ఓబులేసును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. గండిపేటలోని గ్రేహౌండ్స్ నుంచి గత ఏడాది డిసెంబర్లో ఏకే-47 చోరీ అయిందని అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్రావు ఫిబ్రవరి 3న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చోరీ అయిన రైఫిల్ కేబీఆర్ కాల్పుల ఘటన స్థలంలో లభ్యం కావడంతో నార్సింగ్ పోలీసులు నమోదు చేసిన చోరీ కేసు మిస్టరీ కొలిక్కి వచ్చింది. ఓబులేసు అద్దె ఇంట్లో తనిఖీలు... ఓబులేసు ఉంటున్న నివాసాన్ని పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. నార్సింగి వైఎస్సార్ చౌరస్తా ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో అతను కొన్ని నెలలుగా నివాసముంటున్నాడు. అర్థరాత్రి పోలీసులు పెద్దసంఖ్యలో నార్సింగి గ్రామానికి రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం ఓబులేసు ఇక్కడే అద్దెకు ఉన్నాడని తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్కు గురైన చైన్ స్నాచర్ శివ అద్దెకు ఉండేవాడు. సంచలనం సృష్టించిన ఈ రెండు కేసుల నిందితులు నార్సింగిలోనే తలదాచుకోవడం గమనార్హం. -
ఓబులేసుకు డిసెంబర్ 5 వరకూ రిమాండ్
-
ఓబులేసుకు డిసెంబర్ 5 వరకూ రిమాండ్
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కేసులో నిందితుడు ఓబులేసును పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు అతనికి డిసెంబర్ 5 వరకూ రిమాండ్ విధించింది. అనంతరం ఓబులేసును పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఓబులేసును తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. -
ఓబులేసును కస్టడీకి కోరునున్న పోలీసులు
-
ఓబులేసును కస్టడీకి కోరనున్న పోలీసులు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్కు యత్నించి, కాల్పులకు పాల్పడిన నిందితుడు ఓబులేసును... పో్లీసులు శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అతడిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఉంచారు. మరికొద్దిసేపట్లో ఓబులేసును వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించనున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు ఓబులేసును తిరిగి పోలీసు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అతడి వెనకాల మరెవరైనా ఉన్నారా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. -
నేరగాళ్లకు అడ్డాగా లాడ్జీలు..!
కర్నూలు: నగరంలోని కొన్ని లాడ్జిలు నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఏబీఆర్ పార్కు సంఘటన కేసులో నిందితుడు ఓబులేసును కర్నూలులోని మధుర లాడ్జిలో అరెస్టు చేయడం స్థానికంగా అందరినీ ఉలికిపాటుకు గురి చేసింది. కర్నూలు నగరంలో వందకు పైగా లాడ్జిలు, డార్మెంటరీలు ఉన్నాయి. వాటిపై పోలీసు నిఘా కొరవడటం వల్లే నేరగాళ్లు పాగా వేస్తున్నారు. పేరు, అడ్రస్, సెల్ నంబర్ మాత్రమే రిజిష్టర్లో నమోదు చేసుకుని గదులు అద్దెకు ఇస్తున్నారు. దీంతో తప్పుడు చిరునామాలతో లాడ్జిల్లో గదులు తీసుకుని నేరగాళ్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కాల్పుల సంఘటనలో నిందితుడైన ఓబులేసు.. సుబ్బారెడ్డి, వాణిజ్యనగర్, నంద్యాల చిరునామాతో గదిని తీసుకున్నాడు. అసాంఘిక కార్యకలాపాలు.. నగరంలోని కొన్ని లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నకిలీ నోట్లు, బంగారం అక్రమ రవాణా, నకిలీ మద్యం వ్యాపారం, ఎర్ర చందనం స్మగ్లింగ్ వంటి వ్యాపారులు కర్నూలులోని లాడ్జిలోని గదులను అద్దెకు తీసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కొత్తబస్టాండ్ సమీపంలోని డార్మెంటరీల్లో గతంలో గద్వాల ప్రాంతానికి చెందిన దొంగలను అరెస్టు చేసి పెద్ద ఎత్తున రికవరీ చేశారు. తాజాగా కొత్తబస్టాండ్లోని డార్మెంటరీల్లో గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక దొంగ తిష్ట వేసినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాలను కలిపే మార్గంలో కర్నూలు ఉండటంతో కీలకంగా మారింది. నేరగాాళ్లు తమకు అనువుగా ఈ ప్రాంతాన్ని మార్చుకుంటూ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కనిపించని సీసీ కెమెరాలు.. కర్నూలు నగరంలో వందకు పైగా లాడ్జిలు, డార్మెంటరీలు ఉన్నాయి. అందులో సగం లాడ్జిల్లో కూడా సీసీ కెమెరాలు లేవు. నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేదా ఉన్నతాధికారి ఆదేశించినప్పుడు తప్ప సాధారణ సమయాల్లో నిఘా కొరవడటం వల్లే లాడ్జిలను నేరగాళ్లు అడ్డాలుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్టార్ హోటల్ నుంచి సాధారణ లాడ్జి వరకు గదులను అద్దెకు తీసుకుని పేకాట కూడా జోరుగా సాగిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులకు లాడ్జిల యజమానులతో ఉన్న అవసరాల నేపథ్యంలోనే తనిఖీలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని లాడ్జిల్లో వ్యభిచారం, మట్కా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రత్యేక నిఘా తాజా సంఘటన నేపథ్యంలో లాడ్జిలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్న దిశగా జిల్లా ఎస్పీ ఆకే రవిక్రిష్ణ చర్యలకు ఉపక్రమించారు. గుర్తింపు కార్డు ఉంటేనే గదులు అద్దెకు ఇవ్వాలని లాడ్జి యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ముగ్గురికి పైగా ఎస్ఐలు ఉన్నారు. పని విభజన చేసి లాడ్జిల తనిఖీల బాధ్యతలు ఒకరికి అప్పజెప్పే దిశగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ పరిధిలో ఎవరెవరు నిర్వహించాలనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో పోలీసు విధులు గందరగోళంగా మారాయి. స్టేషన్ అవసరాలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సీఐల సూచనల మేరకు ఎస్ఐలు విధులు నిర్వహిస్తున్నారు. స్టేషన్ పరిధిలో జరిగే నేరాల ఆధారంగా పని విభజన చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాద్యతను అప్పజెప్పే విధంగా చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్ల సంఖ్యను బట్టి ఒకరికి బీట్ల తనిఖీ బాధ్యత, మరోకరికి పోలీస్ స్టేషన్ పరిపాలన బాధ్యత, రోజువారీ కోర్టు వ్యవహారాలు, పోలీస్ సిబ్బంది పాలనా వ్యవహారాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, లాడ్జిలు, వాహన తనిఖీలు ఇలా పని విభజన ద్వారా బాధ్యతలు అప్పగించి నేరాల నియంత్రణకు పోలీస్ బాస్ కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి తరహాలో క్రైమ్ కంట్రోల్కు ప్రత్యేకంగా ఎస్ఐతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి బాధ్యతాయుతమైన పోలీసింగ్కు శ్రీకారం చుట్టనున్నారు. -
ఓబులేసు అరెస్టు
జాకెట్లో పెట్టుకుని ఏకే-47 చోరీ ఓర్వకల్లు గుట్టల్లో ఆయుధం దాచివేత మీడియా సమావేశంలో సీపీ మహేందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీ ఆర్) పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్కు యత్నించి, కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ ఓబులేసు(37)ను పోలీ సులు అరెస్టు చేశారు. ఓబులేసు నేరాలబాట.. ఏకే-47 చోరీ.. అరెస్టుపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఏకే 47- దొంగిలించాడిలా... ఓబులేసు గ్రేహౌండ్స్లో ఉన్నప్పుడు అక్కడి ఏకే-47ను దొంగిలించేందుకు జాకెట్ను ఉపయోగించాడు. గత ఏడాది డిసెంబర్లో కూంబింగ్కు వెళ్లి వచ్చిన సిబ్బంది ఏకే-47 ఆయుధాలను బెల్ఫామ్ గదిలో భద్రపర్చారు. ఇలా కూంబిం గ్కు వెళ్లివచ్చిన వారికి మూడు రోజులు సెలవు ఇస్తారు. కానీ, సెలవులో ఉన్నా కూడా ఓబులేసు ఈ గదిలోకి వెళ్లి లోడెడ్ ఏకే-47ను తీసుకొని సంచిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులో కర్నూల్ జిల్లా ఓర్వకల్లుకు చేరుకున్నాడు. అక్కడి రాళ్ల గుట్టల్లో సంచితో పాటు ఆయుధాన్ని దాచిపెట్టాడు. తిరిగి హైదరాబాద్కు చేరుకున్నాడు. అయితే తాను పెట్టిన చోట ఆయుధం ఉందా లేదా అని చూసుకునేందుకు ఓబులేసు ప్రతి వారం ఓర్వకల్లుకు వెళ్లి వచ్చేవాడు. మొదటి కిడ్నాప్ సక్సెస్.. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో మొదటిసారిగా కిడ్నాప్కు పాల్పడ్డాడు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మనవడు కేబీఆర్ పార్కుకు వాకింగ్ వచ్చినప్పుడు ఏకే-47తో బెదిరించి కిడ్నాప్ చేసి కొత్తూరు శివార్లలోకి తీసుకెళ్లాడు. రూ.10 లక్షలు తీసుకుని వదిలిపెట్టాడు. ఇందులోంచి రూ.3 లక్షలను తన బ్యాంకు అకౌంట్లో మరుసటి రోజు జమచేశాడు. మిగిలిన ఏడు లక్షలతో వాహనం ఖరీదు చేసి జల్సా చేశాడు. ముందు రోజు రాత్రి కేబీఆర్ పార్కులోనే... కేబీఆర్ పార్కు వద్ద మొదటి కిడ్నాప్ విజయవంతమవడంతో మరోసారి అదేవిధంగా వీఐపీని కిడ్నాప్ చేసేందుకు ఓబులేసు పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ఓర్వకల్లుకు వెళ్లి ఏకే-47 తీసుకొచ్చి నార్సింగిలోని తన గదిలో దాచిపెట్టాడు. 18వ తేదీ రాత్రి 10.30 గంటలకు ఆయుధాన్ని దాచిన సంచితో ఆర్టీసీ బస్సులో ఎస్ఆర్నగర్ వరకు వచ్చాడు. అక్కడి నుంచి ఆటోలో కృష్ణానగర్లో దిగిపోయాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ కేబీఆర్ పార్కుకు చేరుకుని అక్కడే ఓ చెట్టు పొదల్లో దాక్కున్నాడు. మరుసటి రోజు ఉదయం అందరిలాగే వాకింగ్ చేస్తున్నట్లు నటించి ఖరీదైన కారు గురించి చూ స్తుండగా అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కారు వచ్చి ఆగింది. అతడిని లక్ష్యంగా చేసుకొన్న ఓబులేసు.. 7.20 గంటలకు నిత్యానందరెడ్డి కారులోకి ఎక్కిన సమయంలో కిడ్నాప్కు యత్నించాడు. అయితే ఆయన ధైర్యంగా ప్రతిఘటించడం, అతని సోదరుడు ప్రసాద్రెడ్డి కూడా సహకరించడంతో ఓబులేసు వారి చేతు లు కొరికి కేబీఆర్ పార్కు నుంచి పారిపోయాడు. సీసీ కెమెరాలే పట్టించాయి... ఈ ఘటన తర్వాత ఓబులేసు అశోకాబిల్డర్, ఇందిరానగర్ నుంచి కృష్ణానగర్ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆటో ఎక్కి అమీర్పేటలో దిగి ఆర్టీసీ బస్సు ఎక్కి మహాత్మాగాంధీ బస్స్టేషన్లో మరో బస్సు ఎక్కి కర్నూలు చేరుకున్నాడు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఓబులేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే గుర్తించారు. వెస్ట్జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, టాస్క్ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఎట్టకేలకు ఓబులేసును కర్నూలులో అరెస్టు చేశాయి. ఈ కేసును చేదించడంలో ప్రతిభ కనబర్చిన వెస్ట్జోన్ పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ సిబ్బందిని ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు. వారికి రివార్డులు ప్రకటించారు. 19 బుల్లెట్లు ఎక్కడ? ఓబులేసు గ్రేహౌండ్స్ నుంచి ఏకే-47తో పాటు మ్యాగజైన్ను తస్కరించాడు. ఆ సమయంలో మ్యాగజైన్లో 36 బుల్లెట్లు ఉన్నాయి. అయితే కేబీఆర్ పార్కు కాల్పుల ఘటనలో పది రౌండ్లు ఉపయోగించగా, మరో ఏడు పేలని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 బుల్లెట్లు గుర్తించారు. మిగతా 19 బుల్లెట్లు ఎక్కడ అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరేదైనా నేరం చేసిన సమయంలో కాల్పులకు ఉపయోగించాడా లేక ఎక్కడైనా దాచిపెట్టాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఓబులేసును తిరిగి పోలీసు కస్టడీ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అతడి వెనకాల మరెవరైనా ఉన్నారా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. -
కరో.. కరో.. జర జల్సా
విలాసాల కోసం యువత పెడదారి దొంగతనాలు, నేరాల బాట పోలీసుల విచారణలో వెల్లడి నిందితులలో ఉద్యోగులు, విద్యావంతులు విలాసాలు... జల్సాలకు అలవాటు పడడం... విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం... కార్లు... విందు వినోదాలు... పబ్లు...ఇవన్నీ నగరంలోని యువతను అడ్డదార్లు తొక్కిస్తున్నాయి. ఉన్నత విద్యావంతులు... బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్న వారు సైతం పెడదారి పడుతున్నారు. రాత్రికి రాత్రే ధనవంతులం కావాలనే అత్యాశతో దొంగతనాలు... కిడ్నాప్లు... మర్డర్ల వంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. కష్టపడి సంపాదించే కంటే... అడ్డదారిలో ముందుకు వెళ్లాలనే దురాశతో నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. గ్రేటర్లో ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాలు...ఇతర నేరాల్లో పోలీసులకు చిక్కుతున్న నిందితుల్లో అధికశాతం ఈ తరహా వారేనని వెల్లడైంది. మద్యం... అమ్మాయిలను ఆకర్షించడం వంటిప్రయత్నాలు చేసే క్రమంలో వారు నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నగరంలో గత మూడు రోజుల్లో చోటు చేసుకున్న సంఘటనలూ ఈ కోవలోకే వస్తున్నాయి. తాగుడు.... రాసలీలలకు బానిసైన కానిస్టేబుల్ ఓబులేసు ఏకంగా ఏకే-47 చోరీ చేసి...నేరాల బాట పట్టాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన కె.విశ్వనాథ్(25) కూడా ఉన్నత విద్యావంతుడే. జల్సాలకు అలవాటు పడి... డబ్బు కోసం తుపాకీతోజనాలను బెదిరిస్తూ పోలీసులకు చిక్కాడు. అనంతపురం జిల్లాకు చెందిన దేవరాజ్ (28) బీటెక్ పూర్తి చేశాడు. ఆ యువకుడూ విలాసాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ సంఘటనలు నగరంలో పెరుగుతున్న విష సంస్కృతికి అద్దం పడుతున్నాయి. క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనంగా నిలిచే ఏపీఎస్పీ బెటాలియన్లో శిక్షణ పొందిన ఓబులేసు జల్సాల బాట పట్టి నేరప్రవృత్తికి అలవాటు పడ్డాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న దురాశ... నేరాల వల్ల వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం ప్రవృత్తిగా మారడమే అతన్ని కిడ్నాప్ యత్నానికి పురిగొల్పిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. చిన్నవయసులోనే కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. వేతనాన్ని విలాసాలకు ఖర్చు చేయడమేకాక.. తల్లిదండ్రులకు తన కష్టార్జితంలో నయాపైసా విదల్చకపోవడం గమనార్హం. అవివాహితుడైన ఓబులేసు అడ్డదారుల్లో సంపాదించిన మొత్తాన్ని రాసలీలలకే ఖర్చు చేసేవాడంటే... ఎంత జల్సారాయుడో అర్థం చేసుకోవచ్చు. గతంలో కిడ్నాప్ యత్నానికి పాల్పడి రూ.లక్షల్లో దండుకొని... కేవలం పబ్లు, విందు, వినోదాలు, విలాసాలకే ఖర్చు చేయడం గమనార్హం. విలాసాల బాట పట్టి కటకటాలపాలైన ఈ కానిస్టేబుల్ ఉదంతం పోలీసు అధికారులను నివ్వెరపరిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని పబ్లకు వెళ్లేవాడని తెలిసింది. ఒక్కసారి పబ్బుకు వెళ్తే కనీసం రూ.20 నుంచి రూ.30 వేలు ఖర్చు పెట్టేవాడని సమాచారం. అమ్మాయిలతో రాసలీలకే ఎక్కువ మొత్తం వెచ్చించేవాడు. నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపి పారిపోయి... కర్నూలులోని లాడ్జిలో పట్టుబడే సమయంలోనూ అమ్మాయిలతో ఉన్నట్టు తెలిసింది. సెలవులో ఉన్నాడంటే అంతే... జల్సాలైనా... నేరాలైనా సెలవు రోజుల్లోనే చేయడం ఓబులేసు హాబీ, గత ఏడాది డిసెంబర్లో గండిపేటలోని గ్రేహౌండ్స్ విభాగం నుంచి ఏకే-47 చోరీ చేసింది తాను సెలవులో ఉన్న సమయంలోనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనవడిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు దోచుకున్నప్పుడూ సెలవులోనే ఉన్నాడు. ఇకనిత్యానంద రెడ్డి కిడ్నాప్ యత్నం, కాల్పులకు బరి తెగించింది కూడా తాను సెలవులో ఉన్న రోజే. చివరికి అరెస్టయిందీ సెలవులో ఉన్నప్పుడే. తలకు విగ్తో.. నేరానికి పాల్పడే సమయంలో ఓబులేసు తలకు విగ్ వాడేవాడు. కేబీఆర్ పార్కు వద్ద కాల్పుల సంఘటన స్థలంలో విగ్ లభించింది. నిత్యానందరెడ్డి, ప్రసాద్రెడ్డిలు ఓబులేసును ప్రతిఘటించే క్రమంలో అతని తలకు ఉన్న విగ్ ఊడి కింద పడింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే విగ్ వాడుతున్నట్లు విచారణలో ఓబులేసు అంగీకరించాడు. తుపాకీతో బెదిరిస్తూ... దత్తాత్రేయనగర్: తుపాకితో సంచరిస్తున్న ఓ విద్యార్థిని టప్పాచబుత్ర పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ బి. రవీందర్ వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన కె. విశ్వనాథ్(25) ఎంబీఏ విద్యార్థి. జల్సాలకు అలవాటు పడిన విశ్వనాథ్ కొంత మంది బీహారీలతో కలిసి 3 నెలల క్రితం బీహార్కు వెళ్లాడు. అక్కడ సింగిల్ బ్యారెల్ తుపాకి, 6 బుల్లెట్లను కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చాడు. అప్పటి నుంచి ఏకాంతంగా ఎవరైనా కనిపిస్తే బెదిరించి డబ్బులు, వారి వద్ద ఉన్న సొత్తును దోచుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుడిమల్కాపూర్ వెనకాల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విశ్వనాథ్ అటుగా వెళ్తున్నాడు. ఆయన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా తుపాకి, 6 బుల్లెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓబులేసు ఒక్కడినే అరెస్ట్ చేశాం: పోలీసులు
హైదరాబాద్ : అరబిందో ఫార్మ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన నిందితుడు ఓబులేసును శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఓబులేసుని ఒక్కడినే అరెస్ట్ చేశామని, అతన్ని తప్ప ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారు స్పష్టం చేశారు. మరోవైపు ఓబులేసును పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. గతంలో ఓ పారిశ్రామికవేత్తను ఓబులేసు అపహరించినా... వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటంతో కిడ్నాప్ వ్యవహారం బయటకు రాలేదు. -
నిందితుడు ఓబులేసే: కేసీఆర్ ధ్రువీకరణ
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల దృష్ట్యా నగరం అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేబీఆర్ పార్కు కాల్పుల ఘటనపై శుక్రవారం ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాల్పుల సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు గుర్తించారన్నారు. నిందితుడిని కర్నూలులో పోలీసులు అరెస్ట్ చేశారని, నిందితుడు పోలీసు కానిస్టేబుల్ పి.ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురంగా తెలిపారు. 1998లో ఓబులేసు కర్నూలు రెండో బెటాలియన్లో కానిస్టేబుల్గా నియకం జరిగిందని, 2014 మార్చి వరకూ ఓబులేసు గ్రేహౌండ్స్లో పనిచేశారన్నారు. గ్రేహౌండ్స్లోనే పనిచేస్తున్న సమయంలోనే ఏకే-47 చోరీ చేసినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితుడ్ని గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కొన్ని కెమెరాల కారణంగా చాలా కేసులను ఛేదిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణకు రూ.150 కోట్లతో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై బుధవారం కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. -
హైద్రాబాద్లో శాంతి భద్రతలను పరిరక్షిస్తాం!
-
కేబీఆర్ పార్కు కాల్పుల నిందితుడు ఇతడే!
-
ప్రభుత్వ హామీలపై జాక్టో నేతల ధ్వజం
అనంతపురం ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి హామీలను గుప్పిస్తూ కాలం గడుపుతోందే తప్ప, చర్యలు తీసుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) నాయకులు ధ్వజమెత్తారు. టీచర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా జాక్టో ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఒక్కరోజు దీక్ష చేశారు. జాక్టో నాయకులు బీటీఏ ఓబులేసు, ఎస్ఎల్వీటీ వై. ఆదిశేషయ్య, ఎస్టీఎఫ్ వెంకటరమణప్ప, ఆర్జేయూపీ రామానాయుడు, ఆపస్ భాస్కరయ్య, టీఎన్యూఎస్ నారాయణస్వామి, పీఆర్టీయూ పుల్లప్ప, బీసీటీయూ నారాయణస్వామి దీక్షలో కూర్చున్నారు. వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందన్నారు. ఎంఈఓ, డెప్యూటీ డీఈఓ, జూనియర్ అధ్యాపకులు, డైట్ అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అప్రెంటీస్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేశారన్నారు. ఎన్టీఆర్ హయాంలో రూ. 398 వేతనంతో పని చేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదన్నారు. గతేడాది ముఖ్యమంత్రి సంతకం పూర్తయి, ఆడిగన ఉన్నత పాఠశాలల్లోని భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంటు పోస్టులుగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. మునిసిపల్, పంచాయతీ, ఎయిడెడ్ యాజమాన్యాల్లో ఉద్యోగ విరమణ పొందిన టీచర్లకు అర్ధవేతన సెలవును నగదుగా మార్చుకునే సౌకర్యం పునరుద్ధరించాలన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 10వ వేతన సవరణ కమిటీ సిఫార్సులను పరిశీలించి 63 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలన్నారు. పాఠశాలల పనివేళలను సమీక్షించి, పాత పనివేళలను పునరుద్ధరించాలన్నారు. 2013లో బదిలీ అయిన ఉపాధ్యాయులును వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాస్థాయి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్ణీత కాలవ్యవధిలో నిర్వహించాలన్నా రు. జాక్టో జిల్లా కన్వీనరు రామకృష్ణారె డ్డి, నాయకులు శ్రీధర్రెడ్డి, శ్రీనివాసులు, రామలింగయ్య, నాగభూషణ, లక్ష్మీనారాయణ, మల్లికార్జునరెడ్డి, ఆదిశేషు, హొ న్నూరప్ప తదితరులు పాల్గొన్నారు. -
'కాల్పులు జరిపింది ఎవరో గుర్తించాం'
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కేసులో నిందితుడి అరెస్ట్ను పోలీసులు ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని, కాల్పులకు తెగబడింది ఎవరో గుర్తించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై నిన్న ఉదయం ఓ ఆగంతకుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ఫొటోలు నిందితుడివి కావని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు కానిస్టేబుల్ ఓబులేసు కుటుంబ సభ్యులు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. మీడియాలో తప్పుడు ఫొటోలను ప్రసారం చేస్తున్నారంటూ ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన కొడుకుతో తనకు రెండేళ్లుగా సంబంధాలు లేవని ఓబులేసు తండ్రి మైఖేల్ ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. -
'రెండేళ్లుగా నా కొడుకుతో సంబంధాలు లేవు'
పోరుమామిళ్ల : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న కానిస్టేబుల్ ఓబులేసు తండ్రి మైకేల్ను గురువారం పోరుమామిళ్ల పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో మైకేల్.... తన కుమారుడితో రెండు సంవత్సరాల నుంచి సంబంధాలు లేవని వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ...తన కుమారుడా కాదా అనేది తనకు తెలియదని మైకేల్ ...పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా జీ.పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురం. మరోవైపు ఓబులేసు గురించి మాట్లాడేందుకు గ్రామస్తులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఓబులేసు సర్వీస్ బుక్ ను పరిశీలిస్తున్న పోలీసులు
హైదరాబాద్:అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు సర్వీస్ బుక్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేబీఆర్ పార్కులో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 1998 ఏపీఎస్పీ 11 బెటాలియన్ బ్యాచ్ కు చెందిన ఓబులేసు బుధవారం నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని సర్వీస్ బుక్ ను పరిశీలించే పనిలో పడ్డారు. గత 15 రోజులుగా సెలవులో ఉన్న ఓబులేసును అనంతపురంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురంకు చెందిన ఓబులేసు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. -
కానిస్టేబుల్ అరెస్ట్ వార్తను ఖండించిన సీపీ మహేందర్రెడ్డి
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటన కేసులో కానిస్టేబుల్ ఓబులేసు అరెస్ట్ వార్తను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఖండించారు. కాగా అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడింది ఓబులేసుగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై పోలీసులు మాత్రం పెదవి విప్పటం లేదు. ఓబులేసును నిన్న సాయంత్రం అనంతపురం-కర్నూలు సరిహద్దు ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని హైదరాబాద్ తరలించి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. కాగా ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల. -
సెలవు పెట్టి మరీ స్కెచ్ గీశాడు....!
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు.... విధులకు సెలవు పెట్టి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాంపల్లి ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న అతను...15 రోజులుగా సెలవులో ఉన్నాడు. అనంతపురంలో ఓబులేసును అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిని హైదరాబాద్ తరలించారు. కాగా కాల్పులకు పాల్పడిన ఓబులేసు ....ప్లాన్ ఫెయిల్ కావటంతో నేరుగా ఎస్ ఆర్ నగర్ చేరుకున్న అక్కడ నుంచి బెంగళూరు బస్సు ఎక్కాడు. అనంతపురం వెళుతున్న అతడిని.... సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన పోలీసులు అనంతపురం-కర్నూలు జిల్లా సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని హైదరాబాద్లో రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఓబులేసు అరెస్ట్ వార్తపై ధ్రువీకరించలేదు. కాగా నిందితుడు ఓబులేష్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. హైదరాబాద్ అంబర్ పేటలోని సీపీఎస్ గ్రౌండ్ లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఓబులేసు... 1998లో మొదట కర్నూలు ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్ గా డిపార్ట్ మెంట్లో చేరాడు. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ గ్రేహౌండ్స్ కు బదిలీ అయ్యాడు. విధుల్లో భాగంగా విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ కు వెళ్లాడు. కూంబింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓబులేసుకు చెందిన ఏకే47 తుపాకీ విజయవాడలో మాయమైంది. అయితే అతను గన్ మిస్సయిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టాడు. అయితే ఆ తర్వాత ఏకే47 మిస్ అయినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. దాంతో ఈ విషయం బయటకు తెలిస్తే రచ్చరచ్చ అవుతుందని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు... చడీచప్పుడు చేయకుండా ఓబులేసును అంబర్ పేట్ సీపీఎల్ కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. అయితే అప్పటి నుంచే పక్కా పథకం వేసుకున్న ఓబులేసు ...బడా బాబులను కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలు దండుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిని అపహరించేందుకు యత్నించి విఫలమై అడ్డంగా దొరికిపోయాడు. గతంలోనూ ఓబులేసు ...ఓ ఉన్నతాధికారిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు వసూలు చేసి, విషయం బయటకు చెబితే ...హతమార్చుతానని ఆ అధికారిని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు రెండు కేసులపైనా విచారణ జరుపుతున్నారు. -
కేబీఆర్ పార్క్ కాల్పులు: నేడు మీడియా ముందుకు ఓబులేసు
-
'టాస్క్ఫోర్స్ పోలీసుల రాకపై సమాచారం లేదు'
అనంతపురం : అనంతపురానికి .... హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసుల రాకపై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన ఓబులేసును టాస్క్ఫోర్స్ పోలీసులు అనంతపురంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎస్పీ మాట్లాడుతూ ఓబులేసును అదుపులోకి తీసుకున్నారో లేదో తమకు తెలియదని అన్నారు. మరోవైపు ఓబులేసును టాస్క్ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తరలించారు. -
ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నేత దారుణహత్య
ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ నాయకుడు, వైఎస్సార్ జిల్లా మడూరు గ్రామ మాజీ సర్పంచ్ మర్రిబోయిన ఓబులేసు(53)ను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చి ఇం టికి వెళ్లే సమయంలో మార్గమధ్యలో కాపుకాసిన నలుగురు వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి ఓబులేసును గొంతుకోసి హతమార్చినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఈయనకు భార్య ఈశ్వరమ్మ, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.