జిల్లాను సస్యశ్యామలం చేస్తా | cm tour east godavari | Sakshi
Sakshi News home page

జిల్లాను సస్యశ్యామలం చేస్తా

Published Tue, Aug 15 2017 11:16 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

జిల్లాను సస్యశ్యామలం చేస్తా

జిల్లాను సస్యశ్యామలం చేస్తా

ప్రతి ఏకరాకు నీరు ఇస్తాం 
ఈ ఏడాది జూన్‌లోనే నీరు ఇచ్చాం 
జగ్గంపేట సభలో సీఎం చంద్రబాబు 
సాక్షి, రాజమహేంద్రవరం/ జగ్గంపేట:  జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి, జల్లాను సస్యశ్యామలం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం గం.2:25 నిమిషాలకు పురుషోత్తపట్పం ఎత్తిపోతల పథకాన్ని ఒక మోటారు ఆన్‌ చేసి ప్రారంభించిన సీఎం అక్కడ విలేకర్లతో మాట్లాడిన అనంతరం 3:41 గంటలకు జగ్గంపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ జల్లాలో 31,02,852 భూమి ఉండగా అందులో 13,67,362 వ్యవసాయ భూమి ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది 12,07,960 ఎకరాలకు సాగునీరు ఇచ్చామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌కు జూన్‌లోనే నీరు ఇచ్చామన్నారు. ఈ ఏడాది రెండు పంటలకు నీరు ఇస్తామన్నారు. ఫలితంగా తుపాన్ల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చాన్నారు. జిల్లాలో ఎత్తిపోతల పథకాలను తానే ప్రారంభించి పూర్తి చేశానని, పురుషోత్తపట్నం ద్వారా జిల్లాలో 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత వరకు ఈ ఏడాది చివరికి పురుషోత్తపట్నంలో 10 పంపులు ఏర్పాటు చేసి ఏలేరు నీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించానన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడంలో అధికారులు సెలవులు తీసుకోకుండా కష్టపడ్డారని అభినందించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement