viral fever
-
రాష్ట్రానికి చలిజ్వరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చలిజ్వరం పట్టుకుంది. విషజ్వరాలతోపాటు దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ మొదలు ఏజెన్సీ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. ఏ ఆస్పత్రిలో చూసినా పెద్ద సంఖ్యలో ఔట్ పేషెంట్లు కనిపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా చేరి చికిత్స పొందాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కిక్కిరిసిపోతున్న పెద్దాస్పత్రులు ⇒ హైదరాబాద్లోని ఒక్క ఫీవర్ ఆస్పత్రికి ఈ నెలలో ఇప్పటివరకు వచ్చిన జ్వరాల బాధితులు 12,080 మందికావడం ఆందోళనకరం. నాలుగైదు రోజులుగా రోజూ 800 వరకు ఔట్ పేషెంట్లుగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ జ్వర సంబంధ సమస్యలతో సుమారు 700 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ⇒ ఇక చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫర్కు సోమవారం 1,600 మంది ఔట్ పేషెంట్లుగా నమోదుకాగా.. ఇందులో చలి కారణంగా ‘న్యుమోనియా’వంటి శ్వాస సంబంధ సమస్యలతో వచ్చిన పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇన్ పేషెంట్లుగా 1,300 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ⇒ ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం జనరల్ మెడిసిన్ కింద వైద్యం కోసం వచ్చిన ఔట్పేషెంట్లు 290, ఇక గాంధీ ఆస్పత్రిలో ఈ నెలలో సోమవారం నాటికి వచ్చిన ఔట్ పేషెంట్ల సంఖ్య 35,547. అంటే సగటున ప్రతీరోజు 1,500 మంది వస్తున్నారు. ఇందులో జ్వర సంబంధిత సమస్యలతో వచ్చేవారు ప్రతీరోజు 300 నుంచి 500 మంది వరకు ఉంటారని సిబ్బంది చెబుతున్నారు. ⇒ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రతీరోజు 50కి తక్కువ కాకుండా విషజ్వరాల కేసులు నమోదవుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఉట్నూరు ఐటీడీఏ, ములుగు, భూపాలపల్లి, అచ్చంపేట మన్ననూరు, కొత్తగూడెం పరిధిలోని పలు ఏజెన్సీ మండలాల్లో కూడా జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. కానీ చాలా మంది గిరిజనులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్ల దగ్గరే సొంత వైద్యం చేసుకుంటున్నట్టు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. తగ్గిన డెంగీ, చికున్గున్యా... ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రాన్ని వణికించిన డెంగీ, మలేరియా, చికున్గున్యా కేసులు.. నవంబర్ నెలలో తగ్గుముఖం పట్టినట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. డెంగ్యూ కేసులు సెప్టెంబర్, అక్టోబర్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,500కు పైగా డెంగీ కేసులు నమోదవగా..సెపె్టంబర్లో 1,542, అక్టోబర్లో 854 కేసులు ఉన్నాయి. ఈ నెలలో 22వ తేదీ వరకు 168 కేసులే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇక చికున్గున్యా కేసులు సెప్టెంబర్లో 183, అక్టోబర్లో 13 నమోదవగా, ఈనెలలో ఇప్పటివరకు 13 కేసులే వచ్చాయని వివరిస్తున్నారు. మలేరియా కేసులు కూడా తగ్గాయని అంటున్నారు. పెరిగిన శ్వాస సంబంధ సమస్యలు ఈ నెల మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చిన చలి... కార్తీక పౌర్ణమి మరింత తీవ్రమైంది. దీని కారణంగా న్యుమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలు పెరిగి జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో తీవ్ర చలి కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఇబ్బందిపడుతున్న వారు అధికంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది కూడా. చలితో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.ఈ చిత్రంలోని తల్లీకొడుకులు ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామానికి చెందినవారు. తల్లి మిరియాల రాజమ్మకు వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, కుమారుడు అనుపాల్కు టైఫాయిడ్. ఇద్దరూ ఇప్పుడు ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలి పెరగడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.చలిజ్వరంతో బాధపడుతున్నా..చలి, తీవ్ర జ్వరం, కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం జిల్లా దవాఖానాకు వచ్చిన. డాక్టర్లు పరీక్షించి వార్డులో చేర్చుకున్నారు. పొద్దున, సాయంత్రం వచ్చి చూస్తున్నారు. కొంచెం నయమైంది. – తూడి సోమక్క, వనపర్తి, లింగాల గణపురంశ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో 2,350 మంది ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి వచ్చారు. అందులో 80 మంది జ్వరాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధుల టెస్టులు చేయడానికి ఎక్స్రే, ఈసీజీ, ట్రెడ్మిల్, టూడీ ఈకో టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సరిపడా టెక్నీíÙయన్స్ లేక అన్ని టెస్టులు ఒక్కరే చేస్తున్నారు. సరిపడా మందులు ఉన్నాయి. ఎమ్మారై, సీటీ స్కాన్లు తీయడం లేదు. – డాక్టర్ గోపాలరావు, జిల్లా వైద్యాధికారి, ములుగుసీజనల్ వ్యాధులతో జాగ్రత్త శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు వచ్చి, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలి గాలిలో తిరగవద్దు. బయటికి వెళ్లినప్పుడు మాసు్కలు ధరించడం మంచిది. వెచ్చగా ఉండే దుస్తులను ధరించాలి. రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ మధుసూదన్,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి -
ఏపీలో విజృంభిస్తున్న విషజ్వారాలు
-
జ్వరంతో బాధపడుతున్నారా? వెల్లుల్లి రసంతో అద్భుతం!
ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, వైరల్, డెంగీ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఇలాంటి సమస్యలకు వెల్లుల్లి రసం లేదా వెల్లుల్లి చారు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత నోటికి ఏమీ రుచించని వారికి కూడా ఇది చక్కటి పరిష్కారం. ఈ చారుతో అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరి వెల్లుల్లి చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి!కావాల్సిన పదార్థాలువెల్లుల్లి , కొద్దిగా చింతపండు, టమాటాలు, మిరియాలు, చారు పొడి, తాలింపు దినుసులు , పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర.వెల్లుల్లి చారు తయారీ విధానం:ముందుగా వెల్లుల్లిని అట్ల కాడ సన్నని మొనకు గుచ్చి నిప్పుల మీద కాల్చుకోవాలి. ఆ తరువాత వీటికి కాసిన్ని మిరియాలు జోడించి చెక్కముక్కగా (మరీ మెత్తగా కాకుండా) దంచుకోవాలి. బాగా పండిన టమాటాలతో మెత్తగా రసం తీసిపెట్టుకోవాలి. ఈ రెండూ కలిపిన నీటిలో ఉప్పు, పసుపు, చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసి పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నానబెట్టిన చింతపండు, కరివేపాకు వేయాలి. తరువాత , ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని తయారు చేసుకున్న రసం పొడి వేయాలి. చక్కగా మరిగి కమ్మటి వాసన వస్తున్నపుడు, పోపు గింజలు, ఇంగువతో తాలింపు వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు రెడీ. దీన్ని అన్నంలో గానీ, ఇష్టమున్న వారు ఇడ్లీలో కానీ వేసుకొని తినవచ్చు. -
తెలంగాణను వణికిస్తున్న విషజ్వరాలు
-
వైరల్ ఫీవర్ పేరిట పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా
-
దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా.. బండపల్లిలో విషాదం..!
సాక్షి, కరీంనగర్: ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశానికి వెళ్లిన యువకుడి శవమై ఇంటికి తిరిగొచ్చాడు. యువకుడి మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు గ్రామానికి చెందిన యువకులు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. మండలంలోని బండపల్లికి చెందిన రేగుల బాబు(39) గత డిసెంబర్లో జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. ఇరువై రోజుల క్రితం జ్వరం బారిన పడ్డాడు. అక్కడ వైద్యం చేయించుకున్నప్పటికీ తగ్గలేదు. రెండు, మూడు రోజుల్లో ఇంటికొస్తానని భార్యకు వారం క్రితం ఫోన్ చేసి చెప్పాడు. పరిస్థితి విషమించి బాబు శుక్రవారం మృతి చెందాడు. ఈ అతని స్నేహితులు ఫోన్ ద్వారా బాబు భార్య కల్యాణికి ఫోన్లో తెలపడంతో ఆమె గుండెలవిసేలా రోదించింది. బాబు శవపేటిక సోమవారం బండపల్లికి చేరింది. తండ్రి శవాన్ని చూసి కూతురు, కుమారుడు, భార్య రోదించిన తీరు అందరిని కన్నీరు పెట్టించింది. చిన్ననాటి నుంచి కష్టాలే.. బాబు చిన్నతనంలోనే తండ్రి లచ్చయ్య మృతి చెందడంతో తల్లి లచ్చవ్వ గ్రామంలో చిన్న హోటల్ నడిపిస్తూ కుమారుడిని పోషించింది. బాబు పదోతరగతి చదువుతుండగా తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఒంటరిగా జీవిస్తున్న బాబు బంధువులు పెళ్లి చేశారు. స్వగ్రామంలో చిన్నాచితక పనులు చేసుకునేవాడు. ఇటీవల అప్పు చేసి కువైట్కు వెళ్లాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జ్వరంబారిన పడి గత శుక్రవారం మృతిచెందాడు. ముందుకొచ్చిన యువకులు.. బాబు కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ యువకులు ముందుకొచ్చారు. మృతుడికి పదమూడేళ్ల కూతురు రష్మిత ఉంది. ఆమె చదువుల కోసం యువకులు రూ.50వేలు జమచేశారు. మరింత మొత్తం జమచేసి అందజేసేందుకు యువకులు ప్రయత్నిస్తున్నారు. ఇవి చదవండి: పండుగ రోజున యువకుడి తీవ్ర విషాదం! -
హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. చివరికి..
సాక్షి, కుమరం భీం: తీవ్రజ్వరంతో ఒకరి మృతి చెందిన ఘటన మండలంలోని చింతగూడ గ్రా మంలో చోటు చేసుకుంది. కుటుంబ స భ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అనుమాల నరేందర్ (25) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రీవల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఐదు నెలల పాప ఉంది. నరేందర్ హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 20 రోజుల క్రితం జ్వరం వచ్చింది. ఆసుపత్రుల్లో చూపెట్టుకున్న తగ్గలేదు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్ అసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
జూనియర్ డాక్టర్గా విధులు నిర్వహిస్తూ.. ఒక్కసారిగా ఇలా అవ్వడంతో..
ఖమ్మం: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన జూనియర్ డాక్టర్ సుమ (23) డెంగీ జ్వరంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. సుమ హైదరబాద్లో ఓ ప్రైవేట్ వైద్యశాలలో జూనియర్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజుల నుంచి డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా మారి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహాన్ని హైదరబాద్ నుంచి సీతానగరం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సుమ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: దయచేసి.. మా కుమారుడిని కాపాడండి! -
డెంగీ జ్వరమే కదా.. అని తేలికగా తీసుకున్నారో.. ఇక అంతే!!
మహబూబాబాద్: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని(35) విషజ్వరంతో బుధవారం రాత్రి చనిపోయింది. రజని వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీల వద్ద నాలుగు రోజులు వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో ఏటూరునాగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ పరీక్షలు చేసి టైఫాయిడ్గా తేల్చారు. మెరుగైన వైద్యం నిమిత్తం ములుగు వెళ్లాలని సూచించడంతో ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. రజిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఉంటున్న మనీష(30) రాఖీ పండుగ సందర్భంగా వాజేడు మండల పరిధిలోని మొరుమూరు కాలనీ గ్రామానికి వచ్చింది. ఆమె ఇక్కడికి జ్వరంతోనే వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఆరు నెలల పాప.. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎస్కే.గౌస్– సహర దంపతుల కుమార్తె మినహ(6నెలలు) డెంగీ జ్వరంతో బాధపడుతూ వారంరోజుల నుంచి ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలించగా గురువారం చనిపోయినట్లు తండ్రి గౌస్ తెలిపారు. -
తీవ్రస్థాయిలో జ్వరం.. చిన్నారి మృతి! తండ్రి తిరుగు ప్రయాణం..
జగిత్యాల: డెంగీతో చిన్నారి మృతిచెందిన ఘటన ఆదివారం రాయికల్ మండలం రామాజిపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోనే గౌతమి–రాజరెడ్డి కూతురు గోనే మోక్ష(5)కు వారం రోజులుగా తీవ్రస్థాయిలో జ్వరం రాగా జగిత్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్థారించారు. రక్తకణాలు తక్కువగా ఉన్నాయని తెలపడంతో కరీంనగర్ తరలించి వైద్యం అందిస్తుండగా మృతిచెందింది. రాజరెడ్డి ఇటీవలే ఉపాధి నిమిత్తం గల్ఫ్వెళ్లాడు. చిన్నారి మృతితో తండ్రి తిరుగు ప్రయాణం అయ్యాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కొత్త ఫ్లూ.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా హైఅలర్ట్ జారీ చేసింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ పేషెంట్లతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలామందిలో అవి తీవ్రంగా.. దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది కూడా. ఈ తరుణంలో.. జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని కోరింది. మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదని ప్రజలను, మరోవైపు ఇన్ఫెక్షన్లను నిర్ధారించుకోకుండా యాంటీ బయోటిక్స్ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను హెచ్చరించింది ఐసీఎంఆర్. అలాగే.. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ఐసీఎంఆర్. ఇదిలా ఉంటే.. కోవిడ్ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడం గమనార్హం. ఇదీ చదవండి: H3N2 వైరస్ తీవ్రంగా ఎందుకు ఉందంటే.. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించాలి. గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం జోలికి పోకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం. -
కలలు.. కల్లలయ్యాయి..
ఎల్కతుర్తి: ఇటీవల బీటెక్ అయిపోయింది. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ మనం ఒకటి తలిస్తే.. విధి మరోటి తలుస్తుందని అంటుటారు.. అదే ఈ యువకుడి విషయం జరిగింది. జ్వరంరాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చూయించుకున్నాడు. అతను ఇచ్చిన ఇంజక్షన్తో శరీరం నల్లగా మారడంతోపాటు అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథ్పూర్ గ్రామంలో ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది. మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి విజయ్(22) బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 12న విజయ్కి జ్వరం రావడంతో జీల్గులకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్ను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యుడు మాత్రలు ఇచ్చాడు. అయినప్పటికి విజయ్కి జ్వరం తగ్గకపోవడంతో అదేరోజు సాయంత్రం ఆర్ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ వేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఇంజక్షన్ వేసిన దగ్గర శరీరమంతా నల్లగా మారి ఇబ్బందులు పడ్డాడు. తిరిగి ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లగా మరికొన్ని మాత్రలు ఇచ్చి తగ్గకపోతే రావాలని సూచించాడు. అయినప్పటికి నొప్పి తగ్గకపోవడంతో మరోసారి ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. దీంతో ఆర్ఎంపీ.. విజయ్ చేతికి మరో ఇంజక్షన్ వేసి పంపించాడు. ఆ నొప్పి తీవ్రతరం కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు అశ్రిత్రెడ్డి.. విజయ్ పరిస్థితి క్రిటికల్గా ఉందని, నాలుగు రోజుల తర్వాత రావాలని మందులు రాసి ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన విజయ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఈనెల 14న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. కాగా, ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్తోపాటు వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ అశ్రిత్రెడ్డి విజయ్ మృతికి కారకులని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడికి తల్లిండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. మృతుడి తండ్రి రవిందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జక్కుల పరమేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా ఇటీవలే బావుపేటలో ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి బత్తిని సతీష్ అనే వ్యక్తి మృతిచెందిన విషయం మరువకముందే మరో సంఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త! వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ...
సాక్షి, అమరావతి: వాతావరణంలో మార్పులు, వర్షాలతో రాష్ట్రంలో వైరల్ ఫీవర్; మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 32.98 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా 945 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 531, పార్వతీపురం మన్యంలో 238 కేసులు నమోదు అయ్యాయి. ఐదు జిల్లాల్లో ఓ మోస్తరుగా, 13 జిల్లాల్లో నామమాత్రంగా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 1,387 డెంగీ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 387 కేసులు ఉన్నాయి. విజయనగరంలో 173, కాకినాడలో 99, అనకాపల్లిలో 82 కేసులు నమోదయ్యాయి. డెంగీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నియంత్రణకు పారిశుధ్య నిర్వహణ, నీళ్లు నిల్వ ఉండకుండా చూడటం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. డెంగీకు సంబంధించి 54 ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రులను సెంటినల్ నిఘా ఆసుపత్రులుగా గుర్తించారు. వ్యాధిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,34,270 టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. విశాఖపట్నంలో వైద్య సిబ్బందికి సెరా నమూనాలపై అవగాహన కల్పించారు. మలేరియా ఎక్కువగా ఉన్న ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు, అనకాపల్లి, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో నియంత్రణ చర్యలను వైద్య శాఖ చేపట్టింది. వ్యాధి ఎక్కువగా ఉన్న 4–5 గ్రామాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. దోమల నుంచి రక్షణ కోసం 25.94 లక్షల దోమ తెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. పరిసరాలను పరిశుభ్రతకు, దోమల నివారణకు చర్యలు చేపడుతోంది. వెక్టార్ కంట్రోల్, ఏఎన్ఎంలు వారి పరిధిలో అపరిశుభ్రంగా, నీరు నిలిచిన ప్రాంతాల ఫోటోలను హైజీన్ యాప్లో అప్లోడ్ చేసి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. వెంటనే గ్రామ/వార్డు కార్యదర్శులు అక్కడి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ఫ్రైడే–డ్రై డే ప్రచార కార్యక్రమం ప్రతి శుక్రవారం అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► ఇంటి ఆవరణ, చుట్టుపక్కల పనికిరాని వస్తువులు, టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. ► మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ► నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి ► ఆర్వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి ► తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ► దోమ తెరలు వినియోగించాలి. గర్భిణిలు, చిన్న పిల్లలకు దోమతెరలు తప్పనిసరి నిర్లక్ష్యం చేయద్దు జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలు, వాంతులు సహా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. సొంత వైద్యం చేసుకోకూడదు. సీజనల్ వ్యాధులపై వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది. జ్వర బాధితులకు వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఫీవర్ సర్వే కొనసాగిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, రాష్ట్ర సీజనల్ వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఏడీ ప్రాథమిక దశలోనే గుర్తించాలి వాతావరణంలో మార్పుల వల్ల వైరల్ ఫీవర్ (విష జ్వరం)లు ఎక్కువగా వస్తాయి. దోమల ద్వారా మలేరియా, డెంగీ, ఇతర వ్యాధులు వస్తాయి. అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం కీలకం. జ్వరం, ఇతర అరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. ఇంట్లో ఇతరులకు దూరంగా ఉండాలి. వర్షంలో తడవకూడదు. మాస్క్ ధరించాలి. మాస్క్ వల్ల కరోనాతోపాటు ఇతర వ్యాధులు, వైరస్లు, భ్యాక్టీరియాల నుంచి రక్షణ లభిస్తుంది. – డాక్టర్ రఘు, గుంటూరు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ -
యూపీ: వైరల్ ఫీవర్తో 50 మంది చిన్నారుల మృతి!
లక్నో: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. ఉత్తర ప్రదేశ్లో వైరల్ జ్వరం ప్రజలను బెంబేలేత్తిస్తుంది. వైరల్ జ్వరంతో ఫిరోజాబాద్లో ఇప్పటి వరకు 50 మంది చిన్నారులు మృతి చెందినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. కాగా, ఈ ఘటనను సీఎం యోగి తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఫిరోజాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ను విధుల నుంచి తొలగించారు. సీఎం యోగి ఆదేశాలతో, అప్రమత్తమైన అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్లేట్లేట్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత సోమవారం (ఆగస్టు 30)న సీఎం యోగి ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ప్రతి ఇంటికి వెళ్లి వైరల్ జ్వరం పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైన జ్వరంతో బాధపడుతుంటే వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య అధికారులు స్థానికంగా పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ వైరస్ జ్వరాన్ని డెంగీగా వైద్యఅధికారులు భావిస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. చదవండి: Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి -
ఢిల్లీకి మరో ముప్పు.. అటు కరోనా.. ఇటు
సాక్షి, న్యూఢిల్లీ: ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. మరోవైపు దోమకాటు కారణంగా వచ్చే డెంగ్యూ వైరల్ జ్వరాల కేసులు ఢిల్లీలో పెరగడం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడేళ్ల రికార్డును డెంగ్యూ బద్దలు కొట్టింది. జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ మధ్య నమోదైన డెంగ్యూ కేసులు 2018 నుండి వస్తున్న కేసులను అధిగమించాయి. అధికారిక గణాంకాల ప్రకారం గత వారంలో, కొత్తగా నలుగురు డెంగ్యూ రోగులతో మొత్తం రోగుల సంఖ్య ఈ ఏడాది 13కి చేరుకుంది. అయితే జనవరి 1 నుంచి ఏప్రిల్ 17 మధ్య సమయంలో 2017 సంవత్సరంలో 18 మంది, 2018 సంవత్సరంలో 12 మంది, 2019 లో 8 మంది, 2020 లో 7గురు డెంగ్యూ రోగులను గుర్తించారు. అధికార గణాంకాల ప్రకారం మొత్తం 13 మంది డెంగ్యూ రోగుల్లో నలుగురు సౌత్ ఢిల్లీ కార్పోరేషన్ పరిధికి చెందిన వారుగా గుర్తించారు. అదే సమయంలో, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన 22మంది రోగులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అయితే డెంగ్యూ అనేది నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రతీ ఒక్కరు దోమలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిని కలిగి ఉన్న దోమలు ముఖ్యంగా పట్టణ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయని, వాటి పరిధి సమశీతోష్ణ ప్రాంతాల వైపు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు సైతం తెలిపారు. 1996 నుంచి ప్రతీ సంవత్సరం జూలై, నవంబర్ మధ్య ఢిల్లీ డెంగ్యూ మహమ్మారి బారిన పడుతోంది. ఈ అంటువ్యాధులను బాగా ఎదుర్కోవటానికి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడానికి భౌగోళిక శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, కీటక శాస్త్రవేత్తలు, ఎపిడెమియాలజిస్టుల బృందం గతంలో ఒక అధ్యయనం చేసింది. ఢిల్లీలో దోమ–లార్వా పెంపకాన్ని నివారించడానికి సుమారు 15వేలకు పైగా ఇళ్లను పురుగుమందులతో పిచికారీ చేశారు. బహిరంగ ఉష్ణోగ్రత తగ్గడంతో, దోమలు సాయంత్రం వేళల్లో ఇళ్ళలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి సూర్యాస్తమయం అనంతరం తలుపులు / కిటికీలు మూసివేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చదవండి: కరోనా టీకా సంస్థలకు బూస్ట్ లాక్డౌన్ భయం.. విచ్చలవిడిగా షాపింగ్ -
ఆ గ్రామంలో వరుస మరణాలు.. కారణం ఇదేనా!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరుస మరణాలతో ఆ గ్రామం అల్లాడుతోంది. కారణం తెలియకుండానే కన్నుమూస్తున్న వారిని చూసి గ్రామం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎప్పుడు ఏ చావు వార్త వినాల్సి వస్తుందో.. రేపు ఎవరివంతో అనుకుంటూ.. దినదినగండంగా గడుపుతోంది. ఇదీ.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామం పరిస్థితి. గ్రామంలో జ్వరాల వ్యాప్తి విస్తృతంగా ఉన్నా.. ఎవరికి వారే వైద్యం చేయించుకోవడం, జ్వర తీవ్రత పెరిగితే జిల్లా కేంద్రమైన ఖమ్మం ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో కోవిడ్ మొబైల్ వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నా.. తమ గ్రామానికి ఎందుకు రావడంలేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతమైన పెద్ద పోచారంలో ఒక్కొక్కరుగా కన్ను మూస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు గ్రామంలో 12 మంది మృత్యువాత పడ్డారు. కారణాలు ఏమైనా.. వరుస మరణాలు సంభవిస్తుండటంతో తమను పట్టించుకునే వారే లేరా.. అనే ఆవేదన గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. మరణించిన వారిలో కరోనా వైరస్ సోకిన వారు, వృద్ధాప్యంలో ఉన్న వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు. సెప్టెంబర్ 15 నుంచి వరుసగా మరణాలు సంభవించడం, మరో వైపు జ్వరాల తీవ్రత పెరగడం.. అది ఏ జ్వరమో.. చికిత్స ఎక్కడ చేయించుకోవాలో..? ఎలాంటి మందులు వాడాలో.. చెప్పే వారే కరువయ్యారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం అని చెబితే కరోనా.. అని అంటారనే భయంతో అనేక మందికి జ్వరాలు వచ్చినా బయటకు రాక అందుబాటులో ఉన్న వైద్యంతో సరిపెడుతున్నారని.. ఇది ఎటువైపు దారి తీస్తుందోనని భయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాధి నియంత్రణకు అన్ని ప్రాం తాల్లో చర్యలు చేపడుతున్నా.. తమ గ్రామంలో ప్రభుత్వ వైద్యం అందని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. గ్రామ ప్రజల్లో మనో ధైర్యం కలగాలంటే జ్వరపీడితులకు సరైన వైద్యం అందించడంతోపాటు కరోనాపై వారికి ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని గ్రామపెద్దలు అభిప్రాయ పడుతున్నారు. కాగా, ఇటీవల గ్రామంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. -
కాటేస్తున్నాయి..
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : వైరల్ జ్వరాలు పిల్లలను కాటేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో చాపకింద నీరులా దాడి చేస్తున్నాయి. ఒక సీజన్ నుంచి మరో సీజన్లోకి ప్రవేశించే ముందు ఇన్ఫెక్షన్లు సులభంగా దాడి చేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్ వ్యాప్తికి అనుకూలమైంది. ఈ సీజన్లో ప్రతి 10 మందిలో ఒకరికి జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఎక్కువ మందిని బాధించే వైరల్ ఇన్ఫెక్షన్లలో ఫ్లూ జ్వరం ఒకటి. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న పిల్లల్లో ఎక్కువగా .. ఎక్కువమంది చిన్న పిల్లలు జ్వరాలు, దగ్గు, జలుబుతో బాధ పడుతున్నారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రితో పాటు జ్వర పీడితులతో ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కొందరు పిల్లల్లో డెంగ్యూ పాజిటివ్ లక్షణాలు కనబడడంతో కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఒకటి, రెండు డెంగ్యూ కేసులు బయటపడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో రోజుకు 150 మందికి పైగా పిల్లలు ఓపీలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో సుమారు 50 మందికి పైగా చిన్నారులు వైద్యం తీసుకుంటున్నారు. ఎక్కువ మంది చేరడంతో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్త్రీ, పురుషుల జనరల్ వార్డులు కూడా జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే టోకెన్ కూడా దొరకడం కష్టంగా మారింది. ఉదయం టోకెన్ తీసుకుంటే రాత్రికి గాని వైద్యుడి వద్దకు వెళ్లడానికి అవకాశం దొరకడం లేదు. ఎలా వస్తాయంటే.. వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. వైరల్ జ్వరాలకు మరో కారణం కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు కుచించుపోతాయి. దాని వల్ల రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు, జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎక్కువ మంది గుమికూడి ఉండే చోట్లలో వైరల్ వ్యాప్తి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందుకే పిల్లల్లో జ్వరాలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అదే విధంగా రద్దీగా ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఫ్లూ జ్వరం బారిన పడే అవకాశం ఉంది. లక్షణాలు ఇవీ.. వైరల్ జ్వరాల బారిన పడిన వారిలో ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరం నిస్పత్తువ, తలనొప్పి ఉంటాయి. ఆహారం తీసుకోకపోవడం, గొం తునొప్పి, ముక్కులో నీళ్లు కారడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా వ్యాయామం చేసేవారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. చాలా వరకు వైరల్ జ్వరాలు వాటికవే 5 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ జ్వరం వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి. ♦ జ్వరంతో పాటు తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ఒంటి నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ♦ పిల్లలతో పాటు పెద్దలు కూడా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ♦ పిల్లలను ఐస్క్రీమ్లకు దూరంగా పెట్టాలి. ♦ వాతావరణం చల్లగా ఉంటుంది కావున పిల్లలకు రాత్రి వేళల్లో వెచ్చదనం కోసం దుప్పటి కప్పి నిద్రపుచ్చాలి. ♦ ఆకాశం మేఘావృతం అయినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్న సమయంలో పిల్లలను బయటకు పంపరాదు. ♦ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి వాతావరణంలో మార్పుల కారణంగా చిన్న పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలతో రోజు ఆస్పత్రికి 150 మందికి పైగా చిన్నారులు వస్తున్నారు. పిల్లలను చల్లని వాతావరణంలో తిప్పకూడదు. రాత్రి వేళల్లో దుప్పటి కప్పి పడుకోబెట్టాలి. జ్వరం వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి.– డాక్టర్ డేవిడ్ సెల్వన్రాజ్, ఆర్ఎంఓ,చిన్నపిల్లల వైద్యుడు. ప్రొద్దుటూరు -
వైరల్.. హడల్
నల్లకుంట/గాంధీ: విషజ్వరాలు నగరవాసులను వణికిస్తున్నాయి. ఎప్పడూ లేని విధంగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతుండడంతో రెండు వారాల క్రితం అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు 2వేల నుంచి 3వేల మంది రోగులు వస్తున్నారు. అయితే ఆస్పత్రిలో 20 మంది వైద్యులే అందుబాటులో ఉండడంతో... ఒక్కో వైద్యుడు సగటున 120–150 మందిని చూడాల్సి వస్తోంది. దీంతో రోగులు గంటల తరబడి లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి అదనపు వైద్యులను ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు ల్యాబ్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రక్త పరీక్షల కోసం రోగులు బారులుతీరుతున్నారు. ఇక్కడ క్యూలైన్ పాటించకపోవడంతో ఒక్కోసారి తోపులాట జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. ‘గాంధీ’లో డెంగీ డేంజర్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో డెంగీ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఐదు రోజుల్లో 555 విషజ్వరాల కేసులు నమోదు కాగా... వాటిలో 121 డెంగీ పాజిటివ్ కేసులు కావడం గమనార్హం. బాధితుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 11, 12 తేదీల్లో ఇద్దరు డెంగీతో మరణించగా... ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులు డెంగీతో మృతి చెందారు. నేలపైనే వైద్యం గాంధీకి రోగుల తాకిడి పెరగడంతో బెడ్స్ సరిపోవడం లేదు. దీంతో రోగులను వరండాలో నేలపైనే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో స్ట్రెచర్లు, వీల్చైర్లపైనే వైద్యం అందించాల్సి వస్తోంది. 1,062 పడకలున్న ఆస్పత్రిలో సుమారు 3వేల మందికి వైద్యం అందించడం గమనార్హం. విషజ్వరాల బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైరల్ ఫీవర్ వార్డు రోగులతో కిటకిటలాడుతోంది. ప్రభుత్వం స్పందించి రోగుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని బాధితులు కోరుతున్నారు. సంఖ్య పెరిగింది సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఇటీవల పెరిగింది. నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధిచెందుతాయి. తాగునీరు కలుషితం కావడం వల్ల కూడా ప్రజలు రోగాల బారినపడుతున్నారు. అధికంగా జ్వరాలు, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఎవరూ సొంతంగా వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి. – డాక్టర్ పద్మజ, ఫీవర్ సీఎస్ ఆర్ఎంఓ -
వైరల్ ఫీవర్తో బాలిక మృతి
ఒంగోలు సెంట్రల్: ఒంగోలులో వైరల్ ఫీవర్తో ఓ బాలిక బుధవారం మృతి చెందింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బాలిక కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. అందిన వివరాల ప్రకారం.. ఒంగోలు సంతపేట 14వ డివిజన్ పరిధి ఆంజనేయస్వామి గుడి పక్కన నివసించే రెబ్బ రమేష్ కుమార్తె సిరి చందన (6) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. తల్లిదండ్రులు కుమార్తెను సుందరయ్య భవన్ రోడ్డులోని చిన్న పిల్లల వైద్యశాలలో చేర్పించారు. వైరల్ ఇన్ఫెక్షన్గా గుర్తించిన అక్కడి వైద్యులు పాపకు చికిత్స అందించారు. ఇంతలో పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ జ్వరాలు ప్రబలకుండా నగరంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.వినోద్కుమార్ను ఆదేశించారు. వైద్య శిబిరాలు సంతపేటలో వైరల్ జ్వరాలు ప్రబలడంతో అక్కడ గురువారం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్వో పర్యవేక్షణలో డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ మాధవీలత, డాక్టర్ లక్ష్మీపాపారావులు తమ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి, జ్వరబాధితులను గుర్తించి వారికి వైద్య చికిత్సలు అందించారు. -
'బెడ్డు'మీదపల్లె
ప్రకాశం, యర్రగొండపాలెం: విషజ్వరాలతో (వైరల్ఫీవర్స్) మండలంలోని గడ్డమీదిపల్లె మంచంపట్టింది. వీరభద్రాపురం పంచాయతీలోని ఈ గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా చోటు చేసుకోవడం వలన అంటువ్యాధులు సోకుతున్నాయి. పంట పొలాలు గ్రామానికి సమీపంలో ఉండటంతో గ్రామస్తులపై దండయాత్ర చేస్తున్నాయి. వైద్యాధికారులు సీజనల్ వ్యాధులపై ప్రత్యేదృష్టి పెట్టి గ్రామాల్లో తరచూ వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేస్తున్నారు. జ్వరాలు సోకిన వారి ఇంటివద్దనే సెలైన్ బాటిళ్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గడ్డమీదిపల్లెలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి.సురేష్ బుధవారం తమ సిబ్బందితో వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. 110 మందిని ఆయన పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. 10 మందికి సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. గ్రామంలో వైద్యబృదం పర్యటించి కాలువల్లో, గుంతల్లో నిలువ ఉన్న మురికి నీటిలో ఎబేట్ పిచికారి చేయించారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు
నల్లకుంట: గత కొద్ది రోజులుగా ప్రబలుతున్న విష జ్వరాలతో బస్తీలు వణికిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు విష జ్వరాల బారిన పడిన మంచానికే పరిమితమవుతున్నారు. సకాలంలో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా జ్వరం తగ్గక పోవడంతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి బాట పడుతున్నారు. బస్తీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు. నిరంతర వర్షాలు, పారిశుధ్య లోపం కారణంగా నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుతోంది. గ్రేటర్లోని అన్ని మురికి వాడలు, బస్తీల్లో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. కలుషిత నీరు కూడా జ్వరాల పెరుగుదలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. బస్తీల్లో పారిశుధ్యం లోపించింది. డ్రెయిన్లు పూడుకుపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. పైపులైన్ల లీకేజీల వల్ల రక్షిత నీరు కలుషి తమవుతుండటంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. చలి జ్వరం, జలుబు, దగ్గు తదితర వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీంతో వైరల్ ఫీవర్స్, మలేరియా తదితర రోగాలతో చికిత్సల కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లోనూ జ్వర పీడిత కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ‘గాంధీ’లో నేల పడకలే దిక్కు గాంధీఆస్పత్రి : విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి రోగుల తాడికి విపరీతంగా పెరిగింది. నగరంతోపాటు తెలంగాణ జిల్లాల నుంచి రోగులు క్యూ కట్టడంతో పలు విభాగాలు కిటకిటలాడుతున్నాయి. ఇన్పేషెంట్ వార్డుల్లో ఖాళీ లేకపోవడంతో వరండాలో నేలపై పరుపులు వేసి వైద్యసేవలు అందిస్తున్నారు. గాంధీ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం 2101 రోగులకు వైద్యసేవలు అందించారు. సాయంత్రం ఓపీకి స్పందన అంతంత మాత్రంగా ఉంది. సరైన ప్రచారం లేకపోవడంతో ఈ నెల 1 నుంచి 8 వరకు గాంధీ సాయంత్రం ఓపీలో కేవలం 116 మంది మాత్రమే వైద్యసేవలు పొందారు. జాగ్రత్తలు తీసుకోవాలి కాచి వడపోసిన నీటిని తాగాలి. కలు షిత, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినరాదు. వేడిగా ఉన్న ఆహారాన్ని భుజించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. జ్వరం వస్తే వైద్యుల సలహామేరకు మందులు వాడాలి.– డాక్టర్ పద్మజ, ఫీవర్ సీఎస్ ఆర్ఎంవో -
15 రోజుల్లో డెంగీని అదుపులోకి తెస్తాం : కేటీఆర్
-
15 రోజుల్లో డెంగీని అదుపులోకి తెస్తాం : కేటీఆర్
సాక్షి, హైదారాబాద్ : అంటు వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అవగాహన సదస్సులతో పాటు త్వరలోనే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం ఆయన మంత్రి ఈటల రాజేందర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విష జ్వరాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతోనే విషజ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రమంతటా ప్రజలు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. అందరికి వైద్యం అందేలా ప్రభుత్వం యుద్ధప్రాతిక చర్యలు చేపబట్టబోతుందన్నారు. ఆస్పత్రుల్లో పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్ సమీక్షిస్తున్నారన్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, రోడ్ల పరిస్థితిపై సమీక్షించామని, సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక క్యాలెండర్ రూపొందించాలని మంత్రి సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో దోమలను నివారించవచ్చునని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కేబినెట్ ఆమోదిస్తే బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచుతామన్నారు. స్కూళ్లు, కాలేజీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో అంటువ్యాధులు, నివారణపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారులు ఉదయం 6 గంటలకల్లా విధుల్లో ఉండాలని సూచించారు. డెంగీని 15 రోజుల్లో అదుపులోకి తెస్తామని మంత్రి తెలిపారు. వినాయక మండపాల వద్ద పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. నిర్మాణరంగ వ్యర్థాలపై నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. మేయర్, కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో డ్రైనేజీ పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం జీహెచ్ఎంసీ బాధ్యత అని కాకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. -
పడకలు లేవని ముప్పు తిప్పలు
సాక్షి,సిటీబ్యూరో: చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు మొయిజ్. పాతబస్తీకి చెందిన ఇతడు ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఇతడి కూతురు సయిదా ఫజాబేగం(10) తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానికం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించాడు. పరీక్షించిన అక్కడి వైద్యులు నిలోఫర్కు రిఫర్ చేశారు. దీంతో బిడ్డను తీసుకుని రెండు రోజుల క్రితం నిలోఫర్కు వచ్చాడు. ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో బాలికను చేర్చుకునేందుకు నిరాకరించిన వైద్యులు.. ఉస్మానియాకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో బిడ్డను తీసుకుని ఉస్మానియాకు వెళ్లగా ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యులు లేరని చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో చేసేది లేక మొయిజ్.. బాలల హక్కుల సంఘ అధ్యక్షుడు అచ్యుతరావును ఆశ్రయించాడు. బాలికకు మానవతా దృక్పధంతో చికిత్స చేయాల్సిందిగా బంజారాహిల్స్లోని ఓ చిన్నపిల్లల కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. తీవ్ర జాప్యం వల్ల అప్పటికే బాలిక కాలుతో పాటు మాట కూడా పడిపోయింది. ఇన్ఫెక్షన్ మరింత ముదిరింది. బాలిక కండరాల క్షీణతకు సంబంధించిన గుయిల్లిన్ బారో సిండ్రోమ్ (జీబీఎస్)తో బాధపడుతోందని, వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలని, ఒక్కో ఇంజక్షన్కు రూ.27 వేల చొప్పున మొత్తం రూ.12.50 లక్షలకు పైగా ఖర్చవుతుందని సదరు ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్థిక స్తోమత లేక పోవడంతో శుక్రవారం మధ్యాహ్నం కూతురును తీసుకుని మరోసారి ఉస్మానియాకు పరుగులు తీశాడు. అప్పటికే పడకలన్నీ నిండిపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించి, మళ్లీ నిలోఫర్కు రిఫర్ చేశారు. దీంతో మధ్యాహ్నం ఆయన మరోసారి తన బిడ్డను నిలోఫర్కు తీసుకొచ్చాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అదే మంటే పడకలు ఖాళీ లేవని చెప్పుతున్నారని, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాలిక తండ్రి మొయిజ్ బోరున విలపించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఒక్క మొయిజ్ మాత్రమే కాదు.. వైరల్ జ్వరాలతో బాధపడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది సామాన్యులకు ఇదే అనుభవం ఎదురవుతోంది. -
హైదరాబాద్లో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లు
-
విశ్వనగరంలో విషజ్వరాలు
-
వణికిస్తున్న జ్వరాలు.. 16 లక్షల మందికి డెంగీ పరీక్షలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : ఒక జిల్లా రెవెన్యూ అధికారి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. మరో ప్రాంతీయ రవాణా అధికారి కూడా వారం నుంచి ఇదే పరిస్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో జ్వరాల కారణంగా రోజువారీగా 20–25% మంది కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారు. ఒక పని కోసం మండల స్థాయి నాయకుడు ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తే తన మనవడికి జ్వరం వచ్చినందున ఆసుపత్రిలో ఉన్నానని, తాను ఇప్పుడు కలవలేనని చెప్పాడు. అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా జ్వరాల బారిన పడ్డారు. సచివాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది జ్వరాలబారిన పడడంతో కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ జ్వరాల కారణంగా సిబ్బంది విధులకు రావడంలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగులయితే ఆఫీసులకు రానవసరం లేదని, జ్వరం వస్తే విధులకు హాజరయినట్టే పరిగణిస్తామని ఆయా సంస్థలు సమాచారం ఇచ్చేశాయి. ఇదీ పడకేసిన తెలంగాణ తాజా పరిస్థితి. జ్వరపీడితులతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. డెంగీ పాజిటివ్ వస్తేనే బెడ్ ఇస్తామంటూ ఆసుపత్రులు తేల్చేశాయి. అది కూడా నాలుగైదు రోజుల నిరీక్షణ తర్వాతే. విధిలేని పరిస్థితుల్లో ఒక్కో పడకపై ఇద్దరిని పడుకోబెట్టి చికిత్సనందిస్తున్నాయి. సందర్శకులుండే రిసెప్షన్ సెంటర్లు కూడా రోగులతో నిండిపోతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.25 కోట్ల మంది జ్వరాలతో బాధపడుతున్నారని అంచనా. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో సోమవారం వచ్చిన ఔట్పేషంట్ల సంఖ్య 2వేల పైమాటే. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల మంది డెంగీ పరీక్షలు చేయించుకున్నారంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఎటు చూసినా రోగులే! రాష్ట్రంలోని ఆసుపత్రులు జ్వరబాధితులతో కిటకిటలాడుతున్నాయి. మండల, జిల్లా కేంద్రాల్లో ఉండే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో జ్వరం పేరుతో వచ్చిన వారందరికీ పరీక్షలు చేయాల్సి వస్తోంది. పరీక్షల అనంతరం డెంగీయా? మలేరియానా? అని తేలిన తర్వాతే ఆసుపత్రుల్లోనే ఉంచి చికిత్సనందిచాల్సి వస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో పడకలకు కూడా కొరత ఏర్పడింది. తీవ్రజ్వరంతో వచ్చిన రోగికి పడక కావాలంటే నాలుగైదు రోజులు పడుతోందని, రోగుల సంఖ్యకు అనుగుణంగా ఎక్కడా బెడ్లు లేకపోవడంతో ఈ పరిస్థితి తప్పడం లేదని బాధితుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇదే అదనుగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. జ్వరమనగానే అన్ని రకాల పరీక్షలు రాస్తుండడం, వాటికి వీలున్నంత ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అవసరమున్నా లేకపోయినా ఎడాపెడా మందులు రాస్తూ భారీగా దండుకుంటున్నాయి. 12 జిల్లాల్లో హైరిస్క్ రాష్ట్రంలో పరిస్థితిని బట్టి మొత్తం 12 జిల్లాలను ప్రభుత్వం హైరిస్క్ జిల్లాలుగా గుర్తించింది. ఇందులో హైదరాబాద్, భద్రాద్రి జిల్లాల్లో మరింత ప్రమాదకర పరిస్థితులున్నాయని, ఆయాప్రాంతాల్లో తగిన చర్యలు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించింది. ఒక్క హైదరాబాద్లోనే 309 డెంగీ హైరిస్క్, 151 మలేరియా హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఫాగింగ్, యాంటీ–లార్వా ఆపరేషన్లు, నాలాలు, మురుగు కాల్వల్లో డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఈ నివారణ చర్యలేవీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. గ్రేటర్లో వర్షాల కారణంగా మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయినా పట్టించుకున్న అధికారుల్లేరు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. క్లోరినేషన్ చేయకపోవడంతో మంచినీటిని ముట్టుకునే పరిస్థితి లేదు. తాగునీరు కూడా జ్వరాలకు కారణమవుతోందనే ఆందోళన నగర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్ నగర పరిధిలో ఎటుచూసినా అపరిశుభ్రతే దర్శనమిస్తోంది. 24 గంటల ఓపీలేవీ రాష్ట్రంలో జ్వర తీవ్రత దృష్ట్యా జిల్లా కేంద్ర ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో 24 గంటల పాటు ఓపీ సేవలు అందించాలని ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి. కానీ, ఎక్కడా ఈ సేవలు కనిపించడం లేదని జ్వర పీడితులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రులకెళ్తే పట్టించుకునే వారే లేరంటున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినా అక్కడా ప్రయోజనం ఉండటం లేదని బాధితులు, వారి కుటుంబసభ్యులు వాపోతున్నారు. చేతి చమురు వదిలించుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదంటున్నారు. విద్యార్థులకే ఎక్కువ జ్వర పీడితుల్లో అన్ని వయసులు వారున్నా అందులో విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జ్వరం వల్ల చనిపోతున్న వారిలోనూ ఎక్కువ మంది చిన్నారులే ఉండడం బాధాకరం. దీంతో తల్లిదండ్రులు.. పాఠశాలలు, విద్యాసంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో పరిశుభ్ర వాతావరణం లేకపోవడం, కొన్ని పాఠశాలల్లో కనీసం వెంటిలేషన్ కూడా లేకపోవడంతో విద్యార్థుల్లో ఎక్కువగా జ్వరాలు ప్రబలుతున్నాయని మండిపడుతున్నారు. చాలాచోట్ల వాటర్ ప్యూరిఫయర్లు కూడా లేకపోవడం, ఫాగింగ్ అసలే జరగకపోవడంతో పాఠశాలల్లోనే జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఒక్క పాఠశాలల్లోనే కాదు. రాష్ట్రంలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సినిమాథియేటర్లు, షాపింగ్మాల్స్.. ఇలా ప్రతిచోటా.. పనిచేసే సిబ్బంది జ్వరం బారిన పడుతుండటతో ఆయా ప్రాంగణాలు బోసిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది పలుచబడటంతో పౌరసేవల్లో జాప్యం జరుగుతోంది. అయితే, గత మూడేళ్లతో పోలిస్తే రాష్ట్రంలో డెంగీ కేసులు పెరగ్గా, మలేరియా కేసులు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. జూన్–ఆగస్టు మాసాల్లో 2017లో సగటున 135 డెంగీ కేసులు నమోదు కాగా, 2019లో అది 149కి పెరిగింది. అదే మలేరియా విషయానికి వస్తే 2017లో 206 కేసులు నమోదు కాగా, 2019లో 47కు తగ్గిపోవడం గమనార్హం. ముందు జాగ్రత్తలివే! డెంగీ, మలేరియా, విష జ్వరాలొచ్చేముందు తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. ఒల్లు కదిపితే నొప్పెడుతుంది. చర్మంపై దద్దుర్లు కనిపించడం, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. అధిక దాహం, రక్తపోటు పడిపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. డెంగీతో పాటు మలేరియా ఇతర జ్వరాల నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో నిర్ధారించడానికి శాస్త్రీయత లేదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20వేలలోపు పడిపోతే అది ప్రమాదకరం. 15వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎలక్ట్రాల్ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వరతీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. దోమలు కుట్టకుండా రోజూ జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. కాచి వడబోసిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే మంచినీరు ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా జాగ్రత్తపడవచ్చు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణలో విజృంభించిన జ్వరాలు
-
హైదరాబాద్లో విష జ్వరాలు
-
నిలబడి నిలబడి ప్రాణం పోతోంది
సిటీకి జ్వరమొచ్చింది. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో జనంఅల్లాడుతున్నారు. విషజ్వరాల ప్రభావం తీవ్రమవడంతో రోగులు ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. నగరంలోని గాంధీ, ఫీవర్, ఉస్మానియా ఆస్పత్రులకు సోమవారం వేల సంఖ్యలో రోగులు వచ్చారు. రోగుల సంఖ్యకు తగిన వసతులు లేక నానాపాట్లు పడ్డారు. ముఖ్యంగా ఫీవర్ ఆస్పత్రిలో ఓపీ వద్ద చాంతాడంతలైను ఉండడంతో చాలా మంది అవస్థలు పడ్డారు. గంటల తరబడి క్యూలో నిల్చొని నీరసించిపోయారు. గాంధీలోనూ గంటలతరబడి రోగులు వేచిఉండడం కన్పించింది. గాంధీఆస్పత్రి : మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి సోమవారం రోగులు పోటెత్తారు. రద్దీకి అనుగుణంగా చిట్టీ కౌంటర్లు పెంపు, తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఓపీ చిట్టీలు, వైద్యసేవల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారు. వీల్ఛైర్లు, స్ట్రెచర్లు అందుబాటులోలేక దివ్యాంగులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. కుటుంబీకులే రోగులకు ఎత్తుకుని వైద్యసేవల కోసం తీసుకువెళ్లారు. సోమవారం రికార్డు స్థాయిలో ఓపీ రోగుల సంఖ్య నమోదైంది. సాధారణ రోజుల్లో గాంధీ ఓపీలో 3000 నుంచి 3500 మంది చికిత్సకువస్తుండగా సోమవారం మాత్రం 4వేల మంది చికిత్స కోసం వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇన్పేషెంట్ విభాగంలో ఆరోగ్యశ్రీ రోగులు 30శాతం పెరిగినట్లు సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ తెలిపారు. ఉస్మానియాలో.. అఫ్జల్గంజ్ : ఉస్మానియా ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిటలాడింది. దాదాపు 1600మంది చికిత్స కోసం వచ్చారు. రోగుల సౌకర్యార్థం అన్ని విభాగాల్లోని వైద్యులను అత్యవసర సేవలకు వినియోగించామని సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సోమవారం ఓపీ సహా ఐపీ విభాగాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఓపీ సహా ఫార్మసీలో రోగుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు లేకపోవడంతో మందులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. అసలే జ్వరం ఆపై గంటల తరబడి క్యూలైన్లో నిల బడాల్సి వచ్చింది. సాధారణంగా రోజుకు సగటున వెయ్యి నుంచి 1200 మంది రోగులు వస్తుండగా సోమవారం ఈ సంఖ్య రెండు వేలు దాటింది. -
వైరల్ ఫీవర్తో బాధపడుతున్న ఎల్కే అద్వానీ
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ (91) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ప్రతి ఏడాది ఆయన ఆగస్టు 15న తన నివాసంలో జెండా వందనం చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే అద్వానీకి వైరల్ ఫీవర్ కారణంగా ఈసారి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం లేదని ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటన చేసింది. గత అయిదు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలిపింది. -
బిహార్లో పిల్లలకు వస్తున్న జ్వరం ఏమిటి?
బిహార్లో పిల్లలకు వస్తున్న జబ్బేమిటి? ఆ పిల్లలను చూస్తుంటే బాధగానూ ఉంది. అలాంటి జబ్బు మన పిల్లలకూ వచ్చే అవకాశాలున్నాయేమోననే ఆందోళన కూడా ఉంది. ఆ జబ్బుకు కారణాలేమిటి? ఆ జబ్బు మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశముందా? దానిపై అవగాహన కల్పిస్తూ, దాని నివారణ మార్గం ఏదైనా ఉంటే చెప్పండి.– ఎమ్. కృష్ణచైతన్య, విజయనగరం బిహార్లోని పిల్లల్లో కనిపిస్తున్న జబ్బు ప్రధానంగా ఒక రకం మెదడు వాపు. దీన్ని అక్యూట్ ఎన్సెఫలైటిక్ సిండ్రోమ్గా చెబుతున్నారు. అయితే అక్కడి స్థానికులు హిందీలో దీన్ని ‘చమ్కీ ఫీవర్’ అని కూడా అంటున్నారు. బిహార్లోని ముజఫుర్పూర్, చంపారన్... ఆ చుట్టుపక్కల అనేక జిల్లాల్లో ఇది విస్తృతంగా వ్యాపిస్తూ వందలాది చిన్నారుల ఉసురు తీస్తోంది. సాధారణంగా ఈ అక్యూట్ ఎన్సెఫైలైటిస్ సిండ్రోమ్లో పిల్లలకు మొదట తీవ్రమైన జ్వరం (హైఫీవర్) కనిపిస్తుంది. అలాగే పిల్లలు చాలా మబ్బుగా, మందకొడిగా, నీరసంగా ఉంటారు. అయోమయంగా కనిపిస్తుంటారు. ఒక్కోసారి తల్లిదండ్రులను సైతం గుర్తుపట్టలేరు. వెలుతురును భరించలేకపోవడం, రకరకాల భ్రాంతులకు గురికావడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇక జ్వరం తీవ్రమైనప్పుడు ఫిట్స్ రావడం కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. కారణాలు: సాధారణంగా ఇన్ఫెక్షన్లు వచ్చి అవి మెదడును ప్రభావితం చేయడం వల్ల ‘అక్యూట్ ఎన్సెఫలైటిక్ సిండ్రోమ్’ కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లకు అటు వైరల్, ఇటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ప్రధానంగా కారణమవుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్లలో జాపనీస్ ఎన్సెఫలైటిస్, ఎంటరో వైరస్, హెర్పిస్ సింప్లెక్స్, ఇన్ఫ్లుయెంజా వైరస్ వంటి అనేక వైరస్లు ప్రధాన కారణం. ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ప్రధానంగా స్ట్రెప్టోకోకస్, స్టెఫాలోకోకస్ వంటి బ్యాక్టీరియాలు కారణం కావచ్చు. నిమోనియాకు దారితీసే ఇన్ఫెక్షన్లు బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్కు కారణం కావచ్చు. బ్రెయిన్ టీబీ వల్ల కూడా మెదడు ప్రభావితమై ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాకాలం వచ్చే ముందర, వేసవి నుంచి వర్షాకాలంలోకి ప్రవేశించే సమయాల్లో పడే చినుకులు, జల్లులతో దోమలు బాగా పెరిగి, డెంగ్యూ వస్తుంది. గతంలో అంతగా కనిపించకపోయినా ఇటీవల గత ఆర్నెల్లుగా డెంగ్యూ ఇన్ఫెక్షన్ కారణంగా బ్రెయిన్కు సంబంధించిన సమస్యలు వచ్చి బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్న కేసులూ పెరిగాయి. ఇక మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాందేడ్, దాని పరిసర ప్రాంతాల్లో ఇటీవల రికెట్షియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపించింది. అది కూడా ఇలాగే మెదడును ప్రభావితం చేసింది. ఈ అన్ని కేసుల్లోనూ బిహార్లో కనిపించినట్లుగా పిల్లల్లో మెదడు ప్రభావితమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్లలో ఏది సోకినా రెండు మూడు రోజులు జ్వరం వస్తుంది. అయితే మన దేశంలోని పిల్లల్లో పోషకాహార లోపాల వంటి కారణంగా వారు బలహీనంగా ఉండటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో వెంటనే ఈ తరహా వైరస్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. పైగా బిహార్లో కనిపిస్తున్న ఈ ‘అక్యూట్ ఎన్సెఫలైటిక్ సిండ్రోమ్’ తక్కువ వ్యవధిలో అంటే రెండుమూడు రోజుల్లోనే తీవ్రజ్వరంతో వారి మెదడుపై ప్రభావం చూపి, ఆ పిల్లల ప్రాణాలను తీస్తోంది. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త! అక్యూట్ ఎన్సెఫలైటిక్ సిండ్రోమ్కు ముందర రెండు మూడు రోజుల పాటు జ్వరం వస్తుంది. నిద్రమబ్బుతో, మందకొడిగా, ఫిట్స్తో వస్తుంటారు. వాళ్లు చక్కగా తినలేరు. బ్లడ్షుగర్ తగ్గి కాంప్లికేషన్స్ వస్తుంటాయి. మరికొన్ని ఇన్ఫెక్షన్లలో అవి నేరుగా మెదడుపై ప్రభావం చూపకపోయినా ఒంట్లోని ఇతరత్రా శారీరక వ్యవస్థలు అంటే శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపి ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపోటు సమస్యలు, గుండెవేగం తగ్గడం, మూత్రవిసర్జన వ్యవస్థలో (యూరినరీ) ఇన్ఫెక్షన్లు, జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు వంటివి కనిపించినప్పుడు వెంటనే చికిత్స అందకపోతే వారిలో ‘బ్రెయిన్ప్రెషర్’ పెరిగిపోతుంది. ఇలా బ్రెయిన్ ప్రెషర్ పెరిగినప్పుడు తక్షణం చికిత్స అందించడం చాలా చాలా అవసరం. లేకపోతే మెదడు దెబ్బతిని ఆ పిల్లల్లో (మోటార్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల) శరీరక కదలికలు సరిగా లేకపోవడం, సరిగా నడవలేకపోవడం, చేతులు సరిగా పనిచేయకపోవడంతోపాటు వారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, నేర్చుకునే శక్తి మందగించడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఈ దశలో రెండు రోజులకంటే జ్వరం తగ్గకుండా ఉండటం, అది చాలా తీవ్రమైన జ్వరం (హైఫీవర్)గా కనిపించనప్పుడు తప్పక డాక్టర్ను సంప్రదించాలి. చికిత్స: ఈ తరహా జ్వరాల్లో పిల్లలకు రెండు దశల చికిత్స అవసరమవుతుంది. వీరిలో ఇన్ఫెక్షన్ తగ్గడానికి అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్ ఇవ్వాలి. అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. కానీ వైరల్ ఇన్ఫెక్షన్లలో హెర్పిస్ వంటి వాటికి తప్ప చాలా వైరస్లకు మందులు ఉండవు. వ్యాధి లక్షణాలను అదుపు చేయడానికి మాత్రమే ఉపయోగించే సింప్టమాటిక్ చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పిల్లలకు మొదటి దశ చికిత్సగా తక్షణం ఐసీయూలో ఉంచడం, అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ లేదా వైరస్ను బట్టి కొన్ని యాంటీరిట్రోవైరల్ మందులు ఇవ్వడం, వారి టెంపరేచర్ను నార్మల్కు తీసుకురావడం, బ్లడ్ గ్లూకోజ్ నార్మల్గా ఉండేలా చూడటం, బ్రెయిన్ ప్రెషర్ను తగ్గించడం, శ్వాస సరిగా అందేలా చూడటం వంటి తొలిదశ చికిత్స అందించాలి. ఆ తర్వాత ఆ లక్షణాల కారణంగా పరిస్థితి బాగా దిగజారిపోకుండా చూసే సెకండరీ చికిత్సలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫిట్స్ వంటివి రాకుండానూ ఒకవేళ వచ్చినా అవి భవిష్యత్తులో దీర్ఘకాలం ప్రభావం చూపకుండా చేసే రెండోదశ చికిత్స అందించాలి. ఈ రెండో దశ చికిత్స (సెంకండరీ ట్రీట్మెంట్)లో మరింత విషమించకుండా చూస్తారు. వెంటిలేటర్ మీద ఉంచి, మానిటాల్ లేదా హైపర్టోనిక్ సెలైన్ ఇస్తారు. బ్రెయిన్ ప్రెషర్ తగ్గిస్తారు. అవసరాన్ని బట్టి ఫిట్స్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఫిట్స్ వచ్చిన వారికి ఈఈజీ పరీక్ష చేసి ఫిట్స్ ఇవి ఏ కారణంగా వచ్చాయి, ఇక్కడికి పరిమితమయ్యాయి వంటి అంశాలను గుర్తిస్తారు. ఇలాంటి లక్షణాలు గల పిల్లలకు కొన్ని మందులు ఇచ్చి వారిని ప్రశాంతంగా ఉంచాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ: ఇందుకోసం తొలుత క్లినికల్ ఫీచర్స్ పరిశీలించాలి. అంటే రోగిలో బయటకు కనిపించే అంశాలైన జ్వరం, నీరసం, అయోమయం, బయటి వాతావరణానికీ... దాంతోపాటు మనం ఇచ్చే ఆదేశాలకు స్పందించక పోవడం, గిచ్చడం వంటివి చేసినప్పుడు కదలికలు లేకపోవడం, కనుపాపలు పూర్తిగా స్పందించకపోవడంతోపాటు ఒకవైపు కనుపాప పెద్దగానూ, మరోవైపుది చిన్నగానూ ఉండటం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం వంటి వాటితోపాటు సీటీ స్కాన్ వంటి పరీక్షలతో అక్యూట్ ఎన్సెఫలైటిస్ను నిర్ధారణ చేయవచ్చు. ఇలాంటి పిల్లలను మొదట ఆసుపత్రికి తీసుకురాగానే వారిని మరింత ఆందోళనకు గురికాకుండా కామ్గా ఉండేలా చేసి తక్షణం చికిత్స ప్రారంభించాలి. నివారణ ఇతరలకు సోకకుండా ఉండేందుకు... దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతుల్ని, చేతి రుమాలు అడ్డుపెట్టుకునేలా పిల్లలకు నేర్పాలి. ఈ నియమాన్ని విధిగా అందరూ పాటించాలి ∙దగ్గు, తుమ్ము తర్వాత అలా అడ్డుపెట్టుకున్న చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి ∙దగ్గు, తుమ్ము సమయంలో ఉపయోగించిన రుమాలు/టిష్యూను వేరొకరు ఉపయోగించకూడదు. దాన్ని సరిగ్గా డిస్పోజ్ చేయాలి ∙పరిసరాలను, కిచెన్లను, బాత్రూమ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ∙చాలాసార్లు ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీని నివారణ కోసం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. హ్యాండ్ శానిటేషన్ వాడటం చాలా అవసరం ∙ఇక ఇటీవల డెంగ్యూతో సైతం ఇలాగే మెదడును ప్రభావితం చేసే సమస్యలు వస్తున్నాయి కాబట్టి నీటిగుంటలు లేకుండా చూసుకోవడం, దోమ కాటుకు గురికాకుండా జాగ్రత్త పడటం కూడా అవసరం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... చికిత్సకంటే నివారణ మేలు. అసలు పిల్లలకు ఎలాంటి వ్యాధులేమీ రాకుండా నివారణ ప్రక్రియలు పాటించడం, వారిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందేలా మంచి పోషకాహారం ఇస్తూ ఉండటం అవసరం. డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్, రెయిన్బో చిల్డ్రెన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
మంచం పట్టిన మన్యం
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : పలాస మండలం తర్లాకోట పంచాయతీలోని పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పంచాయతీలోని కొఠారింగ్ తాళభద్ర గ్రామంతో పాటు పొత్రియ, దానగొర, హిమగిరి, గట్టుమీద ఊరు, అలాగే లొత్తూరు పంచాయతీలోని చినపల్లియా, పెద్ద పల్లియా, లొత్తూరు తదితర గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా విష జ్వరాలతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. మందస మండలంలోని పుట్టూరు, సాభకోట, కిల్లోయి, రామరాయి తదితర గ్రామాల్లో కూడా గిరిజనులు తరుచూ జ్వరాల బారిన పడుతున్నారు. బిక్కుబిక్కుమంటున్న గిరిబిడ్డలు పలాస మండల కేంద్రానికి సుమారు 10 కి.మీ దూరంలో ఉన్న తర్లకోట పంచాయతీలోని కొఠారింగ్ తాళభద్రలో దాదాపు అందరూ జ్వర పీడుతులే ఉన్నారు. వీరు తినడానికి తిండి లేక, తాగడానికి గుక్కెడు మంచి నీరు లేక అల్లాడుతున్నారు. గ్రామంలో తాగునీటి బోర్లు పనిచేయక నేల బావుల నీటినే తాగుతున్నారు. ఈ గ్రామానికి దగ్గరలో రెంటికోటలో ఉన్నటువంటి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు కూడా ఇక్కడి నుంచి రహదారి సదుపాయం లేదు. గత వారం రోజులుగా గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నా కనీసం ఇంతవరకు ప్రభుత్వ వైద్యులు గ్రామానికి రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామం..సమస్యల గ్రామం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కొఠారింగ్ తాళభద్ర గ్రామంలో మొత్తం 45 ఇళ్లు, సుమారు 200 జనాభా ఉంటారు. ఈ గ్రామానికి తగిన రహదారి సదుపాయం లేదు. గ్రామంలో మౌలిక వసతులు గురించి ఎంత తక్కువగా మాట్లాడుతకుంటే అంత మంచిది. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు లేవు. విద్యుత్ సదుపాయం అంతంతమాత్రం గానే ఉంది. గతేడాది వచ్చిన తిత్లీ తుఫాన్కు ప్రభావంతో ఇళ్లు మొత్తం ఎగిరిపోయినా కనీస సాయం అందలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి మౌలిక వసతులు కల్పిచాలని కోరుతున్నారు. సంచి డాక్టర్లే శరణ్యం ఈ గ్రామానికి ప్రభుత్వ వైద్యులు రాకపోవడం వల న ప్రస్తుతం ప్రైవేటు ఆర్ఎంపీలు వైద్య సేవలందిస్తున్నారు. అయితే ప్రైవేటుగా వైద్యం చేయిస్తుం డడం వలన అధికంగా ఖర్చులు అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకుల్లో అంత మొత్తంలో ఖర్చు పెట్టదెలా అంటూ నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి ప్రభుత్వ వైద్య సేవలందించాలని కోరుతున్నారు. పస్తులుండాల్సి వస్తోంది కూలి పనులు చేసుకొని బతికే కుటుంబం మాది. గత వారం రోజులుగా నేను నా పి ల్లలు తీవ్రమైన జ్వరంతో ఉండటం వలన ఉపాధి పనులకు వెళ్లలేక ఇంటికే పరిమితం అయ్యాము. దీనికి తోడు ప్రైవేటు డాక్టర్ వద్ద మందులు వాడడం వలన ఇప్పటివరకు రూ.4000 ఖర్చు అయ్యింది. అయినా జ్వరం తగ్గడం లేదు. వారం రోజులుగా పనులకు వెళ్లకపోవడం వలన పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. – సవర చెంచల, కొఠారి తాళభద్ర -
మంచంపట్టిన కనపర్తి
ప్రకాశం , నాగులుప్పలపాడు: ముందుగా చిన్నపాటి జ్వరం.. అనంతరం ఒకరోజులోనే కాలు కదపలేనంతగా నొప్పులు.. ఆపై విపరీతమైన జ్వరంతో కూడిన ఒళ్లు నొప్పులు... ఇదీ ప్రస్తుతం నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తి గ్రామంలో ప్రజల పరిస్థితి. వారం రోజులుగా జ్వరాలతో గ్రామం మొత్తం మంచంపట్టింది. గ్రామంలోని తోపుపాలెం, రెడ్డిపాలెం, బలిజ కాలనీ, మేకల సోమయ్య పట్టపుపాలెంతో పాటు యానాది కాలనీలోని సుమారు 600 కుటుంబాల ప్రజలకు వారం రోజులుగా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా జ్వరం రాకుండా లేదు. హఠాత్తుగా ఇలాంటి జ్వరాలు, తీవ్రమైన ఒళ్లు నొప్పులు రావడంతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ వైద్యం శూన్యం... కనపర్తి గ్రామం అమ్మనబ్రోలు ప్రభుత్వ వైద్యశాల పరిధిలో ఉంది. అక్కడున్న ఇద్దరు డాక్టర్లు శిక్షణ నిమిత్తం గుంటూరు వెళ్లారు. ఆస్పత్రిలో సరైన వైద్యం చేసే వారు లేకపోవడంతో జ్వరపీడితులు కనపర్తిలోని ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఒంగోలు వెళ్లి చూపించుకుంటున్నారు. ఒకవైపు అంతుచిక్కని జ్వరాలతో అల్లాడిపోతూనే మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి ఏఎన్ఎం వస్తున్నప్పటికీ సరైన మందులు లేకపోవడంతో పాటు వ్యాధి నిర్ధారణ చేయడం లేదు. వ్యాధుల నిర్ధారణ రికార్డులకే పరిమితమవుతోంది మినహా వ్యాధిని నయం చేయడానికి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ కళ్యాణ చక్రవర్తి శిక్షణ నిమిత్తం 10 రోజులుగా అందుబాటులో లేకపోగా, మరో వైద్యురాలు రహీమున్నీసా ఇండక్షన్ ట్రైనింగ్ పని మీద 3 రోజుల పాటు అందుబాటులో ఉండరు. వీరికి బదులు ఇక్కడకు డాక్టర్ కులదీప్ను ఇన్చార్జిగా నియమించగా, రోగుల గురించి పట్టించుకోరు అని ఆయనకు పేరుండటంతో అక్కడికి ఎందుకులే అని రోగులే వెళ్లడం మానుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ వైద్యశాల మొహం చూసే వారు లేకుండా పోయారు. దీనిపై అమ్మనబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు కళ్యాణ చక్రవర్తిని వివరణ కోరగా, గ్రామంలో విష జ్వరాలు ప్రబలిన విషయం తమ దృష్టికి వచ్చిందని, క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు రోజుల నుంచి ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉన్నాయి రెండు రోజుల క్రితం పనికి వెళ్లగా, తీవ్రమైన ఒళ్లు నొప్పులు వచ్చాయి. దీంతో పని చేయలేక ఇంటికి వచ్చాను. అప్పటి నుంచి కాలు తీసి బయట పెట్టలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అకస్మాత్తుగా ఇంత భయంకరమైన నొప్పులతో కూడిన జ్వరం రావడం ఏంటో అర్థం కావడం లేదు.– కోటుపల్లి శ్రీనివాసరావు, కనపర్తి -
మంచం పట్టిన సఫావత్ తండా
సాక్షి, తిరుమలగిరి (నాగార్జునసాగర్) : అపరిశుభ్రతో... కలుషిత తాగునీరో... కారణమేదో కానీ ఆ తండాను జ్వరం మహమ్మారి పట్టిపీడిస్తోంది. వైరల్ ఫివతో తండా వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. జబ్బు చేసిందని హాస్పిటల్కు వెళితే మందు గోళీలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లినా డబ్బులు ఖర్చవుతున్నాయే తప్ప రోగం మాత్రం నయం కావడం లేదంటూ తండా వాసులు వాపోతున్నారు. తండాలో ఇప్పటి వరకు 100 మందికి పైగా జ్వరంతో మంచం పట్టగా ఒక్కో కుటుంబానికి రూ. 20వేలకు పైగానే ఖర్చయిందని, అయినా జబ్బు నయం కావడం లేదంటున్నారు. ఇదీ తిరుమలగిరి మండలం సఫావత్ తండా పరిస్థితి. తండాలో 756 మంది జనాభా ఉన్నారు. ఈ తండాలో ఎక్కువగా రైతులు, కూలీలే ఉన్నారు. వీళ్లు బతుకుదెరువు కోసం చుట్టుపక్కల కూలి పనికి వెళ్తుంటారు. సుమారు ఇరవై రోజులుగా వీరి కుటుంబ సభ్యులకు జ్వరం వస్తుంది. దాంతో మిర్యాలగూడ, హాలియా వంటి పెద్దాసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు చేసినా జ్వరం మాత్రం నయం కావడం లేదంటున్నారు. రోజూ వచ్చే కూలి పోతుందని, ఉన్న డబ్బులు కూడా ఖర్చవుతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అపరిశుభ్రతకు నిలయంగా.. మండలంలోని సఫావత్తండా అపరిశుభ్రతకు నిలయంగా మారింది. తండాలో డ్రెయినేజీలు లేకపోవడంతో ఇళ్లలోని మురుగునీరు మొత్తం రోడ్డుపైకి చేరి రోజుల కొద్దీ నీరు నిల్వ ఉంటుంది. అదే విధంగా తండాలో పెంటదిబ్బలు ఇళ్లమధ్యలోనే ఉండటం, తండాకు సరఫరా అయ్యే మంచినీటి ట్యాంకులను కూడా శుభ్రపరచకపోవడంతో అపరిశుభ్రతకు నిలయంగా మారింది. గిరిజన ప్రజలకు మరుగుదొడ్లపై అవగాహన కల్పించాల్సి ఉన్నా వారు మనకేంటిలే అని వ్యవహరిస్తుండటంతో తండాలో కనీసం 30 శాతం మేరకూడా మరుగుదొడ్లు లేవు. దాంతో మలమూత్రాలను రోడ్డువెంటనే విసర్జిస్తున్నారు. దీంతో తండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అవగాహన కార్యక్రమాలేవీ..? పరిసరాల పరిశుభ్రత... రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ వైద్యఆరోగ్యí సిబ్బంది ఆ దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు. ప్రజలకు రోగాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఉన్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతోనే ప్రజలు అవస్థలు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైద్యం అందించాలి.. తండాలోని ప్రజలంతా జ్వరాలతో బాధపడుతున్నారు. అంతా కూలి పనులు చేసుకొని బతి కేటోళ్లమే. రోగం వస్తే చూపించుకునే స్థోమత కూడా మాకు లేదు. ప్రై వేట్ వైద్యం చేయించుకోవాలంటే అప్పు చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థోమతలేకపోవడం, ప్రభుత్వ వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. – సఫావత్ పాండు 20 వేలకు పైగా ఖర్చయింది.. పదిహేను రోజుల నుంచి జ్వరం వస్తుంది. హాలియా, మిర్యాలగూడలోని ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ఇప్పటి వరకు రూ.20వేలకు పైగా ఖర్చయింది. అయినా రోగం తగ్గలే. చేతిలో ఉన్న పైసలు కూడా అయిపోవడంతో వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇంటిబాట పట్టినం. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన వైద్యం అందించాలి. – సఫావత్ మంగి, సఫావత్తండా -
జ్వరం..కలవరం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : శీతాకాలం ప్రారంభం కావడంతో కొన్ని రోజుల నుంచి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని రోజులగా జిల్లాలో పగలు ఎండ, రాత్రి విపరీతమైన చలి వేస్తోంది. వేకువ జామున విపరీతమైన మంచు కూడా కురుస్తుంది. వీటి కారణంగా వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ వస్తున్నాయని, న్యూమోనియా, బ్రాంకైటిస్ వాంటి వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చలి, పొగ మంచు కారణంగా ఇవి వ్యాపిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటుమలేరియా, చికెన్పాక్స్ (పొంగు) కూడా సోకుతున్నాయి. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చిన్న పిల్లల ఓపీ బాగా పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. గతంలో రోజు 100–140 మంది చిన్నారులుగా రాగా 10 రోజుల నుంచి రెట్టింపు సంఖ్యలో ఓపీకి వస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఆస్పత్రిలోని వార్డులో అడ్మిట్ చేస్తున్నారు. పిల్లల సంఖ్య పెరగడంతో ఒక్కో మంచంలో ఇద్దరిని పడుకోబెడుతున్నారు. చిన్న పిల్లలే గాక వృద్ధులు, చాలా మంది మహిళలు జ్వరంతో బాధపడుతున్నారు. ప్రొద్దుటూరులోని అనేక ప్రైవేట్ ఆస్పత్రులు కూడా చిన్న పిల్లలతో కిటకిట లాడుతున్నాయి. ప్రొద్దుటూరుతో పాటు ఎర్రగుంట్ల, మైదుకూరు, దువ్వూరు, రాజుపాళెం, కమలాపురం, కొండాపురం, ముద్దనూరు తదితర మండలాల నుంచి చిన్న పిల్లలను తీసుకొని వస్తున్నారు. కిటకిటలాడుతున్న ల్యాబ్లు జ్వరం సోకిన చిన్న పిల్లలతో ల్యాబ్లు కిటకిట లాడుతున్నాయి. వ్యాధి నిర్ధారణకు వైద్యులు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించడంతో అందరూ పరీక్షల కోసం ల్యాబ్లకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్లు జ్వర పీడితులతో కిక్కిరిసి పోయాయి. వేల రూపాయలు రక్త పరీక్షల కోసం ధార పోస్తున్నారు. వ్యాధుల లక్షణాలు శ్వాసకోశ వ్యాధులైన బ్రాంకైటీస్, బ్రాంకోన్యూమోనియాతో ఎక్కువ మంది చిన్నారులు బాధపడుతున్నారు. జలుబు, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం ఈ వ్యాధుల లక్షణాలు. వ్యాధి ముదిరితే శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చికెన్పాక్స్ వ్యాధికి గురైతే జ్వరం వస్తుంది. ఒళ్లంతా దద్దుర్లుతో కూడిన పొక్కులు వస్తాయి. విపరీతమైన దురద జలుబు కూడా ఉంటుంది. మలేరియా వ్యాధి బారిన పడిన వారికి జ్వరం కొంత సేపు ఉండి తగ్గిపోవడం, మళ్లీ రావడం జరుగుతుంది. రాత్రి సమయాల్లో చలి, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలిచిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ♦ పిల్లలను ఎక్కువగా చలిలో తిరగకుండా చూడాలి. ♦ ఫ్రిజ్ నీరు కాకుండా గోరువెచ్చని నీటిని తాగించాలి. ♦ చల్లని పదార్థాలు, శీతల పానియాల జోలికి వెళ్లకుండా చూడాలి. ♦ దోమలు కుట్టకుండా దోమతెరలు, ఇతర నివారణ సాధనాలు వాడాలి. ♦ కలుషిత నీరు తాగకుండా చూసుకోవాలి. జ్వరం కేసులుఎక్కువగా వస్తున్నాయి కొన్ని రోజుల నుంచి చిన్న పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నాయి. చాలా మందిలో తట్టు కూడా ఉంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో చిన్న పిల్లల్లో ఈ తరహా వ్యాధులు ప్రబలుతున్నాయి. పిల్లల్లో జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. పిల్లల ఆరోగ్యంపై అశ్రద్ధ చేయవద్దు.– డేవిడ్ సెల్వన్రాజ్, చిన్న పిల్లల వైద్యుడు, ఆర్ఎంఓ, జిల్లా ఆస్పత్రి, ప్రొద్దుటూరు -
ప్లేట్లెట్స్ ఎవరికి, ఎప్పుడు ఎక్కించాలి?
ఈమధ్య ఎవరికైనా జ్వరం వస్తే వైరల్ ఫీవరని హాస్పిటల్లో అడ్మిట్ చేసి, ప్లేట్లెట్స్ ఎక్కించేస్తున్నారు. అసలిది ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానం ప్రజల్లో ఉంటోంది. అసలు ప్లేట్లెట్స్ ఎవరికి ఎక్కించాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కించాలి? వివరంగా చెప్పండి. శరీరంలో ప్లేట్లెట్లు ఏమాత్రం తగ్గినా వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది సరికాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం ప్లేట్లెట్ల సంఖ్య పదివేల కంటే తగ్గితేగానీ వాటిని ఎక్కించకూడదు. ఒకవేళ పదివేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. శరీరానికి సహజంగానే తగ్గిపోయిన ప్లేట్లెట్స్ను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. సరైన వ్యాధి నిర్ధారణ అవసరం శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య ఎందుకు తగ్గుతుందనే అంశంపై సరైన వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స సులువవుతుంది. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య చాలా వేగంగా పడిపోతూ ఉంటుంది. వీరికి డెంగ్యూ చికిత్సతో పాటు అవసరాన్ని బట్టి ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతే వారం పదిరోజుల్లో ఆ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మలేరియా కారణంగా ప్లేట్లెట్లు పడిపోతే మలేరియాకే చికిత్స అందించాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్లెట్లు పడిపోతూ ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, ఆ మందులు మానేయాల్సి ఉంటుంది. ముందు ప్లేట్లెట్లు పడిపోవడానికి సరైన కారణం తెలుసుకుని చికిత్స చేయించుకోవాలి. అందుబాటులో అత్యాధునిక చికిత్సా విధానాలు శరీరంలో ఏ కారణంతో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా ఇప్పుడు మెరుగైన వైద్యం అందించగలుగుతున్నారు. గతంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే రోగులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఇప్పుడు అత్యాధునిక విధానాల్లో చికిత్స అందిస్తుండటం వల్ల చాలామందిని ప్రాణాపాయం నుంచి రక్షించగలుగుతున్నారు. రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గితే దాత నుంచి లేదా సేకరించిన రక్తం నుంచి కేవలం ప్లేట్లెట్లను మాత్రమే వేరుచేసి ఎక్కించే అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ (ఎస్డీపీ), రాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ (ఆర్డీపీ) అనే రెండు పద్ధతులలో రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసి, అవసరమైన వారికి ఎక్కిస్తున్నారు. ఎస్డీపీ విధానంలో దానుంచి నేరుగా ప్లేట్లెట్లను సేకరిస్తారు. ఆర్డీపీ విధానంలో సేకరించిన రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరుచేస్తారు. అయితే ఎస్డీపీ విధానంలో ఒకసారికి 50 వేల నుంచి 60 వేల వరకు ప్లేట్లెట్లను సేకరించే అవకాశం ఉంటుంది. -
ప్లేట్లెట్స్ అంటే ఏమిటి? ఎందుకు తగ్గుతాయి?
మా అబ్బాయి వయసు తొమ్మిదేళ్లు. ఈమధ్య వైరల్ ఫీవర్తో చాలా ఇబ్బంది పడ్డాడు. ప్లేట్లెట్స్ తగ్గాయన్నారు. హైదరాబాద్ తీసుకుపోయి ప్లేట్లెట్స్ ఎక్కించి వైద్యం చేసిన నాలుగైదు రోజులకు ఆరోగ్యం మెరుగుపడింది. అసలీ ప్లేట్లెట్స్ అంటే ఏమిటి? అవెందుకు తగ్గుతాయి? ప్లేట్లెట్స్ తగ్గినట్లు ఎలా తెలుస్తుంది? దయచేసి వివరంగా తెలియజేయండి. రక్తకణాల్లో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అని ప్రధానంగా మూడు రకాల కణాలు ఉంటాయి. ఈ మూడూ ఎముక మజ్జ (బోన్మారో) నుంచి ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ, శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి. ఎర్రరక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. ఇక మిగిలినవి ప్లేట్లెట్స్. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి అవి తోడ్పడతాయి. ఇవి ప్రతి వ్యక్తిలోనూ ఒకే విధంగా ఉండాలని లేదు. సాధారణంగా ఒక వ్యక్తిలో ఇవి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. పైగా ఇవి ఒక్కోరోజు ఒక్కోలా ఉండవచ్చు. ప్లేట్లెట్ కణం జీవిత కాలం ఏడు నుంచి పదిరోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోతాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్లెట్స్ మళ్లీ రక్తంలో చేరతాయి. ప్లేట్లెట్స్ విధుల్లో ముఖ్యమైనది రక్తస్రావాన్ని నివారించడం. శరీరానికి గాయమైనపుపడు కాసేపు రక్తం స్రవిస్తుంది. ఆ తర్వాత దానంతట అదే ఆగిపోతుంది. ఈ ప్రక్రియ వెనక రక్తనాళం, ప్లేట్లెట్లు, రక్తం గడ్డకట్టే వ్యవస్థల పాత్ర చాలా కీలకమైనది. ఇలా రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలే ప్లేట్లెట్స్. శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ తదితర కారణాల వల్ల శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. దాంతోపాటు కొంతమందిలో ప్లేట్లెట్ల ఉత్పత్తి తక్కువగా ఉండటానికి కారణం వారిలో పుట్టుకతో ఉండే లోపాలే. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు రక్తం పలుచబడటానికి వాడే మందుల వల్ల కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య, నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంది. శరీరంలో ప్లేట్లెట్స్ మరీ తక్కువగా ఉన్నప్పుడు ఏ గాయమూ లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్లెట్లు తమ విధిని సక్రమంగా నిర్వర్తించలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ, ప్లేట్లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చు. ప్లేట్లెట్ల సంఖ్య సాధారణంగానే ఉన్నా అవి నాణ్యంగా లేకపోతే రక్తస్రావం ఆగదు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే కనిపించే లక్షణాలు సాధారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పదివేలకు తగ్గేవరకు ఏలాంటి లక్షణాలూ కనిపించవు. ఒకవేళ అంతకన్నా తగ్గితే మాత్రం శరీరంలోని వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుర్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్తస్రావం కావచ్చు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిన ప్రతిఒక్కరిలోనూ అనారోగ్య లక్షణాలు కనిపించాలని లేదు. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించవు. ముఖ్యంగా డెంగ్యూ ఉన్నప్పుడు తీవ్ర జ్వరం ఉంటుంది. వ్యాధి లక్షణాలన్నీ ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటాయి. అలాంటప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య ఎంత ఉందో పరీక్షించి, వైద్యపరంగా తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటారు. -
మంచం పట్టిన జుమ్మలదిన్నె
కర్నూలు, కోసిగి: మండల పరిధిలోని జుమ్మలదిన్నె గ్రామం మంచం పట్టింది. డెంగీ, టైఫాయిడ్, మలేరియా తదితర జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వ వైద్యులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతి ఇంటిలో నలుగురైదుగురు జ్వరాల బారిన పడి ఆదోని, కోసిగి, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇప్పటికే 50 మందికి పైగా వైద్యపరీక్షలు చేయించుకోగా డెంగీగా ప్రైవేట్ డాక్టర్లు చెప్పినట్లు బాధితులు పేర్కొంటున్నారు. గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి చరణ్ తేజ్ డెంగీ లక్షణాలతో బాధపడుతూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరో కుటుంబంలోని ఐదుగురు కూడా జిల్లా కేంద్రలోనే చికిత్స పొందుతున్నారు. రెండేళ్ల చిన్నారి ఉష కూడా ఇటీవల కర్నూలులో చికిత్స చేయించుకుంది. హోసన్న, పూర్ణిమ, దేవరాజు, లోకేష్, ఈరమ్మ, నాగమ్మతో పాటు పలువురు జుమ్మలదిన్నె, కోసిగి, ఎమ్మిగనూరులోని ప్రైవేట్ డాక్టర్ల వద్ద చికిత్స చేయించుకున్నారు. గురువారం రాత్రి ఓ బాలిక తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై కుప్పకూలి పడిపోయింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సలు చేయించాలని పలువురు కోరుతున్నారు. -
కొండరెడ్డి గిరిజన విద్యార్థిని మృతి
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల ప్రాంతమైన రెడ్డికోపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న పాములేటి సీతమ్మ (10) అనే కొండరెడ్డి గిరిజన విద్యార్థిని గురువారం వైద్యం పొందుతూ విజయవాడలో మృతి చెందింది. గత నెల 30న జ్వరంతో బాధపడుతున్న సీతమ్మను పులిరామన్నగూడెం ఆస్పత్రిలో చేర్పించినట్టు డాక్టర్ సురేష్ తెలిపారు. అయితే ఆ సమయంలో రక్తపరీక్షలు చేయగా మలేరియా జ్వరంగా నమోదైందని చెప్పారు. మూడు రోజులపాటు మెరుగైన వైద్యం అందించామన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 1వ తేదీ రాత్రి సీతమ్మకు వాంతులు కావడంతోపాటు కాళ్లు, చేతులు బిగుసుకుపోవడంతో పాఠశాల సిబ్బంది మళ్లీ పీహెచ్సీకి తీసుకువచ్చారన్నారు. ప్రాథమిక వైద్యం చేసి జంగారెడ్డిగూడెం రిఫర్ చేశామని అక్కడి నుంచి ఏలూరు, విజయవాడకు తరలించగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్టు డాక్టర్ సురేష్ చెప్పారు. పాఠశాలలో రెండో మరణం రెడ్డికోపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. గతంలో కెచ్చెల పద్మ అనే విద్యార్థిని మృతి చెందగా ఇప్పుడు సీతమ్మ కన్నుమూసింది. అనా రోగ్యంతో ఉన్న సీతమ్మను పులిరామన్నగూడెం ఆస్పత్రిలో చేర్పించినప్పుడు మలేరియా కేస్గా నమోదైంది. అయితే విజయవాడలో వచ్చిన రిపోర్ట్లో మాత్రం క్లబిసెలా బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల మృతి చెందినట్టు ఉంది. అయితే ఎక్కడా మలేరియా ప్రస్తావన లేకపోవడం గమనార్హం. చదువుకోవడానికి వచ్చి మృత్యుఒడికి.. పశ్చిమ ఏజెన్సీలో మారుమూల చిలకలూరు గ్రామానికి చెందిన పాములేటి సీతమ్మ చదువు కోసం రెడ్డికోపల్లి గురుకుల పాఠశాలలో చేరింది. గతనెలలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లి పాఠశాల పునఃప్రారంభం తర్వాత వచ్చిన సీతమ్మ జ్వరం బారినపడింది. పది రోజులపాటు వైద్యం పొందినా ప్రయోజనం లేకపోయింది. ఐటీడీఏ పీఓ ఎంఎన్ హరేంధిరప్రసాద్ సీతమ్మను బతి కించేందుకు సుమారు రూ.2 లక్షల వరకూ ఖర్చు చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. అయినా సీతమ్మ మృత్యు ఒడికి చేరింది. మృతురాలు సీతమ్మ తల్లి రామమ్మ ఐదేళ్ల క్రితం జ్వరంతోనే మృతిచెందింది. తండ్రి చిన్నారెడ్డి అడవే ఆధారంగా జీవించే సాధారణ కూలీ. సీతమ్మకు అక్క, తమ్ముడు ఉన్నారు. -
మందపల్లి.. మంచం పట్టింది
తూర్పుగోదావరి, మందపల్లి (కొత్తపేట): మండలంలోని మందపల్లి గ్రామంలో అనేక కుటుంబాల్లోని 80 మంది సీజనల్ వ్యాధులు, విషజ్వరాలతో మంచం పట్టారు. ఈ గ్రామంలో సుమారు నెలా 15 రోజుల నుంచే జ్వరాలు ప్రారంభమయ్యాయి. 20 రోజులుగా వాటి తీవ్రత పెరిగింది. గ్రామంలో ప్రతి వీధిలోనూ అనేక ఇళ్లలో జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. కొన్ని ఇళ్లల్లో ఒకరి తరువాత ఒకరికి జ్వరాలు రాగా.. మరికొన్ని ఇళ్లల్లో ఒకటి, రెండు రోజుల తేడాలో అందరూ ఒకేసారి మంచం పట్టారు. అనేక మందికి ప్లేట్లెట్స్ (రక్తకణాలు) తగ్గిపోవడంతో పలువురు, జ్వరాలు, నొప్పులతో మరికొందరు రాజమహేంద్రవరం, అమలాపురం ఆస్పత్రుల్లో చేరారు. మరికొందరు కొత్తపేట, రావులపాలెం ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. స్థానిక ఆర్ఎంపీలపై ఆధారపడిన కొందరు ఇళ్ల వద్దే ఫ్లూయిడ్స్ (సెలైన్స్) ఎక్కించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో బాధితులు ఎక్కువ మండలంలో మందపల్లి అతి చిన్న గ్రామం. కేవలం 675 సెంట్లు విస్తీర్ణం ఉన్న ఈ గ్రామంలో 1,470 మంది జనాభా. 350 గృహాలు కాగా 405 కుటుంబాలు ఉన్నాయి. ఎక్కువగా శనేశ్వర ఆలయం వెనుక కాలనీల్లో, జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో జ్వరాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. గ్రామస్తుడు రావూరి సూర్యచంద్రరావు ఇంటికి వెళ్లగా ఇంటి వరండాలో ఆయన జ్వరంతో బాధపడుతూ సెలైన్ బ్యాడిల్ ఎక్కించుకుంటున్నారు. ఆస్పత్రి ఖర్చుభరించలేకపోవడంతో అతడికి కుటుంబ సభ్యులు సఫర్యలు చేస్తున్నారు. అతను 10 రోజుల క్రితం జ్వరం వస్తే స్థానిక ఆర్ఎంపీతో వైద్యం చేయించుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో కొత్తపేటలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా రక్తపరీక్షలు చేసి ప్లేట్లెట్స్ 50 వేలకు పడిపోయాయంటూ సెలైన్స్, ఇంజక్షన్లు చేశారు. ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఇంటికి వచ్చి ఆర్ఎంపీతో వైద్యం చేయించుకుంటున్నాడు. ఆ ఇంట్లోనే అతని తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మద్దిరాల భూలక్ష్మి అనే మహిళ ప్లేట్లెట్స్ 15 వేలకు, కుమారుడు లోకేష్కు 30 వేలకు పడిపోగా రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొంది ఇంటికి వచ్చారు. రావూరి వీరేంద్ర, కుంపట్ల నేతికొండ, నక్కా కనకారావు, అతని భార్య జ్వరాలు, జాయింట్ పెయిన్స్తో బాధ పడుతున్నారు. కుంపట్ల కోటేశ్వరరావు, బొండాడ సత్తిబాబు తదితరులు జ్వరాలతో ఉన్నారు. వీరందరూ రెక్కాడితే గాని డొక్కాడని వారే. గ్రామ మాజీ ఉప సర్పంచి గందం తాతాజీకి ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. విషజ్వరాలు ప్రాణాంతకమని పలువురు వైద్యులు హెచ్చరించడంతో అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకుంటున్నామని పలువురు వాపోయారు. ఒక్కక్కరికీ సుమారు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అయినట్టు పలువురు తెలిపారు. పట్టించుకోని వైద్యాధికారులు గ్రామంలో జ్వరాల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదని గ్రామంలో పలువురు ఆరోపించారు. గ్రామంలోని ఏఎన్ఎం రాజమహేంద్రవరంలో ఉంటారని, 2వ ఏఎన్ఎం గంటిలో ఉంటారని.. ఆమె అప్పుడప్పుడూ వస్తారని వారు తెలిపారు. పంచాయతీ అధికారులు కూడా ఈ పరిస్థితిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. పంచాయతీ కార్యాలయం వద్దే పారిశుద్ధ్యం క్షీణించింది. ‘స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ – స్వచ్ఛ గ్రామం’నినాదాల బోర్డులు ఉన్న చోటే పెంటకుప్పలు ఉన్నాయి. మందపల్లి గ్రామంతోపాటు కొత్తపేట శివారు గ్రామం ఏనుగులమహల్లో కూడా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు విషజ్వరాలతో బాధపడుతున్నారు. -
యూపీలో హై అలర్ట్.. 84 మంది మృతి
లక్నో : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఫలితంగా యూపీలోని 6 జిల్లాలో ఇప్పటికే 84 మంది మరణించారు. దాంతో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా బరేలి జిల్లాలో అత్యధికంగా 24 మంది మృతి చెందగా, సమీప బుదౌన్ జిల్లాలో 23 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధిలో ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయి. అందువల్ల పూర్తి స్థాయిలో వ్యాధి నివారణ జరగకపోవడంతో ఇప్పటికే 84 మంది మరణించారు. ఈ విషయం గురించి యూపీ వైద్య శాఖ మంత్రి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలయడం లేదు. వ్యాధి బారిన పడిన వారిలో మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫివర్ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వ్యాధి నివారణ కోసం తగు చర్యలు తీసుకుంటుంది. ఈ వ్యాధి ముఖ్యంగా రాజధాని చుట్టుపక్కల జిల్లాలైన బరేలీ, బుదౌన్, హరోయి, సీతాపూర్, బహ్రైచ్, షాజహాన్పూర్ జిల్లాలో వ్యాపించింది. ఇది ఇలా కొనసాగితే రాజధానిలో కూడా పాకే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యాధి నివారణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడమే కాక అవసరమైన మందులు సరఫరా చేస్తున్నాం. దోమల నివారణ కోసం ఫాగింగ్ కూడా జరుపుతున్నాం’ అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సమయంలో ప్రజలను కోరేది ఒక్కటే.. మీ కుటుంబ సభ్యుల్లో కానీ, బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా జబ్బు పడితే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లండి. మీడియా వారు కూడా సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. అనవసరమైన పుకార్లను, వదంతులను ప్రచారం చేయవద్దని అభ్యర్ధిస్తున్నాను. త్వరలోనే వ్యాధి తీవ్రత తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాన’ని తెలిపారు. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
వీడని వైరల్ ఫీవర్
కాండ్రేగుల గ్రామాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. రెండోదఫాగా వచ్చిన ఈ జ్వరాలతో గ్రామంలో 40 మంది సతమతమవుతున్నారు. గ్రామంలో మరో డెంగీ కేసు నమోదయింది. తూర్పుగోదావరి, కాండ్రేగుల (పెదపూడి): గ్రామాన్ని వైరల్ జ్వరాలు వీడకపోవడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు డెంగీ జ్వరాలు కూడా భయపెడుతున్నాయి. గ్రామానికి చెందిన పలువురు డెంగీ జ్వరాలకు చికిత్స పొందుతూ అప్పులపాలవుతున్నారు. గ్రామానికి చెందిన అప్పనపల్లి వీరేష్ అనే యువకుడు డెంగీ జ్వరంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతనికి ప్లేట్లెట్స్ 15వేలుకు పడిపోగా వైద్యం చేయడంతో సుమారు 25వేలుకు చేరినట్టు వైద్యులు బుధవారం తెలిపారు. గ్రామంలో వారం రోజుల వ్యవధిలో సుమారు 40 మంది వరకు వైరల్ జ్వరాల బారినపడ్డారు. గ్రామంలో గత నెల 14న రెండు డెంగీ కేసులు నమోదు అయ్యాయి. వారికి వైద్యం అందించగా వారి ఆరోగ్యం బాగుపడింది. గ్రామంలో వైరల్ జ్వరాలు వ్యాపించి తగ్గి మరల విజృంభించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో జ్వరాలు సోకిన చాలామంది కాకినాడ పరిసర ప్రాంతాలకు వెళ్లి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. వారిలో చాల మందికి ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉండటంతో డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నాయంటూ అత్యవసర వైద్యాలు చేయించుకుంటున్నారు. దీనికి చాలా ఖర్చవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ జ్వరాలు సోకిన వారిలో చాల మంది పేదలే. సంపర ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ జ్వరాలు మాత్రం తగ్గడం లేదు. డెంగీ జ్వరాలతో 25 రోజులుగా తాము అల్లాడుతుంటే పూర్తి స్థాయిలో ఎందుకు నివారించలేకపోయారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ ్య నిర్వహణ సరిగా లేదని, గ్రామంలో పందులు పెంపకాన్ని అధికారులు పట్టించుకోవడంలేదంటూ విమర్శిస్తున్నారు. ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకుని వచ్చినవారు పేపకాయల సూర్యనారాయణ, నర్ల సూరిబాబు, చిక్కాల ప్రసాద్, చిక్కాల వెంకన్న,పేపకాయల రాము, కొటిపల్లి ఉషారాణి ఇద్దరి కుమార్తెలు రమ్య,పండు కాకినాడలోని ఒక ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి రక్త పరీక్షలు చేయించుకున్నారు. వారి ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయాయంటూ వైద్యం చేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ.40 వేల నుంచి రూ. 50 వేలు ఖర్చు అయిందని బాధితులు చెబుతున్నారు. పేపకాయల గంగాధర్ ఇంట్లో అతని కుమారుడు అజయ్, కుమార్తె భాను, భార్యకు కూడా ఈ జ్వరాలు వ్యాపించాయి. వారు కూడా వైద్యం చేయించున్నారు. ఆస్పత్రిలో చేరిన వారు పేపకాయల వీరమణి రెండ్రోజుల క్రితం ఆస్పత్రిలో చేరింది. పేపకాయల సాయిమణి అనే చిన్నారి, నక్కా శేష అనే మహిళ బుధవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లారు. కాగా యడ్ల చంద్రశేఖర్,పేపకాయల చంద్రరావు, గోపిశెట్టి వినయ్ తదితరులు ఇళ్ల వద్దనే వైద్యం చేయించు కుంటున్నారు. రెండ్రోజులుగా ఆస్పత్రిలో చికిత్స మా బంధువు పేపకాయల వీరమణి కాళ్లు చేతులు లాగడం,నీరసం, జ్వరంతో బా ధపడుతోంది. ఆమెను కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తే రక్త పరీక్షలు చేశారు. ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని వైద్యులు చెప్పారు. ఆమె అక్కడ వైద్యం చేయించుకుంటోంది.–పేపకాయల చక్రవాణి, కాండ్రేగుల -
గుంటూరుకు జర్రమొచ్చింది!
జ్వరాలతో జిల్లా మంచం పట్టింది. ఎక్కువ మంది రోగులు డెంగీ, మలేరియా బారిన పడ్డారు. ముఖ్యంగా గుంటూరు నగర వాసులు జ్వరాలతో సతమతమవుతున్నారు. ఈ ఏడాది మార్చిలో అతిసారతో అల్లాడిన నగర ప్రజలు నేడు డెంగీ, మలేరియాతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో నమోదైన జ్వరం కేసుల్లో సగం గుంటూరులోనే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. గుంటూరు మెడికల్: జిల్లా ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలు డెంగీ, మలేరియాతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది మార్చిలో అతిసార వ్యాధితో అల్లాడిపోయిన నగర ప్రజలు నేడు డెంగీ, మలేరియా జ్వరాలతో మంచంపట్టారు. రాష్ట్రంలో ఏ నగరంలోనూ లేని విధంగా సుమారు రెండువేలకు పైగా డయేరియా కేసులు నమోదవడంతో పాటుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులు సరఫరా చేసిన తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడం, నీటిలో ఈ కోలి బ్యాక్టీరియా ఉండటం వల్లే అతిసార వ్యాధి ప్రబలిందని నిర్ధారణ చేశారు. తాజాగా జిల్లాలో నమోదవుతున్న మలేరియా, డెంగీ కేసుల్లో అధికశాతం గుంటూరు నగరంలోనే నమోదుకావడంపై వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలను వ్యాప్తి చేసే దోమలు వృద్ధి చెందడానికి నగరంలో అనుకూల వాతావరణం ఉంది. అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ చెత్తకుప్పలతో నిండిపోయాయి. మురుగు నీరు రోజుల తరబడి ఇళ్ల మధ్య తిష్టవేసింది. దీంతో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తిచేస్తున్నాయి. జ్వరాల కేసుల వివరాలు గుంటూరు జిల్లాలో 2015 సంవత్సరంలో దోమకాటు వల్ల వచ్చే మలేరియా కేసులు 413 నమోదయ్యాయి. గుంటూరు నగరంలోనే 271 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2016లో జిల్లా వ్యాప్తంగా 369 మలేరియా కేసులు నమోదవగా 263 కేవలం గుంటూరు నగరంలోనే కావడం గమనార్హం. 20 17లో జిల్లా వ్యాప్తంగా నమోదైన 962 మలేరియా కేసుల్లో 667 గుంటూరువే. 2018లో ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 279 మలేరియా కేసులు నమోదయ్యాయి. 172 గుంటూరు నగరంలోనే నమోదుకావడం గమనార్హం. మలేరియా జ్వరా నికి జిల్లా మొత్తానికి గుంటూరు నగరం చిరునామాగా మారడంపై విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా జిల్లా మలేరి యా అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న పలు వురు వైద్య సిబ్బంది, అధికారులు సైతం మలేరియా వ్యాధిన బారిన పడ్డారంటే నగరంలో మలేరియా వ్యాప్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డెంగీ కేసులదీ అదే తీరు జిల్లాలో 2016లో 349 డెంగీ కేసులు నమోదయ్యాయి. వాటిలో 65 కేసులు గుంటూరు నగరంలో నమోదయ్యాయి. 2017లో జిల్లా వ్యాప్తంగా 686 డెంగీ కేసులు నమోదు నగరంలో 180 కేసులు నమోదయ్యాయి. 2018లో ఆగస్టు 31వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 87 డెంగీ కేసులు నమోదవగా వాటిలో 42 కేసులు గుంటూరువే. ఈ పరిస్థితిపై ప్రజలతోపాటు వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలు నమోదవుతున్న ప్రాంతాలు ఇవీ.. నగరంలో సా«ధారణంగా స్లమ్ ఏరియాలు, నగర శివారున ఉండే మురికివాడల్లో ఎక్కువగా జ్వరా లు నమోదవడం సహజం. అయితే క్లాస్, కమర్షియల్ ఏరియాగా పేరు పొందిన అరండల్పేట, బ్రాడీపేటలో సైతం మలేరియా, డెంగీ కేసులు నమోదవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నల్ల చెరువు, శారదాకాలనీ, కేవీపీ కాలనీ, ఏటి అగ్రహా రం, స్వర్ణభారతి నగర్, మంగళదాస్నగర్, పాతగుంటూరు, డీఎస్నగర్, ఆనంద్పేట, బాలా జీనగర్, లాలాపేట తదితర ప్రాంతాల్లో కేసులు నమో దు అవుతున్నాయి. కార్పొరేషన్ వైద్యాధికా రులు, జిల్లా వైద్యాధికారులు సమన్వయం చేసుకుని ఎన్జీఓల సహకారంతో ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించి, వాటి బారిన పడకుండా చేయాల్సి ఉంది. లేకుంటే నేడు కొన్ని ప్రాంతాలకే పరి మిత జ్వరాలు నగరం అంతా వ్యాపించే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి గుంటూరు నగరంలో జ్వరాల కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కార్పొరేషన్ సిబ్బంది సహకా రంతో దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కేసులు నమోదయిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఆయా ప్రాంతాల్లో సిబ్బందికి అదనంగా విధులు కేటాయించాలని ఆదేశించాం. ఇంటింటికి సర్వే చేసి వ్యాధులు సోకకుండా అవగాహన కల్పించి కరపత్రాలను అందజేస్తున్నాం. ప్రజలు సహకారం లేకుండా దోమల నియంత్రణ సాధ్యం కాదు. ప్రజలు ఇంటి ముందు కాల్వలో, రోడ్లపై మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దోమతెరలు వాడటం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్తే అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తారు.– డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
మురపాకలో విషజ్వరంతో బాలుడి మృతి
లావేరు : మండలంలోని మురపాక గ్రామానికి చెందిన మెండ జశ్వంత్(5) విషజ్వరంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కుమారుడి మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ బాలుడికి నాలుగు రోజుల క్రితం జర్వం రావడంతో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మందులిచ్చారు. వాటిని వాడుతున్నా నయం కాకపోగా, తీవ్రమైన అనారోగ్య సమస్య రావడంతో మరలా తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే బాలుడి తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రక్తంతో కూడిన వాంతులయ్యాయి. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలోనే బాలుడి ఎల్కేజీ చదువుతున్నాడు. తండ్రి ఎం శ్రీనివాసరావు ఎచ్చెర్ల మండలంలోని అరిణాం అక్కివలస వద్ద శ్యాంపిస్టన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఎన్వీ రమణ, తోటి కార్మికులు పరామర్శించారు. -
మంచమెక్కిన మన్యం
రాజవొమ్మంగి (రంపచోడవరం): తూర్పు మన్యం రాజవొమ్మంగిని మాతాశిశు మరణాలు పట్టి పీడిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు మాతా, మరో ఆరు శిశు మరణాలు సంభవించాయి. ఒక్క మే నెలలోనే ఓ నిండు గర్భిణి, మరో ముగ్గురు నవజాత శిశువులు మరణించారు. రక్తహీనత కారణంగా 8వ నెల గర్భిణి మృతశిశువుకు జన్మనీయడం గిరిజన ప్రాంతంలో తల్లిబిడ్డల ఆరోగ్య పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది. గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్లను రాజవొమ్మంగి లేదా జడ్డంగి 24 గంటల తల్లీబిడ్డల ఆస్పత్రికి తీసుకువస్తుంటే.. అక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు, అధునాతన వైద్య పరికరాలు, మందులు లేకపోవడంతో వారికి సకాలంలో వైద్యం అందడం లేదు. రాజవొమ్మంగి ఆస్పత్రిలోని వైద్యులు కాకినాడ జీజీహెచ్కు రిఫర్ చేస్తున్నారు. కాకినాడకు వారిని చేర్చేలోపుగా ప్రాణాలు విడుస్తున్నారు. లేదా చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన్యంలో వైద్య సేవలు ఏరీతిలో ఉన్నాయనేది ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మాతాశిశు మరణాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజనులు కోరుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని స్థానిక గిరిజన ప్రతినిధులు అంటున్నారు. ♦ ముర్లవానిపాలేనికి చెందిన పప్పుల లోవకుమారికి పుట్టిన 3 నెలల మగశిశువు మే 3వ తేదీన ఊపిరి అందక కాకినాడ జీజీహెచ్లో మరణించింది. ♦ మే 21వ తేదీన అప్పలరాజుపేట గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి చిన్ని ప్రేమజ్యోతి రాజవొమ్మంగి పీహెచ్సీలో తీవ్రమైన రక్తస్రావంతో మృత శిశువుకు జన్మనిచ్చింది. తీవ్ర రక్తహీనతతో బాధపడుతోన్న ఆమెను మే 9న పీహెచ్సీలో నిర్వహించిన జననీ సురక్ష యోజన వైద్య శిబిరంలో పరీక్షించారు. ఆమె కడుపులో బిడ్డకు ఎదుగుదల లేదని, వెంటనే పట్టణ ప్రాంతానికి వెళ్లి స్కానింగ్ చేయించుకోవాలని వైద్య నిపుణులు చెప్పారు. అయితే ఆమె కుటుంబానికి ఆర్థిక స్తోమత లేక స్కానింగ్ చేయించుకోలేదు. దీంతో కడుపులోనే బిడ్డ మరణించగా రెండు రోజుల తరువాత ఆమె మృత శిశువుకు జన్మనిచ్చింది. ♦ మే 28వ తేదీన మద్దికొండ సుగుణ అత్తవారి ఇల్లు వై.రామవరం మండలం చవిటిదిబ్బల నుంచి పుట్టిల్లు రాజవొమ్మంగి మండలం వాతంగి వచ్చింది. ఇంతలో ఆమె చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైతే జడ్డంగి 24 గంటల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడు వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో కింది స్థాయి వైద్య సిబ్బంది కాకినాడకు రిఫర్ చేసింది. అతడు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ♦ మే 29వ తేదీనే మండలంలోని జి.కొత్తపల్లికి చెందిన నిండు గర్భిణి నందపు వెంకటలక్ష్మి కాకినాడలో చికిత్స పొందుతూ మరణించింది. అత్తిల్లు రంపచోడవరం సబ్ప్లాన్ ఏరియా బవురువాక గ్రామం నుంచి పుట్టిల్లు జి.కొత్తపల్లికి పురిటి కోసం వచ్చింది. పురిటినొప్పులతో గుర్రపు వాతం (ఫిట్స్) రావడంతో ఆమెను కుటుంబీకులు వెంటనే కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. -
‘గురుకులం’లో వైరల్ ఫీవర్
నిజాంసాగర్(జుక్కల్): ఇంటర్ విద్యార్థిని కృప మరణం మరవకముందే పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు వైరల్ ఫీవర్తో అస్వస్థతకు గురయ్యారు. వారం నుంచి పలువురికి జ్వరాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం గురుకుల పాఠశాలకు చెందిన 8 మందికి ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో పీహెచ్సీలో వైద్య చికిత్సలు చేయించారు. వీరిలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న జ్యోతి అనే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మిగతావారికి ఏఎన్ఎం సవిత ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నారు. గురుకులంలో తరుచూ విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నా, పాఠశాల నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తనిఖీలతో వెలుగులోకి.. పెద్దకొడప్గల్లోని బాలికల గురుకులాన్ని గురువారం గ్రామ సర్పంచ్ మౌనికసాయిరెడ్డి, తహసీల్దార్ గణేశ్ తనిఖీలు చేశారు. పాఠశాలలోని డార్మెట్ రూమ్ల్లోని మంచాలపై విద్యార్థినులు పడుకొని ఉండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారం నుంచి జ్వరాలు వస్తున్నాయని విద్యార్థినులు చెప్పడంతో వారు అవాక్కయారు. వెంటనే పీహెచ్సీ వైద్యుడు శ్రీనివాస్ గుప్తను గురుకులానికి రప్పించారు. వైరల్ ఫీవర్తో బాధతున్న విద్యార్థినులకు పరీక్షలు చేయించారు. ఎనిమిది మంది విద్యార్థులను ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం సర్పంచ్, తహసీల్దార్ గురుకులంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినుల డార్మెట్ రూమ్ల్లో దోమల బెడదతోపాటు నీటిసదుపాయం లేక విద్యార్థినులు తరచూ అస్వస్థతకు గురువుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. విద్యార్థినులకు అందిస్తున్న పండ్లు కుళ్లడంతో సిబ్బందిపై తహసీల్దార్ మండిపడ్డారు. ఆయన ఈ విషయాన్ని బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ దృష్టికి తీసుకు వెళ్లి ఇక్కడి పరిస్థితులను వివరించారు. -
దేవుడా.. మాపై ఎందుకు కక్ష!
వికారాబాద్/ యాలాల(తాండూరు): దేవుడా మాపై ఎందుకు కక్ష గట్టావ్.. నాలుగేళ్ల క్రితం నా భర్తను, చిన్న కూతురును తీసుకెళ్లావ్.. ఇప్పుడు పెద్ద కుమార్తెను మృత్యుఒడికి చేర్చుకున్నావ్.. ఇంకా నేనెవరి కోసం బతకాలి.. ఎందుకు బతకాలి దేవుడా..’ అంటూ ఆ మాతృమూర్తి గుండెలవిసేలా రోదించిన తీరు హృదయవిదారకం. ఈ సంఘటన మండల పరిధిలోని ముద్దాయిపేటలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్, బాలమణి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం శ్రీనివాస్ అనారోగ్యంతో మృతిచెందడంతో బాలమణి వ్యవసాయ పనులు చేసుకుంటూ కూతుళ్లను పోషించుకుంటుంది. ఆమె పెద్ద కూతురు మమత(14) స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అయితే, పదిహేను రోజుల క్రితం మమతకు జ్వరం వచ్చింది. దీంతో బాలమణి కూతురును తాండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించింది. అయినా ఫలితం లేకపోగా జ్వరం తీవ్రత మరింత పెరిగింది. బాలికను వారంరోజుల క్రితం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా కోమాలో ఉన్న మమత ఆదివారం రాత్రి మృతి చెందింది. తీవ్రమైన జ్వరం రావడంతో గుండెకు రక్తప్రసరణ జరగకపోవడంతో చనిపోయిందని వైద్యులు తెలిపారు. సోమవారం మమత మృతి విషయం తెలుసుకున్న ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అయితే, తన కూతురుకు డెంగీ సోకి ఉండొచ్చని మృతురాలి తల్లి అనుమానం వ్యక్తం చేశారు. బాలిక మృతి విషయం తెలుసుకున్న పీహెచ్సీ వైద్యురాలు అశ్విని, సీహెచ్ఓ కిషన్ రాథోడ్ ముద్దాయిపేటకు వెళ్లి వివరాలు సేకరించారు. అయితే, బాలమణి కూతుళ్లలో నాలుగేళ్ల క్రితం చిన్న కూతురు శిరీష అతిసార సోకి చనిపోయింది. రెండో కూతురైన పోచమ్మ పుట్టుకతో అంధురాలు. సర్పంచ్ బిచ్చన్నగౌడ్, పాఠశాల హెచ్ఎం శివకుమార్, ఎస్ఎంసీ చైర్మన్ మహ్మద్ ఫరీద్ బాలమణి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. -
విష జ్వరంతో మహిళ మృతి
కళ్యాణదుర్గం(నుసికొట్టాల తండా): మండల పరిధిలోని నుసికొట్టాల తండాకు చెందిన నీలమ్మ (35) విషజ్వరంతో బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నీలమ్మకు జ్వరం రావడంతో సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాసుత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా అక్కడి వైద్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రి రెఫర్ చేశారు. దీంతో భర్త వెంకటేశ్ నాయక్ ఆమెను అనంతపురం తీసుకురాగా, అక్కఽ చికిత్స పొందుతూ ఆస్పపత్రిలో మృతి చెందింది. మెరుగైన వైద్యం అందకే తన భార్య చనిపోయిందని మృతురాలి భర్త వెంకటేశ్ నాయక్ వాపోయారు. గ్రామంలో మరికొంతమంది జ్వర పీడితులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
కదిలిన వైద్య సిబ్బంది
– గ్రామాల్లో వైద్య శిబిరాలు ఎమ్మిగనూరు రూరల్ : మండలంలో ప్రబలిన విష జ్వరాలపై మంగళవారం ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించారు. ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరి, ఎర్రకోట, కందనాతి, మసీదపురం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలు అందించారు. శిబిరాల్లో మాత్రలతోపాటు సూదులు కూడా వేశారు. వెంకటగిరి గ్రామాన్ని ఎంపీపీ వాల్మీకి శంకరయ్య సందర్శించి వైద్య శిబిరానికి వెళ్లి రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులకు సూచించారు. మసీదు పురంలో హాలహర్వి పీహెచ్సీ డాక్టర్ అఖిలేష్ రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఎర్రకోటలో దైవందిన్నె పీహెచ్సీ డాక్టర్ దుర్గాబాయి పరీక్షలు నిర్వహించి, సూదులు, మందులు వేశారు. ఈ గ్రామాల్లో మందును స్ర్పే చేయించి, బ్లీచింగ్ పౌడర్ను చల్లించారు. -
కరీంనగర్లో విజృంభించిన విష జ్వరాలు
-
విషజ్వరంతో బాలుడి మృతి
తాడిపత్రి రూరల్: తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో లక్ష్మీదేవి, తిరుపాలు దంపతులకు చెందిన ఓబులేసు(4) విష జ్వరంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలతిపారు. మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కుమారుడిని తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా కోలుకోలేక మృతి చెందినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు విషజ్వరంతో మృతి చెందడంతో వారు తల్లడిల్లిపోయారు. వారిని ఓదార్చాడం ఎవరివల్లా కాలేదు. -
విషజ్వరంతో బాలుడి మృతి
గూడూరు: విషజ్వరంతో గూడూరు పడమర బీసీ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు కిరణ్కుమార్ మృతి చెందాడు. తల్లిదండ్రులు మంగలి రాజశేఖర్, కాలేశ్వరీ తెలిపిన వివరాలు మేరకు.. ఈ నెల 5న బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో స్థానిక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. డెంగీ లక్షణాలు కనిపించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కోలుకోలేక బుధవారం ఉదయం ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక వైద్యాధికారి నారాయణ, వైద్య సిబ్బంది పడమర బీసీ కాలనీలో పర్యటించి బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకున్నారు. విషజ్వరంతో బాలుడు మృతి చెందినట్లు విలేకరులకు వైద్యాధికారి తెలిపారు. -
విషజ్వరంతో విద్యార్థిని మృతి
గాలివీడు(వైఎస్సార్జిల్లా): విషజ్వరంతో విద్యార్థిని మృతిచెందిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గాలివీడు మండలం నూలివీడులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోక్షిత(13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా విషజ్వరంతో బాధపడుతోంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందినట్టు సమాచారం. -
డాక్టర్లు కావలెను..
ఏజెన్సీలో వైద్య సేవలు అంతంతే.. జిల్లాలో 21 పోస్టులు ఖాళీ విజృంభిస్తున్న విషజ్వరాలు భద్రాద్రి నుంచి తరలిపోయిన మలేరియా అధికారి పోస్టు సాక్షి, కొత్తగూడెం : నిరంతరం సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్న భద్రాద్రి జిల్లాను ప్రభుత్వ వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పూర్తి గిరిజన జిల్లాగా ఉన్న భద్రాద్రిలోని పలు ప్రాంతాల్లో డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతున్న పరిస్థితుల్లో నిరంతరం వైద్య సేవలు అందించేందుకు అదనపు బృందాలను నియమించాలి. కానీ ఇక్కడ మంజూరైన పోస్టుల్లోనే అనేకం ఖాళీగా ఉన్న దుస్థితి నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఉప ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆయా ప్రాంతాలకు వైద్యాధికారుల పోస్టులను మంజూరు చేసింది. అయితే జిల్లాలో వైద్యాధికారులుగా నియమితులైన వారిలో 27 మంది ఉన్నత విద్యనభ్యసించడానికి మూడు సంవత్సరాలు ఇన్ సర్వీస్ విద్యార్థులుగా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లడంతో వైద్యసేవలు కుంటుపడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం 28 మంది డాక్టర్లకు ఇన్ సర్వీస్లో పీజీ వైద్య విద్య అభ్యసించడానికి అవకాశం రాగా, అందులో 27 మంది భద్రాద్రి జిల్లాలో నియమితులైన వారే కావడం గమనార్హం. ఒకరు మాత్రమే ఖమ్మం జిల్లాలో నియమితులైన వారున్నారు. దీంతో జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నా, సీజనల్ వ్యాధులతో మన్యం మంచం పట్టినా, కనీస వైద్యసేవలు అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. నాలుగు పీహెచ్సీల్లో డాక్టర్లే లేరు.. గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలకు అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో రెండు వైద్యాధికారుల పోస్టులు మంజూరైనా అందులో ఒక వైద్యాధికారితోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ప్రాంతంలో ఇద్దరు వైద్యాధికారులు ఉంటే.. అసలు వైద్యాధికారులు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డిప్యుటేషన్ ప్రాతిపదికన నియమించారు. ఇన్ని చేసినా.. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న ఈ తరుణంలో జిల్లాలోని పూర్తి గిరిజన ప్రాంతాలైన జానంపేట, కరకగూడెం, ములకలపల్లి మండలం మంగపేట, చండ్రుగొండ మండలం ఎర్రగుంట పీహెచ్సీలకు డాక్టర్లు లేని దుస్థితి నెలకొంది. వీటితోపాటు మరికొందరు వైద్యాధికారులు తమ సొంత ప్రాంతమైన ఆంధ్రాకు బదిలీపై వెళ్లాల్సి ఉండటంతో మరికొన్ని పోస్టులు ఖాళీ కానున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు వైద్యాధికారులను ప్రభుత్వం ఇప్పటికే బదిలీ చేసింది. తెలంగాణలో మలేరియా వ్యాధికి చిరునామాగా ఉన్న భద్రాద్రి జిల్లాలో ఈ సంవత్సరం మలేరియా కేసులు తక్కువగా నమోదయ్యాయనే కారణంతో సంవత్సరాల తరబడి భద్రాచలం కేంద్రంగా ఉన్న జిల్లా మలేరియా అధికారి పోస్టును ఈ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు బదలాయించారు. దీంతో జిల్లాలో మలేరియా నివారణ చర్యలు కుంటుపడే ప్రమాదం ఏర్పడింది. మలేరియా వ్యాధి ప్రాథమిక దశనుంచి పూర్తిగా తగ్గేంతవరకు దశలవారీగా చికిత్స చేయాల్సి ఉండటం, ప్రత్యేక పర్యవేక్షణ అవసరమైన నేపథ్యంలో జిల్లాలో ఉన్న మలేరియా అధికారి పోస్టును తీసివేయడం వైద్యవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 సీహెచ్సీలు, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచల్లో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో 65 డాక్టర్ల పోస్టులు జిల్లాకు మంజూరుకాగా, ఇందులో 21 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో గిరిజనులకు సత్వరం వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారాయి. వీటితోపాటు పలుచోట్ల ల్యాబ్టెక్నీషియన్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. వైద్యుల కొరత నిజమే.. జిల్లాలో వైద్యాధికారుల కొరత ఉన్నమాట వాస్తవమే. దీన్ని అధిగమించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో వైద్యాధికారులు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నాం. జిల్లాలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యుల కొరత ఉన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. కాంట్రాక్టు డాక్టర్లతో వైద్యుల కొరత ఉన్న ప్రాంతంలో వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం, -వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి -
ప్రాక్టీస్... ప్రాక్టీస్...
జోరుగాధోని సాధన రెండో వన్డేకూ సురేశ్ రైనా దూరం న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో రెండో వన్డేకు రెండు రోజుల ముందు మంగళవారం భారత ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ మాత్రమే. దాంతో కోహ్లి, రహానే, రోహిత్ తదితర ఆటగాళ్లంతా సాధనకు దూరంగా విశ్రాంతి తీసుకున్నారు. అయితే కెప్టెన్ ధోని మాత్రం తన బ్యాటింగ్కు మరింత పదును పెట్టే పనిలో పడ్డాడు. జూనియర్లతో కలిసి సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. ముందుగా పేసర్ ధావల్ కులకర్ణిని ఎదుర్కొన్న అతను, ఆ తర్వాత కోచ్లు కుంబ్లే, బంగర్ విసిరిన త్రో డౌన్సలను పదే పదే పుల్ షాట్లు ఆడాడు. మరో వైపు కొత్త బౌలర్ జయంత్ యాదవ్ బౌలింగ్లో కూడా ప్రాక్టీస్ చేసిన ధోని అతనికి ఈ సందర్భంగా పలు సూచనలిచ్చాడు. ఫీల్డింగ్ స్థానాలను బట్టి ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు. జ్వరం కారణంగా తొలి వన్డేకు దూరమైన సురేశ్ రైనా జట్టుతో కలిశాడు. కొద్దిసేపు ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే జ్వరం పూర్తిగా తగ్గకపోవడంతో ఈ మ్యాచ్లోనూ అతను ఆడటం లేదని జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. నెట్స్లో జాదవ్ కూడా తీవ్రంగా సాధన చేశాడు. బ్యాటిం గ్తో పాటు చాలా సేపు ధోని, రైనాలకు బౌలింగ్ చేశాడు. -
విషజ్వరంతో విద్యార్థిని మృతి
గాంధీనగరం (శిరివెళ్ల ): విషజ్వరంతో మండలంలోని గాంధీనగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి వట్టికట్టి శ్రీలక్ష్మి (16) బుధవారం మృతిచెందింది. ఈ నెల 27వ తేదీన సైన్స్ పరీక్ష రాయాల్సిన ఈ విద్యార్థిని..జ్వరం అధికం కావడంతో వైద్యం కోసం ఆళ్లగడ్డకు చికిత్స చేయించుకుంది. బుధవారం జ్వరం మరింత అధికం కావడంతో హుటాహుటిన యర్రగుంట్లలోని ఓ ప్రై వేట్ క్లినిక్కు తరలించగా అక్కడ పరిస్థితి విషమించింది. మెరుగైన lవైద్యం కోసం నంద్యాల ఆస్పత్రికి తరలిస్తుడంగా మార్గమధ్యలో దీబగుంట్ల వద్ద మృతి చెందింది. విషయం తెల్సుకున్న ప్రధానోపాధ్యాయుడు సుబ్రమణ్యం, టీచర్లు గ్రామానికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించారు. జ్వరం కారణంగా ఈ విద్యార్థిని శ్రీకాళహస్తీలో జరగనున్న రాష్ట్రస్థాయి త్వైక్వాండో పోటీలకు హాజరు కాలేకపోయిందని ఉపాధ్యాయులు తెలిపారు. -
8నెలల్లో 35 మంది మృత్యువాత
-
ఎంపీ సీతారాంనాయక్కు వైరల్ ఫీవర్
వరంగల్ : మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నా.. ఆదివారం రాత్రి జ్వరం మరింత పెరగడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోని మాక్స్కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో పరీక్షించిన వైద్యులు ఆయనకు వైరల్ ఫీవర్ సోకిందని నిర్ధారించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం ఆస్పత్రిలో ఎంపీని పరామర్శించారు. ఇంకా గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు కూడా సీతారాంనాయక్ను పరామర్శించారు. -
విషజ్వరంతో చిన్నారి మృతి
కందుకూరు: విషజ్వరంతో ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మాన్యగూడలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గోదాసు తానయ్య, సరితల పెద్ద కుమారుడు అఖిల్(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు.వారం రోజులుగా ఆ చిన్నారి జ్వరం సోకడంతో పాటు విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నాడు. వారి తల్లిదండ్రులు కూలినాలీ చేసుకుని పూట గడుపుకునే వారు కావడంతో స్థానికంగానే ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. -
విషజ్వరంలో బాలింత మృతి
విషజ్వరంతో ఐదు రోజుల బాలింత మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం విన్నరపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. రామలక్ష్మి(22) అనే వివాహిత ఐదు రోజుల క్రితం ప్రసవించింది. యితే విషజ్వరం కారణంగా మంగళవారం ఉదయం మృతిచెందింది. -
మెడ నుంచి భుజంలోకి నొప్పిపాకుతోంది... తగ్గేదెలా?
మెడ నుంచి భుజంలోకి నొప్పిపాకుతోంది... తగ్గేదెలా? నా వయసు 29 ఏళ్లు. నేను చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండు వారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని డాక్టర్ చెప్పారు. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం సూచించండి. - నిఖిల్, బెంగళూరు మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ ఒకే భంగిమల్లో కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొని పనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే ఆర్థోపెడిక్ సర్జన్ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు. ............ నా వయసు 29 ఏళ్లు. నా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిపాటి ఒత్తిడితో వంచినప్పుడు క్లిక్మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. దయచేసి నాకు పరిష్కారం చెప్పండి. - నర్సింహ, కరీంనగర్ మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. రిస్ట్ అనేది ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి. నా కుడి ముంజేయి రెండేళ్ల క్రితం విరిగింది (ఫ్రాక్చర్ అయ్యింది). అప్పుడు శస్త్రచికిత్స చేసి మెటల్ ప్లేట్లు వేసి. స్క్రూలు బిగించి సరిచేశారు. ఇప్పుడు మళ్లీ ఇంకో సర్జరీ చేసి లోపల బిగించి ఉన్నవాటిని తొలగించాలని విన్నాను. ఇలా మరో శస్త్రచికిత్స చేయడం తప్పదా? - రవికుమార్, నల్లగొండ మీలాంటి ఫ్రాక్చర్ కేసులలో లోపల అమర్చి ఉన్న లోహపు ప్లేట్లు, స్క్రూలను అలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అవి మరికొన్ని ఇతరత్రా సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించడమే మేలు. ఇది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియే. చాలా వృద్ధులలో మాత్రమే శస్త్రచికిత్స వల్ల ఇతరత్రా ఏవైనా దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉందేమో అన్న సమయంలోనే వాటిని వదిలేస్తాం. ఇక యువకులలో సైతం చేతుల విషయంలోని పైభాగపు ఎముకల విషయంలో తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటే తప్ప... కొన్నిసార్లు అలాగే వదిలేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. మీరు ముంజేయి అంటున్నారు కాబట్టి లోపల అమర్చిన ఇంప్లాంట్ను తొలగించడమే మంచిది. అలా తొలగించకపోతే వాస్తవ ఎముక మరింత బలహీనమైపోయి, తేలిగ్గా విరిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్లేటును తొలగిస్తారనే శస్త్రచికిత్స విషయంలో ఆందోళన చెందకండి. ధైర్యంగా ముందుకు వెళ్లండి. డాక్టర్ కె.సుధీర్ రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్ మార్క్ హాస్పటల్స్ హైదరాబాద్ .................... మా అబ్బాయి వయసు 17 ఏళ్లు. ఇంటర్ చదువుతున్నాడు. చదువుతో పాటు ఆటల్లోనూ చాలా చురుకు. అయితే ఈ మధ్య వాడు తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ చాలా నీరసపడ్డాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆటలాడటం వల్ల కాస్త వీక్ అయ్యాడు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని కొన్ని మందులు రాసిచ్చారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. దాంతో స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాం. ఆయన రక్తపరీక్షలు చేసి ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయాయని డెంగ్యూ లేదా వైరల్ ఫీవర్గా అనుమానించి మందులిచ్చారు. అయినప్పటికీ మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - చంద్రకళ, ఆదిలాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీ అబ్బాయి విషయం కాస్త ఆందోళనగానే ఉన్నట్లు అనిపిస్తోంది. శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య చాలా కారణాలవల్ల తగ్గుతుంది. అయితే సరైన వ్యాధి నిర్ధారణ ద్వారా ఏ కారణంతో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిందో తెలుసుకుని చికిత్స అందించాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్ల సంఖ్య అంతకంతకూ స్పీడ్గా పడిపోతుంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీ అబ్బాయి విషయానికి వస్తే... వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఫీవర్లతో కూడా జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందునా మీ అబ్బాయి ఆటల్లో చురుకుగా వ్యవహరిస్తుంటాడని చెబుతున్నారు కాబట్టి ఈ సమస్యకు లోనైనట్లుగా చెప్పవచ్చు. అయితే మీరు ఇప్పటికీ వైరల్, డెంగ్యూ లాంటి వ్యాధులకు సంబంధించిన మందులు వాడామని, అయినప్పటికీ ఎలాంటి మార్పూ కనిపించలేదని చెబుతున్నారు. కాబట్టి మీరు వెంటనే అన్ని వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి వెళ్లి నిపుణులైన ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ స్పెషలిస్ట్)ని కలవండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఎందుకంటే క్యాన్సర్ లక్షణాలున్న వారిలో కూడా ఈ తరహా ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. వీరికి ప్లేట్లెట్స్ ఎక్కించినప్పటికీ ఏమాత్రమూ ప్రయోజనం ఉండదు. వారిలో ప్లేట్లెట్స్ సంఖ్య ఎప్పటికప్పుడు గణనీయంగా పడిపోతూ ఉంటుంది. దాంతో వారు మరింత నీరసపడిపోతారు. ట్రీట్మెంట్కి కూడా వారి శరీరం సహకరించలేని పరిస్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ అబ్బాయికి పరీక్షలో క్యాన్సర్ అని నిర్ధారణ జరిగినప్పటికీ మీరు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. అది ఏ స్టేజ్లో ఉన్నా మంచి వైద్యచికిత్స ఇప్పుడు అందుబాటులో ఉంది. సమూలంగా క్యాన్సర్ను రూపుమాపవచ్చు. అయితే ఇక్కడ సమయం కీలకం. త్వరగా ఆ మహమ్మారిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే మీ అబ్బాయి మునుపటిలాగే చలాకీగా అవుతాడు. ముందులాగే ఆటపాటల్లో, చదువులో చురుగ్గా అవుతాడు. ముందుగా మీరు నిపుణులైన వైద్యులను సంప్రదించి, మీ అబ్బాయి విషయంలో అసలు సమస్య ఏమిటో తెలుసుకొని, దానికి అనుగుణంగా చికిత్స అందించేలా చూసుకోండి. డాక్టర్ నిఖిల్ గడ్యాల్ పటేల్ సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ యశోదా హాస్పటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ -
పారిశుద్ధ్య లోపం వల్లే విషజ్వరాలు
కోదాడ కాలనీని సందర్శించిన డీఎంహెచ్ఓ తొండంగి : కోదాడ పంచాయతీలోని కోదాడ కాలనీలో పారిశుద్ధ్య లోపం వల్లే విషజ్వరాలు ప్రబలినట్టు డీఎంహెచ్ఓ చంద్రయ్య పేర్కొన్నారు. విషజ్వరాలపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన ఆదివారం కోదాడ కాలనీలో పర్యటించి, రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్య, ఆరోగ్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. పరిశుభ్రతపై ప్రజలు దృష్టి సారించాలని అవగాహన కల్పించారు. రామాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పలువురు గర్భిణులకు, బాలింతలకు వైద్యపరీక్షలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, దీనివల్ల విషజ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, వైద్యశిబిరం కొనసాగించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వైద్యాధికారులు, సిబ్బందిని నియమిస్తాం జిల్లావ్యాప్తంగా 119 పీహెచ్సీలు ఉండగా, కొత్తగా మరో 9 మంజూరయ్యాయని డీఎంహెచ్ఓ తెలిపారు. వీటిలో వైద్యులు, ఇతర సిబ్బందిని త్వరలో నియమించనున్నట్టు వెల్లడించారు. తూరంగి, రాజపూడి, తేటగుంట, చేబ్రోలు, నాగాయలంక, పేరూరు, అడివి, వెల్ల, ఎస్.యానాంల్లో పీహెచ్సీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్రీ్టయ బాల ఆరోగ్య స్వాస్థ కార్యక్రమంలో భాగంగా 52 ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్టు వివరించారు. -
మంచం పట్టిన తండాలు
జ్వరాలతో వణికిపోతున్న జనాలు సుభాష్తండా, బిల్లా తండాల్లో 25 మందికి అస్వస్థత అందని వైద్య సేవలు.. ఆందోళనలో జనం రామాయంపేట: విష జ్వరాలతో గిరిజన తండాల వాసులు వణికిపోతున్నారు. ఏ ఇంట్లో చూసినా జ్వరంతో బాధపడుతున్నవారే కన్పిస్తున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. మండలంలోని దంతేపల్లి పంచాయతీ పరిధిలోని సుభాష్తండా, బిల్లా తండాలు మంచం పట్టాయి. ఈ రెండు తండాల్లో సమారు 25 మంది జ్వరంతో బాధపడుతున్నారు. ప్రభుత్వ వైద్యసేవలు అందక పోవడంతో వారు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దోమల దాడితో గిరిజనులు రోగాల బారిన పడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా జ్వరంతో వణికిపోతున్నారు. రెండో ఏఎన్ఎంలు సమ్మెలో ఉండడంతో వైద్య సేవలందక గిరిజనులు తల్లడిల్లిపోతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో జ్వరం వచ్చినా గడప దాటడం లేదు. తమ ఇంటిల్లిపాదికీ జ్వరం వచ్చిందని.. ఇంటికి తాళంవేసి ఆసుపత్రికి వెళ్లినట్టు సుభాష్ తండాకు చెందిన హరి, దేవీసింగ్ తెలిపారు. రెండు తండాల్లో జ్వరాలు సోకడంతో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం ఈ తండాల్లో పారిశుద్ధ్యం లోపించింది. పెంట కుప్పలు ఇళ్లకు సమీపంలో ఉన్నాయి. నీటి గుంతలు ఉన్నాయి. దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో వీధులన్నీ కంపు కొడుతున్నాయి. వెంటనే తమ తండాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని గిరిజనులు కోరుతున్నారు. పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఢాక్యాతండాలో విషజ్వరాలు
70 మందికి అస్వస్థత.. ఏడు రోజులుగా అవస్థలు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికుల వినతి పాపన్నపేట: మారుమూల గిరిజన తండా విషజ్వరాలతో వణుకుతోంది. సుమారు 70 మంది గిరిజనులు పిల్లా..పెద్ద అన్న తేడా లేకుండా జ్వరాల బారిన పడి మంచం పట్టారు. సర్కారు దవాఖానకు వెళ్లి సూది మందు తీసుకున్నా నయం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. పాపన్నపేట మండలం అర్కెల పంచాయతీ పరిధిలోని ఢాక్యాతండాలో వారం రోజులుగా విషజ్వరాలు ప్రబలాయి. చలి జ్వరం, నీరసం, కీళ్ళనొప్పులు కొంతమంది వాంతులతో బాధపడుతున్నట్లు గిరిజనులు తెలిపారు. ఒక్కో ఇంట్లో ఇంటిళ్ళిపాది జ్వరంతో బాధపడుతున్నారు. చేతనైన వారు పాపన్నపేట పీహెచ్సీకి వెళ్తుండగా..మరికొంత మంది ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకుంటున్నా జ్వరం తగ్గడం లేదంటున్నారు.పీహెచ్సీ సిబ్బంది తండాకు వచ్చి సూది మందులు ఇస్తున్నా నయం కావడం లేదని వాపోతున్నారు. తండాకు చెందిన అన్షి,లక్ష్మి,మోత్య ,పూల్య, సుమిత్ర, గుగులోత్ లక్ష్మి,రాణి, పీక్లి ,ప్రియాంక, విఠల్, శోభ, తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు.వెంటనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి తమకు వైద్యసేవలు అందించాలని కోరుతున్నారు.తల్లి దండ్రులకు జ్వరాలు రావడంతో పిల్లలు సైతం బడికి రావడం లేదు.బుధవారం ఒక్క రోజే 35 మంది విద్యార్థులు బడికి రాలేదని హెచ్ఎం నర్సింహరెడ్డి తెలిపారు. కొనసాగుతున్న వైద్యశిబిరం కౌడిపల్లి: మండలంలోని రాందాస్గూడలో వైద్యశిబిరం కొనసాగుతోంది. బుధవారం మూడో రోజు స్థానిక ఎంపీహెచ్ఈఓ సురేందర్, సూపర్వైజర్ మార్త వైద్యశిబిరం కొనసాగించారు. రోగులకు మందులు ఇచ్చి పంపుతున్నారు. గ్రామంలో విషజ్వరాలు తగ్గుతున్నాయిని జలుబు, కీళ్లనొప్పులతో ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ వర్ల సత్తమ్మ పాల్గొన్నారు. -
వైద్యుల కోసం రాస్తారోకో
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులు ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలేదని నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు రొడ్డెక్కాయి. స్థానికంగా వైద్య సదుపాయం లేకపోవడంతో పాటు.. విషజ్వరాలు విజృంభిస్తున్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. అదిలాబాద్ జిల్లా వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండటంతో.. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వాంకిడి బస్టాండ్ సమీపంలో.. రాస్తారోకో నిర్వహించడంతో.. హైదరాబాద్-నాగ్పూర్ రహదారి పై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. -
విష జ్వరంతో ఒకరి మృతి
కాళేశ్వరం: విషజ్వరంతో మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన కూలీ బద్ది స్వామి(45) మృతి చెందాడు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న స్వామి స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నాడు. అయిన తగ్గకపోవడంతో శుక్రవారం రాత్రి మహదేవపూర్ ఆస్పత్రిలో చేరాడు. శనివారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. స్వామికిS భార్య మల్లక్క ఉంది. -
జనాలకు జర మొస్తోంది..!
గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం ప్రబలుతున్న వ్యాధులు వ్యాధుల బారినపడుతున్న ప్రజలు చెన్నూర్ : వర్షం వచ్చింది రైతుల్లో సంతోషం తెచ్చింది. గ్రామ స్థాయి అధికారులు, పాలకులు స్పహతో ఉండి ఉంటే జనాలూ సంతోషం ఉండేవారు. కానీ పారి‘శుద్ధి’పై చిత్తశుద్ధి లోపించడంతో జనాలకు జరమొస్తోంది. దీంతో గ్రామీణులు దావఖానాల పాలవుతున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు జ్వరాల, డయోరియా బారినపడి ఆస్పత్రులపాలయ్యారు. అధికారులు చెత్తపై చిత్తశుద్ధితో సమరం చేస్తే జనాలు వ్యాధుల బారిన పడరనేది వైద్యుల మాట... గ్రామాలు స్వచ్ఛగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఆమలు చేస్తున్నాయి. స్వచ్ఛ భారత్ లక్ష్యం మంచిదే అయినప్పటికీ ఆచరణకు నోచుకోకపోవడంతో నేడు గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ లోపించి ప్రజలు రోగాలపాలవుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలి మంచాన పడుతున్నారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని ప్రజలు జ్వరాలు, డయోరియా సోకి ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. జ్వరం.. భయం... చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని ప్రజలు జ్వరాలు, డయోరియా వ్యాధులు ప్రబలి మంచం పడతున్నారు. రోజు రోజుకూ జ్వరాలు, డయోరియా రోగులు పెరుగుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారితో చెన్నూర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి నిండిపోతోంది. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, చెన్నూర్ పట్టణంలోని మహాంకాళివాడ, కోటబొగుడ, బొక్కలగూడెం, బేతాళవాడలతో పాటు కోటపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులు, జనాలు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. లోపించిన పారిశుధ్యం చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్, ఇందిరానగర్ , బేతాళవాడ, చెన్నూర్ మండలంలోని కత్తరశాల, సుద్దాల, కిష్టంపేట, సుద్దాల, అంగ్రాజుపల్లి, అస్నాద్, దుగ్నెపల్లి, కొమ్మెర, కోటపల్లి మండలంలోని పారుపల్లి, ఎడగట్ట, ఎసాన్వాయి, ఎధుల్లబంధం, జనగామా, పిన్నారం, మల్లంపేట, పంగిడిసోమారం, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ లోపించింది. ఈ ప్రాంతాల్లో మురికి కాలువల వ్యవస్థ లేక పోవడంతో వర్షపు నీరు ఎక్కడ పడితే అక్కడే నిలిచి పోవడంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు అప్రమత్తమై పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే జనాలు ఆస్పత్రులపాలు కాక తప్పదు. -
తడ్కపల్లికి జ్వరం
మంచం పట్టిన పల్లె.. వణికిస్తున్న విషజ్వరాలు ఆస్పత్రుల చుట్టూ జనం.. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం సిద్దిపేట రూరల్: వర్షాకాలం.. ఆపై పారిశుద్ధ్యం లోపించడంతో గ్రామీణ ప్రజలను వైరల్ ఫీవర్ వేధిస్తోంది. మురుగు కాల్వలు పొంగి పారుతుండటం.. చెత్తాచెదారం పేరుకుపోతుండటంతో దోమలు వృద్ధి చెంది జర్వాలు తీవ్రమవుతున్నాయి. సమాచారం ఉన్నా అధికారులు, పాలకవర్గం చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట మండలంలోని తడ్కపల్లి గ్రామంలో నాలుగైదు రోజులుగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామానికి చెందిన కవిత, బాలయ్య, గొడుగు సత్తవ్వ, బండ్ల ఎల్లయ్య, బిడిలా లలిత, గడ్డం కనకవ్వ, ఎర్రోని ఎల్లయ్యతో పాటు పలువురు విషజ్వరాల బారినపడ్డారు. వీరంతా కొద్ది రోజులుగా గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద వైద్యం పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారు మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట ఆస్పత్రులకు వెళ్తున్నారు. విషజ్వరాలు ప్రబలడానికి పారిశుద్ధ్య లోపమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పడకేసిన పారిశుద్ధ్యం పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో గ్రామంలోని వీధులు, మోరీలు చెత్తతో నిండిపోయాయి. దీంతో దోమలు వృద్ధి చెంది జ్వరాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. చర్యలు చేపడుతున్నాం తడ్కపల్లిలో విషజ్వరాలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. మా సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురికి జ్వరాలు, మరికొందరికి వాంతులు, విరేచనాలు ఉన్నట్లు తెలిసింది. అవన్నీ సీజన్వ్యాధులే. మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్తి పరిశీలన తర్వాతే వివరాలు వెల్లడిస్తాం. – శివానందం, క్లస్టర్ వైధ్యాధికారి సిద్దిపేట -
వైరల్ ఫీవర్తో ఇద్దరి మృతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో వైరల్ ఫీవర్ ఓ విద్యార్ధితో పాటు వృద్ధురాలి ప్రాణాలు బలిగొంది. సంతకవిటి మండలంలో దుర్గారావు(15), నూకమ్మలు గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. మోదుగులపేటకు చెందిన దుర్గారావు స్ధానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ప్రాణాలొదిలారు. వైరల్ ఫీవర్తో జరుగుతున్న వరుస మరణాలతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో వివాహిత మృతి
పాల్వంచ రూరల్(ఖమ్మం): విషజ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన వివాహితకు ఆస్పత్రిలో సరైన వైద్యం అందించకపోవడంతో.. ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆమె మృతికి ఆస్పత్రి వర్గాలే బాధ్యత వహించాలని కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ రూరల్ మండలం మామిడిగూడెంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సురేష్(25), అనూష(22) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అనూష అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. చికిత్స నిమిత్తం ఉల్వనూరులోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. నర్సులే ఆమెకు వైద్యం అందించారు. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమించడంతో.. కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. దీంతో అనూష మృతికి ఉల్వనూరు ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని ఆందోళ నకు దిగారు. -
విషజ్వరంతో చిన్నారి మృతి
రాజుపాలెం (వైఎస్సార్ జిల్లా) : విషజ్వరం బారిన పడిన ఓ బాలుడు మృతిచెందాడు. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఏకువపల్లె గ్రామానికి చెందిన షరీఫ్, చాందినీ దంపతుల రెండో కుమారుడు మహ్మద్ రఫీ(11 నెలలు) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే స్థానికంగా చికిత్స చేయించినా ఫలితం కనిపించకపోవటంతో శనివారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి 108లో తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో రాజుపాలెం వద్ద చిన్నారి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. -
విషజ్వరంతో వివాహిత మృతి
బోయినపల్లి(కరీంనగర్): విష జ్వరంతో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గుడిపద్మ(43) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. కొద్ది రోజుల కిందట కుమారుడికి విష జ్వరం రావడంతో.. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించింది. బాబుకు నయం కాగా.. అదే సమయంలో ఆమెకు జ్వరం వచ్చింది.. దీంతో ఆమె కూడా అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. -
‘వైరల్’పై వైద్యశాఖ అప్రమత్తం
- ఇంటింటికీ వైద్యబృందం - జిల్లాలో డెంగీ మరణాల్లేవు - ఆర్బీఎస్కే ద్వారా 0 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలకు వైద్య సేవలు అందిస్తాం - జిల్లా వైద్యశాఖాధికారి బాలాజీ పవార్ సిద్దిపేట జోన్ : జిల్లాలో ఇటీవల వైరల్ జ్వరాలతో (అంటువ్యాధులు) ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా వైద్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) బాలాజీ పవార్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఎన్జీఓ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తూప్రాన్లో మృతి చెందిన స్వాతిది డెంగీ మరణం కాదన్నారు. వైద్య రికార్డుల ప్రకారం తీవ్రజ్వరంతో బాధపడుతున్న ఆమెకు కామెర్లు సోకాయన్నారు. హైదరాబాద్లోని ఐబీఎం నివేదికలో డెంగీ ఉన్నట్లు నిర్ధారణ నివేదిక వస్తేనే అధికారికంగా గుర్తించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని క్లస్టర్ల వారీగా సమీక్ష చేస్తున్నామన్నారు. గురువారం జోగిపేట, నర్సాపూర్, మెదక్, సిద్దిపేటలో సమీక్షలు నిర్వహించామన్నారు. శుక్రవారం జహీరాబాద్లో సమీక్ష చేపడతామన్నారు. సిబ్బందికి విషజ్వరాలపై పూర్తిస్థాయి అవగాహన ఉందన్నారు. ఇంటింటి సర్వేచేపట్టి దోమల లార్వా దశలను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నామన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, సూపర్వైజర్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లతో కూడిన బృందం తప్పనిసరిగా ప్రతి ఇంటిని సందర్శించాల్సిందేనన్నారు. బృందానికి 34 రకాల మందులు, పరికరాలతో కూడిన అపెడమిక్ కిట్ను అందజేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫాగింగ్ మిషన్లను అందుబాటులో ఉంచామన్నారు. త్వరలో జిల్లాలో ‘ఆరోగ్య సంరక్షణ’ 0 నుంచి 18 ఏళ్ల పిల్లల ఆరోగ్య సంరక్షణ పథకం (కేంద్ర ప్రభుత్వ పథకం) త్వరలో జిల్లాలో ప్రారంభం కానుందన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థిక్ కార్యక్రమం (ఆర్బీఎస్కే) ద్వారా పిల్లలకు వైద్యపరమై సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఇందుకు 13 మొబైల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఈ టీంలో కంటి, చిన్నపిల్లల, జనరల్తో పాటు ఇతర విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 ఏఎన్ఎం పోస్టులకు 4000 దరఖాస్తులు, 20 ఫార్మాసిస్టు పోస్టులకు 2800 దరఖాస్తులు, 40 మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు 200 దరఖాస్తులు వచ్చాయని ఈ నెల 31 లోగా ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. మెరిట్ ప్రకారం ఎంపిక జరుగుతుందన్నారు. అంతకుముందు క్లస్టర్ పరిధిలో డీఎంహెచ్ఓ బాలాజీ పవార్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి నాగయ్య, క్లస్టర్ ఇన్చార్జి డాక్టర్ శివానందం,హైరిస్క్ ఇన్చార్జి డాక్టర్ కాశీనాథ్తో పాటు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తూప్రాన్లో వైద్య శిబిరం తూప్రాన్ : తూప్రాన్ రజక కాలనీలో ‘డెంగీ’ జ్వరం బాలికను బలిగొన్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. గురువారం పట్టణంలోని రజక కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గజ్వేల్ ఎస్పీహెచ్ఓ రామకృష్ణ నేతృత్వంలో తూప్రాన్ వైద్యులు డాక్టర్ సాధన, కృష్ణ ప్రియలు శిబిరంలో పాల్గొని రోగులకు పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. మంచం పట్టిన ‘మునిగేపల్లి’ కల్హేర్ : కల్హేర్ మండలం మునిగేపల్లి విష జ్వరాలతో మంచం పట్టింది. గ్రామానికి చెందిన ముగ్గురికి డెంగీ సోకింది. మరో 20 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. పది రోజులుగా ఇక్కడ జ్వరాలు ప్రబలుతున్నాయని గురువారం గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మచ్కూరి అల్లమయ్య, కె. భాస్కర్, నాగురి దుర్గయ్యకు డెంగీ సోకినట్టు వైద్యులు నిర్థారించారు. వీరు ముగ్గురూ ఇటీవలే హైదరాబాద్లోని యశోద, ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో భాస్కర్ చికిత్సానంతరం ఇంటికి చేరగా, మరో ఇద్దరు ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా, మరో 20 మంది విషజ్వరాలతో నారాయణఖేడ్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. -
కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు : ఇద్దరు మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు ప్రబలాయి. దీంతో ఇద్దరు యువకులు మంగళవారం మృతి చెందారు. జిల్లాలోని మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని ఇంటర్ విద్యార్థి సిద్దార్థ విష జ్వరం బారిన పడ్డాడు. దాంతో అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. అయితే అతడు మంగళవారం మరణించాడు. అలాగే మంథనిలో కూడా మరో యువకుడు రవి విష జ్వరంతో బాధపడుతూ... స్థానికంగా చికిత్స పొందుతున్నాడు. ఆ క్రమంలో అతడు కూడా మంగళవారం కన్నుమూశాడు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. -
విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతి
వీరఘట్టం (శ్రీకాకుళం జిల్లా): విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని ఎం.పుణ్యవతి మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రమపురం గ్రామానికి చెందిన ఎం.పుణ్యవతి ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు అప్పారావు, రమణమ్మ కూలిపనులుచేసి జీవనం గడుపుతున్నారు. గతనెల 24వ తేదీన వీరందరూ గోదావరి పుష్కరాలకు వెళ్లివచ్చారు. అప్పటి నుంచి పుణ్యవతి జ్వరంతో బాధపడుతోంది. ప్రైవేట్ వైద్యుల వద్ద చూపించినా ప్రయోజనం లేకపోవడంతో ఈనెల 4వ తేదీన శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మలేరియా జ్వరం విషమించిందని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కు తీసుకెళ్లాలని సూచించారు. దాంతో గురువారం కేజీహెచ్కు తీసుకెళుతుండగా మార్గంమధ్యలోనే పుణ్యవతి మృతిచెందింది. -
కొత్తమాజేరులో చెరువును పరిశీలించిన వైఎస్ జగన్
కొత్తమాజేరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో కలుషితంగా మారిన మంచినీటి చెరువును పరిశీలించారు. కాగా విష జ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. గ్రామస్తులు కలుషిత నీరు తాగి విషజ్వరాల బారిన పడినా సకాలంలో స్పందించని అధికారుల తీరుపైనా వివరాలను ఆయన అడిగి తెలుసుకుంటారు. అంతకు ముందు వైఎస్ జగన్...శ్రీకాకుళం గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
వల్లూరుపాలెంలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం
విజయవాడ : కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ నేతలు మంగళవారం ఘన స్వాగతం పలికారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్త మాజేరులో విష జ్వరాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో బయలుదేరి 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొత్తమాజేరుకు బయల్దేరి వెళ్లారు. పరామర్శల అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ పయనం అవుతారు. -
ఆ ఊరికి ఏమైంది?
వణుకుతున్న కొత్తమాజేరు ప్రాణాలు తీస్తున్న అంతుచిక్కని జ్వరం రెండున్నర నెలల్లో 18 మంది మృత్యువాత సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామం భయంతో వణికిపోతోంది. కేవలం రెండున్నర నెలల వ్యవధిలో విష జ్వరం (లక్షణాలు) సోకిన 18 మంది మ్యత్యువాత పడటం, చిన్నా పెద్దా తేడా లేకుండా జ్వరం పట్టిపీడిస్తుండటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సుమారు రెండు వేల జనాభా కలిగిన గ్రామంలో ప్రస్తుతం ప్రతి రెండు ఇళ్లకు ఒకరు చొప్పున జ్వరంతో బాధపడుతూ మంచాన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విషయం తెలిసిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే రెండుసార్లు గ్రామాన్ని సందర్శించారు. సమస్య తీవ్రతను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మొదట్లోనే స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు. మే నెలలోనే ఎక్కువ సంఖ్యలో మరణాలు నమోదైనా.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు స్పందించి విషయం వెలుగులోకి తెచ్చిన తర్వాతే ఒకరిద్దరు మంత్రులు మొక్కుబడిగా గ్రామాన్ని సందర్శించారు. నెలరోజుల క్రితం ప్రభుత్వం తూతూ మంత్రంగా ఓ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. రెండురోజుల పాటు నలుగురైదుగురు వైద్యులు, ఏఎన్ఎంలతో హడావుడి చేసినా ప్రస్తుతం ఏ ఒక్క వైద్యుడూ లేకుండా నామమాత్రంగా నడుస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కొత్తమాజేరును సందర్శించాలని నిర్ణయించుకున్నారు. తగ్గినట్టే తగ్గి.. జ్వరాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెట్టడం, తక్కువ వ్యవధిలోనే ఎక్కువమంది మరణించడం గ్రామస్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన జంజనం జయలక్ష్మి జూలై 13వ తేదీన విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. మరుసటి రోజే ఆమె భర్త జంజనం శ్రీరాములు మరణించడంతో గ్రామంలో మరింత అలజడి రేగింది. గత మే 11 నుంచి జూలై 23 వరకు 18 మంది మరణించారు. ఒక్క మే నెలలోనే 9 మంది మరణించారు. కలుషిత జలాలే జ్వరాలకు కారణమని చెబుతున్న జిల్లా వైద్యాధికారులు.. జ్వరాల వల్ల మరణాలు సంభవించినట్లు పేర్కొనకుండా వేరే వ్యాధుల వల్ల చనిపోయినట్టుగా నమోదు చేస్తున్నారు. కలుషిత జలాలే కారణం జ్వరాల నేపథ్యంలో గుక్కెడు నీళ్లు తాగాలంటేనే గ్రామస్తులు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఓ చెరువు, ఆ చెరువు నీరు ఆధారంగా ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ (నామమాత్రపు ధరకు) గ్రామం తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. పదెకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. కాలువ ద్వారా వచ్చిన నీరు చెరువులోకి చేరటం తప్ప బయటకుపోయే వీల్లేదు. చెరువు పక్కనే ఉన్న ఫిల్టర్బెడ్లు పాడైపోవటంతో నీళ్లు సక్రమంగా శుద్ధికాని పరిస్థితి ఉంది. పైగా గత జనవరిలో తాగునీటి అవసరాల కోసం.. కాలువలకు నీటిని నిలిపివేశారు. ఏప్రిల్ వరకు నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులో ఉన్న కొద్దిపాటి నీరు కలుషితమైంది. చెరువు చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లపై అధికసంఖ్యలో కోతులు చేరుతున్నాయి. అవి చెరువులోకి దిగడం, కొన్ని చెరువులోనే పడి మృతిచెంది వాటి కళేబరాలు నీటిలోనే ఉండిపోవటంతో నీరు మరింత కలుషితమైంది. ఇక చెరువు పక్కనే వాటర్ ప్లాంట్ ఉంది. చెరువు నీటిని శుద్ధి చేసి గ్రామానికి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ప్లాంట్ నిర్వహణకు నిధులు అంతంతమాత్రంగా ఉండటం, ప్లాంట్లో పరికరాలు సక్రమంగా లేకపోవటం, నీరు శుద్ధి చేసినట్లే ఉన్నా నీటిలోని బ్యాక్టీరియా, ఇతరత్రాలు అలాగే ఉండిపోతున్నాయని ఇటీవల నీటి శాంపిల్స్కు చేసిన పరీక్షలో తేలింది. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం కొత్తమాజేరులో 2,216 మంది జనాభా ఉండగా పురుషులు 1,113, మహిళలు 1,103 మంది ఉన్నారు. గ్రామస్తులు మూడు నెలలుగా జ్వరాలతో బాధపడుతున్నా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. చెరువును శుద్ధి చేసే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యహరించింది. కోతులు చెరువులో పడి చనిపోతున్నాయని తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువులో నీరు కలుషితమైందని తెలిసినా ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న చేతిపంపు, గ్రామశివారులోని పొలాల్లో ఉన్న బోరు పాయింట్ల ద్వారా వచ్చే నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు వీలున్నా ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. అన్నం పెట్టే కొడుకు, కోడలు దూరమయ్యారు నా కొడుకు శ్రీరాములు, కోడలు జయలక్ష్మి 12 గంటల వ్యవధిలోనే చనిపోయారు. కొడుకు, కోడలు చేనేత పనిచేసి నన్ను, నా మనుమరాలు సీతమ్మను సాకేవారు. నాకిప్పుడు 80 ఏళ్లు. నేనెలా బతకాలి? మనవరాలిని ఎలా చూడాలి? - జంజనం నాగేశ్వరమ్మ జ్వరం నా భార్యను పొట్టనపెట్టుకుంది నాతో పాటు నా భార్య మాణిక్యం, కుమారుడు పోతురాజు జ్వరం బారిన పడ్డాం. మాణిక్యాన్ని ఆస్పత్రికి తీసుకువెళుతుండగా దారిలోనే చనిపోయింది. - మోతుకూరి గురవయ్య వైద్య శిబిరాన్ని కొనసాగిస్తాం.. కొత్తమాజేరులో కలుషిత నీరు సరఫరా అవుతోందని గుర్తించి అక్కడి పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఈలోగానే ఎక్కువమంది విషజ్వరాల బారిన పడ్డారు. మే నుంచి జూలై వరకు 17 మంది చనిపోయారు. అయితే జ్వరం కారణంగానే చనిపోయినట్లు నిర్ధారణ కాలేదు. పరిస్థితులు చక్కబడే వరకు వైద్య శిబిరాన్ని కొనసాగిస్తాం. - ఆర్.నాగమల్లేశ్వరి, డీఎంహెచ్వో -
కొత్తమాజేరులో విషజ్వరాల విలయతాండవం!