కాలుష్య కంపెనీలను మూసివేయాలి | close the polution companies | Sakshi
Sakshi News home page

కాలుష్య కంపెనీలను మూసివేయాలి

Published Tue, Sep 27 2016 9:58 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

కాలుష్య కంపెనీలను మూసివేయాలి - Sakshi

కాలుష్య కంపెనీలను మూసివేయాలి

నల్లగొండ రూరల్‌ : విష పదార్థాలు వెదజల్లే కంపెనీలను మూసివేయాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ఏపూరు గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్‌లోని దీవిస్‌ కంపెనీ నుంచి విష వ్యర్థాలు విడుదలవుతున్నాయని, వీటి వల్ల గుండ్రాంపల్లిలోని ఏపూరు గ్రామ చెరువులో రూ. 12 లక్షల విలువైన చేపలు చనిపోయాయని అన్నారు. ఈ విషయమై అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం డీఆర్‌ఓ రవినాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, నగేష్, రవి, లింగస్వామి పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement