east
-
నాకు చెప్పకుండా ఎలా వస్తావ్..?.. గుంటూరు ఈస్ట్ టీడీపీలో వర్గపోరు
సాక్షి, గుంటూరు: నగరంలోని ఈస్ట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బయటపడింది. ఆర్టీసీ కాలనీలో లోకేష్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరు కాగా, తనకు చెప్పకుండా మా డివిజన్లోకి ఎలా వస్తారంటూ ఎమ్మెల్యేను డివిజన్ పార్టీ అధ్యక్షుడు యాసిన్ అడ్డుకున్నారు.ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు యాసిన్ వర్గీయులు వార్నింగ్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై యాసీన్ వర్గీయులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.తంబళ్లపల్లె టీడీపీలో..కాగా, తంబళ్లపల్లె టీడీపీలో ఇప్పటికే వర్గపోరు నడుస్తుండగా.. లోకేష్ బర్త్డేతో అది రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, సీఎం అంటూ లోకేష్పై సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిచ్చును మరింత రాజేశాయి. ఈ క్రమంలో నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఉన్న ఫ్లెక్సీలను చించిపాడేసింది మరో వర్గం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోగా.. కేసు నమోదైంది.తంబళ్లపల్లె టీడీపీలో మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్సెస్ ఇంఛార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తోంది. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆకర్షించే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బుధవారం రాత్రి శంకర్ వర్గీయులు పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శంకర్ ప్రధాన అనుచరుడు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో.. ఇంఛార్జి జైచంద్రారెడ్డి విడిగా తన అనుచరులతో లోకేష్ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.అందులో శంకర్కు చోటు లేకుండా చూసుకున్నారు కూడా!. అయితే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. చంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది చంద్రారెడ్డి వర్గీయుల పనిగా పురుషోత్తం అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. -
గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు: గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. రాజీవ్ గాంధీ నగర్లో శిలాఫలకాలను పగలగొట్టారు. గత ప్రభుత్వంలో రోడ్ల కోసం వేసిన శిలాఫలకాలను తానే స్వయంగా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇదేం పని అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పచ్చ మూకల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటింది. ఇంకా ప్రతిచోటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాహనాలు తగులబెట్టడం, కొట్టడం, ఊరిలో ఉండవద్దంటూ బెదిరించడం పరిపాటిగా మారింది. తాజాగా వట్టిచెరుకూరు మండలం గారపాడులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామంలో ఉండటానికి వీలులేదంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. -
విశాఖ పోర్టు.. ఏమిటో లోగుట్టు?
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ రాకెట్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. విశాఖలో ఫీడ్ యూనిట్ లేకపోయినా.. ప్రకాశం జిల్లాకు తరలించేందుకు ఇక్కడికి డ్రై ఈస్ట్ తీసుకు రావడంపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కస్టమ్స్ విభాగంలో దిగువ స్థాయి సిబ్బంది కొందరు ఈ తరహా వ్యవహారాలకు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే.. దూరమైనా సరే కొందరు విశాఖ పోర్టును ఎంపిక చేసుకుంటున్నారన్న కోణంలోనూ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరోవైపు.. డ్రై ఈస్ట్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయన్న అంశంపై సంధ్యా ఆక్వా సంస్థ యజమానుల్ని దర్యాప్తు బృందం శనివారం విచారించింది. 25 వేల కిలోల డ్రై ఈస్ట్లో కొకైన్, హెరాయిన్, ఓపియం, కొడైన్, మెథక్విలాన్ మొదలైన డ్రగ్స్ అవశేషాలు బయట పడటంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంలో సంధ్యా ఆక్వా పాత్ర, ఇంకా ఎవరెవరి పాత్ర ఎంత అన్నదానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరా తీస్తుంటే.. అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి సంధ్య ఆక్వా సంస్థకు విశాఖలో ఫీడ్ యూనిట్ లేదు. ప్రకాశంలో దీనికి సంబంధించిన యూనిట్ ఉంది. అంటే.. విశాఖకు వచ్చిన డ్రైఈస్ట్ని ప్రకాశం యూనిట్కు తరలించేందుకు సంధ్య ఆక్వా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అలాంటప్పుడు.. నౌకని నేరుగా విశాఖ పోర్టుకు కాకుండా కృష్ణపట్నం పోర్టుకు తరలించవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కంటైనర్ హ్యాండ్లింగ్ని కృష్ణపట్నం పోర్టులో నిలిపివేశారు. తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుని కంటైనర్ టెర్మినల్గా అభివృద్ధి చేస్తున్నారు. ఒకవేళ.. ప్రకాశంకు తరలించాల్సి వస్తే.. కట్టుపల్లికి ఈ నౌకని బెర్తింగ్ కోసం పర్మిషన్ పెట్టుకోవాలి. దీని వల్ల.. సమయం, వ్యయం కూడా సదరు సంస్థకు ఆదా అవుతుంది. కానీ.. విశాఖకు ఎందుకు తరలించారన్న విషయంపై సదరు సంస్థ స్పందించకపోవడంపై సీబీఐ అనేక అనుమానాల్ని వ్యక్తం చేస్తోంది. పోర్టు సిబ్బంది సహకారంపై సీబీఐ కన్ను విశాఖ కంటైనర్ టెర్మినల్లో కస్టమ్స్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ తనిఖీలు చేపట్టేందుకు ప్రయత్నించగా.. కస్టమ్స్ విభాగం వారు అడ్డుకున్నారని తెలుస్తోంది. తమ పరిధిలో హడావిడి చెయ్యడం తగదంటూ సీబీఐతో వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఫోన్లో జోక్యం చేసుకోవడంతో.. డ్రగ్స్ వ్యవహారంపై సీబీఐ ముందుకు వెళ్లగలిగింది. దీనిపై సీబీఐ గుర్రుగా ఉంది. కస్టమ్స్ విభాగం వ్యవహారంపైనా సీబీఐ కన్నేసింది. కస్టమ్స్లో దిగువ స్థాయి సిబ్బంది కొంత మంది.. కంటైనర్స్ తీసుకొస్తున్న సంస్థలతో లాలూచీ పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపడుతోంది. ఇటీవల విశాఖలో 600కు పైగా ఈ–సిగరెట్ బాక్సుల్ని నగర పోలీసులు పట్టుకున్నారు. ఇవి కూడా కంటైనర్ ద్వారా విశాఖ చేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ–సిగరెట్స్ని భారత్లో నిషేధించారు. అలాంటప్పుడు విశాఖ ఎలా చేరాయని ఆరాతీస్తే.. కంటైనర్ టెర్మి నల్లో కస్టమ్స్ని దాటుకొని నగరానికి వచ్చా యని తెలిసింది. ఇలా.. పలు అంశాల్లో కస్టమ్స్ విభాగానికి చెందిన కొందరు దిగువ స్థాయి సిబ్బందిని మేనేజ్ చేస్తూ.. ఈ తరహా నిషేధిత సరుకు బయటకి వచ్చేలా చేస్తున్నారనే విమర్శలు నిజమేనని ఇలాంటి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ‘సంధ్యా’ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది. శనివారం కూడా మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి సంస్థ ఎండీ, డైరెక్టర్లను విచారించింది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు.. బ్రెజిల్ నుంచి ఫీడ్ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు.. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఆదివారం కూడా వారు మరోమారు విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించిందని తెలిసింది. -
రామాలయంలోకి ఇలా వెళ్లి... అలా రావాలి!
సనాతన సంప్రదాయంలో శ్రీరాముడు ఆదర్శ పురుషునిగా కనిపిస్తాడు. అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరాముని ఆలయం సనాతన విలువలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. నాగర్ శైలిలో నిర్మితమవుతున్న రామాలయ ప్రాంగణంలో దక్షిణ ద్రావిడ శైలి ప్రభావం కూడా కనిపిస్తుంది. పంచాయతన సంప్రదాయమూ దర్శనమిస్తుంది. నూతన రామాలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశం ఉంటుంది. 33 మెట్లు ఎక్కిన తర్వాత భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఆలయ ప్రదక్షిణ, దర్శనం తరువాత భక్తులు దక్షిణ దిశ నుండి నిష్క్రమణ కావాలని ఉంటుంది. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన రామాలయ విశేషాల గురించి తెలియజేసింది. మొత్తం ఆలయ సముదాయం 70 ఎకరాలు. ఇందులో 25 నుంచి 30శాతం స్థలంలో మాత్రమే ఆలయం నిర్మితమవుతోంది. మిగిలిన ప్రాంతం పచ్చదనంతో కూడి ఉంటుంది. 2024 జనవరి 22న ప్రధాని మోదీ.. ఆలయంలోని బాలరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన చేసే సమయానికి గ్రౌండ్ ఫ్లోర్, తూర్పు ప్రధాన ద్వారాలు సిద్ధం కానున్నాయి. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటుంది. పూజలు, ప్రార్థన, భజనలకు ఐదు మంటపాలు నిర్మిస్తున్నారు. ఆలయ సముదాయంలో మొత్తం 44 ద్వారాలు ఉండనున్నాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ సముదాయంలో మౌలిక సదుపాయాలు విరివిగా ఉంటాయన్నారు. నీటి శుద్ధి కేంద్రం, అగ్నిమాపక కేంద్రం కూడా ఉంటాయన్నారు. భక్తుల కోసం సుమారు 25 వేల లాకర్లు ఏర్పాటు చేస్తున్నమని, ఇక్కడ సామాను ఉచితంగా ఉంచుకోవచ్చన్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నూతన ఆలయం నాగర్ శైలిలో ఉంటుందని, ఇది ఉత్తర భారత దేవాలయాల ప్రత్యేకశైలి అని చెప్పారు. అలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార గోడ నిర్మించారని, ఇది దక్షిణ దేవాలయాల నిర్మాణ శైలికి ఉదారహణ అని తెలిపారు. ఆలయ నలుమూలల్లో సూర్య భగవానుడు, గణపతి, శివుడు, భగవతి అలయాలు ఉంటాయని, మధ్యలో బాలరాముడు కొలువుదీరుతాడన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! -
విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం భేటీ
-
War Moves East: ఇక తూర్పుపైకి
లివీవ్: తూర్పు ఉక్రెయిన్లోని వేర్పాటువాద డోన్బాస్ ప్రాంతాలపై భారీ దాడికి రష్యా సిద్ధపడుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ‘ఇందుకోసం సైన్యాన్ని భారీగా అక్కడికి పంపుతోంది. అక్కడి డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకోవడమే దాని లక్ష్యం. అక్కడి పొపస్న, రుబిజిన్ నగరాలను ఆక్రమించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడి ఇతర పట్టణాలు, ప్రాంతాలపై కాల్పులకు దిగింది’ అని చెప్పింది. డోన్బాస్పై దాడి నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి రష్యా దళాలు వెనక్కు వెళ్తున్న నేపథ్యంలో మరిన్ని పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుందని ఇంగ్లండ్ రక్షణ శాఖ పేర్కొంది. రాజధాని కీవ్తో పాటు చెర్నిహివ్ పరిసరాల్లోని పలు కీలక ప్రాంతాలు కూడా తిరిగి ఉక్రెయిన్ నియంత్రణలోకి వచ్చినట్టు చెప్పింది. రష్యా కాల్పులు మాత్రం భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. మారియుపోల్ రేవులో దాడి ధాటికి ప్రయాణికుల నౌక మునిగిపోతున్నట్టు సమాచారం. బుచాలో ప్రాణాలు కోల్పోయిన పౌరులను వలంటీర్లు శ్మశానానికి తీసుకొచ్చిన దృశ్యం యుద్ధంలో చిక్కుబడ్డ వారిని సురక్షితంగా తరలించేందుకు మారియుపోల్, బెర్డియాన్స్క్, తొక్మక్, సెవెరొ డొనెట్స్క్, లిసిచాన్స్క్, పొపస్న తదితర చోట్ల మంగళవారం మరో ఏడు మానవీయ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. అంతులేని అకృత్యాలకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను యుద్ధ నేరాల ఆరోపణలపై విచారించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. ‘‘పుతిన్ కర్కోటకుడు. బుచాలో జరిగినవి క్షమించరాని ఘోరాలు’’ అంటూ దుయ్యబట్టారు. ఉక్రెయిన్లో నిర్వాసితుల సంఖ్య 1.2 కోట్లు దాటినట్టు ఐరాస పేర్కొంది. వీరిలో 45 లక్షల మంది దాకా దేశం వీడినట్టు అంచనా. దౌత్య సిబ్బంది బహిష్కరణ పలు దేశాలు తమ రష్యా రాయబార కార్యాలయంలోని సిబ్బందిని భారీ సంఖ్యలో బహిష్కరిస్తున్నాయి. ఉక్రెయిన్లో మందుపాతర్లు పెట్టొద్దని రష్యాకు ఐరాస విజ్ఞప్తి చేసింది. అవి పౌరుల ప్రాణాలను బలిగొంటాయని గుర్తుంచుకోవాలని మందుపాతరల ఉత్పత్తి, వాడకాన్ని నిషేధించేందుకు ఏర్పాటైన ఐరాస కన్వెన్షన్ ప్రెసిడెంట్ అలీసియా అరంగో ఒల్మోస్ అన్నారు. తాను విదేశాంగ మంత్రిగా ఉండగా రష్యాతో ఇంధన ఒప్పందాలు కుదుర్చుకోవడమే గాక ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని పొరపాటు చేశానని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మెయిర్ అభిప్రాయపడ్డారు. యుద్ధ భయం, ఆకలిచావుకు బలైన తన తల్లి సమాధి వద్ద విషణ్ణవదనంతో ఆరేళ్ల పిల్లాడు వ్లాద్ తన్యుయ్. కీవ్ సమీపంలో తీసిందీ ఫొటో. గ్యాస్ సరఫరాకు నోర్డ్స్ట్రీమ్ 2 పైప్లైన్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోకుండా ఉండాల్సిందన్నారు. తూర్పు యూరప్ దృష్టిలో జర్మనీ విశ్వసనీయతను ఇది బాగా తగ్గించిందని అంగీకరించారు. యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లెయెన్ త్వరలో కీవ్లో జెలెన్స్కీతో భేటీ కానున్నారు. యుద్ధం వల్ల ఆసియాలో పలు దేశాల ఆర్థి్థక వ్యవస్థలు సుదీర్ఘకాలం పాటు నెమ్మదిస్తాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ఒకటి జోస్యం చెప్పింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు బుచా హత్యాకాండ నేపథ్యంలో రష్యాపై ఆంక్షల విషయంలో దృఢంగా వ్యవహరించాలని ఈయూ సభ్య దేశాలన్నీ పట్టుదలతో ఉన్నాయి. రష్యాపై సంయుక్తంగా మరిన్ని ఆంక్షలు విధించనున్నట్టు ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మారీ వెల్లడించారు. వీటిలో భాగంగా రష్యా నుంచి బొగ్గు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని యూరప్ భావిస్తోంది. రష్యా నుంచి యూరప్ ఏటా 400 కోట్ల యూరోల విలువైన బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. రష్యా నరమేధానికి బలై బుచాలో సొంతింట్లో నిర్జీవంగా పడి ఉన్న ఒక వృద్ధురాలు యుద్ధాన్ని ఆపేలా రష్యాపై ఒత్తిడి మరింత పెంచాల్సిన అవసరముందని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లెయెన్ అన్నారు. అయితే కీలకమైన గ్యాస్ దిగుమతులపై నిషేధం అంశాన్ని ఆమె ప్రస్తావించలేదు. రష్యా బ్యాంకింగ్ రంగంలో 23 శాతం వాటా ఉన్న మరో నాలుగు మేజర్ రష్యా బ్యాంకులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఐటీపరంగా రష్యాను బలహీనపరిచే మరిన్ని ఆంక్షలను కూడా ఈయూ ముందు ఆమె ప్రతిపాదించారు. రష్యా చమురు వద్దు: అమెరికా రష్యా నుంచి చమురు, ఇతర దిగుమతులను పెంచుకోవడం భారత ప్రయోజనాలకు మంచిది కాదని అమెరికా వ్యాఖ్యలు చేసింది. రష్యాపై ఆధారపడటం తగ్గించుకునే ప్రయత్నంలో భారత్కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్సింగ్ ఇటీవల ఇవే వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఇతర దేశాలతో కలిసి అమెరికా విధించిన ఆంక్షలకు అంతా కట్టుబడి ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. భారత్ తన చమురు అవసరాల్లో రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది 1 శాతం కంటే తక్కువే. -
కాపులు, పోలీసుల మధ్య తోపులాట
కంచాలతో రోడ్డేకేందుకు యత్నం జగ్గంపేట : కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద కాపులు, పోలీసుల మధ్య గురువారం తోపులాట చోటుచేసుకుంది. కంచాలతో రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించిన కాపులను పోలీసులు అడ్డుకున్నారు. గత నెల 26న ముద్రగడ చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి లేదని అడ్డు చెప్పడంతో.. పోరు సీఎం వర్సెస్ ముద్రగడగా మారింది. ఓట్ల కోసం కాపు జాతికి రిజర్వేషన్లను ఎరవేసి వారి ఓట్లతో పీఠం ఎక్కిన చంద్రబాబుకు ఆ హామీని గుర్తు చేయడం రుచించడం లేదు. జాతి కోసం కుటుంబంతో పోరుబాట సాగిస్తున్న ముద్రగడ..తనకు కంటిలో నలుసుగా మారినట్టు భావిస్తున్న సీఎం.. ఆయనను అణచివేసి ఉద్యమం నీరుగార్చేందుకు దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జగ్గంపేట పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. తనకు ఎవరూ చెప్పాల్సిన పని లేదంటూ చేసిన వ్యాఖ్య.. ముద్రగడను ఉద్దేశించి చేసిందనంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. నిరవధిక పాదయాత్ర పేరిట ముద్రగడ రోజూ బయటకురావడం, ఆయనను పోలీసులతో నిలువరించడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం రోడ్కెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుంటే పరిష్కారం చేయకుండా.. ముద్రగడను టార్గెట్గా చేయడాన్ని కాపు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కంచాలు మోగించి... ముద్రగడ, కాపు జేఏసీ నాయకులు, మహిళలు గురువారం కంచాలు మోగించి నిరసన వ్యక్తం చేశారు. రోజుకో రకం నిరసనలు వ్యక్తం చేస్తోన్న కాపు జేఏసీ నాయకులు నల్ల చొక్కాలను ధరించారు. కంచాలతో నిరసన సందర్భంగా ముద్రగడ ఇంటి నుంచి ఒక్కసారి గేటు వరకు పెద్ద సంఖ్యలో వచ్చి రోడుపై ధర్నాకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాటకు దారితీసింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు వాసురెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, గౌతు స్వామి, ఆరేటి ప్రకాష్, చక్కపల్లి సత్తిబాబు, గుండా వెంకటరమణ, తుమ్మలపల్లి రమేష్, గోపు అచ్యుతరామయ్య, తదితరులు పాల్గొని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. తమకు సంకెళ్లు వేయండి.. కాపు జాతిపై కక్ష సాధింపు ఎన్ని రోజులని నిలదీశారు. -
జిల్లాను సస్యశ్యామలం చేస్తా
ప్రతి ఏకరాకు నీరు ఇస్తాం ఈ ఏడాది జూన్లోనే నీరు ఇచ్చాం జగ్గంపేట సభలో సీఎం చంద్రబాబు సాక్షి, రాజమహేంద్రవరం/ జగ్గంపేట: జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి, జల్లాను సస్యశ్యామలం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం గం.2:25 నిమిషాలకు పురుషోత్తపట్పం ఎత్తిపోతల పథకాన్ని ఒక మోటారు ఆన్ చేసి ప్రారంభించిన సీఎం అక్కడ విలేకర్లతో మాట్లాడిన అనంతరం 3:41 గంటలకు జగ్గంపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ జల్లాలో 31,02,852 భూమి ఉండగా అందులో 13,67,362 వ్యవసాయ భూమి ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది 12,07,960 ఎకరాలకు సాగునీరు ఇచ్చామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్కు జూన్లోనే నీరు ఇచ్చామన్నారు. ఈ ఏడాది రెండు పంటలకు నీరు ఇస్తామన్నారు. ఫలితంగా తుపాన్ల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చాన్నారు. జిల్లాలో ఎత్తిపోతల పథకాలను తానే ప్రారంభించి పూర్తి చేశానని, పురుషోత్తపట్నం ద్వారా జిల్లాలో 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత వరకు ఈ ఏడాది చివరికి పురుషోత్తపట్నంలో 10 పంపులు ఏర్పాటు చేసి ఏలేరు నీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించానన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడంలో అధికారులు సెలవులు తీసుకోకుండా కష్టపడ్డారని అభినందించారు. -
‘అల’వోకగా
సర్కారు బడుల్లో..‘ఆనంద లహరి’ జిల్లాలో 135 పాఠశాలలు ఎంపిక మొదటి దశ ప్రారంభం 1.2 తరగతులకు నూతన అభ్యసన ప్రక్రియ రిషివ్యాలీ తరహాలో విద్యాబోధన విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెంపొందించిందేకు విద్యాశాఖ అధికారులు ఆనందలహరి (అల)పథకాన్ని రూపొందించారు. ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతి విద్యార్థులకు ఈ సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానంలో తరగతి గదులను నూతనంగా తీర్చిదిద్దుతారు. విద్యార్థులు ఆడుకుంటూ అక్కడే ఉన్న బోధనోపకరణాలను సందర్భోచితంగా ఉపయోగించుకుంటారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్కు ఒకటి, మండలానికి రెండు పాఠశాలల వంతున ఎంపిక చేశారు. మొదటి దశలో రెవెన్యూ డివిజన్లలో ‘ఆనందలహరి’ కార్యక్రమాన్ని జిల్లాలో మంగళవారం ప్రారంభించారు. - రాయవరం(మండపేట) రాష్ట్ర వ్యాప్తంగా ఈ ‘అల’ అభ్యసన విధానం అమలు చేసేందుకు 1,342 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలో 135 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. మొదటి దశలో ఏడు రెవెన్యూ డివిజన్లలో ప్రారంభిస్తుండగా..కాకినాడ రూరల్ మండలం పండూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంఛనంగా ప్రారంభించారు. మిగిలిన డివిజన్ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. స్వీయం..సరళం.. ‘అల’ విధానంలో ఆయా పాఠశాలల్లో 1, 2 తరగతులు చదివే విద్యార్థులకు ఈ విధానంలో బోధన సాగిస్తారు. విద్యార్థులు పుస్తకాలను ఇంటి నుంచి తీసుకుని రావాల్సిన పనిలేదు. ఐదుగురు ఒక విద్యార్థులకు ఒక ట్యాబ్ వంతున ఇస్తారు. ఇక్కడ బోధన అంతా స్వీయ అభ్యసనంతో పాటు సరళమైన విధానంలో ఉంటుంది. ఒక అడుగున్న టేబుల్ చెస్ బోర్డు తరహాలో ఏర్పాటు చేసి కుర్చీలు ఉంటాయి. గోడ అంతా బ్లాక్ బోర్డు ఉంటుంది. పిల్లలకు బ్లాక్ బోర్డు మీద కొంత భాగం కేటాయిస్తారు. అక్కడే అందుబాటులో షెల్ఫ్ ఉంటుంది. అందులో బోధన ఉపకరణాలను తీసుకుని పాఠ్యాంశాలపై ఉపాధ్యాయుల సహకారంతో సొంతంగా అవగాహన పొందుతారు. విద్యార్థి కేంద్రీకృతంగా విద్యాబోధన ఉంటుంది. ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థికి సహకారంగానే ఉంటాడు. బోధన అభ్యసన పద్ధతులను, గుర్తించిన విధానం మేరకు వారి స్థాయిని గుర్తిస్తారు. ఈ విధానంలో ఎప్పటికప్పుడు ఏ మేరకు విద్యార్థులు అవగాహన చేసుకుకున్నారో? లేదో? స్పష్టమవుతోంది. కృత్యాధార బోధన ద్వారా గణిత భావనలు సందర్భానుసారంగా ఆసక్తికరంగా, ఆనందకరంగా వైవిధ్యంగా ఉండడంతో ఆసక్తిగా పాల్గొంటారు. మొదటి దశలో ఆనందలహరి ప్రారంభమైన పాఠశాలలివే.. రెవెన్యూ డివిజన్ పాఠశాల కాకినాడ పండూరు రాజమహేంద్రవరం కొంతమూరు అమలాపురం భట్లపాలెం పెద్దాపురం మరువాడ రామచంద్రపురం ఉండూరు రంపచోడవరం బోసిగూడెం ఎటపాక యర్రంపేట విద్యార్థులకు చేరువవుతుంది.. ఈ విధానం తప్పనిసరిగా విద్యార్థులకు చేరువవుతుంది. ఇటు విద్యార్థులపై అటు ఉపాధ్యాయులపై ఒత్తిడి లేని రీతిలో ఆటపాటలతో కూడిన బోధన సాగుతుంది. ఈ విధానంలో నిరంతర మూల్యాంకనం చేరుతుంది. రిషివ్యాలీ విధానంలో ఆనందలహరి ఉంటుంది. ఈ విధానం తప్పనిసరిగా విజయవంతమవుతుంది. ఇప్పటికే ఈ విధానంలో ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. – మేకా శేషగిరి, పీవో, ఎస్ఎస్ఏ, కాకినాడ. -
కలెక్టరేట్ ఎదుట ఆందోళనల హోరు
కాకినాడ సిటీ : సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ కార్మిక, ప్రజా సంఘాలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపట్టాయి. నిరసనల అనంతరం ఆయా సంఘాల ప్రతినిధులు కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని చేనేతను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ చేనేత కులాల సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ఆందోళన నిర్వహించారు. చిలపనూలుపై 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని, చేనేతను అన్ని రకాల పన్నుల నుంచి శాశ్వతంగా మినహాయించాలని డిమాండ్ చేశారు. చేనేత కులాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పంపన రామకృష్ణ, రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ దొంతంశెట్టి విరూపాక్షం, జిల్లా అధ్యక్షుడు చింతకింద రాము, చేనేత ఉద్యమ రాష్ట్ర నాయకులు వై.కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఎస్ఈజెడ్ బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరువాకలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కేఎస్ఈజెడ్ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం కమిటీ ప్రతినిధులు, పలువురు రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి పేరుతో పదివేల ఎకరాల అక్రమ భూదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. నేటికీ ఒక్క పరిశ్రమా రాలేదని, సెజ్ విషయంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలన్నారు. సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేఎస్ఈజెడ్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు బావిశెట్టి నారాయణస్వామి, కన్వీనర్ చింతా సూర్యనారాయణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి పాల్గొన్నారు. మారేడుబాక గ్రామస్తుల ఆందోళన మద్యం షాపు తొలగించాలని కోరుతూ మండపేట మండలం మారేడుబాక గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కలాశాలతో పాటు ప్రైవేటు పాఠశాల, కళాశాల, వినాయక గుడి, జనావాసాలకు సమీపంలో మద్యం షాపు ఏర్పాటు చేశారన్నారు. వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కోరుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్స్ ఫెడరేషన్ ఆందోళన నిర్వహించింది. ఎస్సీలుగా గుర్తించి మత స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హోదా అంశంపై ఈనెల 10న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్టు ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జార్జి శ్రీమంతుల తెలిపారు. ఫెడరేషన్ ప్రతినిధులు ఎన్.ప్రభువరం, కె.రాజేష్బాబు, జే.మేరీమధురవాణి పాల్గొన్నారు. -
వారి దారి.. చెరోదారి
రచ్చకెక్కిన బీజేపీ రాజకీయం తీవ్రమైన రెండు వర్గాల పోరు ఉపరాష్ట్రపతి పదవికి ఎం.వెంకయ్యనాయుడు ఎన్నికైన తరువాత.. రాష్ట్రంలో బీజేపీ ప్రాభవం పెంచుకునేందుకు.. అవసరమైన టీడీపీతో మైత్రి కొనసాగకపోవచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో, బీజేపీలో రెండు వర్గాల విభేదాలు జిల్లాలో ముదిరిపాకన పడ్డాయి. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో, ఇంతవరకూ అంతర్గతంగా సాగుతోన్న వర్గాల పోరు ఇప్పుడు రచ్చ ఎక్కింది. టీడీపీతో పొత్తు విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని, నగరపాలక సంస్థ ఎన్నికలలో సొంతంగా పోటీ చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడి ప్రకటన.. ఆయన సొంత అభిప్రాయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీ సమావేశంలో స్పష్టం చేయడం.. టీడీపీతో పొత్తు విషయంపైనే పోరు సాగుతోందన్న అనుమానాలను ఈ రెండు వర్గాలు నివృత్తి చేసేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు వీరి పోరుకు వేదిక కావచ్చు. పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఈ రెండు వర్గాలు వేర్వేరుగా జాబితాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. బోట్క్లబ్ (కాకినాడ సిటీ) : జిల్లాలో బీజేపీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. 2016లో నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రెండు వర్గాలుగా చీలిపోయిన నాయకుల మధ్య పోరు ఇప్పుడు రసకందాయంలో పడింది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా కృష్ణమోహన్ అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవి విషయంలో చెరో అభ్యర్థిని పోటీకి దింపిన విషయం విదితమే. ఆ ఎన్నికలలో వీర్రాజు బలపర్చిన యెనిమిరెడ్డి మాలకొండయ్య గెలుపొందారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తూ వచ్చారు. ఆదివారం కాకినాడ శశికాంత్నగర్లోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంగరాల చినబాబు నివాసంలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గెలుపొందిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకు వీర్రాజు వర్గం హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాల్గొన్న విషయం విదితమే. పార్టీ కార్యాలయం ఏర్పాటుపై వివాదం తమకు ఆహ్వానం పంపకుండానే పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఇటీవల శాంతినగర్లో ఏర్పాటు చేయడంతో పైడా వర్గీయులు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోర్ కమిటీ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పలేదని పైడా వర్గం పార్టీ జాతీయ, రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య తన అనుచరులతోనే ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకొన్నారని, పార్టీకి సంబంధం లేదని వారు చెబుతున్నారు. ఈ విషయం రాష్ట్ర పార్టీ అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధం ఉన్నట్టు సమాచారం. పార్టీలో గ్రూపులు ఉన్నాయని ఇటీవల ఒక సమావేశంలో పాల్గొన్న పార్టీ జిల్లా ఇన్చార్జి పూడి తిరుపతిరావు అంగీకరించారు. రెండు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తుండడంతో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే పార్టీ రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టంచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ చెరో దారి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు విషయంలో రెండు వర్గాలు వేర్వేరుగా సన్నాహాలు చేసుకుంటున్నాయి రెండు వర్గాలు తమ అనుయాయులకు టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కూడా పైడా వర్గీయులు దూరంగా ఉన్నారు. రెండు వర్గాలతో పార్టీ కార్యాలయంలో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఆయన చెప్పినా, పార్టీ కార్యాలయానికి వచ్చేది లేదంటూ పైడా వర్గం భీష్మించుకుని కూర్చుంది. బీజేపీలో అంతర్గత పోరును టీడీపీ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. -
సీఎం వస్తున్నారని అధికారుల హడావుడి
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు సీఎం చంద్రబాబునాయుడు పరిశీలనకు సోమవారం వస్తున్నారని అధికారులు ఉరుకులు,పరుగులు తీస్తున్నారు. ఉదయం నుండి అధికారులు పలు ఏర్పాట్లుపై దృష్టిసారించారు. సీఎమ్ కాన్వాయ్కు ఎటువంటి అవంతాలు కలుగకుండా రోడ్డు మార్గంలో కాన్వాయ్ ట్రైల్ రన్ వేశారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హెలీప్యాడ్ స్వాదీనం: సీతానగరం డిగ్రీకళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను అధికారుల స్వాదీనం చేసుకున్నారు. కళాశాల ఆవరణలో ఐరన్ బారికేట్లు ఏర్పాటు చేశారు. అధికారులు తప్ప ఎవరిని లోపలికి రానీయకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఉదయం నుండి అర్బన్ ఎస్పీ రాజకుమారి, నార్త్జోన్ డీఎస్పీ శ్రీనివాస్లు హెలీప్యాడ్ వద్ద పరిశీలించారు. ఏలూరు డీఐజీ రామకృష్ణ, ఎస్పీ రాజకుమారి, సబ్ కలెక్టర్ విజయరామరాజు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకేటేష్లు కళాశాల నుంచి కాన్యాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు ఆ మార్గంలో పలు ఏర్పాట్లు .. సీతానగరం నుంచి పురుషోత్తపట్నం 10 కిలోమీటర్లు పొడవునా రోడ్డును మరమ్మతులు చేశారు. అలాగే ఏటిగట్టుపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. రోడ్డు కిరువైపులా తెల్ల రంగుతో బోర్డర్ను ఏర్పాటు చేశారు. సింగవరం, వంగలపూడి, రామచంద్రపురం గ్రామాల వద్ద ఏటిగట్టుపై ఉన్న బస్ స్టాఫ్ షెడ్లకు తెల్లరంగులు అద్దారు. అలాగే రోడ్డు మార్గంలో మైలురాళ్ల కు పసుపు రంగులు వేసి, కిలోమీటర్లు గుర్తించే అంకెలు వేశారు బారికేడ్ల ఏర్పాటు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద ఏటిగట్టుపై ఐరన్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం పరిశీలించే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పలు ఏరాట్లు చేశారు. పురుషోత్తపట్నంలో యాంటీ నక్సల్స్ స్క్వాడ్ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామాల వద్ద ఏటిగట్టుపై యాంటీ నక్సల్స్ స్క్వాడ్ పహారా కాస్తున్నారు. అలాగే పోలీస్ సిబ్బంది పికెట్లు ఏర్పాటు చేశారు. మండలంలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలులతో కలసి మండలానికి 800 మంది సిబ్బంది తరలివచ్చారు. -
‘ఎవరు మీలో కోటీశ్వరుడు?’ సొమ్ము సేవలకే..
-టీవీ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల యానాం : సేవా దృకృథంతో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు టీవీ యాంకర్ కనకాల సుమ పేర్కొన్నారు.శనివారం స్ధానిక కనకాలపేట ప్రభుత్వ హైస్కూల్కు రూ.60 వేల విలువచేసే ప్రొజెక్టర్, స్క్రీన్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరో, తనభర్త రాజీవ్ కనకాల, తాను కలిసి మాటీవీలో ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమంలో పాల్గొని గెలిచిన సొమ్ముతో వివిధ సేవాకార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగానే పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే ప్రొజెక్టర్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కనకాల రాజీవ్ మాట్లాడుతూ తన స్వగ్రామంలో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. ఇప్పటికే హైదరాబాద్, రాజమండ్రి తదితర చోట్ల ప్రొజెక్టర్లు ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కేఎన్ లక్ష్మి, ఉపాధ్యాయులు లక్ష్మణరావు, సూర్యప్రకాష్, నళినీకుమారి,మహ్మద్ యాకూబ్ తదితరులు పాల్గోన్నారు. -
గాలి మేడలు
- మూడేళ్లలో మంజూరు చేసిన ఇళ్లు కేవలం 40,167 - పూర్తిచేసినవి 7,784 - పేదలను మభ్యపెట్టేందుకు సరికొత్త ఎత్తుగడ - పల్స్ సర్వేలోని ఇళ్లకు అర్హుల ఎంపిక పేరిట గ్రామ సభలు - నాడు జిల్లాకు 4.85 లక్షల గృహాలు అవసరంగా గుర్తింపు - 15వ తేదీ వరకు గ్రామసభల నిర్వహణకు సర్కారు ఆదేశాలు - స్వల్ప వ్యవధిలో అర్హుల నిర్ధారణపై పెదవి విరుస్తున్న అధికారులు - తొలిరోజు ఫించన్ల కోసం వచ్చిన లబ్ధిదారులతోనే సభల నిర్వహణ మండపేట : ఆది నుంచి గృహ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కారు తాజాగా పేదలను మభ్యపెట్టేందుకు మరో ఎత్తుగడ వేసింది. 2016 స్మార్ట్ పల్స్ సర్వేలో అవసరంగా గుర్తించిన 4.85 లక్షల ఇళ్లకుగాను తాజాగా మరోమారు అర్హుల ఎంపిక పేరిట గ్రామసభల నిర్వహణకు ఆదేశాలిచ్చింది. అందుకోసం ఈ నెల 15వ తేదీ వరకు గడువిచ్చింది. కేవలం 15 రోజుల వ్యవధిలో మండలంలో అర్హుల గుర్తింపు ఎలా సాధ్యమని పలువురు అధికారులు పెదవి విరుస్తున్నారు. తొలిరోజు చాలాచోట్ల సామాజిక పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారితో తంతు నడిపించేశారు. కేవలం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ‘మమ’ అనిపించుకునేందుకే ప్రభుత్వం ఈ గ్రామసభలు నిర్వహిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హామీ ఏది బాబూ... అధికారంలోకి వస్తే మూడు సెంట్లు స్థలంలో రూ.1.5 లక్షలతో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మిస్తాం. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఎన్నికలు సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీ తుంగలోకి చంద్రబాబు తొక్కారన్న విమర్శలున్నాయి. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఎన్టీఆర్ హౌసింగ్ పేరిట రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సాక్షిగా 2016 ఏప్రిల్ 14న పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇంకేముంది పేదల పక్కా ఇళ్ల నిర్మాణం జోరందుకుంటుందని అంతా భావించగా గాలి మేడలేనని ఆన్లైన్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మూడు ఆర్ధిక సంవత్సరాలకుగాను జిల్లాకు మొత్తం 40,167 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో కేవలం 7,784 మాత్రమే పూర్తికావడం గమనార్హం. తొలి విడతగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 23,765 ఇళ్లను మంజూరు చేయగా వాటిలో పూర్తయ్యాయి. 2017–18లో 13,494 ఇళ్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2,908 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికి ఒక ఇల్లు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన అందరికీ ఇళ్ల పథకం ఇప్పటికే అభాసుపాలవుతోంది. మౌలిక వసతుల భారాన్ని పేదలపైనే మోపుతూ ప్రైవేటు ప్లాట్లలో కూడా లేని విధంగా చదరపు అడుగుకు రూ. 1,953 ధర నిర్ణయించి విమర్శలు ఎదుర్కొంటోంది. లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోతుండటంతో తొలివిడత వాయిదాల కోసం ఇప్పటికే రెండుసార్లు గడువును కూడా పొడిగించింది. మభ్యపెట్టే ఎత్తుగడ... పేదల ఇళ్ల నిర్మాణంలో ఆది నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారు తాజాగా వారిని మభ్యపెట్టే ఎత్తుగడ వేసింది. స్మార్ట్ పల్స్ సర్వే పేరిట 2016 సంవత్సరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించిన విషయం విదితమే. అందులో జిల్లాలో సుమారు 14 లక్షల కుటుంబాలకుగాను 4.85 లక్షల మంది పేదవర్గాలకు చెందిన కుటుంబాలు అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. 4.85 లక్షల మందిలో ఎంత మంది అర్హులనే విషయాన్ని గ్రామసభల ద్వారా ఈనెల 15వ తేదీలోగా గుర్తించి నివేదికను అందజేయాలని ఆదేశాలిచ్చింది. కొన్ని మండలాల్లో 10 నుంచి 15 వేలు వరకు అర్హులు ఉన్నట్టుగా అప్పట్లో గుర్తించారు. అధిక శాతం మండలాల్లో 20కు పైగా పంచాయతీలు ఉండటం, ఎంపిక చేసిన వారు వేలల్లో ఉండటంతో 15 రోజుల వ్యవధిలో వారిలో పారదర్శకంగా అర్హుల గుర్తింపు ఎలా సాధ్యమని పలువురు అధికారులు అంటున్నారు. రెండు వారాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సి ఉండటంతో చాలాచోట్ల గ్రామసభలు తూతూమంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1వ తేదీ కావడంతో పంచాయతీల వద్దకు సామాజిక పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారితో చాలాచోట్ల పంచాయతీ కార్యాలయాల వద్ద వారితోనే అధికారులు తొలిరోజు గ్రామసభలు తంతు నడిపించారు. ఎంపిక చేసిన పేరుల్లో అనర్హులు ఉంటే చెప్పాలని అడుగుతుండగా తెల్లమొహం వేసి చూడటం సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వంతయింది. పల్స్ సర్వేలో గుర్తించిన వారిలో అర్హులెవరనేది నిర్ధారించాల్సి ఉందని, అయితే వారికి ప్రభుత్వం గృహనిర్మాణ రుణాల మంజూరు చేసే విషయమై స్పష్టత లేదని హౌసింగ్ అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు కోరే అవకాశం ఉందని భావిస్తున్నామంటున్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణనికి 2011 సెక్డేటా ఆధారంగా కేంద్రం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పల్స్సర్వే ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులను కేంద్రం ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందనే అనుమానం వ్యక్తమవుతోంది. గ్రామ సభలు నేపథ్యంలో త్వరలోనే తమ సొంతింటి కల సాకారమవుతుందని పేదవర్గాల ఆశాభావం వ్యక్తచేస్తున్నారు. కేంద్రం ఆమోదం తెలపకుంటే మూడేళ్లలో కేవలం40 వేల ఇళ్లు మంజూరు చేసిన చంద్రబాబు సర్కారు రానున్న రెండేళ్లలో దాదాపు 4.5 లక్షలు ఇళ్లు ఎలా మంజూరు చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం పేదవర్గాల వారిని మభ్యపెట్టేందుకు ఇగో ఎత్తుగడని విమర్శిస్తున్నారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లకు నిధులు విడుదల చేసి పూర్తిచేయడంతోపాటు ఎన్నికల వాగ్ధానాలను చంద్రబాబు అమలు చేయాలని కోరుతున్నారు. -
మడ అడవుల పరిరక్షణ కార్పొరేట్ సంస్థలదే
– సదస్సులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ : జిల్లాలోని మడ అడవుల పరిరక్షణ ద్వారా వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడలోని హోటల్ రాయల్పార్క్లో ఎగ్రీ ఫౌండేషన్ ప్రీ కార్పొరేట్ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో సుందర్బన్ తరువాత జిల్లాలో ఉన్న మడ అడవులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. జిల్లాలో ఆయిల్, సహజవాయువు, ఫెర్టిలైజర్స్ షిప్పింగ్ పోర్ట్స్ వ్యవహారాలు నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలు వాతావరణ పరిరక్షణ కోసం మైక్రో ప్లాను రూపొందించి వాటిని అమలు చేయాలన్నారు. కోరంగి మడఅడవుల పరిరక్షణకు కార్పొరేట్ సంస్థలు చేపట్టాల్సిన అంశాలపై ఒక ప్రణాళిక రూపొందించాలని వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓను కలెక్టర్ కోరారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.రవికుమార్ మాట్లాడుతూ ఎగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోస్తా జీవ పరిరక్షణ కోసం ఆయిల్, సహజవాయువు, ఆక్వా కల్చర్, టూరిజం, ఫెర్టిలైజర్స్, ఫిషరీస్ వంటి ఏడు సంస్థలను గుర్తించామన్నారు. ఆక్వాకల్చర్ నిపుణులు డాక్టర్ డి.పద్మావతి రూపొందించిన పిన్ఫిష్ అట్లాస్ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాదికారి నందిని సలారియా, ఓఎన్జీసీ ఇడి అలోక్ సుందర్, కోరమండల్ జీఎం జ్ఞానసుందరం, వన్యప్రాణి విభాగ డీఎఫ్ఓ ప్రభాకరరావు, ట్రైనీ కలెక్టర్ ఆనంద్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
యువతను మత్తులో ముంచేశారు..
గంజాయి, నిషేధిత మందుల విక్రయాల గుట్టురట్టు ఆరుగురు నిందితుల అరెస్ట్ రూ.2 లక్షలు స్వాధీనం కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : తీగ లాగితే.. డొంక కదిలింది. ఏజెన్సీ నుంచి గంజాయి యథేచ్ఛగా జిల్లా నుంచి అక్రమంగా రవాణా అవుతున్నట్టు స్పష్టమైన నేపథ్యంలో.. తాజా సంఘటనను పరిశీలిస్తే.. గంజాయితోపాటు మత్తు కలిగించే మందులు జిల్లాలోనే గుట్టుగా విక్రయిస్తున్న వైనాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. యువత, విద్యార్థులు, కూలీలకు వీటిని విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేల్చారు. జిల్లా ప్రజలను దిగ్భ్రాంతి చెందేలా ఉన్న ఈ కేసు వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ విలేకరులకు వివరించారు. యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలు, గంజాయి మత్తులో ముంచి నిందితులు అక్రమార్జన చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆయన వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మత్తు పదార్థాలు, గంజాయి యువతకు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో...నగరంలోని రేచర్లపేట, మిలటరీ రోడ్డులో ఉంటున్న పాత నేరస్తుడు బెజవాడ రవి ఇంటిపై పోలీసులు.. అర్బన్ తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం, వీఆర్వోలతో కలిసి దాడి చేశారు. అక్కడ అంతర జిల్లా నేరస్తుడు పెమ్మాడి శివప్రసాద్ గంజాయి అమ్ముతుండగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి 25 కిలోల గంజాయి, రూ.2,03,020 లక్షలు, 189 టోసెక్స్ కాఫ్ సిరఫ్, 197 ఎస్కుల్ప్ కాఫ్ సిరఫ్ బాటిళ్లు, 3,465 నిట్రోవిట్ 10 ఎంజీ, 170 నిట్రోసన్ 10.5 ఎంజీ ట్యాబెట్లు, 5 ఎవిల్ ఇంజెక్షన్లు, 10 లుపెజెరిక్, 3 ఫినెర్జెన్ ఇంజెక్షన్లు, 10.2 ఎంఐ సిరంజ్లను స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ షాపుల సిబ్బందిని కూడా... డాక్టర్ల ప్రిస్కెప్షన్ లేకుండానే అధిక పరిమాణంలో వందల సంఖ్యలో ట్యాబెట్లు, కాఫ్ సిరప్లను నిందితులకు విక్రయిస్తూ యువత ఆరోగ్యం చెడిపోవడానికి కారణమవుతున్న సాయిరామ్ మెడికల్స్కు చెందిన దాసరి సత్యనారాయణ(అంగర), శ్రీమౌనిక మెడికల్, జనరల్ స్టోర్కు చెందిన కంకటాల వెంకట మల్లేశ్వరరావు (అంగర), ప్రసాద్ అండ్ సన్స్కు చెందిన నండూరు సత్యభాస్కరరావు (భీమవరం), దుర్గాభవాని మెడికల్స్కు చెందిన నడిపూడి దుర్గాప్రసాద్ (ఏలూరు)లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యధిక ధరలకు విక్రయం... రూ.100 ధర ఉండే దగ్గు మందును రూ.200 నుంచి రూ.300కు విక్రయిస్తున్నారు. సిరఫ్ బాటిల్ని తాగితే రెండు రోజుల పాటు మత్తులో ఉంటారు. నిట్రోవిట్ ట్యాబ్లెట్ను రూ.3 నుంచి రూ.4కు కొని రూ.100కు విక్రయిస్తున్నారు. మూడు ట్యాబ్లెట్స్ ఒకేసారి వేసుకుంటే రెండు, మూడు రోజుల వరకు మత్తులో ఉంటారు. ఆ ఇద్దరూ.. పాత నేరస్తులే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇద్దరూ పాత నేరస్తులే. కాకినాడ రేచర్లపేట మిలటరీ కాలనీకి చెందిన బెజవాడ రవి, జగన్నాథపురం గౌరీశంకర్పేటకు చెందిన అంతర జిల్లా నేరస్తుడు పెమ్మాడి శివప్రసాద్ గంజాయిని సిగరెట్లలో కూరి యువత, విద్యార్థులకు విక్రయిస్తున్నారు. అంగర, భీమవరం, ఏలూరు వంటి వేర్వేరు ప్రాంతాల నుంచి మెడికల్ షాపుల నుంచి సంపాదించిన టోసెక్స్, ఎస్కుల్ప్ కాఫ్ సిరప్లు, నిత్రోవిట్, నిట్రోసన్ టాబ్లెట్లు, ఎవిల్ ఇంజెక్షన్లను యువత, విద్యార్థులు, కూలీలకు విక్రయిస్తున్నారు. ప్రిస్కెప్షన్ లేకుండా మత్తు ట్యాబ్లెట్లు, దగ్గు సిరప్, పలు రకాల ఇంజెక్షన్లను ఈ మెడికల్ షాపుల నుంచి వారు సులువుగా సంపాదిస్తున్నారు. జీవితాలు నాశనం చేసుకోవద్దు మత్తు పదార్ధాలు, గంజాయి వంటి ఉత్పేరకాలకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు ఎస్పీ గున్ని సూచించారు. అక్రమార్జన కోసం వీటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. యువతను వ్యసనపరులుగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. విద్యార్జన కోసం కళాశాలలకు వెళుతోన్న విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. మత్తుకు బానిసలుగా మారిన విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని సన్మార్గంలో నడచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలు, ముఖ్య కూడళ్ల వద్ద గస్తీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో కళాశాలల నిర్వాహకులు నిఘా పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు విక్రయిస్తున్న నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన క్రైం డీఎస్పీ పల్లపురాజు, సీఐ ఈశ్వరుడు, ఎస్సైలు హరీష్కుమార్,కేవీ రామారావు, సీహెచ్ సుధాకర్, ఎం.ఏసుబాబు, హెచ్సీ గోవిందరావు, పీసీ చిన్నా,శ్రీరామ్,అజేయ్,వర్మా,రాము, బాబు, మారుతిలను అభినందించారు. -
‘బెల్టు’ ఎలా.. తెగుద్ధి
- బెల్లు బిగించిందీ వారే ... - ‘బెల్టు’ తీయడం సాధ్యమేనా..? – పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టు షాపులు – మద్యం దుకాణదారులే వీటి నిర్వాహకులు – మద్యం సరఫరా చేస్తున్న దుకణాలపై చర్యలు నిల్ – దుకాణాలు పూర్తిగా ఏర్పాటు కాకపోయినా 25 శాతం పెరిగిన అమ్మకాలు - ప్లీనరీలో జగన్ దశలవారీ మద్య నిషేధ ప్రకటనతో బాబు సర్కారు హడావుడి - జిల్లాలో మహిళల ఆందోళనలతో మరింత బెంబేలు సాక్షి, రాజమహేంద్రవరం: ప్రోత్సహించిందీ వారే ... ఆగ్రహిస్తున్నట్టుగా నటిస్తున్నదీ వారే ... ఇప్పుడు తొలగిస్తామని హడావుడి చేస్తున్నదీ ఆ వర్గమే... ఇందంతా హైడ్రామాగా అధికార పార్టీ నేతలు రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారని జిల్లాలోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మద్యం పాలసీలో దాదాపు ప్రతి దుకాణానికి పట్టణాల్లో కనీసం రెండు, గ్రామీణ ప్రాంతాల్లో పది వరకు అనుబంధంగా బెల్టు షాపులు ఉండగా అధికారులు అనేక కారణాల వల్ల వాటికి జోలికి వెళ్లలేదు. పాలసీ ముగిసే చివరి రెండు నెలల్లో ప్రభుత్వం తామేదో చేస్తున్నామని చెప్పడానికి బెల్టు షాపులు పూర్తిగా నిర్మూలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త కమిషనర్ రాకతోపాటు ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో అధికారులు మే నెల 20వ తేదీ నుంచి జిల్లాలో బెల్టు షాపులపై దాడులు చేసి 284 కేసులు నమోదు చేసి 289 మందిని అరెస్ట్ చేశారు. ఇలా ఓ పక్క నమోదు చేస్తుండగానే మరో పక్క పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతున్నాయి. జూలై 1వ తేదీ నుంచి మద్యం కొత్త పాలసీ (2017–19) అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఏర్పాటు చేయడానికి అవకాశమున్న 545 దుకాణాలకుగాను లాటరీలో 534 దుకాణాలకు అధికారులు లైసెన్స్లు జారీ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500, 220 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న నిబంధన, ఇళ్లు, పాఠశాలలకు దగ్గరగా ఏర్పాటు చేయడంపై మహిళలు, స్థానికుల తీవ్ర అభ్యంతరాలతో దుకాణాల ఏర్పాటు నెమ్మదిగా సాగుతోంది. ఈ నెల 18వ తేదీ వరకు 534 దుకాణాలకుగాను 424 దుకాణాలు ఏర్పాటయ్యాయి. దుకాణదారులే ‘బెల్టు’ నిర్వాహకులు... మద్యం కొత్త పాలసీ వచ్చిన తరువాత పైన పేర్కొన్న కారణాల వల్ల దుకాణాల ఏర్పాటు ఆలస్యం కావడంతో దుకాణదారులు తమ సిబ్బందితోనే పాత దుకాణాలకు సమీపంలోని ఇళ్లు, బడ్డీ కొట్లు, ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ మద్యం విక్రయిస్తున్నారు. ఇలా 24 గంటలపాటు మద్యం అందుబాటులో ఉంచారు. 25 శాతం పెరిగిన అమ్మకాలు... దుకాణాలు పూర్తిగా ఏర్పాటు కాకపోయినా మద్యం అమ్మకాలు మాత్రం 25 శాతం పెరగడం బెల్టు దుకాణాలు ఏ స్థాయిలో ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఉదహరణకు రాజమహేంద్రవరం మద్యం డిపో పరిధిలో గత నెల 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు(మద్యం పాత పాలసీ) రూ.30 కోట్ల అమ్మకాలు జరగ్గా ఈ నెల 1 నుంచి 18వ తేదీ వరకు (మద్యం కొత్త పాలసీ) రూ.37 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ డిపో పరిధిలో రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ పరిధిలోని ఏడు సర్కిళ్లు (రాజమహేంద్రవరం ఉత్తరం, దక్షిణం, ఆలమూరు, రాయవరం, కొరుకొండ, అడ్డతీగల, రంపచోడవరం) అమలాపురం సర్కిల్ పరిధిలోని రెండు (రామచంద్రపురం, కొత్తపేట) వెరసి తొమ్మిది సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలోని 229 దుకాణాలకుగాను 221 దుకాణాలకు లాటరీ తీసి లైసెన్స్లు జారీ చేశారు. 221 దుకాణాలకుగాను 181 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇంకా 40 దుకాణాలు (18 శాతం) ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే గత నెల ఈ నెల 1 నుంచి 18వ తేదీకి మధ్య జరిగిన మద్యం అమ్మకాల మొత్తాన్ని పరిశీలిస్తే దాదాపు 25 శాతం పెరగడం బెల్టు దుకాణాల ఎలా ఏర్పాటు చేశారో స్పష్టమవుతోంది. సూత్రధారులను వదిలి పాత్రధారులపై ప్రతాపం... ఎక్సైజ్ అధికారులు చెబుతున్న 284 కేసుల నమోదు, 289 మంది అరెస్ట్లు కేవలం ఆ సమయంలో అక్కడ మద్యం అమ్ముతున్న వారిపై నమోదు చేసినవే. కానీ ఆయా బెల్టు షాపులు ఏర్పాటు చేసిన, చేయించిన, మద్యం సరఫరా చేసిన దుకాణదారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చేయాలి కాబట్టి ఏదో తూతూ మంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేసి రికార్టుల పరంగా ఉన్నతాధికారులుకు చూపిస్తున్నారు. కానీ నిబద్ధతతో బెల్టు షాపులు నిర్మూలించాలని క్షేత్ర స్థాయిలోని అధికారులు పని చేస్తున్న దాఖలాలు లేవు. పనిచేస్తే కాలిపోతామంటూ కొందరు ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బంది పని తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిబంధనల ప్రకారం మద్యం దుకాణం ఏర్పాటు, నిర్ణీత సమయంలో మాత్రమే అమ్మకాలు జరిగేలా చూడడం, బెల్టు దాకాణాల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపడానికి అధికారులకు నిబద్ధత ఎంతో అవసరం. కొత్తగా బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి.. దుకాణాల ఏర్పాటు ఆలస్యం కావడంతో కొంత మంది బెల్టు షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించారు. మే, జూన్ నెలల్లో బెల్టు షాపులపై దాడులు చేసి 284 కేసులు నమోదు చేశాం. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో బుధవారం నుంచే దాడులు చేస్తున్నాం. బెల్టు షాపుల ఏర్పాటుకు ప్రోత్సహించిన మద్యం వ్యాపారులు, వారికి మద్యం సరఫరా చేసే మద్యం దుకాణదారులపై కూడా ఇకపై కేసులు నమోదు చేస్తాం. – బి. అరుణారావు, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, కాకినాడ -
అంబా...అని అరిచినా...
ఒకే రోజు 20 ఆవుల మృత్యువాత కమిటీ సభ్యుల నిర్లక్ష్యం బట్టబయలు ఏడాదిగా విమర్శలున్నా పట్టించుకోని అధికారులు కాకినాడ రూరల్: గోవు సర్వ దేవతల స్వరూపమని హిందూ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అందుకే గోవును హిందువులు తల్లి లాంటిదని, పాలిచ్చి పెంచేదని, అది ఎంతో పవిత్రమైందిగా భావిస్తూ దాన్ని గోమాతగా పూజిస్తారు. సంక్రాంతి పండుగ సమయంలో చేసే ముత్యాల ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టేందుకు ఆవుపేడను ఉపయోగిస్తారంటే దాని ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. అలాంటి పవిత్ర గోమాతలకు రక్షణగా ఉండాల్సిన జంతు హింస నివారణ సంఘం ఆశ్రమ కమిటీ సభ్యులు నిర్లక్ష్యం చూపించడంతో ఆవులు చనిపోవడం ప్రారంభించాయి. ఈ ఆవరణంతా బురద, దోమలు, అడుగు వేస్తే ఊబిలో దిగబడిపోయే విధంగా ఉండడంతో గత ఐదారు రోజులుగా వందలాది ఆవులు ఒంటి కాళ్లపై నిలబడి ఉండడం, సరైన పశుగ్రాసం లేకపోవడంతో మృత్యువాత పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 20కి పైగా ఆవులు చనిపోవడం చూస్తే నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు, ఇతరేతర సంఘాలకు చెందిన వారు స్థానికంగా రోడ్లపై తిరిగే ఆవులను, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా గోవధకు తరలిస్తున్న ఆవులను పట్టుకొని ఈ సంఘ సభ్యులకు అప్పగిస్తారు. తీరా ఇక్కడకు వచ్చిన తరువాత మేత లేకపోవడంతో అనేక ఆవులు మృత్యువాత పడుతుంటాయి. మరికొన్ని ఆవులను ఇక్కడ నుంచి తరస్తుంటారు... అయితే ఇవి ఎక్కడికి తరలిస్తారనేది ఎవరికీ తెలియని ప్రశ్నగానే ఉందని స్థానికులు అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ మొత్తం దాతల విరాళాలపైనే నడుస్తుంది. గతంలో ప్రభుత్వం ఈ సంస్థ నిర్వహణకు కొంత నిధులు కేటాయించేదని, సంఘం తమదంటే తమదని రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల కోర్టుకు వెళ్లడంతో నిధులు నిలిపివేయడంతో కొత్త చిక్కులు ఏర్పడ్డాయని సంఘ సభ్యులే చెబుతున్నారు. తరువాత పూర్తిగా విరాళాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. సంరక్షణ సరిగ్గా లేక... గోవులకు మేత కూడా సరిగ్గా వేయకపోవడంతో అవి బక్కచిక్కి మృత్యువాత పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవగాహన లేకపోవడంతో ఇష్టమొచ్చిన రీతిగా కోత గడ్డికి బదులుగా మిషన్ గడ్డిని పెట్టడంతో అవి తినలేక బక్కచిక్కి ఆకలితో అలమటిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు ఒక్కో ఆవుకు 11 కేజీల పచ్చిగడ్డి పెట్టాలి. కాని ఇక్కడ పచ్చిగడ్డి అనేదే కనిపించదు. కదిలిన అధికార యంత్రాంగం... ఈ ప్రాంగణంలో ఒకే రోజు 20కి పైగా ఆవులు చనిపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. పశుగ్రాసం కరువుతోనే ఆవులు మరణించినట్లు అధికారులు నిర్థారించారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా పశువైద్య జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్టీవో రఘుబాబుల పర్యవేక్షణలో 27 మంది పశువైద్యులు బుధవారం ఉదయమే జంతుహింస నివారణ సంఘానికి చేరుకొని పశువులకు ఇంజెక్షన్లు చేశారు. 10 నుంచి 20 వరకు ఆవులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. అధికారులు విచారణ చేస్తున్న సమయంలో సంఘ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఒకానొక సమయంలో ముష్టి ఘాతాలకు దిగారు. ప్రస్తుతం ఉన్న సంఘాన్ని రద్దు చేసి, స్థానికంగా ఉన్న పెద్దలకు నిర్వహణ అప్పగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. మూగ జీవులను అమ్ముకొంటున్నారని ఉన్న జీవాలకు కనీసం గడ్డి కూడా వేయడంలేదంటూ స్థానికులు అధికారుల ఎదుట ఆందోళన చేశారు. దీనిపై పూర్తి విచారణ చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తానని జేడీ వెంకటేశ్వరరావు వివరించారు. ప్రత్యేక జేసీబీతో ఆ ప్రాంతంలో ఉన్న ఊబిలా మారిన బురదను తొలగించే పనులు చేపట్టారు. ఈ విచారణ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆలీంబాషా, కాకినాడ అర్బన్ తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయం పెరిగినా.. సమస్యలే సమస్తం
- పంచాయతీల దుస్థితి - పన్నుభారం మోపినా అదే పరిస్థితి - పాలకవర్గాలు లేనిచోట మరింత అధ్వానం - పట్టించుకునే నాథుడే కరువు అమలాపురం : పంచాయతీల్లో ఇంటి పన్నుతోపాటు పనిలో పనిగా ఆస్తి విలువ కూడా పెంచిన చంద్రబాబు సర్కారు సామాన్యులపై మోయలేనంత భారం మోపింది. ఇలా పన్నులు పెంచడం ద్వారా పంచాయతీల సాధారణ నిధులు పెరుగుతాయని, చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. తీరా చూస్తే పెంచిన పన్ను మొత్తాన్ని నిలబెట్టి వసూలు చేస్తున్న పంచాయతీ పాలకులు, అధికారులు.. ఆయా గ్రామాల్లో సమస్యల పరిష్కారాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. కోటి రూపాయల ఆదాయం పెరిగిన పంచాయతీల్లో సహితం వేల రూపాయల్లో ఖర్చయ్యే పనులు కూడా చేపట్టడం లేదు. ప్రజారోగ్యానికి కీలకమైన తాగునీటి సరఫరా, మురుగునీటి డ్రైన్ల ఆధునికీకరణ వంటి వాటిని పట్టించుకోవడంలేదు. రోడ్ల గురించైతే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. గోతులు పడి, కొద్దిపాటి వర్షానికే అవి బురదమయమవుతున్నాయి. చాలా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో తాగునీరందడంలేదు. విద్యుద్దీపాలు కూడా వెలగక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలను ఆనుకొని ఉన్న పలు గ్రామాల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు పట్టణాలకన్నా నగరాలను ఆనుకొని ఉన్న పంచాయతీల్లో అపార్ట్మెంట్లు, భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. హైవేలు, ప్రధాన రహదారులకు చేరువలో కమర్షియల్ కాంప్లెక్సులు సహితం ఏర్పాటవుతున్నాయి. దీంతో ఈ పంచాయతీల ఆదాయం రెండు మూడు రెట్లు పెరిగింది. విచిత్రంగా ఇక్కడే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో ఆయా పంచాయతీలను విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం, దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టులను ఆశ్రయించడంతో అక్కడ ఎన్నికలు లేకుండా పోయాయి. ఫలితంగా ఆయా పంచాయతీల్లో అధికారుల పాలనే సాగుతోంది. ప్రజల తరఫున ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పట్టించుకునేవారే లేకుండా పోయారు. అనపర్తి మేజర్ పంచాయతీ పరిస్థితి కూడా అంతే. వందలు, వేల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పంచాయతీ చూసినా సమస్యలే.. - రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను ఆనుకొని ఉన్న పంచాయతీల ఆదాయం రెండు మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం నగర విస్తరణ అంతా పంచాయతీల్లోనే సాగుతోంది. ముఖ్యంగా హకుంపేట, ధవళేశ్వరం, బొమ్మూరు, కోలమూరుల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి గణనీయంగా పెరిగింది. ఇంటి పన్నులు పెంచడంతో ›ప్రతి పంచాయతీ ఆదాయం రూ.కోటికి పైగా పెరిగింది. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రధాన డ్రైన్ల నిర్మాణం జరగడం లేదు. దీంతో జనావాసాలను మురుగునీరు ముంచెత్తుతోంది. ఈ పంచాయతీలకు పాలకవర్గం లేదు. నగరంలో విలీన ప్రతిపాదనతో ఈ పంచాయతీలకు ఎన్నికలు లేవు. అధికారుల పాలనలో వీటిల్లో అభివృద్ధి అతీగతి లేకుండా పోయింది. - కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ ఆదాయం రూ.3 కోట్లకు చేరింది. ఇంద్రపాలెం, వాకలపూడి, వలసపాకల, తూరంగి పంచాయతీల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఆదాయంతోపాటు ఈ గ్రామాల్లో సమస్యలు కూడా పెరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. రమణయ్యపేటలో డ్రైనేజీ సమస్యల తీవ్రంగా ఉంది. నూతన నిర్మాణాలకు అనుగుణంగా ఇక్కడ డ్రైనేజీలను విస్తరించకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కొద్దిపాటి వర్షం వస్తే చాలు రహదారులు ముంపునకు గురవుతున్నాయి. - అనపర్తి పంచాయతీకి ప్రస్తుతం పాలకవర్గం లేదు. దీనిని ప్రభుత్వం నగర పంచాయతీగా ప్రకటించగా, వివాదం కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు లేకుండాపోయాయి. ఒకవిధంగా ఇది మున్సిపాలిటీతో సమానం. అధికారుల పాలన పుణ్యమా అని స్థానికుల సమస్యలను పట్టించుకునేవారే లేరు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. - సామర్లకోట మండలం వేట్లపాలెంలో పంచాయతీ ఆదాయం గతంలో రూ.52 లక్షలు కాగా, ఇప్పుడు ఆదాయం రూ.1.20 కోట్లు. ఆదాయం రెట్టింపైనా ఇక్కడ డ్రైన్లు, రోడ్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి. - అమలాపురం మండలం ఈదరపల్లి పంచాయతీ ఆదాయం రూ.8 లక్షలు కాగా, ఇప్పుడు ఏకంగా ఐదురెట్లు పెరిగి రూ.40 లక్షలు అయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కామనగరువు పంచాయతీ ఆదాయం రెండు రెట్లు పెరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు. - జిల్లాలోని కీలకమై గ్రామ పంచాయతీల్లో రావులపాలెం ఒకటి. కోనసీమకు ఒకవిధంగా వాణిజ్య రాజధాని. ఈ పంచాయతీ ఆదాయం రూ.1.24 కోట్లకు పెరిగింది. ఇక్కడ ప్రధాన డ్రైన్, దాని నిర్వహణ తీరు చూస్తే ప్రజలపై పాలకులకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. పట్టణంలో దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. -
జాతీయ ప్లీనరీలో జిల్లాకు పెద్దపీట
– మూడో తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షుడు కన్నబాబు – జిల్లా సమస్యల ప్రస్తావనకు వేదికైన వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీ - జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ – చంద్రబాబు అవినీతి చక్రవర్తి పుస్తకంపై జిల్లాలో విస్తృత చర్చ సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీలో తూర్పు గోదావరి జిల్లాకు సముచిత స్థానం దక్కింది. జిల్లాలోని ప్రధాన సమస్యలు ప్రస్తావించేందుకు పార్టీ అవకాశం ఇవ్వడంతో ప్లీనరీలో మూడో తీర్మానాన్ని ప్రవేశ పెట్టే ఛాన్స్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు లభించింది. జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలు చర్చించేందుకు జాతీయ ప్లీనరీ కూడా వేదికైంది. జ్వరాల జిల్లాను ఆదుకోండి... గుంటూరు వేదికగా జరుగుతున్న వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీలో శనివారం మధ్యాహ్నం 1.05 గంటల సమయంలో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మూడో తీర్మానం ప్రవేశపెట్టారు. పౌష్టికాహారం లోపంతో చాపరాయి వంటి గిరిజన గ్రామాలకు చెందిన వారంతా మృత్యువాత పడుతున్నారని, కనీస సౌకర్యాల్లేక సతమతమవుతున్నారని, గిరిజనులను ఆదుకోవాలని కోరారు. విష జ్వరాలు, మలేరియా జ్వరాలు, ఇతరత్రా వ్యాధులతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరణాలు సంభవిస్తున్న ప్రతిసారీ ఏజెన్సీలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏజెన్సీలో పర్యటించి, గిరిజనులకు సహాయం చేసి భరోసా ఇచ్చారే తప్ప ప్రభుత్వం సాయం అందించలేదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోదావరి డెల్లా ఆధునికీకరణ దారుణంగా తయారైందని, వైఎస్సార్ హయాంలో గొప్పగా చేపట్టిన కార్యక్రమాన్ని చంద్రబాబు పాలనలో అధ్వానంగా మార్చారని, ఆధునికీకరణ జరిగేలా చూడాలని కోరారు. ఇంటి పన్నులు భారీగా పెంచేశారని, ఇందిరమ్మ ఇళ్లకు రూ.100గా ఉన్న పన్నును రూ.1000 వరకూ చేశారని, పెంచిన పన్నును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపురం ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని, కాసుల కోసం అన్నట్టుగా పనులు చేపడుతున్నారని, కాంట్రాక్టులు, ముడుపుల కోసం కాకుండా నిర్వాసితుల కోసం ఆలోచించాలని కోరుతూ తీర్మానం ప్రవేశం పెట్టారు. కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్తు అందించాలని, లంక గ్రామాల్లో కోతలను అరికట్టేందుకు గ్రోయిన్లు నిర్మించాలని, కాటవరం, చాగల్నాడు. కలవచర్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని, ర్యాలీ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, జగ్గంపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని, కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ, మండపేట ఇళ్ల నిర్మాణాల్లో జరిగే అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించాలని, టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతుల్లో చేపడుతున్న పనులు రద్దు చేయాలని, బీసీల అభివృద్ధిపైన టీడీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తక్షణమే సానుకూలంగా స్పందించాలంటూ తదితర డిమాండ్లు చేశారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. వీటికి జాతీయ ప్లీనరీలో ఆమోదం తెలపాలని నాయకులను కోరారు. అవినీతి చక్రవర్తిపై జిల్లాలో చర్చ... వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీ వేదికపై ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి’ పేరుతో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవిష్కరించిన పుస్తకంపై జిల్లాలో విస్తృత చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో బినామీలను రంగంలోకి దించి పెద్ద అవినీతికి పాల్పడగా, ఇప్పుడు రాజధాని, విశాఖలో భూకుంభకోణాలకు పాల్పడి లక్షల కోట్లు ఆర్జించినట్టుగా ఆధారాలతో సహా పుస్తకాల ప్రచురించడం ప్రాధాన్యతకు సంతరించుకుంది. 66 కుంభకోణాలకు పాల్పడి రూ.3.75 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడారని తెలియగానే ప్లీనరీ జరిగిన గుంటూరు వేదిక ప్రాంగణంలోనే కాదు జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడీ అవినీతి చక్రవర్తి పుస్తకం హాట్ టాపిక్గా మారింది. వేలాదిగా తరలి వెళ్లిన నేతలు... జాతీయ ప్లీనరీ జరుగుతున్న గుంటూరుకు శనివారం ఉదయం జిల్లా నేతలు భారీగా తరలివెళ్లారు. వైఎస్సార్ జయంతి వేడుకలు ముగించుకొని నేతలంతా అక్కడికి పయనమయ్యారు. నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నేతలు భారీగా తరలి వెళ్లడంతో గుంటూరు ప్రాంగణంలో జిల్లా మార్క్ స్పష్టంగా కనిపించింది. -
ఇసుక మస్కా...
మూతపడిన ర్యాంపులు గడువుకు ముందే జాగ్రత్తపడిన ఇసుకాసురులు భారీగా పోగేసుకున్న ఇసుక నిల్వలు వదరలతో స్తంభించిన తవ్వకాలు నిల్వచేసి పదిరెట్ల హెచ్చు ధరలకు విక్రయాలు ఉచిత ఇసుక విధానం అభాసుపాలు అమలాపురం : ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం మరోసారి అభాసుపాలైంది. గోదావరికి వరద పోటు తగిలిందో లేదో, అక్రమార్కులు చెలిరేగిపోతున్నారు. ఒకవైపు ప్రధాన ర్యాంపుల గడువు పూర్తికావడం.. వరద వల్ల తవ్వకాలు సాగకపోవడంతో...అడ్డదారిలో నిల్వ చేసిన ఇసుక ధరను ఏకంగా పదిరెట్లు పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. గోదావరికి వరదలను ఎదుర్కొనేందుకు కేవలం నెల రోజుల ముందు ఇరిగేషన్ అధికారులు సన్నహాలు చేస్తుంటారు. కాని ఇసుక అక్రమార్కులు మాత్రం ఇందుకు రెండు, మూడు నెలల ముందునుంచే వరద సమయంలో ఇసుక విక్రయాలకు భారీగా నిల్వలు చేయడం సర్వసాధారణం. ప్రభుత్వం ఉచిత ఇసుక అమలులోకి తెచ్చిన తరువాత కూడా నిల్వలు చేయడం మానలేదు. ప్రభుత్వ ఆధీనంలో ఇసుక విక్రయాలు జరగడం లేదని, అధికార టీడీపీకి ప్రజాప్రతినిధుల అండదండలతో వారి అనుచరులే ర్యాంపుల్లో పాగా వేసి విక్రయాలు చేస్తున్నారనడానికి ఈ నిల్వలు చూస్తేనే అర్థమవుతోంది. గోదావరికి వరద పోటు తగలకముందే ర్యాంపుల సమీపంలోని రహస్య ప్రాంతాల్లోను, ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకన్నట్టుగా ఇసుకను భారీ ఎత్తున నిల్వచేశారు. ఎప్పుడైతే తవ్వకాలు దాదాపుగా నిలిచిపోయాయో.. అక్రమార్కులు ఇసుక ధరలను ఇష్టానుసారం పెంచేశారు. ఉచిత ఇసుక వల్ల ర్యాంపుల నిర్వహణ, తవ్వకాలకు యూనిట్కు రూ.125 చొప్పున ధర నిర్ణయించారు. ర్యాంపుల్లో యూనిట్కు రూ.500 చొప్పున అనధికారికంగా వసూళ్లు జరిగేవి. ఎప్పుడైతే తవ్వకాలు నిలిచిపోయాయో అనధికార నిల్వల వద్ద యూనిట్ ధర రూ.2 వేలు చేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. పనిలో పనిగా లారీ రవాణా చార్జీలను సైతం పెంచేశారు. ఆత్రేయపురం నుంచి అమలాపురం ఒకప్పుడు మూడు యూనిట్ల ఇసుక రవాణాకు రూ.4 వేలు వరకు అవగా, ఇప్పుడది రూ.9 వేలు పలుకుతోంది. జిల్లాలో సీతానగరం మండలం ముగ్గుళ్ల, వంగలపూడి, కపిలేశ్వరపురం, వేమగిరి, జొన్నాడ వంటి ర్యాంపులు గడువు ముగియడంతో తవ్వకాలు నిలిపివేశారు. మిగిలిన ర్యాంపుల్లో వరదల వల్ల తవ్వకాలు ఆగాయి. జొన్నాడకు తిరిగి అనుమతి వచ్చినా వరదల వల్ల తవ్వకాలు చేసే అవకాశం లేదు. ఇవన్నీ ముందే ఊహించిన అక్రమార్కులు పలు ప్రాంతాల్లో ఇసుక నిల్వలు చేశారు. నిర్మాణాల కోసమంటూ 20 నుంచి 50 యూనిట్ల చొప్పున ఇసుక నిల్వ చేశారు. కొత్తపేట, పి.గన్నవరం, రాజమహేంద్రవరం నగరం, రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇసుక నిల్వలున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఎక్కువుగా ఇసుక నిల్వలున్నాయి. అధికారులు దాడులు చేసినా ఇళ్ల నిర్మాణాల కోసమంటూ అక్రమార్కులు చెప్పుకునేందుకు వీలుచిక్కుతోంది. ఇటీవల ఆత్రేయపురం మండలం అంకంపాలెం, రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు, రావులపాలెం శివారు గౌతమీ ఏటిగట్టు వద్ద ఇసుక నిల్వలను అధికారులు సీజ్ చేశారు. అయితే రెండు మండలాల్లో ఇంతకు పదిరెట్లు ఇసుక నిల్వలున్నట్టు అంచనా. ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక నిల్వలపై దాడులు చేసి వాటిని తమకు తక్కువ ధరకు అందించాలని సామాన్యులు కోరుతున్నారు. -
తొలి అడుగు.. తడబాటు..
- జీఎస్టీపై కానరాని స్పష్టత - సర్వత్రా గందరగోళం - ముందుకు సాగని వ్యాపారాలు - పాత తేదీలపై అమ్మకాలు అమలాపురం : వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు లేవు.. నగల షాపుల్లో బోణీలు లేవు.. ఎలక్ట్రానిక్ షాపులు వెలవెలబోతున్నాయి. హోల్సేల్ షాపుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు నిలిచిపోయాయి. సెల్ఫోన్ షాపులు.. సిమెంట్.. ఐరన్.. చివరకు ఒక మోస్తరు హోటళ్ల వద్ద సహితం కొనుగోళ్లు లేవు. బయటి నుంచి లోడుతో వచ్చే లారీలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రారంభం కావడంతో.. జిల్లాలోని వాణిజ్య కేంద్రాల వద్ద అనధికార బంద్ వాతావరణం నెలకొంది. కొత్త పన్ను విధానంపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా గందరగోళం కనిపిస్తోంది. వ్యాపారం చేయాలంటే ఒకరకమైన భయం. జీఎస్టీవలన లాభమే తప్ప నష్టం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నా.. భయపడాల్సిన పని లేదని వాణిజ్య పన్నుల శాఖాధికారులు చెబుతున్నా.. వ్యాపారులు ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నారు. తొలి అడుగులోనే తడబడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యాపారులు ఎదుర్కొంటున్న పెద్ద ఆర్థిక సంక్షోభంగా జీఎస్టీ అమలు మారింది. వెలవెలబోతున్నాయిలా.. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రెండో రోజు కూడా మార్కెట్లను చూస్తుంటే అనధికార బంద్ వాతావరణం కనిపిస్తోంది. గడచిన రెండు రోజులుగా రోజువారీ జరిగే వ్యాపారం 30 శాతం కూడా జరగకపోవడం గమనార్హం. - రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు పలు మున్సిపాలిటీలు, ప్రధాన గ్రామాల్లో ఆదివారం వ్యాపార సముదాయాలకు సెలవు. కానీ అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి మున్సిపాలిటీలు, వస్త్ర వ్యాపార కేంద్రమైన ద్వారపూడి వంటి కీలక వాణిజ్య కేంద్రాల్లో సెలవు లేదు. కానీ, ఇక్కడ కూడా ఆదివారం పెద్దగా వ్యాపారం సాగలేదు. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత పన్ను శాతం తగ్గి.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రచారం జరిగింది. కానీ వాటి అమ్మకాలు సహితం భారీగా పడిపోయాయి. - ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన రాజమహేంద్రవరంలో నిత్యావసర వస్తువుల దిగుమతి దాదాపుగా నిలిచిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో ప్రతి రోజూ నిత్యావసర వస్తువులతోపాటు, వస్త్రాలు, ఇతర సరుకులు సుమారు 500 లారీల దిగుమతులు జరిగేవి. ఇప్పుడు 25 లారీల సరుకు కూడా రావడం లేదు. - ఇవే కాకుండా అమలాపురం, కాకినాడల్లో బంగారు దుకాణాలు ఖాళీగా దర్శినమిస్తున్నాయి. - ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్ల అమ్మకాలు వంటివే కాదు.. చివరకు మాల్స్, హోల్సేల్ మార్కెట్లలో సహితం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. చివరకు ఒక మోస్తరు హోటళ్లలో కూడా అమ్మకాలు పెద్దగా ఉండడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. - దీనికితోడు జీఎస్టీపై స్పష్టత లేకపోవడంతో చాలామంది పెద్ద వ్యాపారులు విక్రయాలను దాదాపు నిలిపివేశారు. జీఎస్టీ పేరెత్తితే చిరు వ్యాపారులు సహితం వణికిపోతున్నారు. పాత తేదీలతోనే అమ్మకాలు ఈ నెల ఒకటిన నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చినా పది రోజుల వరకూ వ్యాపారులను ఇబ్బంది పెట్టకూడదని, చూసీచూడనట్టుగా ఉండాలని వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ధీమాతో కొంతమంది వ్యాపారులు మాత్రం పాత తేదీలతో విక్రయాలు జరుపుతున్నారు. స్థానికంగా కొంతమంది జీఎస్టీలో బిల్లులు కొడుతున్నా ఇవి పెద్ద హోటళ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. పెద్దపెద్ద కంపెనీలు, హోల్సేల్ వస్త్ర, కిరాణా, ఇతర వ్యాపారులు జిల్లాకు తమ ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేశారు. కొందరు ఎగుమతులు చేస్తున్నా పాత తేదీల్లోనే బిల్లులు పంపుతున్నారు. దీంతో స్థానిక వ్యాపారులకు స్పష్టత రావడం లేదు. -
తొలి అడుగు.. తడబాటు..
- జీఎస్టీపై కానరాని స్పష్టత - సర్వత్రా గందరగోళం - ముందుకు సాగని వ్యాపారాలు - పాత తేదీలపై అమ్మకాలు అమలాపురం : వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు లేవు.. నగల షాపుల్లో బోణీలు లేవు.. ఎలక్ట్రానిక్ షాపులు వెలవెలబోతున్నాయి. హోల్సేల్ షాపుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు నిలిచిపోయాయి. సెల్ఫోన్ షాపులు.. సిమెంట్.. ఐరన్.. చివరకు ఒక మోస్తరు హోటళ్ల వద్ద సహితం కొనుగోళ్లు లేవు. బయటి నుంచి లోడుతో వచ్చే లారీలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రారంభం కావడంతో.. జిల్లాలోని వాణిజ్య కేంద్రాల వద్ద అనధికార బంద్ వాతావరణం నెలకొంది. కొత్త పన్ను విధానంపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా గందరగోళం కనిపిస్తోంది. వ్యాపారం చేయాలంటే ఒకరకమైన భయం. జీఎస్టీవలన లాభమే తప్ప నష్టం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నా.. భయపడాల్సిన పని లేదని వాణిజ్య పన్నుల శాఖాధికారులు చెబుతున్నా.. వ్యాపారులు ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నారు. తొలి అడుగులోనే తడబడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యాపారులు ఎదుర్కొంటున్న పెద్ద ఆర్థిక సంక్షోభంగా జీఎస్టీ అమలు మారింది. వెలవెలబోతున్నాయిలా.. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రెండో రోజు కూడా మార్కెట్లను చూస్తుంటే అనధికార బంద్ వాతావరణం కనిపిస్తోంది. గడచిన రెండు రోజులుగా రోజువారీ జరిగే వ్యాపారం 30 శాతం కూడా జరగకపోవడం గమనార్హం. - రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు పలు మున్సిపాలిటీలు, ప్రధాన గ్రామాల్లో ఆదివారం వ్యాపార సముదాయాలకు సెలవు. కానీ అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి మున్సిపాలిటీలు, వస్త్ర వ్యాపార కేంద్రమైన ద్వారపూడి వంటి కీలక వాణిజ్య కేంద్రాల్లో సెలవు లేదు. కానీ, ఇక్కడ కూడా ఆదివారం పెద్దగా వ్యాపారం సాగలేదు. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత పన్ను శాతం తగ్గి.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రచారం జరిగింది. కానీ వాటి అమ్మకాలు సహితం భారీగా పడిపోయాయి. - ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన రాజమహేంద్రవరంలో నిత్యావసర వస్తువుల దిగుమతి దాదాపుగా నిలిచిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో ప్రతి రోజూ నిత్యావసర వస్తువులతోపాటు, వస్త్రాలు, ఇతర సరుకులు సుమారు 500 లారీల దిగుమతులు జరిగేవి. ఇప్పుడు 25 లారీల సరుకు కూడా రావడం లేదు. - ఇవే కాకుండా అమలాపురం, కాకినాడల్లో బంగారు దుకాణాలు ఖాళీగా దర్శినమిస్తున్నాయి. - ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్ల అమ్మకాలు వంటివే కాదు.. చివరకు మాల్స్, హోల్సేల్ మార్కెట్లలో సహితం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. చివరకు ఒక మోస్తరు హోటళ్లలో కూడా అమ్మకాలు పెద్దగా ఉండడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. - దీనికితోడు జీఎస్టీపై స్పష్టత లేకపోవడంతో చాలామంది పెద్ద వ్యాపారులు విక్రయాలను దాదాపు నిలిపివేశారు. జీఎస్టీ పేరెత్తితే చిరు వ్యాపారులు సహితం వణికిపోతున్నారు. పాత తేదీలతోనే అమ్మకాలు ఈ నెల ఒకటిన నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చినా పది రోజుల వరకూ వ్యాపారులను ఇబ్బంది పెట్టకూడదని, చూసీచూడనట్టుగా ఉండాలని వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ధీమాతో కొంతమంది వ్యాపారులు మాత్రం పాత తేదీలతో విక్రయాలు జరుపుతున్నారు. స్థానికంగా కొంతమంది జీఎస్టీలో బిల్లులు కొడుతున్నా ఇవి పెద్ద హోటళ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. పెద్దపెద్ద కంపెనీలు, హోల్సేల్ వస్త్ర, కిరాణా, ఇతర వ్యాపారులు జిల్లాకు తమ ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేశారు. కొందరు ఎగుమతులు చేస్తున్నా పాత తేదీల్లోనే బిల్లులు పంపుతున్నారు. దీంతో స్థానిక వ్యాపారులకు స్పష్టత రావడం లేదు. -
ఆపదవేళ.. ఆప్తబంధువులా..
- చాపరాయి బాధితులను పరామర్శించిన జగన్ - గిరిజనుల్లో భరోసా నింపిన వైఎస్సార్ సీపీ అధినేత - అభయారణ్యం, ప్రమాదకర ఘాట్లో 70 కిలోమీటర్లు సాగిన ప్రయాణం సాక్షి, రాజమహేంద్రవరం : ఎవరిని కదిపినా కన్నీళ్లే. ఏ ఒక్కరిని పలుకరించినా కష్టాలే. తమకు జరిగిన అన్యాయాన్ని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తలచుకొని ఆ అడవి బిడ్డలు కొండలు ప్రతిధ్వనించేలా రోదిస్తున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన అభాగ్యులు.. తల్లీబిడ్డలను కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న బాధితులు.. ఇలా ఒకరేమిటి? అనేకమంది బాధిత గిరిజనుల కన్నీళ్లు తుడిచే సదాశయంతో వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏజెన్సీలో పర్యటించారు. బాధిత గిరిజన కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఎంత కష్టమైనా వెనుకాడలేదు. దట్టమైన అభయారణ్యంలో.. ఘాట్ రోడ్డు మీదుగా.. సాహసోపేతంగా పయనించి గిరిజనుల చెంతకు వెళ్లారు. కొండంత కష్టాల్లో ఉన్న వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఆదుకుంటానని చెప్పి కొండంత ధైర్యం ఇచ్చారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి బాధితులను శనివారం ఉదయం పరామర్శించిన జగన్.. అనంతరం మారేడుమిల్లి మీదుగా చాపరాయి గ్రామానికి వెళ్లారు. మారేడుమిల్లి నుంచి దట్టమైన అడవి, ఘాట్ రోడ్డులో ప్రయాణించి మధ్యాహ్నం రెండు గంటలకు ఆ గ్రామానికి చేరుకున్నారు. మార్గం మధ్యలోని గ్రామాల్లో తనకోసం ఎదురు చూస్తున్న గిరిజనుల సమస్యలు వింటూ, వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ తన పయనం సాగించారు. ఆకుమామిడికోట, బొడ్డుమానివీధి, విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం బొడుగుమామిడి, పోతవరం, రంపచోడవరం నియోజకవర్గం దారగడ్డ, యొడ్లకొండ గ్రామాల్లో తనకోసం రోడ్డుపైకి వచ్చిన గిరిజనులు చూసిన ఆగిన జగన్.. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ఆయా గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, యువకులు తమ సమస్యలను జగన్కు మొర పెట్టుకున్నారు. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. తాగడానికి కనీసం గుక్కెడు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వాగుల్లో నీరు తాగుతున్నామని, స్నానానికి వర్షపు నీటిని వాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఆస్పత్రికి వెళదామన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బోరుమన్నారు. నీరు నిలిచి ఉండడంతో దోమలు పెరిగిపోతున్నాయని వాపోయారు. పాకల్లో ఉంటున్న తమకు ప్రభుత్వం తమకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. 70 ఏళ్లు వచ్చినా పింఛన్ ఇవ్వడం లేదని వాపోయారు. మాకు మీరే దిక్కు ‘‘ఇవే సమస్యలతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. మాకు మంచినీరు, తిండి, రోడ్లు వేయించండి. మీరే మాకు దిక్కు. మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి’’ అంటూ ఆయా గ్రామాల గిరిజనులు జగన్కు విన్నవించారు. వారి కష్టాలను, సమస్యలను సావధానంగా విన్న జగన్.. అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని చెప్పారు. తోలు మందం చంద్రబాబుకు సమస్యలు చెప్పినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అయినా విడవకుండా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేద్దామని భరోసా ఇచ్చారు. స్థానికంగా పరిష్కారమయ్యే పింఛన్లు, రేషన్ కార్డులవంటి వాటిని పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరిలకు సూచించారు. ఆయా గ్రామాల ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను తీసుకున్నారు. ప్రతిపక్షంగా సమస్యల పరిష్కారంపై పోరాడదామని, మన ప్రభుత్వం వచ్చాక అందిరికీ మంచి చేస్తామని హామీ ఇచ్చారు. చేయి ఇచ్చి నడిపించిన గిరిజనులు గ్రామాల్లో వాగులు, వంకలు దాటేందుకు స్థానిక గిరిజనులు జగన్కు సహాయం చేశారు. తమ చేతిని అందించి జగన్ను తమ ఊరి నుంచి సాగనంపారు. కటారికోట గ్రామంలో కర్రెల వంతెనను ఓ మహిళ జగన్ చేయిపట్టుకుని దాటించింది. కటారికోట దాటిన తర్వాత చాపరాయి గ్రామానికి మధ్య ఏడు కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వాహనాలు కొండలు ఎక్కలేకపోయాయి. జగన్ కాన్వాయ్లో సెక్యూరిటీ వాహనాలు చాపరాయికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. స్థానికంగా సమకూర్చిన వాహనంలో జగన్ చాపరాయి గ్రామం వెళ్లారు. వాగులు, వంకలు దాటి గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. వారిలో ధైర్యం నింపారు. అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జగన్ పర్యటనతో ఏజెన్సీ ప్రజల మోముల్లో తమ సమస్యలు ఇకనైనా తీరతాయన్న ఆనందం కనిపించింది. ఒక్కొక్కరి తలపై నిమురుతూ వారిని ఆప్యాయంగా పలుకరించడంతో ఆయా గ్రామాల్లో గిరిజనులు ఆనందంతో కంటతడిపెట్టారు. సీతమ్మ కొడుకు వైఎస్ జగన్ చాపరాయి గ్రామానికి వచ్చిన వై.రామవరం మండలం బొడ్డగండి నుంచి సీతమ్మ అనే వృద్ధురాలు వచ్చింది. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చిన సీతమ్మ.. చాపరాయి గ్రామంలో తమ పంచాయతీ సమస్యలను చెప్పుకొంది. జగన్తో ఆమె మాట్లాడుతూ ‘‘మా ఊరిలో తాగడానికి నీరు లేదు. రోడ్లు లేవు. ఎవ్వరూ పట్టించుకోవడంలేదు’’ అంటూ తమ సమస్యలు పరిష్కరించేందుకు సీతమ్మ కొడుకు వైఎస్ జగన్ వచ్చాడని ఆనందం వ్యక్తం చేసింది. ‘‘మాకు నీవే దిక్కు కొడుకా.. ఏమి చేస్తవో’’ అంటూ ఆప్యాయంగా మాట్లాడింది. సీతమ్మ కొడుకు జగన్ అని ఆమె అనగానే అక్కడ ఉన్న గిరిజనులు చప్పట్లతో హోరెత్తించారు. -
- జగనన్నా...చూడన్నా...
మరణశయ్యపై మన్యం - మలేరియా, విషజ్వరాలకు ప్రాణాలు అర్పణం - పట్టించుకోని పాలకులు - గిరిజన గ్రామాలకు కనీస వసతులు కరువు - జ్వరాల నివారణ చర్యలు శూన్యం - ప్రభుత్వ నిర్లక్ష్యంతో వైద్య పోస్టులు ఖాళీ - పల్లెలకు అందని వైద్య సేవలు - గ్రామాల్లో జరగని స్ప్రేయింగ్ - దోమతెరలకు అతీగతి లేదు - చాపరాయి ఘటనతోనైనా కనువిప్పు కలగదా? సాక్షి ప్రతినిధి, కాకినాడ : సాధారణంగా చినుకు పడితే ఊరూవాడా పులకరిస్తుంది. కానీ మన్యం పరిస్థితి వేరు. చినుకుల సీజన్ వస్తుందంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. రుతు పవనాలు ఇక్కడ మృత్యు పవనాలవుతున్నాయి. వరుణుడికంటే ముందే యముడు వస్తున్నట్టుగా ఉంటుంది. ప్రతి ఏటా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మన్యం మరణశయ్యగా మారిపోతుంది. అనారోగ్యానికి కేరాఫ్ అడ్రస్సుగా తయారవుతోంది. ఇంత జరుగుతున్నా ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రోగ నివారణ, నియంత్రణ, రక్షిత మంచినీరు, పౌష్టికాహారం, వైద్య సిబ్బంది పర్యవేక్షణ, మందుల సరఫరా, చికిత్స విషయాల్లో సరైన చర్యలు తీసుకోనందున గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఏటా వందల ప్రాణాల్ని మలేరియాకి, విషజ్వరాలకు అర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా మన్యం గజగజ ‘తూర్పు’ మన్యం ఏటా మరణాలతో గజగజలాడుతోంది. గతేడాది ఇదే సమయంలో కాళ్ల వాపు వ్యాధితో 16 మంది గిరిజనులు చనిపోయారు. ఇక, పౌష్టికాహారం లోపం, రక్తహీనతతో ఏడాది కాలంలో 60 మంది శిశువులు, బాలింతలు మృతి చెందారు. ఇప్పుడేమో ఒక్క చాపరాయిలోనే 16 మంది మరణించారు. మన్యంలో మలేరియా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎవరెక్కడ చనిపోతున్నారో తెలియని పరిస్థితి నెలకుంది. చాపరాయి ఘటన వెలుగు చూడకముందు జిల్లాలో అసలు మరణాలే లేవని అధికారులు బుకాయించారు. వాస్తవానికి ఇక్కడ జూన్ 8వ తేదీ నుంచి రోజుకొకరు, ఇద్దరు చొప్పున మరణిస్తూ వస్తున్నారు. కానీ, బయటి ప్రపంచానికి తెలియలేదు. ఒక్క చాపరాయిలోనే ఇలా ఉంటే ఏజెన్సీలోని 11 మండలాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల రికార్డుల ప్రకారం ఇప్పటివరకూ 2,979 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూన్లోనే వేలాదిగా కేసులొచ్చాయి. ఏటా ఇదే పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం అప్రమత్తమవడం లేదు. సగానికి పైగా గ్రామాల్లో మలేరియా తీవ్రత రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధుల్లోని 11 మండలాల్లో 1,180 గ్రామాలున్నాయి. వీటిలో అధిక గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల సంఖ్య 434గా గుర్తించారు. చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి పీహెచ్సీలు హైరిస్క్ జోన్లో నిలిచాయి. మలేరియా నియంత్రణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతోంది. గత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 2,187 మలేరియా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఈ ఏడాది జూన్ వరకు ఆ సంఖ్య 2,979గా ఉంది. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో 3 లక్షల దోమతెరలు పంపిణీ చేయాలి. ఈ మేరకు 2015లో ప్రతిపాదనలు పంపిస్తే గత ఏడాది లక్షా 35 వేల దోమతెరలు మాత్రమే మంజూరయ్యాయి. అవి కూడా పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. ఈ ఏడాది 2 లక్షల దోమతెరల కోసం ప్రతిపాదనలు పంపిస్తే ఇంతవరకూ ఒక్క దోమతెరను కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. నామమాత్రంగా స్ప్రేయింగ్ మలేరియా నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా యాంటీ లార్వా స్ప్రే చేయాలి. ప్రభుత్వం రెండేళ్లుగా విలీన మండలాల్లో స్ప్రేయింగ్ అనే మాటనే మరిచిపోయింది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 7 మండలాల్లో రెండు విడతలుగా చేయాల్సిన స్ప్రేయింగ్ను ఒక విడతే చేసినట్టు చెబుతున్నారు. అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదన్న విమర్శలున్నాయి. సాధారణంగా మే నెలాఖరుకు తొలి విడత స్ప్రేయింగ్ పూర్తవ్వాలి. రెండో విడత జూన్ నాటికి పూర్తి చేయాలి. కానీ, రెండో విడతకు సంబం«ధించి స్ప్రేయింగ్ డబ్బాలు ఇప్పుడు గ్రామాలకు పంపిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మలేరియా నియంత్రణకు ప్రైమాక్విన్ డ్రగ్ సరఫరా ఉండటం లేదు. ఈ మందు అందుబాటులో లేకపోవడంతో పీహెచ్సీలకు వచ్చే మలేరియా వ్యాధిగ్రస్తులకు క్లోరోక్విన్, పారాసిటమాల్తోనే సరిపెడుతున్నారు. దీంతో వ్యాధి నయం కాకపోగా మరింత తీవ్రమవుతోంది. వైద్య పోస్టులు ఖాళీ మన్యంలోని పీహెచ్సీలను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏజెన్సీలో వైద్య, ఆరోగ్య సేవలను పర్యవేక్షించాల్సిన ఏజెన్సీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పోస్టు ఎంతో కాలంగా ఇన్చార్జీలతో నడుస్తోంది. దీంతో వారు పూర్తిస్థాయిలో రంపచోడవరంలో ఉండి పర్యవేక్షణ చేయడం లేదు. జిల్లా టీబీ కంట్రోల్ అధికారికి ఏడీఎంఅండ్హెచ్ఓగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. జిల్లా మలేరియా అధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఫైలేరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ వైద్యాధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ అదనపు వైద్య, ఆరోగ్య అధికారి పోస్టు కూడా ఖాళీగా ఉంది. జిల్లా లెప్రసీ అధికారి ఈ పోస్టులో ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. వీరంతా ఇన్చార్జ్లు కావడంతో ఏజెన్సీకి అందుబాటులో ఉండటం లేదు. అలాగే ఉన్న ఒక్క సివిల్ సర్జన్ స్పెషలిస్టు పోస్టు ఖాళీగా ఉంది. మెడికల్ ఆఫీసర్లు (వైద్యులు) 38కి పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీహెచ్ఓ 8 పోస్టులకు రెండు ఖాళీగా ఉన్నాయి. ఎంపీహెచ్ఎస్ 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరు గ్రామస్థాయిలో జ్వరాల కేసులను గుర్తించి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కనీస సౌకర్యాలు కరువు ఏజెన్సీలోని గ్రామాలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. ఊటలు, చెలమనీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఏజెన్సీలోని 1,180 గ్రామాల్లో 300 వరకూ తాగునీటికి నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదు. స్వచ్ఛ జలాలు అందకపోవడంతో కలుషిత నీరు తాగి గిరిజనులు అనారోగ్యానికి గురవుతున్నారు. పౌష్టికాహారం లోపమైతే చెప్పనక్కర్లేదు. సిబ్బంది అక్కడికెళ్లడమే గగనమనుకుంటే పౌష్టికాహారం అందిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. గతంలో వెలుగు ఆధ్వర్యంలో న్యూట్రిషన్ సెంటర్లు ఉండేవి. ప్రస్తుతం వీటిని ఎత్తేశారు. పౌష్టికాహారం లోపంవల్లనే గిరిజనులు రక్తహీనతకు గురై వ్యాధుల బారిన పడుతున్నారు. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని 11 మండలాల్లో మెజార్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యమే లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో 844 గ్రామాలున్నాయి. వాటిలో 298 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్లు లేవు. చింతూరు ఐటీడీఏ పరిధిలోని నాలుగు విలీన మండలాల్లో 336 గ్రామాలున్నాయి. ఇక్కడ 96 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్లు లేవు. 5 సబ్ప్లాన్ మండలాల పరిధిలోని 57 గ్రామాలకుగాను 19 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్లు లేవు. మొత్తం 1237 గ్రామాలకుగాను 413 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్ల సౌకర్యం లేదు. రహదారుల విషయంలో ఇంత దారుణమైన పరిస్థితులు అక్కడున్నాయి. ఇక్కడ కాలిబాటే దిక్కు. అత్యవసర పరిస్థితుల్లో కావిడి, జెట్టీలపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో సరైన వైద్యం అందక మార్గం మధ్యలోనే రోగులు చనిపోతున్నారు. ఆ మధ్య ఒక శిశువు కూడా ఈవిధంగానే మృతి చెందింది. ఇక మంజూరైన 90 రోడ్లు అటవీ శాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిపోయాయి. అటవీ అభ్యంతరాలను తొలగించేందుకు ఐటీడీఏ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో రోడ్డు నిర్మాణాలు పూర్తి కావడం లేదు. ఇదిలా ఉండగా విలీన మండలాల్ని విసిరేసిన వాటిగా ప్రభుత్వం వదిలేసింది. తాజాగా 16 మంది మృతి చెందిన చాపరాయి పరిస్థితి మరింత దారుణం. ఈ గ్రామానికి సరైన రహదారి లేదు. కాటారికోట గ్రామం నుంచి చాపరాయికి ఘాట్ రోడ్డు కావడంతో వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామంలో ఆరు బోర్లున్నాయి. వాటిల్లో ఒక్కటి కూడా పని చేయడం లేదు. దీంతో కొండకాలువ(వాగు) నీటినే వినియోగిస్తున్నారు. వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్ ఏజెన్సీలో వర్షాకాలం వస్తే కొండవాగులు పొంగి ప్రవహిస్తాయి. దీంతో గిరిజనులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా గ్రామంలో మగ్గిపోవాల్సిందే. అనేక గ్రామాలకు వంతెనలు, కల్వర్టులు లేకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. ఏజెన్సీ ఏడు మండలాల్లో సుమారు 100 గ్రామాలకు వంతెనలు లేవు. రంపచోడవరం సమీపంలోని ధరమడుగుల గ్రామానికి చేపట్టిన వంతెన నిర్మాణం సగంలో వదిలేశారు. మారేడుమిల్లి మండలం సున్నంపాడు వద్ద కొండకాలువపై వంతెన నిర్మించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. వారం వారం అందని వైద్య సేవలు వైద్య సిబ్బంది మారుమూల గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంతో గిరిజనులకు సోకుతున్న వ్యాధిమూలాలను కనిపెట్టలేకపోతున్నారు. దీంతో వ్యాధులు ముదిరి గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. మరణాలు వెలుగు చూశాకే వైద్య సిబ్బంది, అధికారులు హడావుడి చేస్తున్నారే తప్ప ముందు జాగ్రత్తలు చేపట్టడం లేదు. జిల్లాస్థాయి అధికారులు ప్రతి నెలా మూడు రోజులపాటు ఏజెన్సీలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలుకు నోచుకోవడంలేదు. మరోవైపు స్థానికంగా ఉంటూ విధులు నిర్వహించాల్సిన కింది స్థాయి సిబ్బంది పట్టణ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే గ్రామాలకు వెళ్లి తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. -
ధైర్యం చెబుతూ... భరోసానిస్తూ...
- చాపరాయి బాధితులకు జగన్ ఓదార్పు - అధినేత రాకతో పార్టీ శ్రేణుల్లో సందడి - తరలివచ్చిన వెస్సార్సీపీ నేతలు కాకినాడ, కాకినాడ క్రైం: అధైర్యపడవద్దని ధైర్యం చెబుతూ... త్వరలోనే కోలుకుంటారని భరోసానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చాపరాయి విషజ్వరాల బాధితులకు ఓదార్పునిచ్చారు. ఏజెన్సీలోని చాపరాయి విషజ్వరాలు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. పీడియాట్రిక్ వార్డులో ఉన్న చిన్నారులు విజయ, కనకమ్మ, కె.స్వామిరెడ్డి, పల్లాల చిట్టెమ్మతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. ప్రభుత్వాస్పత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న వైద్యులతో కూడా మాట్లాడి మెరుగైన సేవలు అందించాల్సిందిగా కోరారు. దాదాపు 30 నిమిషాలపాటు అక్కడ గడిపిన జగన్ నలుగురు బాధితులతోనూ మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితులతోపాటు చాపరాయి ప్రాంతంలో రేషన్ సరుకులు, మంచినీరు, వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునే విధంగా రోగులకు పౌష్టికాహారాన్ని, ఇతర సేవలను అందించాలని ఇన్చార్జ్ సూపరింటెండెంట్ జీఎస్ఎన్మూర్తి, సీఎస్ఆర్ఎంవో శ్రీరామచంద్రమూర్తి, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ, వైద్యులు డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ గిరిధర్లకు సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులను జగన్ స్వయంగా జీజీహెచ్కు వచ్చి ధైర్యం చెప్పడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటనిచ్చినట్లయిది. జగన్కు ఘన స్వాగతం... పశ్చిమగోదావరి జిల్లా నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పాముల రాజేశ్వరిదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, రాష్ట్ర, జిల్లా యువజన విభాగాల అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయ భాస్కర్తోపాటు వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లాకమిటీ నాయకులు ఘనస్వాగతం పలికారు. జగన్ వస్తున్న సమాచారం తెలియజేయడంతో పార్టీ శ్రేణులతోపాటు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున జీజీహెచ్కు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగాను, పార్టీ శ్రేణుల నినాదాలతో కోలాహలంగా మారింది. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులు తమ సమస్యలను జగన్కు విన్నవించగా రాజమహేంద్రవరం ప్రాంతంలో వైఎస్ హయాంలో ఇచ్చిన నివాసాలను జన్మభూమి కమిటీ సభ్యులు బలవంతంగా తొలగించి తమకు అన్యాయం చేస్తున్నారంటూ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, గిరిజాల బాబు, కొండేటి చిట్టిబాబు, ముత్తా శశిధర్, పర్వత ప్రసాద్, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండకుదిటి మోహన్, సంగిశెట్టి అశోక్, ఎన్.ఎస్.రాజు, ముదునూరి మురళీకృష్ణంరాజు, రాష్ట్ర ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్, రాష్ట్ర బీసీసెల్ క్యాదర్శి అల్లిరాజబాబు, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డిజమీలు, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, జిన్నూరి వెంకటేశ్వరరావు, హరినా«ద్, ముమ్మిడివరం ప్లోర్లీడర్ కాశి మునికుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా అధికార ప్రతినిధులు సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, కె.ఆదిత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘దేశం’ దోపిడీపై పోరాడండి
పార్టీ శ్రేణులకు మోపిదేవి పిలుపు - జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేష్ - అన్నివర్గాలను మోసం చేసిన బాబు - మానవీయ పాలనకు నిదర్శనం వై.ఎస్. - టీడీపీ ముఠా ఓ మాఫియా గ్యాంగ్ - వైఎస్సార్ సీపీ నేతల ధ్వజం కాకినాడ: తెలుగుదేశం ప్రభుత్వ అరాచక, రాక్షసపాలనపై గట్టిగా పోరాడుతూ పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ ప్రత్యేక ఆహ్వానితులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పిలుపునిచ్చారు. స్థానిక తూరంగిలోని కుసుమ సత్య ఫంక్షన్ హాలులో గురువారం సాయంత్రం జరిగిన వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు బీహార్, యూపీ రాష్ట్రాలు అరాచకాలు, దౌర్జన్యాలకు మారుపేరుగా ఉండేవని, తెలుగుదేశం పాలనలో ఇప్పుడా పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో లక్షలాది ఎకరాల ప్రజా సంపదను ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియని స్థితిలో మంత్రి లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ జోకర్లా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. అందరూ మోసపోయారు... మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. బాబు పాలనలో రైతులు, నిరుద్యోగులు మహిళలు సహా అన్ని వర్గాలు పూర్తిగా మోసపోయాయన్నారు. విష జ్వరాలతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు తమకు కనపడదు, వినపడదు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఓట్ల కోసం నంద్యాలలో రూ.90 లక్షలు ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు ఇఫ్తార్ విందు ఇస్తే అక్కడి ముస్లింలు ఆశించినంతగా హాజరుకాకపోవడంతో చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ పాలన చరిత్రలో సుస్థిర స్థానం... వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ పరిపాలనకు మానవత్వాన్ని జోడించి మహానేత వైఎస్ చేసిన పాలన చరిత్రగా మిగిలిపోతుందన్నారు. చంద్రబాబు అధికారాన్ని చేపట్టే ముందు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నిలుపుకోలేదన్నారు. కాపులు పట్ల ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలోను, చేనేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోను ప్రశ్నిస్తానని చెప్పిన ఆ మొనగాడు ఎక్కడికెళ్ళాడంటూ పవన్ కల్యాణ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో దళితులపై దాడులు రోజురోజుకీ ఎక్కువయ్యాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఇసుక, మట్టి, మద్యం మాఫియాలతో తెలుగుదేశం నేతలు దోపిడీ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో భాగంగా తొలుత వేదిక వద్ద పార్టీ పతాకాన్ని నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వేదిక వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు అతి«థులను వేదికపైకి ఆహ్వానించగా, మరో ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి జిల్లా పార్టీ నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రసంగించారు. రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జునను పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఘనంగా సత్కరించింది. కోనసీమ ప్రాంతానికి చెందిన కొమ్ముల కొండలరావు రూపొందించిన సీడీని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వెయ్యికి పైగా వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. -
వైఎస్ జగన్ నేడు జిల్లాకు రాక
– కాకినాడ ఆసుపత్రిలో చాపరాయి బాధితులకు పరామర్శ – రంపచోడవరంలో రాత్రి బస – శనివారం చాపరాయి పర్యటన సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం కాకినాడ చేరుకుని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం రంపచోడవరం చేరుకుని రాత్రి బస చేయనున్నారు. మరుసటి రోజైన శనివారం చాపరాయి గ్రామంలోని బాధిత కుటుంబాలను పరామర్శించి అదే రోజు హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు వైఎస్ జగన్ టూర్ షెడ్యూల్ను గురువారం రాత్రి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రకటించారు. -
అందుబాటులో పీహెచ్ఎల్వీ ’ 94949 33233
పోలీస్ ఫేస్బుక్ కూడా ఆవిష్కరించిన ఎస్పీ విశాల్ గున్ని కాకినాడ క్రైం: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీస్ హెల్ప్లైన్ వాట్సప్ (పీహెచ్ఎల్వీ) ను ప్రారంభిస్తున్నట్టు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన వాట్సప్ హెల్ప్లైన్ తూర్పు గోదావరి జిల్లా పోలీస్ నం. 94949 33233ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీంతో పోలీస్ సేవల సరళీకృతం, పారదర్శక పాలన అందించేందుకు వీలవుతుందన్నారు. అందరి చేతుల్లో ఆధునికమైన ఫోన్లు ఉంటున్నాయని, ఎక్కడైనా సమస్య, సంఘటన సంభవిస్తే తక్షణమే వాట్సప్ నంబర్కు పోస్టింగ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలా పోస్ట్ చేసిన మరుక్షణమే జిల్లా పోలీస్ కార్యాలయంలోని కంట్రోల్ రూం నుంచి సంబంధిత ఎస్సై, సీఐ, డీఎస్పీలకు క్షణాల్లో సమాచారం చేరుతుందన్నారు. వెనువెంటనే సమస్య పరిష్కారానికి పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. ఎమర్జెన్సీ సంఘటనలపై పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వీలు లేనప్పుడు వాట్సప్ ద్వారా సమాచారం అందించవచ్చన్నారు. శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లే సంఘటనలు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలను వాట్సప్ చేస్తే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతికతను అందుపుచ్చుకుంటూ నేరాల నియంత్రణకు సామాజిక స్పృహతో పోలీసులతో కలసి పనిచేసేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫేస్బుక్లో యువతతో పోలీసింగ్, ప్రజా సంబంధాలు, పారదర్శనపై సలహాలు, సూచనలను పంచుకుంటామన్నారు. పలు ఫిర్యాదులపై ఎస్పీ, సీఐ, ఎస్సైలను కలసి ఫిర్యాదు చేయలేకపోయామనే భావన రాకుండా వాట్సప్, ఫేస్బుక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ రహదారుల్లో సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ పోలీస్ హెల్ప్లైన్ వాట్సప్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత పోలీస్ అధికారులకు పంపించేందుకు ఇరవై నాలుగు గంటల పాటూ మూడు ఫిప్టుల్లో పని చేసేందుకు ముగ్గురు కానిస్టేబుళ్లను నియమించినట్టు ఎస్పీ తెలిపారు. వీరు నిరంతరం కంట్రోల్ రూమ్లో ఉంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్లో నమోదు చేసుకుని సంబంధిత పోలీస్ అధికారులకు పంపుతారన్నారు. ఫిర్యాదుదారులకు వాట్సప్లో ఆన్లైన్లో ఎఫ్ఐఆర్/రసీదు ఇస్తారన్నారు. సమస్య పరిష్కారం తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలపై సమాచారం అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ
- అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ - అంటు వ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు కాకినాడ సిటీ: జిల్లాలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో జరుగుతున్న పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా వచ్చే మూడు రోజులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అత్యవసరంగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాల్టీలు గ్రామ పంచాయతీల్లో చెత్తను తొలగించడం, మంచినీటి వనరులు ఓవర్ హెడ్ ట్యాంక్లు, బావుల్లో క్లోరినేషన్, బోర్ల మరమ్మతులు చేపట్టాలని, దోమలు ప్రబలకుండా నీటి నిల్వలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు, యాంటీ లార్వల్ ఆపరేషన్లు చేపట్టాలని సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మండల ప్రత్యేకాధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట్ల ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. .డెంగీ పట్ల అప్రమత్తం... ప్రజలు డెంగీ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా విజ్ఞప్తి చేశారు. దోమలు కుట్టకుండా, పుట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడిస్ ‘ఈజిప్టి’ దోమ పగటి పూట మాత్రమే కుడతాయని, దీనివల్ల డెంగీ వ్యాధికి గురవుతారన్నారు. సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే వ్యాధి సోకిన 50 మందిలో ఒకరు మరణించే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యాధి లక్షణాలు తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుర్లు చర్మం ద్వారా రక్తస్రావం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడంవంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలున్న వారు దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో తగిన వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలన్నారు. -
ఏజెన్సీలో వై.ఎస్. జగన్ పర్యటన ఖరారు
– జూలై 1న చాపరాయిలో పర్యటన – జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వెల్లడి సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏజెన్సీ పర్యటన ఖరారైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మంగళవారం రాత్రి వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ రాత్రికి జిల్లాకు చేరుకుంటారని, జూలై 1వ తేదీన విష జ్వరాలతో అల్లాడుతున్న చాపరాయి, ఇతర గ్రామాలను సందర్శించి మృతుల కుటుంబాలను జగన్ పరామర్శిస్తారని తెలిపారు. అక్కడి పరిస్థితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నెలకున్న సమస్యల్ని బాధిత కుటుంబాలు, స్థానికులతో జగన్ మాట్లాడి తెలుసుకుంటారన్నారు. చాపరాయి ఘటనపై జగన్ ఆరా... వై.రామవరం మండలం చాపరాయి ఘటనపై జగన్ మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు, అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలు, బాధితులకు న్యాయం జరిగేలా పార్టీ అండగా నిలవాలని ఆయన కోరారు. -
వణుకుతున్న తూర్పు మన్యం
– మన్యంపై మలేరియా పంజా –జ్వరాలు బారిన గిరిజనులు - 16 గ్రామాల్లో దోమల విహారం - పెరుగుతున్న కేసులు... ప్రేక్షకపాత్రలో అధికార యంత్రాంగం - హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి: వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ - ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత ఏడాదికంటే మలేరియా కేసులు సంఖ్య పెరిగింది. 2016లో 1688 మందికి, 2017లో జనవరి నుంచి మే వరకు 2,676 మందికి... విలీన మండలాల్లో గత ఏడాది 699 మలేరియా కేసులు నమోదు. ఈ ఏడాది 1076 కేసులు నమోదయ్యాయి.. రంపచోడవరం: మలేరియా మరణాలు ఏజెన్సీని వణికిస్తున్నాయి. వర్షకాలం రాకుండానే తూర్పు ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తోంది. . వై రామవరం, మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లోని గిరిజనులు మలేరియా జ్వరాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంటికొకరు చొప్పున ఒకే గ్రామంలో జ్వరపీడితులున్నారు. గతంలోవలే మలేరియా నివారణకు ముందుస్తు చర్యలు తీసుకోకపోవడంతో జ్వరాలు వ్యాప్తికి ప్రధాన కారణమవుతోంది.. వణుకుతున్న గిరిజన గ్రామాలు... మలేరియా జ్వరాలు సీజన్కంటే ముందే గిరిజనులపై పంజా విసిరింది. రెండు రోజుల్లో విలీన మండలాల్లో ముగ్గురు మలేరియా జ్వరాలతో మృత్యువాడ పడ్డారు. వై రామవరం మండలం చాపరాయిలో జ్వరాలు బారిన పడి 16 మంది మృతి చెందగా 15 మంది కాకినాడ జీజీహెచ్లోను, 15 మంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. మరో 13 మంది చాపరాయి గ్రామం నుంచి మారేడుమిల్లి పీహెచ్సీకి తరలించారు. చాపరాయి పరిస్థితి ఇలా ఉంటే బొడ్డగండి పంచాయతీ పరిధిలోని 16 గ్రామాలు జ్వరాలతో వణుకుతున్నాయి. గొందికోట, నాగలోవ, అంటిలోవ తదితర గ్రామాలున్నాయి. గతకొన్ని రోజుల నుంచి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్ధితి అధికారులు దృష్టికి వచ్చిన వైద్య బృందాలను పంపలేదు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రయ్య మాట్లాడుతూ చాపరాయిలో ఐదు వైద్య బృందాలున్నట్లు తెలిపారు. చాపరాయి చుట్టుపక్కల గ్రామాలకు మరో ఏడు బృందాలను పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు ఇంటింటి సర్వే చేస్తాయన్నారు. పెరిగిన మలేరియా కేసులు... ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత ఏడాదికంటే మలేరియా కేసులు సంఖ్య పెరిగింది. 2016సంవత్సరంలో 96,121 మంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తే 1688 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణయింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 110334 మంది జ్వర పీడితులు నుంచి రక్త నమూనాలు సేకరిస్తే 2,676 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణయింది. విలీన మండలంలో గత ఏడాది 699 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది 1076 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది దోమ తెర రెండు లక్షలు ప్రతిపాదనలు పంపగా 80 వేలు దోమతెరలు మాత్రమే వచ్చాయి. .ఏజెన్సీలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి... ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్థితులు తాండవిస్తున్నాయని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. తక్షణం హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మలేరియా బారినపడి విలీన మండలాల్లో ముగ్గురు చనిపోయారని భారీ మూల్యం చెల్లించకముందే తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పూర్తిస్థాయిలో వైద్య పోస్టులు, సిబ్బందిని నియమించాలన్నారు. అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రక్షిత మంచినీరు అందించాలన్నారు. గొందికోట గ్రామంలో 80 మంది జ్వరాలతో బాధపడుతున్నారని వారికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చాపరాయి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. తూతూ మంత్రపు చర్యలు... ప్రభుత్వం ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్ధితులను చక్కబెట్టేందుకు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ అన్నారు. బొడ్డగండి పంచాయతీలోని అన్ని గ్రామాలకు వైద్య బృందాలను పంపించి తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని తక్షణం తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు యుద్ధ ప్రతిపాదికన రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ సహాయంతో చాపరాయి గ్రామం వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్న గొప్పును తవ్వాలన్నారు. విలీన మండలంలో కాళ్లవాపు వ్యాధి వచ్చినప్పుడే గిరిజన గ్రామాల్లో ఆర్ఓ పాంట్లు ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోలేదన్నారు. ఈ రోజుల గిరిజనులు కలుషిత నీరు తాగి జ్వరాలు బారిన పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జూలై 1న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. -
ఆరోగ్యంపై అప్రమత్తం
- అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ - జిల్లాలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు కాకినాడ సిటీ: జిల్లాలో ఆరోగ్య పరిస్ధితుల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వై.రామవరం మండలం చాపరాయి గ్రామంలో గిరిజనులు విష జ్వరాల బారిన పడి 16 మంది మృతి చెందడమే కాకుండా అనేక మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఏజన్సీ ప్రాంతంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తతపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా సంబంధిత శాఖల అధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్తో పాటు జిల్లాలో డివిజన్ స్ధాయిలో అన్ని ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని సూచించారు. రెవెన్యూ, వైద్యారోగ్య శాఖ, పంచాయితీ, డీఆర్డీఏ, ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో వ్యవహరించి పారిశుధ్యం, తాగునీరు, వైద్యసేవల పరంగా ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్ధాయి పరిస్ధితులపై ప్రతిరోజు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు డివిజన్లలో ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. డివిజన్ల పరిదిలోని క్షేత్రస్ధాయిలో ఉన్న పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై ప్రజలు కూడా సంబంధిత ఆర్డీవో కార్యాలయాల కంట్రోల్ రూం నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కలెక్టరేట్ తోపాటు జిల్లాలోని ఏడు డివిజన్ల ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్లు. కలెక్టరేట్ : టోల్ఫ్రీ నెంబర్ 1800 425 307 కాకినాడ డివిజన్: 0884– 2368100 అమలాపురం : 08856–233100 రాజమహేంద్రవరం: 088– 2442344 పెద్దాపురం : 088– 241256 రామచంద్రాపురం: 088– 245166 రంపచోడవరం: 08864–243561 ఎటపాక : 7013697657 -
పాహిమాం...
- పదే పదే అదే నిర్లక్ష్యం – గిరిజనుల ప్రాణాలతో చెలగాటం – గతేడాది కాళ్లవాపుతో ప్రాణాలు కోల్పోయిన గిరిజనులు – పదుల సంఖ్యలో మాతా,శిశు మరణాలు – ప్రస్తుతం విజృంభిస్తున్న మలేరియా - సోమవారం నిండు గర్భిణి చికిత్స పొందుతూ మృతి - మరో బిడ్డను కాటేసిన మలేరియా – ఘటన సమయంలో ప్రభుత్వం హడావుడి – ఆనక షరా మామూలు - పాహిమాం అంటూ గిరిజనం శరణు ఘోష సాక్షి, రాజమహేంద్రవరం: మూఢనమ్మకాలు, సకాలంలో వైద్యం తీసుకోకపోవడం, వైద్య సౌకర్యాల లేమీతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్యం, యంత్రాంగం బాధ్యతారాహిత్యం జిల్లాలో గిరిజనుల ప్రాణాలు బలికొంటున్నాయి. తరచూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం, యంత్రాంగం మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడడంలేదు. వై.రామవరం మండలం చాపవరంలో 16 మంది గిరిజనులు మలేరియాతో మృతి చెందగా సోమవారం విలీన మండలాలైన చింతూరు, వీఆర్పురాల్లో ఇద్దరు మలేరియాతో ప్రాణాలు కోల్పోయారు. చింతూరు మండలం దబ్బగూడెం గ్రామానికి చెందిన మడవి దేవుడమ్మ అనే గర్భిణి (30) చికిత్స పొందుతూ భద్రాచలం ఆస్పత్రిలో మృతి చెందింది. వీఆర్పురం మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన జశ్వంత్(9) సోమవారం మలేరియా జ్వరం కారణంగా మృతి చెందాడు. ఇలా ఏజెన్సీ వ్యాప్తంగా మలేరియా మరణాలు సంభవిస్తుంటే నివారణ చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి ‘మమ’ అనిపిస్తోంది. మలేరియా జ్వరాలతో గిరిజనులు మరణిస్తుంటే డయేరియా, ఇతర కారణాల వల్ల చనిపోయారంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పింస్తోంది. వ్యాధులు ప్రబలకుండా అరికట్టాల్సిన ప్రభుత్వ పెద్దలు ప్రాణాలు మీదకు వచ్చిన తర్వాత పరామర్శిస్తూ, పరిహారాలు ప్రకటిస్తున్నారు. శాశ్వత చర్యలేవీ... ఏజెన్సీలో జ్వరాలు, ఇతర వ్యాధుల నివారణ, నియంత్రణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టంలేదు. గత ఏడాది జూన్లో ఏజెన్సీలోని పోలవరం విలీన మండలాల్లో కాళ్లవాపు మరణాలు సంభవించాయి. వీఆర్పురం మండలంలో 10 మంది, చింతూరు మండలంలో ఐదుగురు, కూనవరం మండలంలో ఒకరు కాళ్ల వాపు వ్యాధితో మృతి చెందారు. ఒక్కొక్కరుగా గిరిజనులు మృతి చెందుతుంటే నాటు సారా తాగడం వల్ల వారు మరణిస్తున్నారంటూ సమస్యను పక్కదోవ పట్టించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. సమస్య మూలాలు కనుగొని నివారించే ప్రయత్నం చేయకపోవడం సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో బాధితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం విశాఖ పంపారు. అయితే ఇప్పటి వరకు వాటి ఫలితాలు అధికారులు ప్రకటించలేదు. కలుషిత నీరుతాగడం వల్ల కిడ్నీలు విఫలమై మృతి చెందారని సోమవారం రంపచోడవరంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐటీడీవో పీవో దినేష్కుమార్ చెప్పారు. కాళ్లవాపు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీంతో చింతూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాని ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వైద్య సేవలు, పౌష్టికాహారం ఎక్కడ..? ఏజెన్సీలో పని చేసేందుకు వైద్యులు ఆసక్తి చూపండంలేదంటూ జిల్లా వైద్యాశాఖాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. లక్షల జీతం ఇస్తామన్నా వారు రావడంలేదని పేర్కొంటున్నారు. తాత్కాలిక పద్ధతిపై నియమించే బదులు ఏజెన్సీలోని ఏరియా, పీహెచ్సీలలో వైద్యాధికారుల పోస్టులు భర్తి చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. దీంతో ఎళ్ల తరబడి రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇబ్బంది కొరత నెలకొని ఉంది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 95 సబ్సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 486 పోస్టులకు గాను 139 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా గిరిజనులకు పూర్తి స్థాయిలోవైద్య సేవలు అందడంలేదు. గిరిజన గర్భిణులకు తరచూ పరీక్షలు చేసి మందులు, పౌష్టికారహారం అందించకపోవడం ప్రవసం, అనంతరం తల్లులు, శిశువులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది రాజవొమ్మంగి, గంగవరం, మారేడుమిల్లి మండలాల్లో రక్త హీనత వల్ల మాతా,శిశు మరణాలు అధికంగా నమోదయ్యాయి. జిల్లాలో మలేరియా మరణాలు ప్రతి ఏడాది సంభవిస్తున్నా ఇప్పటి వరకు కూడా జిల్లా మలేరియా అధికారి పోస్టు ఇన్చార్జి పాలన లో ఉండడం ఏజెన్సీ ప్రజల ప్రాణాలపై ప్రభుత్వ తీరును అద్దం పడుతోంది. -
ప్రజల సహకారంతోనే సత్ఫలితాలు
జిల్లాలో రూ.100 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు ఆర్అండ్బీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు సామర్లకోట : ప్రజల సహకారం ఉంటేనే అభివృద్ధి పనుల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆర్అండ్బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. రూ.30 కోట్లతో పెద్దాపురం–సామర్లకోట నాలుగు లైన్ల రోడ్డుకు సోమవారం సాయంత్రం ఆయన ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద శంకుస్థాపన చేశారు. అన్నపూర్ణ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసం గించారు. జిల్లాలో ఒకేరోజు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ.100 కోట్లతో ఆర్అండ్బీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. గతంలో ఉన్న ఆర్అండ్బీ మంత్రులు జిల్లాకు అన్యాయం చేశారని, దాంతో తాను చదువుకున్న తూర్పు గోదావరి జిల్లా, పుట్టిన విశాఖ జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధచూపుతానని హామీ ఇచ్చారు. రాజానగరం నుంచి కాకినాడ వరకు రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా సామర్లకోట రైల్వే ట్రాకుపై మరో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తి చేశామన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడీబీ రోడ్డును కలుపుతూ బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవడంతో ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.1.50 లక్షలు ఉచితంగా అందజేస్తామన్నారు. కార్యక్రమానికి అ«ధ్యక్షత వహించిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం నుంచి సామర్లకోట వరకు రోడ్డు నిర్మాణంలో భాగంగా రోడ్డు మార్జిన్లో ఉన్న విద్యుత్తు స్తంభాల మార్పునకు రూ.2.50 కోట్లు భరించాల్సి వస్తుందని, దానిని రెండు మున్సిపాలిటీలు భరించడానికి అంగీకరించాయని తెలిపారు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు ప్రసంగించారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ముత్యాల రాజబ్బాయి, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, రైతు సంఘం అధ్యక్షుడు కంటే బాబు, ఎంపీపీ గొడత మార్త, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టరు చందలాడ అనంతపద్మనాభం తదితరులు పాల్గొన్నారు. -
మన్యంపై మృత్యు పంజా
వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి భారీ మూల్యం ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగుకు చర్యలు శూన్యం గిరిజనులు ప్రాణాలు పోయినప్పుడే హడావుడి రంపచోడవరం : వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గిరిజనులు భారీగానే మూల్యం చెల్లించుకుంటున్నారు. వర్షాకాలం వస్తుందంటే ఏజెన్సీ గ్రామాల్లో వణుకు పుడుతోంది. అనారోగ్యం బారిన పడిన అనేక మంది గిరిజనులు ›ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వై.రామవరం, మారేడుమిల్లి మండలాల్లోని లోతట్టు గిరిజన గ్రామాల్లో అసలేం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ యంత్రాంగం ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో అనేక మంది మృత్యువాత పడినా ప్రభుత్వ లెక్కల్లోకి రావడం లేదు. వై.రామవరం మండలం చాపరాయిలో మూడు వారాల వ్యవధిలో 16 మంది గిరిజనులు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ఏజెన్సీలోని దయనీయ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడం, సరైన మందులు లేక, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఇప్పటికీ గిరిజన పల్లెలు దూరంగా ఉండడంతో పలు అనర్థాలకు దారితీస్తోంది. గిరిజనుల ప్రాణాలు పోయిన సందర్భంగా హడావుడి చేస్తున్న యంత్రాంగం తర్వాత కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎంత కాలం ఇన్చార్జిల పాలన రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 95 సబ్ సెంటర్లు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రిత్రి, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖలో ఎంతో కాలంగా ఇన్చార్జిల పాలనలో నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధికారిని నియమించడం లేదు. జిల్లా మలేరియా అధికారి (డీఎంఓ)పోస్టు కూడా ఎంతో కాలంగా ఇన్చార్జి పాలనలోనే ఉంది. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులే ఇన్చార్జులైతే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భర్తీకాని ఖాళీలు వైద్య ఆరోగ్యశాఖలో అన్ని క్యాడర్ల్లో 486 పోస్టులు ఉంటే వాటిలో 349 మంది పనిచేస్తున్నారు. 139 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఎంపీహెచ్ఎస్ పోస్టులు 40 ఖాళీగా ఉన్నాయి. గతంలో జ్వరాల సీజన్ దృష్టిలో ఉంచుకుని రెండు నెలలు మైదాన ప్రాంతం నుంచి వైద్య సిబ్బందిని డిప్యూటేషన్పై నియమించే వారు. అలాంటి ప్రక్రియకు మంగళం పాడారు. ప్రస్తుతం ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్థితులు తాండవించడంతో తిరిగి డిప్యూటేషన్పై నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు. పీహెచ్సీల్లో ఐదు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా మరో నలుగురు వైద్యులు పీజీ చేసేందుకు వెళ్లిపోనున్నారు. రోడ్డు నిర్మాణంపై నిర్లక్ష్యమేల ? వై రామవరం– గుర్తేడు మధ్య రహదారి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. మండలం కేంద్రం చేరుకునేందుకు అనేక గ్రామాలకు దగ్గర మార్గమైన ఈ రహదారిని అధికారులు నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. రూ.3 కోట్ల అంచనా వ్యయంతో వై.రామవరం నుంచి పోతవరం వరకు 20 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రూ.1.50 కోట్లు ఖర్చు చేసి ఎర్త్ వర్క్ చేసి వదిలి పెట్టారు. అప్పటి నుంచి రోడ్డు నిర్మాణం ఊసే పట్టించుకోలేదు. అధికారులు గిరిజనాభివృద్ధికి చేస్తున్న ఆలోచనలు ఏమిటనే అనుమానులు కలగక మానదు. ఏజెన్సీలో అటవీ అభ్యంతరాల కారణంగా సుమారు 20 రోడ్డు నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసేందుకు ఎందుకు సిద్ధం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన్యంలో రహదారి సౌకర్యాలు ఎలా మెరుగపడతాయో అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది. మండల కేంద్రం ఏర్పాటుతోనే గిరిజనులకు మేలు గత దశాబ్దకాలంగా వై.రామవరం మండలం ఎగువ ప్రాంతాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని అక్కడ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మండల కేంద్రం ఏర్పాటుకు ఐటీడీఏ పీవో దినేష్కుమార్ మారేడుమిల్లి వివిధ సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించారు. మండల కేంద్రం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా అప్పర్ పార్ట్లో ఉన్న గ్రామాలకు పాలన దగ్గర అవుతుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి గిరిజనులు సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మూడు మండలాలను దాటుకుని 150 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేసి మండల కేంద్రం వై.రామవరం చేరుకోవాల్సిన పరిస్ధితి. ఇలాంటి కష్టాలు నుంచి గిరిజనులు గట్టెక్కాలంటే గుర్తేడును మండల కేంద్రంగా ఏర్పాటు చేసే పని వేగవంతం చేయాలి. అయినవారిని కోల్పోయి... చాపరాయి గ్రామంలో జ్వరాలు బారిన పడి 16 మంది గిరిజనులు మృతి చెందారు. వారిలో ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. కుటుంబంలో మిగిలిన ఒక్క మహిళ పల్లాల చిట్టెమ్మ రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. జ్వరాల బారిన పడి మామ పల్లాల తమ్మిరెడ్డి మరణించిన వారం వ్యవధిలో అత్త చిట్టెమ్మ ( అత్తగారి పేరుచిట్టెమ్మ) జ్వరంతో మృత్యువాత పడింది. మరో మూడు రోజుల్లో భర్త పల్లాల కన్నమ్మరెడ్డి మరణించాడు. కుటుంబంలో అత్తమామలును, భర్తను కోల్పోయి ఆమె, ముగ్గురు చిన్నారులు మాత్రమే మిగిలి ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆమె ఇద్దరు పిల్లలతో చికిత్స పొందుతుండగా మరో బాలిక గ్రామంలోనే ఉంది. గ్రామంలో జరిగిన వేడుకకు వెళ్లలేదని ఆమె వాపోయింది. జ్వరాలే ఐనా వారి ప్రాణాలు తీసిందని ఆవేదన చెందింది. త్వరలో చాపరాయి బాధిత కుటుంబాలకు జగన్ పరామర్శ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వెల్లడి మారేడుమిల్లి : వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో విషజ్వరాల బారిన పడి మృతి చెందిన బాధిత కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే మన్యంలో పర్యటించి మృతులు కుంటుబాలను పరామర్శిస్తారని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. సోమవారం మారేడుమిల్లిలో ఆమె విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ 16 మంది గిరిజనులు వ్యాధులతో మృతి చెందిన కనీసం వైద్యాధికారులకు, ప్రభుత్వానికి, తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదన్నారు. ఎనిమిది నెలల క్రితం విలీన మండలాల్లో కాళ్లవాపుతో 18 మంది గిరిజనులు మృతి చెందారని, 216 మాతా శిశుమరణాలు సంభవించినప్పుటికి ఇప్పుటికీ వ్యాధులకు గల కారణాలు కనిపెట్టాలేకపోయారని విమర్శించారు. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వచ్చి మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షలు ప్రకటించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ ప్రకటనలు స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నాయే తప్ప బాధితులకు సహాయం అందడం లేదన్నారు. గతంలో మారేడుమిల్లి మండలం సిరిపిన లోవ గ్రామంలో కొండపోడు పొలానికి నిప్పుంటుకుని నలుగురు చిన్నారులు మృతి చెందితే వారి కుటుంబాలకు రూ.రెండు లక్షలు ప్రకటించారని ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదని, అలాగే వారికి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీకూడా నెరవేర్చలేదన్నారు. చాపరాయి గ్రామంలో రెండు నెలలు నుంచి కరెంట్ సదుపాయం లేదని, వారికి ఇచ్చే కిరోసిన్ కోత విదిచడంతో చీకట్లోనే మగ్గుతున్నారని అన్నారు. సరైన రోడ్డు సదుపాయం, తాగునీరు అందుబాటులో లేదన్నారు. చాపరాయి బాధిత గిరిజనులకు వైఎస్సాసీపీ తరఫున అండగా నిలుస్తామన్నారు. ఆ గ్రామంలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించి. బాధితులకు ప్రభుత్వం సాయం అందించే వరకు పోరాడతామని హెచ్చరించారు. మండల కన్వీనర్, జెట్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ కుండ్ల సీతామçహాలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు గొర్లె అనిల్ ప్రసాద్(బాబి), ఉపసర్పంచ్ గురుకు దర్మరాజు, మండల కార్యదర్శి బి.గంగరాజు నాయకులు వీరబాబు, సత్తి సునీల్ రెడ్డి, మంగరౌతు వీరబాబు, సాయిరాజు పాల్గొన్నారు. కొనసాగుతున్న వైద్య సేవలు చాపరాయి(వై.రామవరం) : వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ చాపరాయి గ్రామంలోని 7 వీధుల్లో రెండో రోజు సోమవారం ఎంపీడీఓ కె.బాపన్నదొర ఆధ్వర్యంలో వైద్య బృందాలు పర్యటించి సేవలు అందించాయి. ప్రస్తుతం అదే గ్రామంలో జ్వరాలతో ఉన్న మరో 32 మంది గిరి నులను ఐటీడీఏ పీఓ దినేష్కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం రంపచోడవరం, మారేడిమిల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించిన విషయం విదితమే. జ్వరాలు అదుపులోకి వచ్చే వరకు గ్రామంలోనే వైద్య బృందాలను మకాం ఉండమన్న పీఓ ఆదేశాల మేరకు 2వ రోజు కూడా చాపరాయి గ్రామంలో వైద్యసేవలు అందించారు. వైద్య బృందంతో పాటు ఎంపీడీఓ కె.బాపన్నదొర కూడా ఆ గ్రామంలోనే మకాం వేశారు. కార్యక్రమంలో మారేడుమిల్లి, గుర్తేడు పీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు రమాదేవి, ఉషారాణిలు, వై.రామవరం రెవెన్యూ అధికారులు కానరాకపోవడంతో, పీఓ ఆదేశాల మేరకు గంగవరం తహశీల్దార్ పాల్గొని సేవలు అందిస్తున్నారు. -
కసి ఉంటే కష్టమేం కాదు
- ఇంగ్లిషు నేర్చుకోండి...మోజును తగ్గించుకోండి - తెలుగుకే పరిమితమైతే అవకాశాలు రావనేది అపోహ - సివిల్స్ రాసే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నదే ఆకాంక్ష - అందుకే విద్యార్థులను కలుసుకుంటున్నా... - తెలుగు అకాడమీ అనువాదాలు విసృ్తతంగా చేపట్టాలి – ‘సాక్షి’తో... సివిల్స్లో అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాల కృష్ణ రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం: సివిల్స్లో అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం జీవితంలో మరచిపోలేని రోజని రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం సివిల్స్ రాస్తున్న విద్యార్థులను కలిసి సలహాలు, సూచనలిస్తూ వారిలో స్ఫూర్తిని రగిలించి ఏపీ నుంచి మరింతమంది సివిల్ ర్యాంకులను చూడాలన్నదే నా ఆకాంక్షని అన్నారు. అందుకే తనకున్న ఖాళీ సమయంలో ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి విద్యార్థులను కలుసుకుంటున్నానని పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... . సాక్షి: సివిల్స్ రాయాలంటే ఆర్థికబలం ఉండాలా? గోపాలకృష్ణ: ఆర్థికంగా కొంతైనా నిలదొక్కుకోవాలి. సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేయడం వల్ల శిక్షణకు, ఇతరత్రా మెటీరియల్, పుస్తుకాల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులేమీ ఎదుర్కోలేదు. సాక్షి: కోచింగ్ సెంటర్లు మీ ఫొటోలతో ప్రచారం చేసుకుంటున్నాయని, దీనిపై మీ స్పందన? గోపాల కృష్ణ: నేనైతే ప్రత్యేకంగా ఏ శిక్షణా సంస్థలో కోచింగ్ తీసుకోలేదు. అయితే అన్ని కోచింగ్ సెంటర్లు నిర్వహించే మాక్ టర్వ్యూకు, మ్యూనికేషన్స్కు మాత్రమే హాజరయ్యాను. ఇక వారు నా ఫొటోను వాడుకుంటే అది వారి విచక్షణకే వదిలేస్తున్నాను. సాక్షి: సివిల్స్ తెలుగు మాధ్యంలో రాస్తే లక్ష్యాన్ని సాధించవచ్చా? గోపాలకృష్ణ: అందుకు నేనే ఉదాహరణ. ప్రిలిమనరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఎలా నెగ్గుకు రాగలిగాను. మూడో ర్యాంకు ఎలా సాధింగలిగాను. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. సాక్షి: తెలుగు మాధ్యంలో మెటీరియల్ లభ్యం కావడం కష్టమంటారే? గోపాలకృష్ణ: నిజమే. ఇంగ్లిషు మెటీరియల్ను సంపాదించి తెలుగులో తర్జుమా చేసుకుని అధ్యయనం చేశాను. సాక్షి: మీరిచ్చే సూచనలేమిటి...? గోపాలకృష్ణ: మనకు ప్రత్యేకంగా తెలుగు అకాడమీ ఉంది. వీరు చేయాల్సింది ఎంతో ఉంది. సివిల్ సర్వీసుకు సంబంధించిన ఎథిక్స్, ఎకనామిక్స్, ఆప్టిట్యూడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర పుస్తకాలు ఇంగ్లిషులో ఉన్నాయి. వీటిని తెలుగులో అనువదించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ పని నేను చేయాలనుకుంటున్నాను. ఎంత వరకు సాధ్యపడుతుందో చూడాలి. సాక్షి: సివిల్స్ రాసేవారికి మీరిచ్చే సూచనలు? గోపాలకృష్ణ: సిలబస్ పట్ల కసితో కూడిన లక్ష్య నిర్దేశం ఉండాలి. పాత సివిల్ పరీక్షా పేపర్లను చదువుతూ ఉండాలి. వర్తమాన అంశాలపై బాగా అవగాహన ఉండాలి. సాక్షి: ప్రజలకు ఏవిధమైన సేవలందిస్తారు? గోపాలకృష్ణ: పేదప్రజలకు, అణగారిన వర్గాలకు సేవలందిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలన్నది తన ఆకాంక్ష. సాక్షి: మీ స్వగ్రామంలో మీ కుటుంబాన్ని వెలి వేశారు, భూమిని కబ్జా చేశారన్నారు కదా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గోపాలకృష్ణ: సివిల్స్ సాధించగానే గ్రామంలో సమస్యలన్నీ సమసిపోయాయి. అందరూ బాగానే ఉంటున్నాం. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాం. -
నాన్న కోరిక, నా లక్ష్యం నెరవేరింది..
సివిల్ సర్వీస్లో 3వ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ నన్నయ్య వర్సిటీ, లెనోరా దంత వైద్య కళాశాలలో ఘన సత్కారం ‘నీ జేబులో గ్రీనింకు పెన్ను ఉండాలిరా, నీ ద్వారా మనలాంటి పేదలెందరికో సేవలందాలిరా’ అన్న నాన్న మాటలే... సివిల్స్లో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణకు ప్రేరణ. నాన్న కోరికను లక్ష్యంగా చేసుకున్న అతడు 11 ఏళ్లపాటు కఠోరంగా శ్రమించాడు. కొంతమంది మిత్రులు, సహచరులు, బంధువులు నిరుత్సాహపరిచినా.. పేదరికం అడ్డంకిగా మారిన.. అతడి గురి లక్ష్యంపైనే ఉంది. ఇంతవరకూ తెలుగు రాష్ట్రంలోనే ఎవరూ సాధించలేని ఈ ర్యాంకును... తెలుగు మీడియంలో పరీక్ష రాసిన ఇతడు సాధించి కొత్త రికార్డును నెలకొల్పాడు. అందుకే తెలుగు ప్రజలు ఇతడికి నీరాజనాలు పడుతున్నారు. మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన ఇతడిపై విద్యార్థులతో సమానంగా అధ్యాపకులు, అచార్యులు కూడా ప్రేమాభిమానాలు కురిపించారు. వారి అభిమాన వర్షానికి తడిచి ముద్దైన గోపాలకృష్ణ వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. రాజానగరం : ‘తెలుగు మీడియంలో చదువుకున్నా, పేదరికం అడ్డంకిగా ఉన్నా.. నాన్న కోరికను తీర్చడంతోపాటు నా లక్ష్యాన్ని కూడా సాధించాలనే తపనతో 11 సంవత్సరాలపాటు కఠోరంగా శ్రమించాను’ అంటూ... అంటూ సివిల్స్లో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ చేసిన ప్రసంగం అటు విద్యార్థులను ఇటు అధ్యాపకులు, ఆచార్యులను మంత్రముగ్ధులను చేసింది. నగరానికి వచ్చిన మంగళవారం అతడిని ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరంలోని కేఎల్ఆర్ లెనోరా దంతవైద్య కళాశాలలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోణంకి మాట్లాడుతూ లక్ష్యసాధనకు కష్టపడుతుంటే కొంతమంది మిత్రులు, సహచరులు, బంధువులు కాస్త నిరుత్సాహపరిచినా వెనుకంజవేయలేదన్నారు. అప్పటికే చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగం ఆత్మస్ధైర్యాన్నిచ్చిందన్నారు. ఇంత ర్యాంకు సాధించడంలో ఎదురైన కష్టాలు, ఇబ్బందులు, లక్ష్యాన్ని సాధించేందుకు చేసిన కృషిని వివరించారు. ప్రభుత్వ బడులలోనే ఉన్నత విద్య సాగిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్ తరువాత టీటీసీ చేసి డీఎస్సీ రాయడంతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చిందన్నారు. అయితే సివిల్స్ కోసం డిగ్రీ ప్రైవేటుగా చదివానన్నారు. ఇలా 11 ఏళ్లు కఠోర శ్రమతో మూడుసార్లు విఫలమై..నాలుగో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించినట్టు చెప్పారు. ఇంతవరకూ పడిన కష్టమే రేపు మంచి పరిపాలనాధికారిగా తీర్చిదిద్దుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పరీక్షకు ప్రివేర్ అయిన తీరు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్ పరీక్షకు ఏవిధంగా ప్రిపేర్ కావాలి, ఏ పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు సాధించాలనే విషయాలను కూలకషంగా వివరించారు. ఇంటర్య్వూతోపాటు 2,025 మార్కులకు 1,104 మార్కులే తనకు వచ్చాయన్నారు. తన ప్రసంగం వింటున్న విద్యార్థులలో కనీసం ఒకరిద్దరైనా సివిల్స్ లక్ష్యం వస్తే ఇక్కడకు వచ్చినందుకు ఫలితం ఉంటుందన్నారు. ఇంగ్లిష్లో చదువుకున్న వారే విజయం సాధిస్తారనే భావాన్ని విడనాడాలని, భాష ఏదైనా భావం ఉండాలనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా దంత వైద్య కళాశాలలో విద్యాభ్యాసంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ఆయన అందజేశారు. నాడు బుర్రా, నేడు రోణంకి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసులో 1993లో బుర్రా వెంకటేష్ 12వ ర్యాంకును సాధిస్తే నేడు రోణంకి గోపాలకృష్ణ మూడో ర్యాంకును పొందారని నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో మొదటి ర్యాంకును సాధించేవారెవ్వరని విద్యార్థులను ప్రశ్నించారు. తెలుగులో మాట్లాడటమే నామోషీ అనుకునే ఈ రోజుల్లో తెలుగులో పరీక్ష రాసి ఈ ర్యాంకును పొందడం సా«ధారణ విషయం కాదన్నారు. సాధారణ కుటుంబం నుండి వచ్చినవాడు కావడం మరీ విశేషమన్నారు. కేఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి మట్లాడుతూ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం లోపం ఉండకూడదన్న విషయాన్ని గోపాలకృష్ణ నిరూపించారన్నారు. ఘన సత్కారం అనంతరం గోపాలకృష్ణను కళాశాల యాజమాన్యం గజమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసింది. నన్నయ యూనివర్సిటీలో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో నన్నయ అధ్యాపక బృందం ఆచార్య ఎస్.టేకి, ఆచార్య మట్టారెడ్డి, ఆచార్య పి.సురేష్వర్మ, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ టి.సత్యనారాయణ, డాక్టర్ ఆలీషాబాబు, ఈసీ మెంబర్ విజయనిర్మల, డీఎస్పీ రమేష్బాబు, సింగపూర్ సిటీ బ్యాంకు ఉపాధ్యక్షులు అనుమోలు సారథి, దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విశ్వప్రకాష్రెడి, వైస్ ప్రిన్సిపాల్ ధల్సింగ్, డైరెక్టర్లు లక్ష్మణరావు, నాగార్జనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత
ఇప్తార్ విందులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ: మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ విభాగం, మైనారిటీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాలులో రంజాన్ మాసం పురస్కరించుకొని ఆదివారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విందులో కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో పాటు ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, వరుపుల సుబ్బారావు అతిథులుగా పాల్గొన్నారు. వారు జిల్లాలోని ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ దీక్షలు, ప్రార్థనలు మానవీయతను మేల్కొలిపి శాంతి సౌభ్రాతృత్వాలను నింపుతాయన్నారు. మైనారిటీ వర్గాల ప్రజలకు జిల్లా యంత్రాంగం సదా అండగా ఉంటుందని, ఇఫ్తార్ విందుకు తనతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి సీనియర్, ఉన్నతాధికారులు తరలిరావడం దీనికి నిదర్శనమన్నారు. జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ వి.విజయరామరాజు, ఐటీడీఏ పీఓ దినేష్కుమార్, డీఎఫ్ఓ నందిని సలారియా, ఓఎస్డీ అద్నాన్ నయీమ్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ శాస్త్రి, మైనారిటీ సంక్షేమాధికారి డీఎస్ సునీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, నగరంలోని వివిధ మసీదుల పెద్దలు పాల్గొన్నారు. -
దుమ్ము రేపిన హామీలు దమ్ముకేవీ నీళ్లు
మాటలు కోటలు దాటాయి చేతలు చతికిలపడ్డాయి - మంత్రుల హామీలన్నీ నీటి మీద కోతలే - ఏరువాక హడావుడి ఏమైందో... - జూలై 15కి ఖరీఫ్ నాట్లు కష్టమే - మండిపడుతున్న రైతులు - మరోసారి సాగు సమ్మెకు సన్నద్ధమవుతున్న వైనం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఖరీఫ్లో వారం రోజులు ముందుగానే సాగునీరు అందించిన ఘనత తమదేనని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జబ్బలుచరుచుకున్నారు... ముందస్తుగా నీరిచ్చే దమ్ము మా పార్టీదేనని జూన్ 2న తెగ సంబరపడిపోయారు... మాటలు కోటలు దాటినా పంట పొలాల్లోకి మాత్రం నీరు దరి చేరలేదు. మంత్రుల మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. నీరు విడుదలచేసి రెండు వారాలు గడచినా ఇప్పటికీ ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాల్లో చాలా పొలాల్లో రైతులకు ఎదురు తెన్నులు తప్పడం లేదు. ఈ నెల రెండో తేదీన ధవళేశ్వరం నుంచి ఈ రెండు డెల్టాల పరిధిలోని పంట కాలువలకు సాగునీరును అధికారికంగా విడుదల చేశారు. సాగునీటిని కుడి చేత్తో విడుదల చేసి ఎడమ చేత్తో ఆపేసి రైతులను ఇబ్బందులుపాల్జేశారు. ఖరీఫ్లో క్లోజర్ పనులు పంట కాలువలకు నీరు ఆపేసిన వెనువెంటనే చేపట్టకుండా తాత్సారం చేశారు. వారం, పది రోజుల్లో నీరు విడుదల చేసేస్తారనగా క్లోజర్ పనులు మొదలుపెట్టి అటు పనులు పూర్తికాకుండా చేశారు. మరోపక్క వారం రోజులు ముందుగానే సాగునీరు విడుదలచేసినా వాటి ఫలాలు రైతులకు దక్కకుండా చేశారు. కానీ వారం ముందుగానే నీటిని విడుదలచేసి రైతులకు ఎంతో ప్రయోజనం కల్పించామని స్వయంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పే గొప్పగా ప్రకటించుకున్నారు. అసలు ఖరీఫ్ చరిత్రలో తమ ప్రభుత్వమే సాగునీటిని వారం ముందుగా తొలిసారి విడుదలచేసిందని కూడా సెలవిచ్చారు. ఇటీవల కాకినాడలో మహా సంకల్ప సభకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపై ఉంగానే ఈ విషయాన్ని చెవిలో వేయడం ఆయనేమో అధికారికంగా ఏరువాక కూడా నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. ఆ మాట పట్టుకుని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అనపర్తి నియోజకవర్గంలో ఏరువాక అంటూ ఆర్భాటం చేయగా, మిగిలిన ఎమ్మెల్యేలు తమ, తమ నియోజకవర్గాల్లో ఏదో ఘనకార్యం సాధించినట్టు ఏరువాక పేరుతో నాగలిపట్టి ఫొటోలకు ఫోజులిచ్చి ఆర్భాటం చేశారు. తప్పితే రైతులకు ఒరిగిందేమీ లేదు. క్షేత్రస్థాయిలో ఇదీ దుస్థితీ... ఓ పక్క క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి చూస్తే జిల్లాలో పలు పంటకాలువల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు లేక ఇప్పటికీ నారుమళ్లు వేసిన దాఖలాలు లేవు. మరోపక్క జూలై 15 నాటికి ఖరీఫ్ నాట్లు పూర్తి చేయాలంటూ జిల్లా వ్యవసాయశాఖ కార్యచరణ ప్రకటించింది. ఈ విషయాన్ని గురువారం ఆలమూరు మండలంలో పర్యటించిన సందర్బంలో వ్యవసాయ శాఖ జేడీ కె.ఎస్.వి. ప్రసాద్ రైతులకు సూచించారు. పూర్తి స్థాయిలో పంటకాలువల నుంచి సాగునీరు పొలాలకు చేరకుండా నారుమళ్లు ఎప్పుడు పోయాలి, ఆకు ఎప్పటికి వస్తుంది, నాట్లు ఎప్పుడు వేయాలంటూ రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతిఏటా నిర్లక్షమే... అధికారులు ఈ నెల2న నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఖరీఫ్ సీజన్లో కూడా పంటకాలువల పరిధిలో క్లోజర్ పనులు పూర్తి స్థాయిలో చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడంతో మధ్యలోనే ఉండిపోయాయి. ఓ పక్క పనులు పూర్తి కాలేదు, మరోపక్క పొలాలకు సాగునీరు అందలేదు. ఈ విషయంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు తప్ప మరెవరికీ కలిసి రాలేదంటున్నారు. ప్రధానంగా అమలాపురం–చల్లపల్లి పంట కాలువ, ఇటు సామర్లకోట కెనాల్పై పనులతో రెండు ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన చెందారు. ఈ రెండు ప్రాంతాలు ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు అనుబంధం ఉన్నవే. అయినా పనుల పేరుతో కాంట్రాక్టర్లకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వకుండా వారం రోజులకుపైనే నీరు విడుదల చేయకుండా నిలిపివేశారని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండుచోట్ల సుమారు రూ.13 కోట్లతో పనులు చేపట్టినా పూర్తి చేయలేకపోయారు. ఈ విషయమై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు గురువారం సామర్లకోట కెనాల్కు అనివార్యంగా నీరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవికాకుండా జిల్లాలోని అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలు, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాలు, పి గన్నవరం, రాజోలు, కొత్తపేట, అనపర్తి, మండపేట తదితర నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఆయకట్టుకు ఇప్పటికీ నీరు చేరలేదు. ఉదాహరణకు కపిలేశ్వరపురం మండలం టేకి, రాయవరం మండలం సోమేశ్వరం తదితర శివారు పొలాలకు ఇప్పటికీ నీరు చేరలేదు.అనపర్తి నియోజవకర్గంలో ఎర్రకాలువకు సాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదని అక్కడి ఆయకట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాంతాలకు ఆలస్యంగా విడుదల చేయడమే కాకుండా కాలువ లెవెల్కు నీరు చేరకపోవడంతో పొలాలకు నీరందక రైతులు విత్తనాలు చల్లుకోవడానికి ఇబ్బందిగా మారింది. అవగాహన లేమే కారణహా...! నీటిపారుదలశాఖ ఎస్ఈగా వచ్చిన రాంబాబుకు ఈ డెల్టా వ్యవస్థపై అంతగా అవగాహన లేకపోవడమే ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణమంటున్నారు. గతంలో పనిచేసిన సుగుణాకరరావు సహా పలువురు ఎస్ఈలు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు సమయస్ఫూర్తితో కాలువలకు నీరు సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూశారు. రాంబాబుకు ఇక్కడి పరిస్థితులపై పెద్దగా అవగాహన లేకపోవడంతోనే నీరు విడుదలచేసినా పంట పొలాలకు సకాలంలో నీరు చేరని పరిస్థితి ఎదురైందని రైతు ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఎస్ఈగా రాంబాబును ప్రతిపాదించిన మంత్రి దృష్టికి ఇదే అనుమానాన్ని రైతు ప్రతినిధులు అప్పట్లో తీసుకువెళ్లినా ఆయన కొట్టిపారేశారంటున్నారు. అందుకు మూల్యం రైతులు ఇప్పుడు చెల్లించుకోవాల్సి వస్తోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు చెబుతున్నట్టు వచ్చే నెల 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోను నాట్లు పూర్తి చేయలేమని రైతులు పేర్కొంటున్నారు. ఆగస్టు 20 నాటికి పూర్తి అయితే గొప్పేనంటున్నారు. ఇటువంటి విషయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమాలంటూ ఆర్భాటాలకు పోకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేలా అధికారులను ఆదేశించాలంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు సమ్మెకు మరోసారి సన్నద్ధమవడానికి రైతాంగం సమాయత్తమవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో రైతులు పిడికిలి బిగించడం ... ఎమ్మెల్యే చర్చలు జరిపినా ససేమిరా అనడం విదితమే. ఇదే తరహాలో మిగిలిన ప్రాంతాల్లో కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. -
కావల్సిన వారికే... కాపులోన్లు
- పార్టీ కార్యాలయంలో లబ్ధిదారుల ఎంపిక - - ఉత్సవ విగ్రహాలుగా అధికారులు - అన్ని లోన్లు పార్టీ కార్యకర్తలకే - అర్హులకు మొండిచేయి - ప్రధాన అర్హతగా దేశం సభ్యత్వం! - పిఠాపురంలో కాపులోన్ల మాయాజాలం పిఠాపురం: కాపులకు రుణాలు ... ఇందుకు కాపు కులంలో పుట్టిన నిరుపేదలందరూ అర్హులే అనుకుంటే పొరపాటే. పిఠాపురం మున్సిపాల్టీలో మాత్రం కాపు కులానికి చెందిన వారైతే చాలదు. తెలుగు దేశం పార్టీ నాయకుడో, కార్యకర్తో, లేక ఎమ్మెల్యే అనుచరుడో అయి ఉంటేనే కాపు లోను తన కాళ్ల దగ్గరకు పరుగులు తీస్తూ వచ్చేస్తుంది. అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఆ దరఖాస్తులు కాపు కార్పొరేషన్కు ఆన్లైన్లో పంపించేది ... ఎంపిక చేసేది మాత్రం ‘దేశం’ నేతలే అన్నది ఇక్కడ బహిరంగ రహస్యం. ఏదైనా ఒక ప్రభుత్వ పథకంలో లబ్థిదారుల ఎంపిక జరగాలంటే వివిధ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణలు జరిపి ప్రభుత్వ కార్యాలయంలో అర్హుల జాబితా తయారు చేస్తుంటారు. కానీ పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాగే అధికారులతో సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు దేశం నేతలు కలిపి భర్తలున్న వారికే వితంతు పింఛన్లు మంజూరు చేయించగా ‘సాక్షి’ దినపత్రిక ఆ గుట్టును బట్టబయలు చేయడంతో అధికారుల విచారణ అనంతరం వాటిని రద్దు చేశారు. అయినప్పటికీ ఇక్కడ పద్ధతిలో మాత్రం మార్పు రాలేదంటున్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న కాపు రుణాల మంజూరులో నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కేస్తున్నారు. పచ్చచొక్కా వేసుకుంటేనే నిజమైన లబ్ధిదారుడిగాను, లేకుంటే ఎంత నిరుపేదవాడైనా సరే అనర్హుడిగా పరిగణిస్తున్నట్లు ప్రస్తుతం మంజూరైన లోన్ల నడత స్పష్టం చేస్తోంది. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఏడాది కాపులోన్ల లక్ష్యం 105 కాగా ఇప్పటి వరకు సుమారు 500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు 27 మందికి రుణాలు మంజూరయ్యాయి. వీరిలో అధిక శాతం మంది తెలుగు దేశం పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. దేశం నేతలకే కాపులోన్లు... పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 24వ వార్డులో 15 మంది అర్హులైన లబ్ధిదారులు బ్యాంకు అంగీకారంతో సహా కాపులోన్లకూ దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ వారందరినీ పక్కన పెట్టి కేవలం ఆ వార్డు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, పాదగయ ట్రస్టు బోర్డు సభ్యుడైన ఓగేటి మురళీధర్కు మాత్రమే కాపులోను మంజూరయింది. ఇలా అన్ని వార్డుల్లోను ఆయా వార్డుల పార్టీ అధ్యక్షులు, తెలుగు యువత నాయకులు ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వినినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా అన్ని అర్హతలుండీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఒక్క రుణం కూడా మంజూరుకాకపోవడం విశేషం. పార్టీ కార్యాలయంలోనే ఎంపిక...! అర్హులైన లబ్ధిదారులు బ్యాంకు అనుమతితో మున్సిపల్ అధికారులు దరఖాస్తులు చేసుకుంటుండగా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో తెలుగు యువత నాయకుడు ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పక్రియంతా స్థానిక తెలుగదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరగాల్సిన ఎంపిక పక్రియ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుండడంతో కేవలం పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే రుణాలు మంజూరవుతున్నాయి. మా దరఖాస్తులు ఏమయ్యాయో తెలియడం లేదు నేను కూలిపని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నా. దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసుకుందామని కాపులోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. బ్యాంకు విల్లింగ్ సైతం ఇచ్చారు. అయినా ఏడాదవుతున్నా లోన్ రాలేదు. నాకంటే వెనుక పెట్టుకున్న తెలుగుదేశం వారికి మాత్రం లోన్లు ఇచ్చేస్తున్నారు. - కె. అచ్చియ్య, లబ్దిదారుడు, పిఠాపురం అధికారులు పట్టించుకోవడం లేదు పొట్టపోసుకోడానికి ప్రభుత్వం ఇచ్చే రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. అధికారలెవరూ పట్టించుకోవడం లేదు. అసలు వారి ప్రమేయం ఏమీ లేనట్టు మాట్లుడుతున్నారు. మా దరఖాస్తులు ఏమయ్యాయో కూడా తెలియడం లేదు. ఆకుల దొరబాబు, లబ్ధిదారుడు, పిఠాపురం అర్హులైన కాపులకు అందడం లేదు నిరుపేదలైన కాపులకు అన్యాయం జరుగుతోంది. ఏ ఆధారం లేకుండా అణగారిపోతున్న కాపుల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసి నిరుపేదలకు అండగా నిలుస్తుంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం నేతల అక్రమాలు ఎక్కువయిపోతున్నాయి. పిఠాపురంలో కేవలం తెలుగుదేశం నేతలకే రుణాలు మంజూరవుతున్నాయి. అర్హులందరూ రుణాలు రాక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. బాలిపల్లి రాంబాబు, కాపుఐక్య వేదిక నాయకుడు. పిఠాపురం -
తడిసి ముద్దయిన కోనసీమ
జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అమలాపురంలో అత్యధికంగా 105.2 మి.మీ. వర్షపాతం అమలాపురం : నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఏజెన్సీ.. మెట్ట.. కోనసీమ ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షం పడింది. గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లా వ్యాప్తంగా సగటున 35.2 మి.మీ. వర్షం పడింది. అత్యధికంగా అమలాపురంలో 105.2 మి.మీ. వర్షం కురవగా, అత్యల్పంగా కోరుకొండలో 1.2 మి.మీ. వర్షం పడింది. గురువారం రాత్రి నుంచి కోనసీమ తడిసి ముద్దయ్యింది. అమలాపురంతోపాటు అంబాజీపేట, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లిలో భారీ వర్షం కురిసింది. మెట్ట ప్రాంతంలో శంఖవరం మండలంలో 101.2 మి.మీ. వర్షం కురవగా, తుని, తొండంగి, ఏలేశ్వరం, గంగవరం మండలాల్లోను, ఏజెన్సీలోని వై.రామవరం, అడ్డతీగల మండలాల్లో పలు ప్రాంతాల్లో సైతం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఖరీఫ్కు ఊతం డెల్టాతోపాటు ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఖరీఫ్కు ఊతం లభించింది. డెల్టాలో జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేసినా పంట కాలువల ద్వారా సకాలంలో సాగునీరు శివారు ప్రాంతాలకు అందలేదు. దీంతో తూర్పు, మధ్యడెల్టాల్లో బ్యారేజ్కు సమీపంలో ఉన్న కొత్తపేట, రాజమహేంద్రవరం, అనపర్తి, ఆలమూరు వ్యవసాయ సబ్ డివిజన్లలో మాత్రమే నారుమడులు ఆశాజనకంగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే నీరందుతుండగా.. ఇదే సమయంలో భారీ వర్షాలు కురవడంతో ఇక్కడ ఖరీఫ్ పనులు జోరందుకోనున్నాయి. వర్షాలు లంక ప్రాంతాల్లోని కూరగాయ, ఇతర వాణిజ్య పంటలకు మేలు చేస్తున్నాయి. కొబ్బరి రైతులు వర్షం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి ఎండల వల్ల పిందెలు రాలి, ఆకులు తలవాల్చాయని, ఈ సమయంలో భారీ వర్షం పడడం, వాతావరణం చల్లబడడంతో కొబ్బరి తోటలకు మేలు జరుగుతుందని రైతులు తెలిపారు. -
సంప్రదాయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి
- సకాలంలో నీరిచ్చి ఆదుకున్న ప్రభుత్వం మాదే - ఏరువాకలో ఉప ముఖ్య మంత్రి చిన రాజప్ప పొలమూరు (అనపర్తి): సంప్రదాయ వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యతనివ్వాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా రైతులు ముందుకు సాగాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని పొలమూరులో జిల్లాస్థాయి శుక్రవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చినరాజప్ప మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసి సాగునీటికి అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రెండో పంటకు నీరందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ రసాయన ఎరువుల విపరీతంగా వాడటం వల్ల భూసారం తగ్గి తద్వారా పంట దిగుబడులు తగ్గుతాయన్నారు. జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతోపాటు ప్రత్యామ్మాయ మార్గాల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతవహించిన స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జేష్ట పౌర్ణమి రోజున రైతులు తొలి అరక దున్ని సాగును ప్రారంభించటం ఆనవాయితీకి అనుగుణంగా ప్రభుత్వం ఏరువాక పౌర్ణమిని నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్, పశు సంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అంతకుముందు ఏరువాకలో భాగంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పొలమూరులోని వ్యవసాయ క్షేత్రంలో భూమితల్లికి, నాగలికి పూజలు నిర్వహించి కాడెద్దులతో దుక్కిదున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి, ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరి, నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి సీతామహాలక్ష్మి, ఫిషరీస్ జెడీ కోటేశ్వరరావు, పట్టు పరిశ్రమ శాఖ డీడీ బిఎంవి రామరాజు ఏపీ సీడ్స్ మేనేజర్ భాస్కరరావు, ఏరువాక శాస్త్రవేత్త ప్రవీణ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తా
- రాజమహేంద్రవరంలో ఫారెస్ట్ అకాడమీ - కాకినాడను వండర్ఫుల్ సిటీగా చేస్తా - మహాసంకల్ప సభలో చంద్రబాబు కాకినాడ: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా పూర్తి తోడ్పాటును అందిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మహాసంకల్ప సభకు విచ్చేసిన ఆయన కాకినాడ సూర్య కళామందిరంలో జరిగిన సభలో జిల్లాకు సంబంధించి అనేక హామీలు గుప్పించారు. మహాసంకల్ప ప్రతిజ్ఞ అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాను ఆదర్శ జిల్లాగా తయారు చేసేందుకు తోడ్పాటును అందిస్తానన్నారు. పర్యాటక రంగంలో తూర్పుగోదావరి జిల్లాకు పెద్దపీట వేస్తానన్నారు. కాకినాడ జగన్నాథపురం వంతెనపై రూ.146 కోట్ల వ్యయంతో మూడో బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రూ.50 నుంచి రూ.100 కోట్ల వ్యయంతో రాజమహేంద్రవరంలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తుని, అమలాపురం, చింతూరు డయాల్సిస్ యూనిట్లుతోపాటు మోతుగూడెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నెల్లిపాకలో జూనియర్ కళాశాల, యర్రంపేట వద్ద డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును, చింతూరులో ఫైర్స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు. 53 ఎత్తిపోతల పథకాలు వివిధ కారణాలు వల్ల వినియోగంలోలేనందున వీటికయ్యే రూ.9 కోట్లు వెచ్చించి తక్షణమే పనులు ప్రారంభించాలని అక్కడే ఉన్న కలెక్టర్ కార్తికేయ మిశ్రాను ఆదేశించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం సూచన మేరకు కాకినాడ రైల్వే స్టేషన్ను స్మార్ట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహాసంకల్ప సభా వేదికగా ఉన్న ఆనంద భారతి గ్రౌండ్స్ను శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా రూ. 10 కోట్లతో మినీ స్టేడియంను అభివృద్ధి చేస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. కాకినాడ నగరాన్ని వండర్ఫుల్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ దిశగా తాము ప్రయత్నిస్తామంటూ పేర్కొన్నారు. . సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2018 నాటికల్లా ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి ఇచ్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రూ.100 కోట్లతో డ్రైనేజీలు ఆధునికీకరణ, ఉప్పుటేరుపై మూడో వంతెన నిర్మాణాలను 2019 నాటికల్లా పూర్తి చేసేందుకు నవనిర్మాణ దీక్షలో ప్రతిపాదించామన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాలు ద్వారా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ గడచిన నెల రోజుల్లో దీపం కనెక్షన్లు ద్వారా లక్షా 80 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంకల్పానికి అధికారులు, ప్రజల భాగస్వామ్యం వహిస్తే అభివృద్ధిలో అన్ని విధాలా ముందుండగలమన్నారు. పౌర సరఫరాలశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పొగ రహిత వంట ఇంధన రాష్ట్రంగా చేసేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పోలవరంతోపాటు జాతీయ రహదారుల అభివృద్ధి సహా ఎన్నో కార్యక్రమాలు అమలుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను అక్షర క్రమంలోనే కాక, అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజలంతా నడుం కట్టాలన్నారు. ఎన్జీవో సంఘ రాష్ట్రనేత అశోక్బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కనబడని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని సంస్కరణలు చేపట్టాలని కోరారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచన పలువురు అధికారులను సత్కరించగా మూడేళ్ళ ప్రగతిపై రూపొందించిన పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. పొగ రహితవంట ఇంధన కార్యక్రమంలో భాగంగా గ్యాస్ కనెక్షన్లు పెద్ద ఎత్తున అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును పలువురు మహిళలు సత్కరించారు. సమావేశంలో శాసనమండలి స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం మహా సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
అన్నీ తానే....అంతా నేనే
- బాబు ప్రసంగం ప్రారంభంలోనే లేచిపోయిన జనం - గంట కూడా ఓపిక లేకపోతే ఇంకేం సాధిస్తారంటూ సీఎం అసహనం - వెళ్లిపోతున్నవారిని గేట్టు వేసి అడ్డుకున్న పోలీసులు - గేట్లు దూకి కొంతమంది, గేట్లు సందుల్లోంచి మరికొంతమంది బయటకు - ‘సాక్షి’ కథనాలే ప్రధాన అజెండాగా మళ్లీ హామీలు - పొగడ్తలతో ఉద్యోగ సంఘ నేతల ఉపన్యాసాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ :అన్నీ తానే...అంతా నేనే.. అన్నట్టుగా సీఎం చంద్రబాబు ప్రసంగం సాగింది. గత హామీలనే మరోసారి వల్లెవేస్తూ సుమారు గంటంపావు సాగిన బాబు ప్రసంగం జనాన్ని విసుగెత్తేలా చేసింది. కాకినాడ ఆనంద భారతి మైదానంలో గురువారం రాష్ట్ర స్థాయిలో నవ నిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమం జరిగింది. సాయంత్రం 5.15 నుంచి 6.40 గంటల వరకు ఏకబిగిన బాబు ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభిస్తుండగానే జనం కుర్చీల్లోంచి లేచిపోవడాన్ని గమనించిన చంద్రబాబు కాస్త అసహనంతో గంట కూడా కూర్చోలేకపోతే ఇక జీవితంలో ఏమి సాధించలేమంటూ వారిని వెళ్లకుండా చేశారు. ఆ ఉపన్యాసం అయిందనుకునే సరికి రాష్ట్ర్రస్థాయి మహా సంకల్పం పేరుతో 20 నిమిషాలకు పైగానే ప్రతిజ్ఞ చేయించారు. చంద్రబాబు ప్రసంగంలో రాష్ట్రంలో ‘అన్నీ తానే’ చేశానని చెప్పుకునే ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. గతంలో చెప్పిన అంశాలనే మరోసారి చెప్పుకుంటూ పోతూ జనానికి విసుగు పుట్టించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఔటర్రింగ్ రోడ్డు, విలీన మండలాల్లో ఏడు గ్రామాలు కలిపేతేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని కేంద్రాన్ని హెచ్చరించి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించానని చెప్పుకురావడం, రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించిన చంద్రబాబు వేదికపై మాత్రం రైతులకు రూ.24 వేల కోట్ల రుణ విముక్తి కల్పించింది దేశంలో తానొక్కడినేని గొప్పలు చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవరెస్టు అధిరోహకుల ఘనతనూ తన ఖాతలోకే... ఎవరెస్టు అధిరోహించిన 14 మంది సభ్యుల బృందంలోని రాణి, భరత్లు తమ అనుభవాలను వివరించారు. అయితే వారిని వేదికపైకి ఆహ్వానించిన చంద్రబాబు ‘ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.40 లక్షలు ఖర్చు చేశామని ఇదంతా వారి విజయవం కాదంటూ’నే వారి ఘనతను తన ప్రభుత్వ ఖాతాలో వేసేందుకు ప్రయత్నించారు. ఓ పక్క రాష్ట్రం కష్టాల్లో ఉందని, డబ్బుల్లేవని బీద అరపులు అరుస్తూ మరో పక్క భవిష్యత్తులో తలసరి ఆదాయాన్ని కోట్లలో తీసుకు వస్తాననడంతో జనం విస్మయానికి గురికావడం కనిపించింది. రాజధాని నిర్మిస్తానని చెప్పడంలో తప్పు లేదు, కానీ చరిత్రలో వెయ్యి, రెండువేల ఏళ్ల వరకు నిలిచిపోతుందనడమే కాస్త విడ్డూరంగా కనిపించింది. బాబు భజనలో... ఉద్యోగుల సంఘం ప్రతినిధిలుగా సభకు హాజరైన అశోక్బాబు, మురళీకృష్ణ టీడీపీ నేతలను మించిపోయి చంద్రబాబు భజన చేయడం సభికులను ఆశ్ఛర్యానికి గురిచేసింది. అమరావతిని తీర్చిదిదేందుకు కష్టపడుతున్న చంద్రబాబును జీవితకాలం సీఎంగా ఉండాలని ఒకరు, అసలు అమరావతి అంటేనే ఒక అవకాశమంటూ మరొక నేత చేసిన వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయి. అసలు వారిద్దరూ ఉద్యోగ సంఘం నాయకుల్లా కాకుండా టీడీపీ నేతలను మించి ప్రసంగించారంటూ సభికులు చర్చించుకోవడం కనిపించింది. ‘సాక్షి’ అంశాలే అజెండాగా... పనిలో పనిగా చంద్రబాబు మరోసారి ‘సాక్షి’పై తన అక్కసును వెళ్లగక్కారు. నవ నిర్మాణ దీక్షను అన్ని పత్రికలు మంచి కవరేజ్ ఇస్తే ‘సాక్షి’ మాత్రం వ్యతిరేక కథనాలు ప్రచురించిందంటూ విమర్శలకు దిగారు. కానీ అదే చంద్రబాబు గతంలో జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనాల్లోని అంశాలే అజెండాగా మాట్లాడటం విశేషం. కాకినాడ ఉప్పుటేరుపై రూ.146 కోట్లతో మూడో వంతెన, ఏజెన్సీ ప్రాంతంలో వైద్య, విద్య, మౌలిక సదుపాయాలపై మరోసారి హామీల వర్షం కురిపించారు. చంద్రబాబు కంటే ముందు ప్రసంగించే అవకాశం దక్కిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తేందుకు పోటీపడటం కనిపించింది. తాను నివాసం ఉండే అమలాపురంలో బుధవారం రాత్రి నుంచి 14 గంటలపాటు విద్యుత్ లేక జనం ఇబ్బందులు పడితే బాబు సీఎం అవ్వడంతోనే నిరంతర విద్యుత్ ఇస్తున్నామని చినరాజప్ప చెప్పడం చర్చనీయాంశమైంది. -
సీబీఎస్ఈ పేరుతో బురిడీ
-లేని గుర్తింపు ఉందంటూ కొన్ని విద్యాసంస్థల వంచన -పుస్తకాలు, బోధన అదే అయినా..స్టేట్ సిలబస్తోనే మార్కులు -చివరిలో విషయం తెలిసి హతాశులవుతున్న తల్లిదండ్రులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : తిరుమలరావు తన కుమారుడు యశ్వంత్ను మంచి విద్యను అందించాలని ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూలులో సీబీఎస్ఈ సిలబస్లో చేర్పించాడు. అయితే ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడిని ఏవో కారణాలతో స్కూలు మార్చాలని టీసీ, మార్కుల లిస్టు తీసుకుని మరొక స్కూలుకు వెళ్లి సీబీఎస్ఈ సిలబస్లో చేర్చబోయాడు. అయితే ఆ స్కూలు వారు ‘మీ అబ్బాయి చదివింది సీబీఎస్ఈ సిలబస్ కాదు. స్టేట్బోర్డు సిలబసే. మేము అందులోనే చేర్పించుకుంటాం’ అంటే ‘అదేమి’టంటూ మండిపడ్డాడు. అయితే ఆ స్కూలు నిర్వాహకులు ముందు స్కూలులో జరిగిన మోసాన్ని విప్పి చెప్పి, మార్కుల లిస్టులో స్టేట్బోర్డు సిలబస్ అని రాసి ఉండడాన్ని చూపడంతో హతాశుడయ్యాడు. ఇన్నాళ్లూ సీబీఎస్ఈ సిలబస్ చదువుతున్నాడనుకున్నానని, ఇంత మోసమా అని వాపోయాడు. ఈ అనుభవం ఒక్క తిరుమలరావుకే కాదు.. జిల్లాలో కొన్ని వందలమంది తల్లిండ్రులు, విద్యార్థులకు ఎదురవుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల మోసం. తల్లిదండ్రుల ఆసక్తిని ఆసరాగా తీసుకుని.. జిల్లాలో మొత్తం 1500 ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలున్నాయి. వాటిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించేవి 900, ఆరు నుంచి పదో తరగతి వరకు బోధించేది 600 ఉన్నాయి. వీటిలో మొత్తం నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల్లో ఎక్కువమంది సీబీఎస్ఈ, ఐసీసీఎస్ సిలబస్లకే మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు తల్లిదండ్రులు, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. తమ స్కూలులో సీబీఎస్ఈ సిలబస్ ఉందంటూ, పుస్తకాలు, స్కూలు ఫీజులకు వేల రూపాయలు గుంజుతున్నాయి. అలాంటి స్కూళ్లలో విద్యార్థికి ఇచ్చేది సీబీఎస్ఈ పుస్తకాలే, చెప్పేది అదే కోర్సు, కాని పరీక్ష పూర్తయిన తర్వాత వారికి ఇచ్చే మార్కుల లిస్టులో సీబీఎస్ఈ అని కాక స్టేట్బోర్డు అని ఉండడం గమనార్హం. చాలా మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు మార్కుల లిస్టు వచ్చిన తర్వాత కూడా అర్థం కాని పరిస్థితి. మరో స్కూలులో చేర్పించే సమయంలో ఆ యాజమాన్యం చెప్పేవరకు తమ పిల్లలు ఏ సిలబస్ చదివారో తెలియని స్థితి. కొన్ని స్కూళ్లలో అయితే ‘మీ పిల్లాడు సరిగా చదవడం లేదు. సీబీఎస్ఈలో అయితే కొంచెం కష్టం. సేట్బోర్డు సిలబస్లోకి మార్చేస్తాం’ అంటూ తొమ్మిదో తరగతి పూర్తిచేసి పదో తరగతిలోకి అడుగెడుతున్న వారి తల్లిదండ్రులకు అనునయంగా చెపుతూ వారి మోసం బయటపడకుండా పడుతున్నారు. జిల్లాలో ఈ స్కూళ్లకే సీబీఎస్ఈ, ఐసీసీఎస్ గుర్తింపు జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడలలో మాత్రమే సీబీఎస్ఈ, ఐసీసీఎస్ గుర్తింపు ఉన్న స్కూళ్లు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి సమాచారం మేరకు.. రాజమహేంద్రవరంలో సీబీఎస్ఈ గుర్తింపు ఉన్నవి శ్రీషిర్డీసాయి విద్యానికేతన్, ఫ్యూచర్కిడ్స్, గురుకులం, భారతీయ విద్యాభవన్, ఐసీసీఎస్ గుర్తింపు ఉన్నవి ప్యూచర్కిడ్స్, సెంట్ ఏన్స్, కాకినాడలో సీబీఎస్ఈ గుర్తింపు ఉన్నవి లక్ష్య, గ్రీన్ఫీల్డ్, శ్రీప్రకాశ్, ఐసీసీఎస్ గుర్తింపు ఉన్నవి ఆశ్రమ, అక్షర స్కూల్స్ మాత్రమే. చర్యలు తీసుకుంటాం స్టేట్బోర్డు గుర్తింపు మాత్రమే ఉన్నా సీబీఎస్ఈ, ఐసీసీఎస్ సిలబస్ అంటూ పిల్లలను చేర్పించుకోవడం, వారికి అదే సిలబస్ బోధించి చివరకు స్టేట్బోర్డు అని ఇవ్వడం నేరం. జిల్లాలో కొని స్కూల్స్కు మాత్రమే ఆ గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు స్కూళ్లలో చేర్చేటప్పుడే గమనించాలి. ఈ విధంగా ఏ విద్యాసంస్థ అయినా మోసం చేసిందని మాకు చెపితే కఠిన చర్యలు తీసుకుని, ఆ విద్యాసంస్థను మూసివేయించే చర్యలు తీసుకుంటాం. –ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి -
మాటలన్నీ నీటిమూటలేనా?
-జిల్లాకు వచ్చిన ప్రతిసారీ హామీలతో ‘చంద్ర’జాలం -అంగర నుంచి విలీన మండలాల వరకూ వరాల వర్షం -వాటిలో ఏ ఒక్కటీ సాకారం కాని చేదు వాస్తవం -నేడు ‘మహా సంకల్పం’ పేరుతో మరోసారి జిల్లాకు రానున్న సీఎం మాటలతో కోటలు కట్టడంతో ఆరితేరిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘అర చేత వైకుంఠాన్నే’ కాదు.. ‘కొనగోట కైలాసాన్నీ’ చూపగల ఇంద్రజాలికుడని చెప్పవచ్చు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆయన.. 2014 ఎన్నికల ప్రచారంంలో ఇవ్వని హామీ లేదు. చెయ్యని వాగ్దానం లేదు. వాటిని నమ్మి ఓట్లేసి, గద్దెనెక్కించిన జనాన్ని.. ముఖ్యమంత్రిగా తన పాలనతో మెప్పించాల్సిన ఆయన అధికారం చేపట్టి గురువారం నాటికి మూడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరగుతున్న నవనిర్మాణదీక్షల ముగింపు ఉత్సవం ‘మహా సంకల్పం’ పేరుతో కాకినాడలో జరగనుంది. ఈ వేడుకకు హాజరు కానున్న సీఎం కొత్తగా ఏ హామీలు ఇస్తారో తెలియదు.. కానీ ఆయన అంతకు ముందు, ఈ మూడేళ్లలో ఇచ్చిన హామీలలో నెరవేర్చని వాటికి ఏం సమాధానం చెపుతారన్నది జిల్లావాసుల ప్రశ్న. జిల్లాకు వచ్చిన ప్రతిసారీ సీఎం ఎడాపెడా గుప్పిస్తున్న హామీలు దొంతరగా పెరిగిపోతున్నాయే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ ఎత్తిచూపినవి.. ఈ మూడేళ్లలో ఆయన కురిపించిన హామీల్లో కురవని మబ్బుల్లా మిగిలిన వాటిలో కొన్ని మాత్రమే.. -సాక్షి ప్రతినిధి, కాకినాడ అంగరకు ఆశాభంగమే.. - ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి–మా ఊరు రాష్ట్రంలోనే తొలిసారి కపిలేశ్వరపురం మండలం అంగరలో 2014 అక్టోబరు 4న ప్రారంభించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు హాజరైన కార్యక్రమంలో సీఎం వరాల జల్లు కురిపించారు. అంగరను స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దుతానని జనం చప్పట్ల మధ్య అట్టహాసంగా ప్రకటించారు. చేనేతకు పేరొందిన ఆ ఊళ్లో ప్రతి చేనేత కార్మికుడికి రూ.12 వేల విలువైన వృత్తి కిట్లను అందజేస్తామన్నారు. సహకార సంఘాల అమ్మకాలపై 30 శాతం రాయితీ ఇస్తామనీ ఊరించారు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో అమలుచేసిన చీర, ధోవతి పథకం (జనతా స్కీం)ను పునరుద్ధరిస్తానన్నప్పుడు చేనేత కార్మికులు పట్టరాని ఆనందం దిక్కులు పిక్కటిల్లేలా కరతాళధ్వనులు చేశారు. అంగరలో రూ.కోటితో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల నిర్మాణానికి సేకరించిన మూడు ఎకరాలను మెరక చేసి జీ ప్లస్ టు గృహాలను నిర్మిస్తామని..ఇలా గ్రామానికి రూ.ఆరుకోట్ల విలువైన వరాలు ప్రకటించారు. మూడేళ్లు అయిపోతున్నా వాటిలో ఏ ఒక్క హామీనీ ఇంతవరకూ నెరవేర్చలేదు. ఏ వరాన్నీ సాకారం చేయలేదు. బాబు ఇస్తానన్న రాయితీæ లేక సహకార సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. గాలిలో దీపం.. గిరిజనుల ప్రాణం.. - చంద్రబాబు గత ఏడాది విలీనమండలాల పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా చింతూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం ఆ ప్రాంత గిరిజనులకు అనేక హామీలు గుప్పించారు. చింతూరులో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో మన్యంవాసులు ఎంతో సంబరపడ్డారు. ఇప్పటికీ అది ఏరియా ఆసుపత్రిగానే ఉంది. పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఒకే ఒక వైద్యుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ప్రత్యేక వైద్య నిపుణుల నియామకం కూడా చేపట్ట లేదు. బస్సు డిపో ఏర్పాటు చేస్తామని గొప్పగా ప్రకటించిన సీఎం బస్స్టాండ్ ఏర్పాటుతో చేతులు దులుపుకొన్నారు. నాలుగు విలీన మండలాల్లో గిరిజన రైతులకు సాగునీరందించేందుకు 53 ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ.9 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నేటికీ వాటికి మరమ్మతులు జరగలేదు. నాలుగు మండలాల్లో విద్యార్థుళఖు పౌష్టికాహారం కోసం చింతూరులో సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ కూడా అటకెక్కింంది. పీబీసీపై వాగ్దానం.. ఎండమావిలో కెరటం.. -ఎన్నికలకు ముందు బాబు పాదయాత్రకు వచ్చిన సందర్బంలో పిఠాపురంలో పార్టీ స్థూపం ఆవిష్కరించిన సందర్బంగా అక్కడి రైతులకు పిఠాపురం బ్రాంచి కెనాల్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కెనాల్ అభివృద్ధికి రూ.25 కోట్లు అవసరమని గతంలో అంచనా వేశారు. ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈ కెనాల్కు ఎంతో కొంత కేటాయిస్తారని అక్కడి రైతులు ఆశగా ఎదురుచూశారు. గొల్లప్రోలు సుద్దగడ్డ ముంపును కూడా నివారిస్తామన్నారు. పిఠాపురం వాసులకు ఈ రెండూ ప్రధాన సమస్యలు. ఎన్నికల ముందు ఓట్ల కోసం తమను నమ్మించి గద్దె నెక్కాక ఇచ్చిన హామీ నెరవేర్చకుండా గాలికొదిలేశారని ఆ ప్రాంత రైతులు మండిపడుతున్నారు. ఒకే పరిశ్రమతో కే-సెజ్ -విశాఖ–చెన్నై కోస్తా కారిడార్లో భాగంగా కాకినాడను పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు అనేక పర్యాయాలు హామీ ఇచ్చారు. అంతెందుకు 2004కు ముందు సీఎంగా చివరి రోజుల్లో కే- సెజ్కు జీఓ ఇచ్చింది కూడా ఆయనే. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఆ సెజ్లో ఒక చైనా బొమ్మల కంపెనీ మాత్రమే వచ్చింది. వాస్తవానికి ఆ సెజ్లో రూ.50 వేల కోట్ల విలువైన పెట్రో ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. ఒకవేళ పరిశ్రమలు తీసుకు రాలేకపోతే రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు తమ స్థితి రెండింటికీ చెడ్డ రేవడిగా మారిందని ఆ ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నారు. సెజ్లో వస్తాయని చెప్పిన హార్డ్వేర్, సాఫ్ట్ వేర్ పార్కులు కూడా అడ్రస్ లేవు. రాజమహేంద్రవరంలో కన్వెన్షన్ సెంటర్, స్టేడియం ఏర్పాటు చేస్తానన్న బాబు హామీలు కూడా గోదావరి వరద కెరటాలపై నీటిబుడగల్లాగే మిగిలాయి. 25 శాతం కాదు.. ఒక్క రూపాయిస్తే ఒట్టు.. - కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో 25 శాతం వాటా నిధులు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇంతవరకు రూ.650 కోట్లు విడుదల చేసినా బాబు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వాటాలో రూపాయి కూడా విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని కోనసీమవాసులు ఆవేదన చెందుతున్నారు. వీటితో పాటు మోరి స్మార్ట్ విలేజ్, రామచంద్రపురంలో ఫైబర్గ్రిడ్, కాకినాడలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు, కాకినాడలో ఉప్పుటేరుపై మూడో వంతెన నిర్మాణం, జిల్లాలో మత్స్యకారుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు...ఇలా జిల్లాకు వచ్చిన ప్రతిసారీ హామీలు ఇవ్వడం, జిల్లా సరిహద్దు దాటాక గాలికొదిలేయడం చంద్రబాబుకు షరామామూలై పోయిందని జనం నిష్టురమాడుతున్నారు. వలస పోతున్నారు వారసత్వంగా వస్తున్న చేనేత వృత్తిని కొనసాగించే పరిస్థితి లేదు. ఇంటిల్లిపాదీ కష్టించి పనిచేసినా రోజుకు రూ.రెండు వందలు రావడం లేదు. దీంతో వృత్తిని నమ్ముకున్న వారు వలసలు పోతున్నారు. జనతా వస్త్రాల స్కీంను పునరుద్ధరిస్తానని, చేనేత కిట్లు ఇస్తానని, అమ్మకాలపై 30 శాతం రిబేట్ ఇస్తానంటూ అంగరసభలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. -రుద్రాక్షుల శ్రీనివాస్, చేనేత కార్మికుడు -
సస్యశ్యామలంపై ... స్వార్ధపు చీడ
- పెద్దల నిర్మాణ బాగోతం - సాగు నీటికి బ్రేకులు - సాగును ప్రశ్నార్థకంలో పడేసిన నేతల స్వార్థం - రైతులకు నీటి కష్టాలు - గుక్కెడు నీటి కోసం జనం కటకట సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజలు ఎలాపోతే మాకేంటి ... మా జేబులు నిండితే చాలన్నట్టుంది అధికార పార్టీ నేతల తీరు. వారి స్వార్థం వేల ఎకరాల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా పంట కాలువ వెంబడి పనుల కాంట్రాక్ట్లో పడి తమ స్వప్రయోజనాల కోసం అటు కోనసీమలోను, ఇటు సామర్లకోటల్లో పంట కాలువలకు సాగునీరు సరఫరా కాకుండా నిలిపివేశారు. కేవలం రెండున్నర కోట్ల వ్యయంతో సామర్లకోట పంట కాలువపై నిర్మిస్తున్న వంతెన కోసం వేలాది మంది రైతుల కంట కన్నీరు పెట్టేలా చేస్తున్నారు. అమలాపురంలో రూ.9.10 కోట్ల వ్యయంతో నల్లవంతెన–ఎర్రవంతెన మ«ధ్య పంట కాలువ పక్కన లాంగ్ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో అమలాపురం–చల్లపల్లి పంటకాలువ, మురమళ్ల–ఎదుర్లంక మధ్య, గాడిలంక–కర్రివానిరేవు మధ్య పంట కాలువల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం పంట కాలువలకు అడ్డగోలుగా సాగు నీరు నిలిపివేశారు. దాదాపు ఈ పనులన్నీ ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన బంధువులు, బినామీలే చేస్తున్నారు. ఈ కారణంగా వారి స్వార్థం కోసం పంట కాలువలకు సాగునీరు సరఫరా చేయకుండా నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. సామర్లకోట కాలువపై వంతెన నిర్మాణంలో ఒక మంత్రి తనయుడు బినామీగా పనులు చేపడుతుండంతోనే వేలాది మందికి సాగు, తాగునీరు ఇబ్బంది కలుగుతున్నా ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్టు పోతున్నారు. వారి నిర్వాకం ఫలితంగా జిల్లా కేంద్రం కాకినాడ నగరం, పెద్దాపురం, సామర్లకోట పట్టణాలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. ప్రతి ఏటా కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంట కాలువలకు ముందుగానే నీరు విడుదల చేశారని సంబరపడ్డ రైతులకు అమాత్యుని నిర్వాకంతో శాపమైంది. ఇదంతా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. ధవళేశ్వరం గోదావరి నుంచి సామర్లకోట గోదావరి కాలువకు విడుదలచేసిన నీటిని కడియం కొత్త లాకులను మూసేసి సరఫరా కాకుండా బంధించేశారు. నీటి విడుదల ఆనందం ఆవిరి... ఈ నెల ఒకటో తేదీన ధవళేశ్వరం వద్ద ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాలకు ప్రభుత్వం అధికారికంగా సాగునీరు విడుదల చేసింది. ధవళేశ్వరంలో నీరు విడుదల చేసిన 48 గంటల్లోపు జిల్లాలో ఏ పంట కాలువలోనైనా చివరి వరకు నీరు పారాల్సిందే. అధికారికంగా సాగునీరు విడుదల చేసి మంగళవారం నాటికి ఆరు రోజులయింది. ఇంతవరకు సామర్లకోట గోదావరి కెనాల్కు చుక్కనీరు సరఫరా కాలేదు. ఇందుకు కారణమేమిటని ఆరా తీస్తే నేతల స్వార్థం కోసం సాగునీటి సరఫరా నిలిపివేసిన బాగోతం బయటపడింది. కారణమిదీ... సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే గోదావరి కాలువపై కొత్త వంతెన నిర్మాణానికి గతేడాది జూన్ 3న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. రూ.1.99 కోట్లు అంచనా వ్యయం నిర్మాణం ఆలస్యం కావడంతో అంచనా రూ.2.70 కోట్లకు పెరిగిపోయింది. ఏడాది తరువాత 18 రోజులు క్రితమే వంతెన పనులు మొదలుపెట్టడం గమనార్హం. వంతెన పనులు తెరవెనుక చక్కబెడుతున్న మంత్రి కుటుంబ సభ్యులు సామర్లకోట కెనాల్ నీటి సరఫరా నిలిపివేయించారని రైతులు మండిపడుతున్నారు. ఈ నీరే సాగుకు ఆధారం... ఈ కెనాల్ నుంచి సరఫరా అయ్యే నీరు సాగు, తాగుకు చాలా కీలకం. ఈ సాగు నీరుతో సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల్లోని చాలా గ్రామాల ఆయకట్టుకు జీవం పోస్తుంది. ఈ కాలువకు నీరు వస్తే ఖరీఫ్ దమ్ములు చేసుకుందామని ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు. సామర్లకోట మండల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలు, కాకినాడ రూరల్ రామేశ్వరం, గంగనాపల్లి, అచ్యుతాపురం గ్రామాలకు మరో 15వేల ఎకరాలకు సాగు నీరు సరఫరాకు బ్రేక్ పడింది. పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలోని ఆయకట్టుకు కూడా ఈ కాలువ నీరే ఆధారం. పిఠాపురం నుంచి గొల్లప్రోలు, తుని వరకు సుమారు 47 వేలు ఎకరాలకు సాగునీరు పిఠాపురం బ్రాంచి కెనాలే ఆధారం. లక్ష మందికి గొంతు తడిపే కాలువ ఇదే... సాగునీరే కాకుండా వేలాది మంది దాహార్తిని కూడా ఈ కాలువ తీరుస్తుంటుంది. చినరాజప్ప ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గంలోని సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల పరిధిలోని లక్షన్నర మంది గొంతు తడిపే కాలువ కూడా ఇదే. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో 70 వేలు, పెద్దాపురం మున్సిపాలిటీలో 55 వేల జనాభాకు తాగునీరు మున్సిపాలిటీలు సరఫరా చేయాలి. ఇందు కోసం సామర్లకోటలో రెండు రిజర్వాయర్లున్నాయి. సామర్లకోట–కాకినాడ రోడ్డులో సాంబమూర్తి రిజర్వాయరు, ఉండూరు రైల్వే గేటు వద్ద నాగార్జున చెరువును ఏర్పాటు చేశారు. గోదావరి కాలువ నీటితోనే ఈ రెండు మున్సిపాలిటీలకు నీరు రిజర్వు చేశారు. సాంబమూర్తి రిజర్వాయరు పెద్దాపురం మున్సిపాలిటీ, నాగార్జున చెరువు సామర్లకోట మున్సిపాలిటీతో పాటు కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారానికి, కాకినాడ సీపోర్టుకు కూడా ఈ కాలువ నీరే ఆధారం. వేసవి తాపంతో రెండు చెరువులలో నీరు అడుగంటింది. దాంతో ఫిల్టరు ప్లాంటులకు నీరు అందని పరిస్థితి ఉంది. ఉన్న నీరు కూడా పసరు రంగుకు మారిపోయి నీరు చెడువాసన వస్తోందని పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఓ మంత్రి ఆదేశాలతోనే... గోదావరి కాలువలో వంతెన పనుల్లో భాగంగా రెండుగట్ల వైపు కాంక్రీట్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి పై ఎత్తుకు వచ్చే వరకు ఈ కాలువ నీటిని విడుదల చేయవద్దని ఒక ఆమాత్యుని హుకుం. ఆయన చెప్పిందే తడవు ఇరిగేషన్ అధికారులు ‘జీ హుజూర్’ అంటూ నీటిని కడియం లాకుల్లో నిలిపివేశారు. ప్రస్తుతం ఒక దిమ్మ నీటి మట్టం ఎత్తుకు రాగా, మరో దిమ్మ పునాదికే పరిమితమైంది. మరో వారం రోజుల వరకు ఈ పనులు పూర్తి అయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇదే కాలువ నీరు సామర్లకోట నుంచి వీకే రాయపురం, మాధవపట్నం మీదుగా కాకినాడ వరకు వెళుతుంది. ఈ కాలువలో వంతెన నిర్మాణ కాంట్రాక్ట్ కోసం నీరువిడుదల అపేస్తే వీకె రాయపురం, మాధవపట్నం వద్ద గోదావరి కాలువలకు అడ్డు కట్టలు వేసి మరీ కాలువ అవతలివైపు కొందరు నేతలు, రియల్టర్లు పంట పొలాలను లేఆవుట్ చేసుకోడానికి గ్రావెల్ రవాణా చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడిపడితే అక్కడ ముడుపులు మెక్కేసి గోదావరి కాలువలో అడ్డుకట్టలు వేసిన నీటిపారుదల శాఖాధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికీ కటకటే... కాకినాడ నగరంలో కూడా గోదావరి నీరు సరఫరా లేకపోవడంతో ఉన్న నీరు దుర్వాసన వస్తోందని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అరట్లకట్ట వేసవి జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడంలేదు. ప్రజలకు రెండుపూటలా నీరు అందించలేని పరిస్థితిని నగరపాలక సంస్థ ఎదుర్కొంటోంది. వేసవి జలాశయంలో 45 రోజులుకు సరిపడేంతగా నీటిని నిల్వ చేసుకున్నా ముందస్తు ప్రణాళిక లేక గడచిన వారం రోజులుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కుళాయిలు ద్వారా మురికినీరు సరఫరా అవుతుండటంతో నగరంలో సుమారు నాలుగు లక్షల మంది తాగునీటికి కటకటలాడుతున్నారు. గాంధీనగర్, రామారావుపేట, పాతబస్టాండ్, అశోక్నగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా మంచినీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. గోదావరి కాలువలు తెరచినప్పటికీ ఈ పరిస్థితి అధిగమించడానికి మరో నాలుగైదు రోజులుపైనే పడుతుందని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ‘గుక్కెడు నీరు రంగు మారి పొయింది’ గడచిన రెండు రోజులుగా తాగునీరు రంగు మారిపోయింది. నీరు చెడు వాసన వస్తుంది. గోదావరి కాలువకు నీరు వచ్చినా సామర్లకోటకు చేరకపోవడంతో తాగునీటి చెరువులు నింపుకునే అవకాశం లేకుండాపోయింది. అధికారుల నిర్వాకంతో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. తుంపాల శ్రీనివాసు, సీఐటీయు మండల అధ్యక్షుడు, సామర్లకోట. బోరు నీరే శరణ్యం.... పెద్దాపురం మున్సిపాలిటీ ప్రజలకు బోరు నీరే శరణ్యంగా మారింది. గోదావరి జలాలు విడుదల చేసినా బోరు నీరు తప్పడం లేదు. సాంబమూర్తి రిజర్వాయరులో నీరు చాలా రుచిగా ఉంటాయి. బోరునీరు చాలా చప్పగా ఉంటున్నాయి.పట్టణ ప్రజలందరికి గోదావరి జలాలు అందించాలి. 20 రోజులుగా తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. షేక్ బేబీ, రామారావుపేట, పెద్దాపురం. ‘వర్షాలు లేవు...సాగునీరు లేదు’ గోదావరి కాలువలో నీరు వస్తే పంట భూముల్లో దమ్ములు చేసుకొవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత వేసవి కాలంలోని ఎండలకు భూములు బీటలు వారాయి. సామర్లకోట–వీకే రాయపురం మధ్యలో గోదావరి కాలువకు అడ్డుగా తాత్కలికం మార్గం ఏర్పాటు చేసుకొని లేవుట్లు వేస్తున్నారు. దాంతో గోదావరి కాలువ నీరు పంట కాలువలకు రావడానికి మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. వెలమర్తి శ్రీనివాసు, రైతు సంఘ నాయకుడు, వికె రాయపురం. ‘ఐదు రోజుల్లో విడుదల చేస్తాం’ సామర్లకోట గోదావరి కాలువపై జరుగుతున్న వంతెన పనులతో గోదావరి జలాలు విడుదలకు అంతరాయం కలిగింది. కడియంలో నీటిని నిలుపుదల చేశాం. ఐదు రోజుల్లో వంతెన స్తంభాలు పూర్తవుతాయి. వెంటనే గోదావరి కాలువలో మట్టిని తొలగించి గోదావరి కాలువకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తాం. విజయకుమార్, ఇరిగేషన్ డీఈ, కాకినాడ -
సీఎం పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ డీఎస్పీ సత్యనారాయణ వెల్లడి కాకినాడ క్రైం : సీఎం చంద్రబాబునాయుడు కాకినాడ పర్యటన పురస్కరించుకుని జూన్ 8న ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం స్థానిక టూటౌన్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవనిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబునాయుడు కాకినాడ వస్తుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. - విశాఖపట్టణం నుంచి కాకినాడకు వచ్చే అన్ని లారీలు, భారీ వాహనాలు అచ్చంపేట జంక్షన్ నుంచి ఏడీబీ రోడ్డు మీదుగా వాకలపూడి నుంచి కుంభాభిషేకం రోడ్డు మీదుగా జగన్నాథపురం రూట్లో వెళ్లాలి. - రామచంద్రపురం, అమలాపురం, యానాం వైపు నుంచి కాకినాడ మీదుగా వెళ్లే లారీలు, భారీ వాహనాలు ఎన్టీఆర్ కొత్త బ్రిడ్జి, వన్టౌన్ పోలీస్స్టేషన్ నుంచి జగన్నాథపురం, కుంభాభిషేకం, వాకలపూడి, ఏడీబీ రోడ్డు మీదుగా అచ్చంపేట నుంచి వెళ్లాలి. - విశాఖ నుంచి కాకినాడ ఆర్టీసీ బస్టాండ్కొచ్చే ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులన్నీ నాగమల్లిసెంటర్ నుంచి ఆర్టీవో కార్యాలయం, గొడారిగుంట సెంటర్, మదర్థెరిస్సా స్కూల్ నుంచి వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లాలి. ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి విశాఖవైపు వైళ్లే ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు పై రూట్లో వెళ్లాలి. - కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి యానాం, రావులపాలెం, విజయవాడ వైపు వెళ్లే బస్సులు, ఆయా ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ జగన్నాథపురం కొత్త బ్రిడ్జి, వన్టౌన్ పోలీస్స్టేషన్, పోర్ట్ పోలీస్స్టేషన్, డెయిరీ ఫారం సెంటర్, సాంబమూర్తినగర్ అయిదో వీధి గుండా మదర్థెరిస్సా, వైఎస్సార్ విగ్రహం సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్సుకి వచ్చి, ఇదే రూట్లో తిరిగి ఆయా గమ్యస్థానాలకు చేరుకోవాలి. - సామర్లకోట, జగ్గంపేట, రాజమహేంద్రవరం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ బాలాజీచెరువు సెంటర్ వద్ద ప్రయాణికులను దింపివేయాలి. అక్కడి నుంచి మళ్లీ ఆయా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఒకవేళ ఆర్టీసీ కాంప్లెక్సుకి వెళ్లాల్సి వస్తే మాధవపట్నం నుంచి సర్పవరం జంక్షన్, నాగమల్లిజంక్షన్, ఆర్టీవో కార్యాలయం సెంటర్, గొడారిగుంట, లక్ష్మీ హాస్పిటల్, మదర్థెరిసా సెంటర్ నుంచి వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరుకోవాలి. ఇదే రూట్లో వెనక్కి సామర్లకోట, జగ్గంపేట, రాజమహేంద్రవరం చేరుకోవాలి. -సీఎం సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ తుని వైపు నుంచి కాకినాడ వచ్చే వాహనాలన్నీ భానుగుడి వద్దకు చేరుకోవాలి. రిజర్వు పోలీస్ గ్రౌండ్లో వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సామర్లకోట, అమలాపురం, రామచంద్రపురం నుంచి కాకినాడకు వచ్చే వాహనాలన్నీ మెక్లారిన్ హైస్కూల్, పీఆర్ ప్రభుత్వ కళాశాల్లో పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. -
ఇదో ‘చల్లని’ మాయ
- గత ఏడాది సుమారు రూ.2 కోట్ల మజ్జిగ ఖర్చు - హెరిటేజీ మజ్జిగతో ‘మమ’ అనిపించారు - ఈ ఏడాది అంతకు తగ్గకుండా వ్యయం - ఆచరణలో కానరాని చలివేంద్రాలు - స్వచ్ఛంద సంస్థల కేంద్రాలూ అధికారిక రికార్డుల్లో... - ఉపాధి కూలీల మజ్జిగ సొమ్ములోనూ కక్కుర్తే...! ఏ రూపంలో నిధులు మంజూరైనా సరే ఏదో విధంగా స్వాహా చేయడానికి సిద్ధం...భారీ పథకంలోనే కాదు ... చలి వేంద్రాల చిల్లరను కూడా ఏరుకోడానికి కాచుక్కూర్చున్నారు అధికారపార్టీకి చెందిన చిల్లర నేతలు. గత ఏడాది మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సేవలో మునిగిన నేతలు ఈ సారి ఆ మజ్జిగ వాసన కూడా చూపించలేదు. దాహం కేకలు వేసే వారికి గుక్కెడు నీరు అందించే పథకంలో నిధులను పక్కదారి పట్టించి తమ జేబులు నింపుకున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : వేసవిలో జనం సేద తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రభుత్వం మొక్కుబడి తంతుగా మార్చేస్తోంది. గతేడాది వేసవిలో సొంత బ్రాండ్ హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీని ఆర్భాటంగా నిర్వహించింది. గత వేసవిలో జిల్లాలో మజ్జిగను మొక్కుబడిగా చేసి మంచినీళ్లు సరఫరా చేశారు. ఆ ప్రక్రియ మొత్తానికి సుమారు రూ.2 కోట్లు ఖర్చు చూపించారనే విమర్శలు వచ్చాయి. అసలు మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయకుండానే చేసినట్టుగా కాగితాలపై చూపించి సొమ్ములు కాజేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ వేసవిలో కూడా ప్రతి చలివేంద్రంలో మజ్జిగ, చల్లటి నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మే ఒకటి నుంచి 31 తేదీ వరకు మజ్జిగ, కూలింగ్ వాటర్, జూన్ ఒకటి నుంచి మంచినీరు సరఫరా చేశామని అధికారులు చెబుతున్నారు. మే నెలలో మజ్జిగ అనేది తూతూమంత్రంగా సరఫరా చేశారంటున్నారు. అదనంగా పదివేల చలివేంద్రాలేవీ... రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని ఇస్రో హెచ్చరికలతోపాటు జిల్లాను డేంజర్ జోన్గా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. సాయంత్రం వరకు ఇళ్ల నుంచి ప్రజలను బయటకు వెళ్లవద్దని కూడా ఆయన సూచించారు. ఆ హెచ్చరికలతో జిల్లావాసులు నాలుగైదు రోజులు భయంతో వణికిపోయారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. అప్పటి వరకు నిర్వహిస్తున్న చలివేంద్రాలకు అదనంగా జిల్లాలో మరో పది వేల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆ సందర్భంలో సూచించారు. కానీ ఆయన ఆదేశాల మేరకు అదనంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు మాత్రం జిల్లాలో ఎక్కడా కనిపించ లేదు. మండలానికి రూ.2 లక్షలు మంజూరు ప్రకటనతో హడావుడి... ఉన్న చలివేంద్రాలకే దిక్కుమొక్కు లేదు, అదనంగా ఎక్కడ ఏర్పాటుచేసేదంటూ మండల స్థాయిలో అధికారులు చేతులెత్తేశారు. చలివేంద్రాల నిర్వహణ కోసం మండలానికి రూ.2 లక్షలు వంతున బడ్జెట్ మంజూరవుతుందనే సమాచారంతో కొందరు ఏర్పాటు చేయగా, మరికొందరు ఏర్పాటు చేయకుండానే చేసినట్టు రికార్డు చేశారంటున్నారు. గ్రామ పంచాయతీల్లో విధిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలతో చేతిలో పైసా లేకున్నా స్వచ్ఛంద సంస్థలు, దాతల సాయంతో ఏర్పాటు చేశామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. పైసా ఇవ్వకున్నా ప్రభుత్వం చలివేంద్రాల ఏర్పాటును కూడా డాబుసరి కార్యక్రమంగా ప్రచారం చేసుకుంది. అధికార పార్టీ అయితే పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలతో చలివేంద్రాలకు రిబ్బన్ కటింగులతో చాలా ఆర్భాటమే చేయించారు. కానీ ప్రారంభించిన నాలుగైదు రోజులకే మొక్కుబడి తంతుగా మూసేశారు. మొదట్లో మండలానికి రెండు లక్షలు వంతున చలివేంద్రాల నిర్వహణకు మంజూరు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ ఊసే లేదంటున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో చలివేంద్రాలు మొక్కుబడిగానే కొనసాగాయి. అసలు స్వచ్ఛంద సంస్థలంటూ ముందుకు రావడంతోనే కాస్తోకూస్తో ప్రజలకు దాహం తీరింది. జిల్లా కేంద్రంలోనే కనికట్టు... వాస్తవానికి ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చల్లని నీళ్లు, మే ఒకటి నుంచి 31 తేదీ వరకు మజ్జిగ. జూన్ ఒకటి నుంచి మంచినీరు జిల్లా అంతటా సరఫరా చేసినట్టు చెబుతున్నారు. ఇందుకోసం ఒక్క కాకినాడ నగరపాలక సంస్థకు రూ.22 లక్షలు బడ్జెట్ కేటాయించారు. కానీ ఈ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 16 చలి వేంద్రాల్లో రెండు, మూడు మినహాయిస్తే మరెక్కడా మే నెలలో మజ్జిగ సరఫరా చేసినట్టుగా కనిపించ లేదు. కేవలం మంచినీరు మాత్రమే సరఫరా చేశారంటున్నారు. నగరంలో రోజుకు 300 లీటర్ల పెరుగు కొనుగోలుచేసి మజ్జిగ చేసి 16 చలివేంద్రాలకు సరఫరా చేశామని చెబుతున్నారు. ఇందుకోసం రూ.20 లక్షలు ఖర్చయిందని లెక్క లేస్తున్నారు. ఈ విషయమై కార్పొరేషన్ వాటర్ వర్క్స్ ఏఈ సూర్యారావును ‘సాక్షి’ సంప్రదించగా కలెక్టర్ ఆదేశాల మేరకు రూ.22 లక్షలు కేటాయించిన మాట వాస్తవమేనని, ఇంకా నగదు మాత్రం చెల్లింపులు జరపలేదని చెబుతున్నారు. దాదాపు ఇదే పరిస్థితి మండలాల్లో కూడా కనిపిస్తోంది. మండలానికి రెండు లక్షలు మంజూరవుతాయనే ముందస్తు సమాచారంతో దాతల సాయంతో ఏర్పాటుచేసిన వాటిని కూడా తమ ఖాతాలో వేసేసుకొని రికార్డుల్లో లెక్కలు చూపించుకోవడం గమనార్హం. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు 1,56,448 పంపిణీ చేసినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఉపాధి కూలీల మజ్జిగ సొమ్మూ స్వాహా... ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు మజ్జిగ సరఫరా చేయాలని రోజుకు రూ.5 విడుదల చేసినట్టు డ్వామా అధికారులు చెబుతున్నారు. రోజుకు 2 లక్షల 70 వేల మంది కూలీలు జిల్లాలో పనిచేస్తున్నారు. కనీసంగా వారంలో ఒకటి, రెండు రోజులు కూడా సరఫరా చేసిన దాఖలాలు లేవు. కొన్ని మండలాల్లో అయితే మజ్జిగ వాసనే లేదు. ఇటీవల కలెక్టర్ ఆదేశాల మేరకు కోనసీమ పర్యటనకు వెళ్లిన డీపీఓ కుమార్ ఉపాధి కూలీలను అడిగితే అసలు మజ్జిగే ఇవ్వడం లేదని చెప్పారు. వాస్తవానికి ఏప్రిల్ నుంచే మజ్జిగ ఇస్తున్నట్టుగా రికార్డుల్లో రాసేసుకున్నారు. కూలీకి వచ్చిన ఐదు రూపాయలు వంతున మేట్ల ఖాతాలకు వేసేశామని డ్వామా అధికారులు చెబుతున్నారు. రోజుకు పది లక్షల రూపాయలకు పైగానే పక్కతోవ పట్టినట్టు తెలుస్తోంది. అధికారిక లెక్కలివీ... జిల్లాలో 5,801 చలి వేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో 1,323 చలి వేంద్రాలు, స్థానిక సంస్థలు ద్వారా 1,497 చలి వేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు కలిపి 2,981 కలిపితే మొత్తంగా 5,801 చలి వేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. వీటిలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించినవి మాత్రమే పూర్తిస్థాయిలో మజ్జిగ, మంచినీరు చిత్త శుద్ధిగా సరఫరా చేశారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినవన్నీ మొక్కుబడిగా కొనసాగాయనే విమరశ ఉంది. -
కళామతల్లిసేవలో అలుపెరుగని పయనం
సాంస్కృతిక వైభవానికి గోరుగంతు ప్రచారం శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర ఆధ్వర్యంలో నేడు నిర్విరామ ప్రదర్శన రాజమహేంద్రవరం కల్చరల్ : సంగీత స్వరకర్త, గాయకుడు, రచయిత, భరతనాట్య నిష్ణాతుడు గోరుగంతు నారాయణ. సుమారు 26 వసంతాలకు వెనుక, ఆయన ధవళేశ్వరంలో స్థాపించిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విశ్వవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, కళాభిమానుల ప్రశంసలు అందుకుంది. 1972లో రాజమహేంద్రిలో జన్మించిన గోరుగంతు నారాయణ సంగీతం, నాట్యం, వీణల్లో ఎంఏ కోర్సులు పూర్తి చేశాకా, హైదరాబాద్లోని త్యాగరాజ సంగీత నృత్యకళాశాలలో కొంతకాలం అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేశారు. రాష్ట్రవిభజన అనంతర పరిస్థితుల్లో ఇమడలేక కళలకు కాణాచి అయిన రాజమహేంద్రికి వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగ విరమణ అనంతరం జిల్లాలోని ధవళేశ్వరంలో స్థాపించిన రాధాకృష్ణ కళాక్షేత్ర సంస్థపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. విద్యార్థుల ప్రతిభకు గీటురాళ్లు ఇవీ.. ప్రస్తుతం కళాక్షేత్రలో 143 మంది విద్యార్థులు గాత్రం, వీణ, కూచిపూడి, కీబోర్డు, లలిత సంగీతం రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. కళాక్షేత్ర విద్యార్థిని లక్ష్మీదీపిక గతేడాది శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర చేతులమీదుగా ‘నాట్యవిశారద’ ఉగాది పురస్కారాన్ని , కర్నూలులో అభినయశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థినులు కృష్ణసాహితి, సాయిముత్యలక్ష్మీశృతి నృత్యకిశోరం పురస్కారాలు అందుకున్నారు. యునెస్కో నిర్వహించిన అంతర్జాతీయ రంగ్ మహోత్సవ్లో లక్ష్మీదీపిక ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఇక సంస్థ వ్యవస్థాపకుడు గోరుగంతు నారాయణ సైతం ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఉమామహేశ్వరరావు చేతులమీదుగా ‘సంగీత, నాట్య వైణిక సుధాకర’బిరుదు అందుకున్నారు. నారాయణ అర్ధాంగి ఉమాజయశ్రీ కూడా నాట్యంలో అందెవేసిన చేయి కావడంతో నటరాజ కళామందిరం నుంచి అభినయ గురుశ్రీ పురస్కారం అందుకున్నారు. నేడు నిర్విరామ సప్త నృత్యరూపక ప్రదర్శన గోరుగంతు రచించిన సప్త నృత్యరూపకాల ప్రదర్శన ఆదివారం ఆనం కళాకేంద్రంలో– ఒకే ఆహార్యంతో ఉన్న 63మంది సాంప్రదాయ కళాకారులతో నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన శిల్పి రాజకుమార్ ఉడయార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రదర్శన ప్రారంభమై రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదుకు ప్రాథమిక అంగీకారం ఇప్పటికే ఈ ప్రదర్శనకు వచ్చింది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు ప్రతినిధులు పర్యవేక్షకులుగా హాజరుకానున్నారు. ఈ రికార్డులను కూడా సొంతం చేసుకోగలమన్న ఆశాభావాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమానికి సినీ నటి కిన్నెర ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. -
రోహిణీలో నిప్పుల కుంపటి
- తునిలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత అమలాపురం : ఒకవైపు బంగాళాఖాతంలో తుపాను.. మరోవైపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ...ఎండవేడికి ఆపసోపాలు పడుతున్న జిల్లావాసులకు ఈ రెండు వార్తలు పెద్దగా ఊరటనివ్వలేదు. జిల్లాలో వరుసగా రెండు రోజుల నుంచి పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోహిణీకార్తి చల్లగా ఆరంభమైనప్పటికీ రోజుల గడుస్తున్న కొద్దీ భానుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. వారం రోజులుగా మండే ఎండలకు కాస్త విరామం ఇచ్చిన భానుడు గడిచిన రెండు రోజులుగా మళ్లీ చెలరేగిపోతున్నాడు. జిల్లాలో మంగళవారం సూర్య ప్రతాపంతో సామాన్యులు విలవిల్లాడారు. ఎండకు, వడగాల్పులు తోడుకావడంతో వాతావరణం వేడెక్కింపోయింది. తునిలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వేసవి ఆరంభమైన తరువాత ఇక్కడే ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. జిల్లా కేంద్రమైన కాకినాడలో 42.6, రాజమహేంద్రవరం, ఏజెన్సీలోని చింతూరు, కోనసీమల్లో 42, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఏడు గంటల వరకు వేడుగాలలు వీస్తుండడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
ఆక్వా రైతులపై సిండ్‘కాటు’
- కీలక కౌంట్ ధరల తగ్గింపు - లబోదిబోమంటున్న రైతులు అమలాపురం : ఆక్వా ధరలు మరోసారి దారుణంగా పడిపోయాయి. కీలక కౌంట్ ధరలు నెల రోజుల వ్యవధిలో కేజీకి రూ.50 నుంచి 120 వరకు పడిపోవడంతో రైతులు కుదేవుతున్నారు. వ్యాపారులు సిండికేటుగా మారి మరోసారి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. జిల్లాలో గడిచిన రెండేళ్లుగా కాసులు కురిపిస్తున్న వెనామీ సాగు ఈ ఏడాది రైతులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చిన ఊరూపేరూ లేని హేచరీల్లో నాణ్యత లేని సీడ్ వల్ల కొంత వరకు చెరువులు దెబ్బతినగా, మిగిలిన చెరువుల పట్టుబడి సమయానికి దగ్గరకు వచ్చే సరికి వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించి వేశారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల వల్ల చెరువుల్లో రొయ్యలు సహజసిద్ధంగా చనిపోతున్నాయి. దీనికితోడు డీవో (డెడ్ ఆక్సిజన్) కారణంగా వందలాది ఎకరాల చెరువుల్లో రొయ్యలు మరణిస్తున్నాయి. ఆందోళనతో ఉన్న రైతులు పట్టుబడులు ఆరంభించారు. ఇదే అదనుగా వ్యాపారులు సిండికేటయ్యారు. ఎక్కువుగా వస్తున్న కౌంట్లను చూసి వాటి ధరలను ఆమాంతంగా తగ్గించేశారు. కొనుగోలుదారులు రేట్లు తగ్గుతున్నాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయడంతో రైతులు ముందస్తు పట్టుబడులకు వెళుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కువుగా 40 కౌంట్ (కేజీకి 40 రొయ్యలు) నుంచి 80 కౌంట్ వరకు వస్తున్నాయి. దీంతో ఈ కౌంట్ ధరలను గుణనీయంగా తగ్గించి వేశారు. 40 కౌంట్ ధర కేజీకి రూ.70, 43 నుంచి 50 కౌంట్ ధర రూ.120, 60 కౌంట్ ధర రూ.110, 63 నుంచి 70 కౌంట్ ధర రూ.90, 73 నుంచి 80 కౌంట్ ధర రూ.70 చొప్పున తగ్గించేశారు. వీటితోపాటు 83 నుంచి 90 కౌంట్ ధర రూ.50, 100 కౌంట్ ధర రూ.30 చొప్పున తగ్గించి రైతుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు. ధరలు తగ్గించే విషయంలో కొనుగోలుదారులు ఒకే మాట, ఒకే ధర అన్నట్టుగా సిండికేటు కావడంతో రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు. 50 కౌంట్ ధర రూ.120 తగ్గడంతో రైతులు ఎకరాకు సగటున దిగుబడిగా వచ్చే రెండు టన్నుల రొయ్యల ఉత్పత్తిపై రూ. 3 లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నారని అంచనా. ఇటీవల కాలంలో వెనామీ సాగు వైపు రెతులు ఎక్కువగా మొగ్గు చూపడంతో చెరువుల లీజుల ధరలు, సీడ్, మేత ధరలతోపాటు కూలి ధరలు భారీగా పెరిగాయి. చివరకు వేసవి సీజన్ కావడంతో రూ.200 ఉండే క్యాన్ ఐస్ ధర ప్రస్తుతం రూ.400ల నుంచి రూ. 500 వరకు పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 15 శాతం పైగా పెట్టుబడి పెరిగిందని అంచనా. ఈ సమయంలో వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించడంతో పంటపండినా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. కౌంట్ గత నెల 25న తాజాగా 20 కౌంట్ 640 640 25 కౌంట్ 540 540 30 కౌంట్ 530 460 40 కౌంట్ 430 360 42 కౌంట్ 410 340 43 నుంచి 50 కౌంట్ 380 260 60 కౌంట్ 350 240 63 నుంచి 70 కౌంట్ 320 230 73 నుంచి 80 కౌంట్ 290 220 83 నుంచి 90 కౌంట్ 260 210 93 నుంచి 100 కౌంట్ 230 200 -
పడకేసిన పల్లె పాలన
- జిల్లాలో గ్రామ కార్యదర్శులకు కొరత - మొత్తం పంచాయతీలు 1069.. ఉన్న కార్యదర్శులు 524 మంది - సగానికి పైగా ఇన్చార్జిల ఏలుబడిలోనే.. - క్లస్టర్ పంచాయతీల్లోనూ ఖాళీలే.. - అదనపు భారంతో సిబ్బంది ఇక్కట్లు బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా.. చేతిపంపు మరమ్మతు చేయించుకోవాలన్నా.. డ్రైన్లు శుభ్రం చేయించుకోవాలన్నా.. రోజుల తరబడి పేరుకుపోయే చెత్తను తొలగించాలన్నా పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాల్సిందే. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పంచాయతీ పాలనలో కార్యదర్శులదే కీలకపాత్ర. ధ్రువపత్రాల మంజూరు, ఫించన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామసభల నిర్వహణ, ఉపాధి హామీ సేవలు, తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లు, ఇతర పరిపాలనాపరమైన విధులను వీరు నిర్వర్తిస్తున్నారు. అంతటి కీలకమైన గ్రామ కార్యదర్శుల పోస్టులు జిల్లాలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉండడంతో పల్లెల్లో పాలన పడకేస్తోంది. మండపేట : జిల్లాలోని పంచాయతీల్లో కార్యదర్శులకు కొరత వచ్చింది. సగానికి పైగా పంచాయతీలు ఇన్చార్జిల ఏలుబడిలోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ప్రభుత్వం ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బంది అదనపు భారంతో సతమతమవుతున్నారు. దీంతో గ్రామ పాలన గాడి తప్పుతోంది. కార్యదర్శులు లేకపోవడంతో వివిధ పనులు, సమస్యల పరిష్కారానికి వస్తున్న ప్రజలు.. పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 1,069 పంచాయతీలకుగాను ప్రస్తుతం 524 మంది మాత్రమే కార్యదర్శులున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఊహించుకోవచ్చు. క్లస్టర్లకూ తప్పని కొరత సిబ్బంది కొరతను అధిగమించి, పాలనా సౌలభ్యం కోసం రెండు మూడు మైనర్ పంచాయతీలు లేదా మేజర్ పంచాయతీకి సమీపంలోని మైనర్ పంచాయతీని కలిపి క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ను ఒక్కో కార్యదర్శి పర్యవేక్షించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలోని 1,069 పంచాయతీలను 779 క్లస్టర్లుగా విభజించారు. ఇలా లెక్కేసుకున్నా కూడా పూర్తిస్థాయిలో కార్యదర్శులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం 524 మంది కార్యదర్శులు మాత్రమే ఉండటంతో ఇంకా 255 క్లస్టర్ పంచాయతీలకు కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఫలితంగా ఒక్కో కార్యదర్శి రెండు లేదా మూడు పంచాయతీలను పర్యవేక్షించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల నాలుగైదు పంచాయతీలకు సహితం ఒక్కరే విధులు నిర్వహించాల్సి వస్తోంది. అందని సేవలు ఇన్చార్జి బాధ్యతలను సాకుగా చూపి కొందరు కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా అధిక శాతం పంచాయతీల్లో కీలకమైన పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటికి కటకటలాడాల్సిన దుస్థితి నెలకొంటోంది. రామచంద్రపురం రూరల్ పరిధిలో 25 గ్రామ పంచాయతీలకు 10 మంది కార్యదర్శులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కరప మండలంలో 23 పంచాయతీలకుగాను కేవలం 11 మంది కార్యదర్శులే ఉన్నారు. మిగిలిన పంచాయతీల్లో ఇన్చార్జిలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కపిలేశ్వరపురం మండలంలో 19 పంచాయతీలకు 13 పంచాయతీల్లోనే కార్యదర్శులు ఉన్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. జిల్లావ్యాప్తంగా అధిక శాతం మండలాల్లో దాదాపు ఇదే దుస్థితి నెలకొని ఉంది. కార్యదర్శులు లేకపోవడంతో సకాలంలో పనులు జరగడం లేదని, చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిపై పంచాయతీ కార్యాలయాలకు వెళుతుంటే అక్కడి సిబ్బంది ఆఫీసరుగారు లేరంటున్నారని ప్రజలు వాపోతున్నారు. పలు పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. దీంతో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇతర సమస్యల పరిష్కారంలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. కార్యదర్శుల కొరతను అధిగమించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
అయోమయం
- తేలని టీడీపీ పార్టీ సారథి పంచాయతీ - నవీన్కు ఖాయమైన జెడ్పీ పీఠం - ‘దేశం’లో కొనసాగుతున్న ‘హై’డ్రామా పార్టీయే సర్వస్వం అనుకున్నారు ... అంచలంచెలుగా ఎదిగి జెడ్పీ చైర్మెన్ పీఠంపై కూర్చొని ముచ్చటగా మూడేళ్లయింది ... అంతలోనే వలసలు వచ్చి ఎసరు పెట్టేయడంతో టీడీపీ రాజకీయ చక్రవ్యూహంలో చిక్కుకొని గిలగిల్లాడుతున్నారు నామన రాంబాబు. తన అనుచరులను కూడా బుజ్జగించి ఒంటరిని చేసేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతుండడంతో ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : రెండు కీలకమైన నియామకాలపై తెలుగుదేశం పార్టీలో హైడ్రామా నడుస్తోంది. పార్టీ పగ్గాలు, జెడ్పీ చైర్మన్ పీఠం రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వీటిని సమస్వయం చేసే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప భుజానకెత్తుకున్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుకు పార్టీ పగ్గాలు అప్పగించి ... జెడ్పీ చైర్మన్ పదవి నుంచి తప్పించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్కు అప్పగించాలనేది పార్టీ వ్యూహం. ఈ దిశగా అన్నీ తానై గడచిన వారం రోజులుగా రాజప్ప ప్రయత్నాలన్నీ తుస్సుమని బొమ్మ తిరిగి దిమ్మ చేతికొచ్చి పార్టీ రచ్చకెక్కిన విషయం తెలిసిందే. మొదట్లో దూకుడు ప్రదర్శించిన రాజప్ప చక్కదిద్దలేకపోగా పార్టీని బజారున పడేశారని కేడర్ మథనపడుతోంది. పార్టీ పగ్గాలు చేపడితే చైర్మన్ పీఠానికి ఎసరుపెడతారనే భయంతో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నామనను పైకి బుజ్జగిస్తున్నట్టు ముఖ్యనేతలు కనిపించారు. తీరా తెరవెనుక మాత్రం అనుకున్న వ్యూహాన్ని పక్కాగా అమలుచేసే ఎత్తులు వేస్తూనే ఉన్నారు. మొదట నామనను బుజ్జగించేందుకు మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొండబాబు తదితరులను పంపించిన చినరాజప్ప అకస్మాత్తుగా వారికి కనీసం మాటమత్రమైనా చెప్పకుండా తరువాత రోజు నేతలను మార్చి పంపడంపై నేతలు గుర్రుగా ఉన్నారు. అక్కడికి తామేమీ చేయలేకపోయామని తెలియజెప్పాలని మంత్రుల ఉద్ధేశంగా కనిపిస్తుందంటున్నారు. ప్రత్తిపాడు మినీ మహానాడు వేదిక వరకూ తీసుకురాగలిగిన నేతలు అతనికేమైనా భరోసా ఇవ్వగలిగారా, పార్టీపరంగా జరిగిన నష్టాన్ని తొలగించగలిగారా అని కేడర్ ప్రశ్నిస్తోంది. ఏకాకిని చేసేందుకు పావులు... పార్టీ పగ్గాలు చేపట్టేలా చైర్మన్ను ఓ పక్క ఒప్పించే ప్రయత్నం చేస్తూ, మరోపక్క పార్టీలో అతన్ని ఏకాకిని చేసేందుకు ముఖ్యనేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే జరుగుతున్న పరిణామాలతో కలిగే నష్టాన్ని కుండబద్దలు కొట్టిన పేరాబత్తుల రాజశేఖర్, నాగిడి నాగేశ్వరరావు తదితర జెడ్పీటీసీలను అధిష్టానం వద్దకు పంపించి పార్టీకి కట్టుబడి ఉంటామని ఒప్పింపజేసి మౌనం వహించేలా చేస్తున్నారు. వాస్తవం చెప్పడమే నేరమన్నట్టు నామనకు మద్ధతుదారులనే ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అమాత్యుల ఎత్తుగడలతో నామనకు నైతికంగా మద్ధతు తెలియచేసిన వారంతా ఇప్పుడు దాదాపు దూరం చేయడంలో ముఖ్యనేతల వ్యూహం ఫలించినట్టయింది. ఇప్పుడు నామనకు రెండే రెండుదార్లు కనిపిస్తున్నాయి. ఒకటి పార్టీలో కొనసాగాలంటే పార్టీ పగ్గాలు చేపట్టడం, ఆ తరువాత చైర్మన్ గిరీకి రాజీనామా చేయడం. నేతలు నమ్మకద్రోహం చేశారని, మూడు దశాబ్థాల రాజకీయంలో ఇంతటి అవమానం ఎదురవలేదని భావిస్తే పార్టీకి దూరమవడం. వీటిలో నామన ఎటువైపు మొగ్గుతారనేది పార్టీలో చర్చనీయాంశమైంది. నామన కాదంటే ఆ తరువాత పార్టీ పగ్గాలు ఎవరిని ఎంపిక చేయాలనేది ఆలోచిస్తామని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం మాట ప్రకారం నవీన్కు జెడ్పీ చైర్మన్ గిరీ అప్పగించడం ఖాయమైందని పార్టీలో విశ్వసనీయ సమాచారం. నామన అవునన్నా, కాదన్నా చైర్మన్ పదవిలో అతని స్థానే నవీన్ కూర్చోవడానికి పై స్థాయిలో లైన్ క్లియర్ అయిందనే చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే టీడీపీలో జరుగుతున్నది హైడ్రామా కాక మరేమిటని ఆ పార్టీ అనుచరులే బాహాటంగా విమర్శిస్తున్నారు. -
బుడతా ... బడికొస్తావా
- చిన్నారుల కోసం..కార్యకర్తల బాట - వచ్చే నెల 1 నుంచి ‘మన అంగన్వాడీ పిలుస్తోంది’ - 15 వరకు ప్రజల్లోకి కార్యక్రమాలు - ఉత్తర్వులు జారీ చేసిన శిశు సంక్షేమ శాఖ కమిషనర్ రాయవరం (మండపేట) : పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలు కూడా చిన్నారుల కోసం తల్లిదండ్రుల వద్దకు వెళ్లనున్నాయి. అంగన్వాడీలు జూన్ ఒకటో తేదీ నుంచి బుడతల బాట పట్టనుంది ‘మన అంగన్వాడీ పిలుస్తోంది’ పేరుతో 15 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 27 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో.. జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 5,546 అంగన్వాడీ కేంద్రాల్లోని కార్యకర్తలు, ఆయాలు చిన్నపిల్లలుండే ఇళ్ల వద్దకు వెళ్లనున్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ ఈ నెల 23న ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లు నిండి మూడో సంవత్సరంలోకి అడుగిడిన చిన్నారులంతా అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా వారి తల్లిదండ్రులను ఒప్పించేందుకు వీరంతా సమాయత్తమవుతున్నారు. కార్యక్రమం జరుగుతుందిలా.. - జూన్ ఒకటో తేదీన అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల వివరాలపై నివేదిక తయారు చేస్తారు. - 2వ తేదీన అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు. - 3న గ్రామ పెద్దలు, చిన్నారుల తల్లిదండ్రులకు ప్రీస్కూల్ నిర్వహణపై అవగాహన కల్పిస్తారు. - 5న గృహ సందర్శనాల ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లిదండ్రులను కలిసి వారిని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా ఒప్పించడం. - 6వ తేదీన జిల్లాలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాల భవనాలను ప్రారంభోత్సవం చేస్తారు. - 7వ తేదీన అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్కు సంబంధించిన మెటీరియల్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు. - 8,9 తేదీల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ పూర్తి చేసిన ఐదేళ్లు నిండిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి సర్టిఫికేట్లు అందజేసి ఒకటో తరగతిలో చేర్పించనున్నారు. - 12వ తేదీ నుంచి 15వ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో చేరిన ఐదేళ్లలోపు చిన్నారులందరితో అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టనున్నారు. వయస్సు ప్రకారం తరగతులు.. కాన్వెంట్లలో చిన్నారుల వయస్సుల ప్రకారం తరగతులు నిర్వహించనున్నారు. ప్రైవేటు కాన్వెంట్ల పోటీని తట్టుకునేందుకు వీలుగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కాన్వెంట్ విద్యను అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ తరహా విద్యను అందించేందుకు ప్రయత్నాలు చేస్తే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పలువురు విద్యావేత్తలు భావిస్తున్నారు. విజయవంతం చేస్తాం.. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి జరగనున్న ‘మన అంగన్వాడీ పిలుస్తోంది’ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్య, వైద్య, పంచాయతీరాజ్ తదితర శాఖల సహకారం తీసుకోవాలని ఇప్పటికే పీవోలకు ఆదేశాలిచ్చాం. ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది అంగన్వాడీ కేంద్రాల్లో 30 వేల మంది చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకున్నాం. ఈ ఏడాది మరింత ఎక్కువ మందిని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేపడుతున్నాం. చిన్నారులకు కాన్వెంట్ విద్యతోపాటు పౌష్టికాహారాన్ని పొందేలా చూస్తున్నాం. – టి.శారదాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్, కాకినాడ. -
జెడ్పీ... కిస్కా కుర్చీ...!
- టీడీపీలో వీడని ముసలం - సందిగ్ధంలోనే ‘నామన’ భవితవ్యం - నేడు ప్రత్తిపాడులో మినీ మహానాడు - జెడ్పీటీసీల మూకుమ్మడి రాజీనామాల అస్త్రం - నవీన్కు పీఠం దక్కకూడదనే ఎత్తుగడ - తెరవెనుక యనమల వర్గం సాక్షి ప్రతినిధి, కాకినాడ : కష్టపడి పనిచేసిన వారిని కరివేపాకులా వాడుకొని వదిలేయడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడికి వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యనే ఇప్పుడు జెడ్పీపై ప్రయోగించనున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు జెడ్పీ పీఠం పునాదులే కదిలిపోయేలా కనిపిస్తున్నాయి. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు ప్రకటించినప్పుడే జెడ్పీ పీఠం నుంచి దింపేయడం ఖాయమైపోయిది. అయితే పార్టీ పరిశీలకుడు కిమిడి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఈ విషయాన్ని దాచిపెట్టి నామనతో పార్టీ అధ్యక్ష బాధ్యతలకు అంగీకరింపజేసే ఎత్తుగడ వేశారు. అవసరమైతే పార్టీ ధిక్కారానికి సైతం వెనుకాడేది లేదంటూ ఎదురు తిగరడంతో గడచిన రెండు రోజులుగా దఫదఫాలుగా ముఖ్యనేతలు చేస్తున్న బుజ్జగించే ప్రయత్నాలు బెడిసికొట్టడంతో డోలాయమానంలో పడ్డారు. నామనను తప్పించి వైఎస్సార్ నుంచి టీడీపీకి ఫిరాయించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్కు కట్టబెట్టాలని గత కొంత కాలంగా పార్టీ వ్యూహకర్తలు గట్టి ప్రయత్నాల్లో ఉన్న విషయం విదితమే. వేడుకున్నా ససేమిరా... ఈ క్రమంలోనే నామనకు టీడీపీ పగ్గాలు అప్పగించడం, జెడ్పీ పీఠం నుంచి తప్పించడం, ఆ తరువాత నవీన్కు అందలమెక్కించాలనేది పార్టీ అధిష్టాన వ్యూహం. రాంబాబుకు పార్టీ జిల్లా పగ్గాలు ప్రకటించిన 24 గంటలు కూడా తిరగకుండానే ఎదురు దెబ్బ తగిలింది. ఆ పగ్గాలు చేపట్టేది లేదని నామన తెగేసి చెప్పారని సమాచారం. జిల్లా టీడీపీ చరిత్రలో పార్టీ పగ్గాలు ప్రకటించాక స్వీకరించేది లేదని ధిక్కార స్వరాన్ని వినిపించడం ఇదే తొలిసారి. నామనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నట్టు మినీ మహానాడులో నిర్ణయం వెలువడిన మరుక్షణమే రాజీనామా పత్రాలను మూకుమ్మడిగా అందజేసి ధిక్కార గళాన్ని వినిపించేందుకు జెడ్పీటీసీలు సమాలోచనల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళ్లిన నామన సోమవారం కాకినాడలో పార్టీ నేతలకు చెప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధిష్ఠాన నిర్ణయంలో మార్పు లేకుంటే మంగళవారం ప్రత్తిపాడు మినీ మహానాడుకు వెళ్లకుండా తమతోపాటు పార్టీకి రాజీనామా చేయాలని జెడ్పీటీసీలు నామనకు సూచించారు. రాజీనామాల వైపు జెడ్పీటీసీల అడుగులు... చినరాజప్ప, ఇన్ఛార్జి మంత్రి కళా వెంకట్రావు కాకినాడలో మరోమారు సమావేశమై నామనను రాజీనామా చేయాలని కోరినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అధిష్టానం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడమే జెడ్పీటీసీలకు ఎంతమాత్రం రుచించడం లేదు. మాట మాత్రమైనా చెప్పకపోవడం, పార్టీ ఫిరాయింపుదారులకు అందలం ఎక్కించే ప్రయత్నం చేయడంతో ఒకే గొడుకు కిందకు రావడానికి కారణమైంది. అయినా అధిష్టానం దిగి రాకుంటే జెడ్పీటీసీలు రాజీనామా చేయడానికి కూడా వెనుకాడకూడదనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. న్యాయమైన డిమాండ్ కోసం జెడ్పీటీసీలు సంతకాల సేకరణ ఉద్యమాన్ని ఇప్పటికే చేపట్టారు. ఇందులో 22 మంది సభ్యులు పార్టీని ధిక్కరించేందుకైనా సిద్ధమేనంటున్నారు. ఈ పరిణామాలు చివరకు జిల్లా పరిషత్ చైర్మన్ గిరీకి ఎసరు పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. జెడ్పీలో 60 జెడ్పీటీసీ సభ్యుల్లో ప్రతిపక్ష వైస్సార్సీపీ జెడ్పీటీసీలు 14మంది ఉన్నారు. మిగిలిన 46 మంది పార్టీ జెడ్పీటీసీల్లో 22 మంది రాజీనామాకు సిద్ధపడితే ఎదురయ్యే పరిణామాలు చైర్మన్ పీఠానికే ఎసరుపెట్టడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే 25 మందితో కోరం లేకుండా చేసి చైర్మన్ ఎన్నిక అడ్డుకోవాలనేది వీరి వ్యూహం. కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటింగ్ ఉందనే ధీమాతో అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ వైఎస్సార్సీపీ నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై, ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించిన నవీన్ను చైర్మన్ పీఠంపై కూర్చోబెడితే న్యాయస్థానంలో నిలుస్తుందా అనేది కూడా చర్చనీయాంశమైంది. చివరకు ఏమి జరిగినా అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకత ఉందనే విషయంపై కళ్లుతెరిపించాలనేది వీరి వ్యూహంగా కనిపిస్తోంది. యనమల హస్తం...? నామన. అతనికి మద్ధతుగా అంత మంది జెడ్పీటీసీలు నిలవడం, అవసరమైతే అధిష్టానాన్ని కూడా ధిక్కరించే తెగువ ప్రదర్శించడం వెనుక బలమైన రాజకీయ కారణమేదో ఒకటి ఉండే ఉంటుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. జ్యోతులకు ఆది నుంచి రాజకీయంగా బద్ధ విరోధి అయిన మంత్రి యనమల రామకృష్ణుడు వర్గం తెర వెనుక ఈ ఆట ఆడిస్తుందనే అనుమానం కలుగుతోందని పార్టీలో చర్చ నడుస్తోంది. నెహ్రూ తనయుడు నవీన్కు చైర్మన్ పీఠం దక్కకుండా చేయాలనే పట్టుదలతో ఆ వర్గం చేయని ప్రయత్నమంటూ లేదని, ఇందుకు నామన వ్యవహారాన్ని వినియోగించుకుంటోందనే వాదన కూడా పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం మంగళవారం జరిగే మినీ మహానాడు తరువాత టీడీపీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే. -
అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారు..
– నామన రాంబాబుకే పార్టీ పగ్గాలు! –21న జిల్లా పార్టీ కార్యవర్గం ఎన్నిక - ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప భానుగుడి(కాకినాడ) : సారధి లేకుండా సాగుతున్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అధ్యక్షుడి ఎన్నికతో పాటు జిల్లా తెదేపా కార్యవర్గాన్ని సైతం అదే రోజున ఎన్నుకోనున్నట్టు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ప్రకటించారు. జిల్లా అ«ధ్యక్షుడి ఎన్నిక ద్వారా జెడ్పీ పీఠమెక్కేదెవరో స్పష్టం కానుంది. ఈనెల 21న ఈ తంతు ముగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు కాకినాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విలేకరులకు వెల్లడించారు. అ«ధ్యక్ష, ఉపా«ధ్యక్షుడితో పాటు, పార్టీ కార్గవర్గసభ్యులను, వివిధ పదవులకు నాయకులను ఎన్నుకోనున్నామన్నారు. ఈనెల 24న ప్రత్తిపాడులో జరగనున్న మినీమహానాడుపై జిల్లా నాయకులతో చర్చించారు. విశాఖలో ఈనెల 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమానికి జిల్లా నుంచి జనసమీకరణకు సంబంధించి పార్టీ కేడర్తో చర్చించారు. బయట తిరగవద్దు.. ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు మధ్యాహ్నం 12 దాటితే బయటకు రావొద్దని హెచ్చరించారు. జిల్లాలో పార్టీ తరఫున నిర్వహిస్తున్న చలివేంద్రాలను ఎండలు తగ్గుముఖం పట్టే వరకు కొనసాగించాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. అసభ్యకర పోస్టింగ్లు పెడితే శిక్షలు తప్పవు.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్లు పెడితే శిక్షలు తప్పవని, ప్రస్తుతం ప్రభుత్వం సోషల్మీడియాపై నియంత్రణలో భాగంగా చేస్తున్న చర్యలను రాజప్ప సమర్థించుకున్నారు. సమావేశంలో రాజప్పతో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నామన పేరు ఖరారు.. జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా జెడ్పీ చైర్మన్ నామన పేరు ఖరారైనట్టు ఉపముఖ్యమంత్రి రాజప్ప తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ఈ నెల 21న నామన ఎన్నిక లాంఛనప్రాయమేనని, జెడ్పీ చైర్మన్గా జ్యోతుల నవీన్కు మార్గం సుగమమైందంటున్నారు. అయితే నామన వర్గం ఈ విషయమై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంఇ. పంచాయితీని అధిష్టానం వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేక.. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నామన సమాయత్తమవుతున్నట్టు సమాచారం. -
కలెక్టర్ బాటలోనే...
అర్జీదారుల సమస్యలపై జేసీ ప్రతిస్పందన గ్రీవెన్స్సెల్కు పోటెత్తిన ప్రజలు కాకినాడ : ప్రజావాణికి కొత్త ఒరవడి తెచ్చిన కలెక్టర్ కార్తికేయమిశ్రా బాటలోనే సోమవారం జాయింట్ కలెక్టర్ఎ.మల్లికార్జున కూడా గ్రీవెన్స్సెల్కు వచ్చిన అర్జీదారుల విషయంలో ప్రతి స్పందించారు.అర్జీదారుల సమస్యలను సావధానంగా విని అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ అందుబాటలో లేకపోవడంతో కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిని జాయింట్ కలెక్టర్ మల్లికార్జున కొనసాగించారు. ఆయా సమస్యలను నిర్ణీత వ్యవధిలో అధికారులు పరిష్కరించాలని జేసీ స్పష్టం చేశారు. కాకినాడ సంజయ్నగర్కు చెందిన అడిగడ్ల రామలక్ష్మి తన ఇద్దరు కుమారులు పూర్తిశాతం దృష్టి లోపంతో ఉన్నారని, వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని కోరగా, ఒక రేషన్కార్డుపై ఒకరికే పింఛన్ ఇచ్చే అవకాశం ఉందని, కానీ దృష్టిలోపం కారణంగా ఇద్దరికీ పింఛన్ ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదిస్తామని జేసీ తెలిపారు. ముమ్మిడివరం నక్కావారిపేటకు చెందిన రేవు ధనలక్ష్మి తన కుమారుడు వెంకటేశ్వరరావుకు ఉదయ కుమారితో వివాహం చేశామని, కోడలే అతనిని చంపేసిందని, తిరిగి పోస్టుమార్టం చేయాలని కోరగా, రిపోర్టుకు డాక్టర్, అతని అసిస్టెంట్ రూ.70వేలు అడుగుతున్నారని, లేకపోతే తప్పుడు రిపోర్టు ఇస్తామని బెదిరిస్తున్నారని తెలుపగా, డీసీహెచ్ఎస్ను వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాంధీనగర్లో ఉంటున్న ఆర్.శ్రీనివాసశర్మ రామావైన్స్ షాపు వారు తన పక్క ఇంటిలో వైన్షాపు నిర్వహిస్తున్నారని, తనకు ఇబ్బంది కలుగజేస్తున్నారని, రక్షణకు చర్యలు చేపట్టాలని కోరగా, చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్శాఖను ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత నేరుగా జేసీ అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని, అర్జీలు తీసుకున్నారు. ఈ ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వేడెక్కుతోంది...
- 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు - చింతూరులో అత్యధికంగా 43 డిగ్రీలు - మరో వారం రోజులు ఇంతే అమలాపురం : భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా అగ్నిగుండంగా మారిపోతోంది. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. విలీన మండలమైన చింతూరులో శనివారం ఏకంగా 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. రాజమహేంద్రవరం, పచ్చని కోనసీమలో సైతం 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. కాకినాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తుని, మండపేట వంటి ప్రాంతాల్లో సైతం ఇదే ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం పది గంటల తరువాత బయటకు రావాలంటనే భయపడుతున్నారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో కూడా 33 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం, వేడి గాలులతో సామాన్యులు అపసోపాలు పడుతున్నారు. ఏజెన్సీ కేంద్రమైన రంపచోడవరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం విశేషం. ఈ వారం మరింత తీవ్రత... ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వారం పొడవునా అత్యధిక ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది. ముఖ్యంగా బుధ, గురు, శుక్రవారాల్లో ఎండతీవ్రత ఎక్కువగ ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పుడే ఎండతీవ్రతలు ఇలా ఉంటే రోహిణిలో ఎలా తట్టుకునేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. -
నిర్లక్ష్య సర్కారు ఇదీ
- ఏ వర్గం సమస్యలనూ తీర్చడం లేదు - బాబు ప్రభుత్వంపై జగన్ ధ్వజం - జగన్ రాకతో కిక్కిరిసిపోయిన ఎయిర్పోర్టు - ధాన్యానికి గిట్టుబాటు దక్కడం లేదన్న కన్నబాబు సాక్షి ప్రతినిధి, కాకినాడ/మధురపూడి : పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి మధురపూడి ఎయిర్పోర్టులో శనివారం రైతులు, విద్యార్థులు పలు సమస్యలను ఏకరవుపెట్టారు. అన్ని వర్గాల సమస్యలను సావధానంగా విన్న జగన్ ఆ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఉదయం 11.30 గంటలకు మధురపూడి ఎయిర్పోర్టుకు వచ్చిన జగన్ను కలిసేందుకు నేతలు, అభిమానులు పోటెత్తడంతో ఎయిర్పోర్టు కిక్కిరిసిపోయింది. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఫ్యాకల్టీని పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధులు తాడేపల్లి విజయ కుమార్, తారకేష్, మహేశ్ కార్పొరేటర్ బొంతా శ్రీహరి ఆధ్వర్యంలో జగన్కు విన్నవించారు. 150 మంది అధ్యాపకులకు 52 మంది మాత్రమే ఉండటంతో విద్యార్థులు నష్టపోతున్నారని జగన్కు విజ్ఞప్తి చేశారు. అధ్యాపకుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తానని జగన్ చెప్పారు. ఎయిర్పోర్టు బయట పలువురు రైతులు కలిశారు. వరికి గిట్టుబాటు ధర లభించడం లేదని మెట్ట రైతులు జగన్కు వివరించారు. కోరుకొండ మండల రైతు అధ్యక్షుడు తోరాల శ్రీను, నాయకులు గణేశుల పోసియ్య, నాగవిష్ణు, సిహెచ్ దుర్గారావు, ఆకుల శ్రీను, కొల్లపు అభి తదితరులు వరికి గిట్టుబాటు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని, రైతులంతా సమన్వయంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ ఈ సందర్భంగా వారికి సూచించారు. జిల్లా పరిస్థితులపై కన్నబాబుతో మాటామంతీ... గడప, గడపకూ వైఎస్సార్ కార్యక్రమంపై జగన్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో చర్చించారు. జగన్ జిల్లాలో పార్టీ పరిస్థితిని కన్నబాబుతో సమీక్షించారు. జీజీవైఎస్సార్ కార్యక్రమం ఏ నియోజకవర్గంలో ఏ రీతిన జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జీజీవైఎస్సార్ సరైన వేదిక అని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో మండల, బూత్ కమిటీలను త్వరతగతిన పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. జిల్లాలో ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్కు కన్నబాబు వివరించారు. బస్తా రూ.1400లు కొనుగోలుచేసి ఇప్పుడు హఠాత్తుగా రూ.100లు తగ్గించేశారని కన్నబాబు వివరించారు. పంట దిగుబడి బాగున్నా ధర విషయంలో అన్యాయం జరుగుతోందని వివరించగా పార్టీ తరఫున వారికి భరోసా ఇవ్వాలని జగన్ పేర్కొన్నారు. ఘన స్వాగతం... జగన్కు స్వాగతం పలికిన వారిలో ఉభయగోదావరి జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పాముల రాజేశ్వరి, ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, కో–ఆర్డినేటర్లు తోట సుబ్బారావు నాయుడు, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, బొంతు రాజేశ్వరరావు,ముత్తా శశిధర్, వేగుళ్ల లీలాకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, ముత్యాల శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, అధికార ప్రతినిధి చెల్లు బోయిన వేణు, రాష్ట్రకార్యదర్శులు గుత్తుల సాయి, నక్కా రాజుబాబు, కర్రి పాపారాయుడు, వట్టికూటి రాజశేఖర్, చెల్లుబోయిన శ్రీనివాస్, అల్లి రాజబాబుయాదవ్, గుర్రం గౌతమ్, రావిపాటి రామచంద్రరావు, మిండగుదిటి మోహన్, సుంకర చిన్ని, తాడి విజయభాస్కరరెడ్డి, పేరి శ్రీనివాసరావు, పోలు కిరణ్రెడ్డి, కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ మేడపాటి అనిల్ షర్మిలా రెడ్డి, డిప్యుటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, అనుబంధ విభాగాల అధ్యక్షలు కొవ్వూరి త్రినాథరెడ్డి, డాక్టర్ యనమదల గీత మురళీకృష్ణ, పెట్టా శ్రీనివాస్, శిరిపురపు శ్రీనివాస్, మార్తి లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అధికారప్రతినిధి శెట్టిబత్తుల రాజుబాబు, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కార్యదర్శులు విప్పర్తి వేణుగోపాల్, నేతలు జక్కంపూడి గణేష్, మజ్జి నూకరత్నం, బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, ఈతకోట బాపనసుధారాణి తదితరులు ఉన్నారు. -
బౌద్ధదేశంగా మారనున్న భారత్
-బుద్ధవిహార్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గొల్లపల్లి -ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు అమలాపురం రూరల్ : బౌధ్ద ధర్మాన్ని ఆచరిస్తున్న దేశాల్లో ఒకటైన భారత్ త్వరలోనే బౌద్ధదేశంగా మారనుందని బుద్ధవిహార్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి సందర్భంగా బుధవారం ఇక్కటి త్రిరత్న బుద్ధవిహార్లో బుద్ధుని విగ్రహానికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. బుద్ధుడి జననం, ఆయనకు జ్ఞానోదయం వైశాఖ పౌర్ణమి రోజునే జరిగాయపి చెప్పారు. శాంతి, ప్రేమ, దయ బౌద్ధధర్మం ద్వారానే వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ప్ర«««ధాన కార్యదర్శి డీబీ లోక్ అధ్యక్షతన జరిగిన సభలో సామాజికవేత్త ఎం.ఎ.కె.భీమారావు, బౌద్ధ ఉపాసకులు పినిపే రాధాకృష్ణ, పెయ్యల శ్రీనివాసరావు, దోనిపాటి ఆంజనేయులు, కాశీపరశు రాంబోది, దోనిపాటి నాగేశ్వరరావు, రేవు ఈశ్వరరావు, ఉండ్రు ఆశీర్వాదం, జిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆదుర్రు బౌద్ధస్థూపం వద్ద.. మామిడికుదురు (పి.గన్నవరం) : పురాతన ఆది బౌద్ధస్థూపం వద్ద బుధవారం బుద్ధ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుద్ధవిహార్ ట్రస్టు ప్రాంగణంలో పంచశీల పతాకావిష్కరణ, త్రిశరణ, పంచశీల, బుద్ధ వందన, ధమ్మ వందన, సంఘ వందన తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థూపం చుట్టూ ప్రదక్షణలు చేసి బుద్ధ వందనం చేశారు. ధమ్మ ప్రవచనాలు, ధమ్మపాలన గాథ తదితర అంశాలను భక్తులకు వివరించారు. ఉపాసక రొక్కాల రాజన్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో బర్మాకు చెందిన బౌద్ధ భిక్కులు పనసక్క, విసుత, థాయ్లాండ్కు చెందిన సంగియాన్, బూన్సాంగ్, సయన్బ్రహనిన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుద్ధుడు దేశంలో స్వర్ణ యుగానికి నాంది పలికాడని భిక్కులు పేర్కొన్నారు. భారతీయ వారసత్వ సంస్కృతులన్నింటిలో అత్యంత ప్రాచీనమైనది బౌద్ధ జీవన విధానమన్నారు. అనంతరం స్థానిక బుద్ధవిహార్లో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. బుద్ధవిహార్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో అధ్యక్ష కార్యదర్శులు చింతా శ్రీరామ్మూర్తి, ఎస్ఎస్ఆర్ భూపతి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, మట్టా వెంకట్రావు, చింతపల్లి స్వరూపారాణి, పిల్లి రాంబాబు, సరెళ్ల వెంకటరత్నం, తాడి సురేష్, జి.వెంకటేశ్వరరావు, పెనుమాల సుధీర్, ట్రస్టు ప్రతినిధులు పులపర్తి కృష్ణ, గాలిదేవర సత్యనారాయణ, బళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ..
కోనసీమలో పలు ప్రాంతాల్లో కలెక్టర్ మిశ్రా సుడిగాలి పర్యటన ఉరుకులు, పరుగులు పెట్టిన అధికారులు సఖినేటిపల్లి : జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బుధవారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. దీంతో ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ.. రైతులకు, ప్రజలకు అవసర మయ్యే పనులు గుర్తిస్తూ కలెక్టర్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామివారి దర్శనానికి వచ్చిన కలెక్టర్ మండలంలోని దేవస్థానం, పల్లిపాలెం, సఖినేటిపల్లి, అంతర్వేదిపాలెం, మోరి ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత అంతర్వేది గెస్ట్హౌస్ నుంచి కలెక్టర్ సరాసరి దేవస్థానంలోని సముద్ర స్నానాల రేవును పరిశీలించారు. స్నానాలరేవు పరిసరాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా లేదంటూ స్థానిక భక్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం దీనిపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అక్కడి నుంచి లైట్హౌస్ మీదుగా సాగరసంగమం ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం సుమారు రూ.23 కోట్లతో జరుగుతున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించారు. హార్బర్లో జరుగుతున్న పనులను హెడ్వర్క్స్ ఈఈ కృష్ణారావు, కలెక్టర్కు వివరించారు. తొలి ఫేజ్ పనులు ఎప్పటికి పూర్తిచేస్తారని కలెక్టర్ ప్రశ్నించగా ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ఈఈ కృష్ణారావు బదులు చెప్పారు. అనంతరం అంతర్వేది ఏటిగట్టుకు రాళ్ల, నవా మురుగుకాలువలకున్న శిథిల అవుట్ఫాల్ స్లూయిస్లను, నీరు–చెట్టు పథకంలో వివిధ పంటకాలువల్లో జరుగుతున్న రక్షణగోడ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. సఖినేటిపల్లి, అంతర్వేదిపాలెం, మోరి గ్రామాల పరిధిల్లోని ఆయా పనులను చూశారు. అండర్టన్నెల్ నిర్మించాలని.. కాలువమొగ సెంటర్ నుంచి పల్లిపాలెం వరకూ తవ్విన మురుగుకాలువకు అంతర్వేది దేవస్థానం పరిధిలో ఆదర్శనగర్ వద్ద అండర్టన్నెల్ నిర్మించాలని, ఇది లేకపోవడం వల్ల మురుగుకాలువలోకి ఉప్పునీరు పోటెత్తే అవకాశం ఉందని కలెక్టర్కు, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు రావి దుర్గ ఆలేంద్రమణి వివరించారు. దీనిని పరిశీలించాల్సిందిగా ఆర్డీఓ గణేష్కుమార్ను కలెక్టర్ ఆదేశించారు. గోదావరి డెల్టాకమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, రాజోలు సబ్డివిజన్ నీటి సంఘ ఛైర్మన్ ఓగూరి విజయ్కుమార్, ఎంపీపీ పప్పుల లక్ష్మీసరస్వతి, సర్పంచ్లు చొప్పల చిట్టిబాబు, భాస్కర్ల గణపతి, పోతురాజు నాగేంద్రకుమార్, ఎంపీటీసీ సభ్యులు దొంగ నాగసత్యనారాయణ, జి వాసు, తహసీల్దార్ డీజే సుధాకర్రాజు, ఎంపీడీఓ జీ వరప్రసాద్బాబు, ఈఓపీఆర్డీ బొంతు శ్రీహరి, ఎన్ఆర్ఈజీఎస్ జేఈ సునీల్, రాజోలు ఏఎంసీ చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి కృష్ణారావు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. పర్యాకుల విడిది కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మిశ్రా పాశర్లపూడి(మామిడికుదురు) : పాశర్లపూడిబాడవలో రూ.1.13 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పర్యాటకుల విడిది కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బుధవారం పరిశీలించారు. పర్యాటకులు వైనతేయ గోదావరి నదిలో విహరించిన అనంతరం ఇక్కడ విశ్రాంతి తీసుకునేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేకాధికారి భీమశంకరం కలెక్టర్కు వివరించారు. ఈ కేంద్రానికి సమీపంలో ఉన్న అప్పనపల్లి శ్రీబాలబాలాజీ స్వామి వారి దేవస్థానంతో పాటు ఆదుర్రులోని ప్రాచీన ఆది బౌద్ధ స్థూపాన్ని బోటు షికారు ద్వారా సందర్శించే పర్యాటకుల విడిది కోసం ఈ కేంద్రం నిర్మిస్తున్నామన్నారు. ఈ కేంద్రానికి కనకదుర్గమ్మ ఆలయం పక్కన ఉన్న మెటల్ రోడ్డును సిమెంట్ కాంక్రీట్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. మరో వైపున సీసీ రోడ్డు నిర్మాణానికి జిరాయితీ రైతుల నుంచి భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి టూరిజం అధికారులకు పలు సూచనలు అందించారు. ఆయన వెంట అమలాపురం ఆర్డీఓ జి.గణేష్కుమార్, టూరిజం, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు. -
యూత్ బాస్కెట్బాల్ విజేత ‘తూర్పు’
పిఠాపురం టౌ¯ŒS : విశాఖపట్నంలో సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగిన అంతర్ జిల్లాల యూత్ బాస్కెట్బాల్ పోటీల బాలుర విభాగంలో తూర్పుగోదావరి జట్టు విజేతగా నిలిచిందని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఎం.ఉపేంద్ర సోమవారం తెలిపారు. ఆదివారం విశాఖపట్నం జట్టుతో హోరాహోరీగా జరిగిన ఫైనల్స్లో తూర్పు జట్టు 82–61 స్కోర్ తేడాతో విజయం సాధించిందన్నారు. కాగా బాలికల విభాగంలో మూడోస్థానం కోసం జరిగిన పోటీలో తూర్పుగోదావరి జట్టు పశ్చిమ గోదావరి జట్టుతో తలపడి 38–26 స్కోర్తో గెలుపొందిందన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, శిక్షణ ఇచ్చిన కోచ్లు పి.శ్రీనివాసరావు, ఐ.భీమేష్, మేనేజర్లు బొజ్జా సతీష్, పి.రమాదేవిలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.మురళీధర్, ఆర్.ఐ.పి. టి.వి.ఎస్ రంగారావు, అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు గన్నమనేని చక్రవర్తి, కార్యదర్శి ఉపేంద్ర, కోశాధికారి ఎ¯ŒSవీవీ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు కె.పురుషోత్తమరావు, యర్రా జగన్నాథరావు అభినందించారు. -
నో టిక్కెట్ ... ఓన్లీ బ్లాక్
– యథేచ్ఛగా బ్లాక్ టిక్కెట్ల విక్రయం – కౌంటర్లో ఒక్క టిక్కెట్ట అమ్మని థియేటర్లు – ఆన్లైన్లోనూ దర్శనమివ్వని వైనం – చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు విభాగాలు – అమలాపురంలో బెనిఫిట్ షోపై వివాదం.. ఉద్రిక్తత సాక్షి, రాజమహేంద్రవరం: బాహుబలి–2 సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ను డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్లను బ్లాక్లో అమ్మి సొమ్ముచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాహుబలి బెనిఫిట్ షోను ప్రదర్శించారు. వాటి టిక్కెట్లను రూ.800 నుంచి రూ.2000 వరకు గురువారం ఉదయం నుంచే విక్రయించేశారు. శుక్రవారం సాధారణ షో టిక్కెట్లు కూడా బ్లాక్లో అమ్మడంతో సాధారణ ప్రేక్షకుడికి నిరాశే ఎదురైంది. సాధారణంగా ఇప్పటి వరకు »బెనిఫిట్ షోతోపాటు సాధారణ షోలకు కనీసం కొద్ది మొత్తంలోనైనా థియేటర్ కౌంటర్లో టిక్కెట్లు అమ్మేవారు. అయితే ఈ చిత్రానికి మాత్రం శుక్రవారం బ్లాక్లోనే అన్నీ విక్రయించేశారు. ఆన్లైన్ టిక్కెట్లు నిల్... గతంలోనూ కొత్త సినిమా లేదా పేరున్న హీరో సినిమా విడుదల అవుతుందంటే ఆన్లైన్లోనే టిక్కెట్లన్నీ అయిపోయాయని థియేటర్ యాజమాన్యాలు, నిర్వాహకులు చెప్పేవారు. వాటిని వారి సిబ్బందితో థియేటర్ వద్దనే విక్రయించేవారు. అయితే బాహుబలి సినిమాకు మాత్రం ఆన్లైన్లో ఒక్క టిక్కెట్టు కూడా పెట్టలేదు. నిబంధనల ప్రకారం బాల్కనీ టిక్కెట్లలో 50 శాతం ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. మిగిలిన 50 శాతం టిక్కెట్లతోపాటు ఇతర క్లాస్ టిక్కెట్లు కౌంటర్లో విక్రయిచాలి. కానీ శుక్రవారం ఇలా జిల్లాలో ఎక్కడా జరుగలేదు. నిమ్మకు నీరేత్తిన రెవెన్యూ, పోలీస్ విభాగాలు... థియేటర్ల వద్ద బ్లాక్టిక్కెట్ల దందా ఇలా సాగుతుంటే జిల్లా రెవెన్యూ, పోలీసు విభాగాలు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. నిబంధనల ప్రకారం కనీసం కౌంటర్లో, ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించేలా చూడాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకునీరేత్తినట్లుగా వ్యవహరిస్తోందని థియేటర్ల వద్ద ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు బ్లాక్ టిక్కెట్ల దందా అరికట్టడం తమ పని కాదన్నట్లు థియేటర్ల వద్ద చోద్యం చూశారు. టిక్కెట్ల కోసం గుంపులుగా నిరీక్షిస్తున్న ప్రేక్షకులపై తమ ప్రతాపం చూపారేగానీ బ్లాక్టిక్కెట్లు విక్రయిస్తున్న వారి వైపు కన్నెత్తి చూడలేదు. అమలాపురంలో బెనిఫిట్షోపై ఉద్రిక్తత... అమలాపురంలో బాహుబలి బెనిఫిట్ షో ప్రదర్శనపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఉత్కంఠ, ఉద్రిక్తత నెలకొంది. గతంలో కొంత మంది హీరోల సినిమాలకు బెనిఫిట్ షో అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే యంత్రాంగం బాహుబలి–2 చిత్రానికి ఇవ్వలేదు. కొంత మంది అభిమానులు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఒక్కో టిక్కెట్టును రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయించేశారు. ఈ నేపథ్యంలో ఇతర హీరోల అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు అనుకున్న సమయానికి సినిమా వేయలేదన్న కోపంతో టిక్కెట్లు కొన్నవారు వెంకట పద్మావతి మల్లి కాంప్లెక్స్ అద్దాలు, అక్కడ ఉన్న ఐదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. సున్నితమైన అంశం కావడంతో అధికార యంత్రాంగం చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. -
ప్రజలకు వైఎస్సార్ సీపీ భరోసా
జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సీహెచ్ గున్నేపల్లిలో పార్టీలో 350 కార్యకర్తల చేరిక ముమ్మిడివరం : ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు భరోసా వైఎస్సార్ సీపీ నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. మండలంలోని సీహెచ్ గున్నేపల్లిలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 350 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కన్నబాబు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీకి కంచుకోటగా ఉండే సీహెచ్ గున్నేపల్లి గ్రామంలో మూకుమ్మడిగా టీడీపీ కార్యకర్తలు చేరడంతో పార్టీలో నూతనోత్సవం వెల్లివిరిసింది. ఆ గ్రామ ప్రజలు వైఎస్సార్ సీపీ నాయకులకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మాటలకు మోసపోయిన ప్రజలు ఎన్నికలు వస్తాయోనని ఎదురు చూస్తున్నారన్నారు. అధికారం కోసం ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతుంటే ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తిరిగి తీసుకురావడం పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేష్ను అడ్డదారిలో అధికారంలోకి తీసుకువచ్చాడని ఎద్దేవా చేశారు. టీడీపీ కంచుకోటలాంటి గ్రామాలలో కార్యకర్తలు టీడీపీ గోడలు పగలుకొట్టి వైఎస్సార్ సీపీలో చేరుతుండడం శుభ పరిణామమన్నారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ అధినేత సీఎం కావాలనే లక్ష్యంతో కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శలు మెండగుదిటి మోహన్, పెయ్యల చిట్టిబాబు, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ హరినాథ్బాబు, జగతా పద్మనాభం (బాబ్జీ), రాష్ట్ర కార్యదర్శి అడ్డగళ్ళ సాయిరాం, పుణ్యమంతుల కాళీ తదితరులు పాల్గొన్నారు. -
కాయ్ రాజా కాయ్...
- పల్లెపల్లోనూ ‘బెట్టింగ్’ బంగార్రాజులు – రూ. లక్షల నుంచి రూ. కోట్లలోకి... - విజేతలకు ఆన్లైన్లోనే పేమెంట్లు – విస్తృత నెట్వర్క్తో వల విసురుతున్న బృందాలు – పెడదారి పడుతున్న యువత – ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న పోలీసులు ప్రధాన పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ ఇప్పుడు పల్లెలనూ పట్టి పీడిస్తోంది. ధనవంతుల మధ్య సాగే లావాదేవీలు సామాన్య, మధ్య స్థాయి వర్గాలనూ భాగస్వామ్యులుగా చేస్తున్నాయి. విద్యార్థులు కూడా ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. ఆన్లైన్ల ద్వారా ఈ జోరు ఊపందుకుంటోంది. రాజమహేంద్రవరం క్రైం: క్రికెట్ బెట్టింగ్ ఒకప్పుడు డబ్బున్నవారికే పరిమితమయ్యేది. ఇప్పుడు పేద, మధ్య తరగతి యువత కూడా ఈ ఊబిలో కూరుకుపోతోంది. జిల్లాలో ప్రధాన నగరాలైన కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర పట్టణాలతోపాటు క్రమేపీ పల్లెలకు కూడా పాకింది. క్రికెట్ మ్యాచ్ చూడడమంటే ఒకప్పుడు వినోదం ... ప్రస్తుతం విస్తృతమైన నెట్వర్క్తో వ్యాపారంగా మారిపోయింది. ప్రతి మ్యాచ్కు చిన్నపాటి గ్రామం నుంచి కూడా లక్షల్లో నగదు చేతులు మారుతోందంటే ఏ స్థాయిలో ఈ వ్యాపారం సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. .విస్తృత నెట్వర్క్తో... బెట్టింగ్ బృందాలు విస్తృతమైన నెట్వర్క్తో ముందుకు సాగుతున్నాయి. ప్రతి గ్రామంలో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ఖాళీగా ఉన్న యువతను నెలవారీ జీతాలతో ఎంపికచేసుకుంటున్నాయి. వెయ్యికి రూ.50 కమీషన్పై బెట్టింగ్ వసూళ్ళు చేస్తున్నట్లు చెబుతున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని ఒక చిన్న మండలం నుంచే ఇటీవల జరిగిన ఒక కీలక మ్యాచ్కు సంబంధించి రూ.85 లక్షలు చేతులు మారినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న పోలీసులు.. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. ఒకప్పుడు ఒక గదిలో భారీగా సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు వంటి సరంజామాతో బెట్టింగ్ నిర్వహించేవారు. అయితే ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని మొబైల్ బెట్టింగ్ బృందాలు రంగ ప్రవేశం చేశాయి. వీళ్ళు తరచూ ప్రదేశాలు మార్చుతూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో వీరిని పట్టుకోవడం కష్టమవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్లకు కోట్లలో... ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ మ్యాచ్లకు బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఇంజినీరింగ్, వైద్య కళాశాల విద్యార్థులు ఈ బెట్టింగ్లలో జోరుగా పాల్గొనేలా బెట్టింగ్ ముఠాలు పావులు కదుపుతున్నాయి. గెలిచే జట్లుపైన, ఆ జట్టులో అత్యధిక స్కోర్ సాధించే క్రికెటర్పైనా, సిక్సర్లు, ఫోర్లుపైనా బెట్టింగ్లు కడుతుంటారు. ఫోన్ ద్వారా సాగే ఈ బెట్టింగ్ వ్యవహారమంతా ఆన్లైన్ ద్వారా పేమెంట్లు మార్పిడి జరుగుతోంది. సకాలంలో డబ్బులు చెల్లించని వారిని బుకీలు బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ వేధింపులను తాళలేక గత ఏడాది రాజమహేంద్రవరంలోని మెయిన్ రోడ్డులో హోల్ సేల్ ప్లాస్టిక్ వ్యాపారి కుమారుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. .అధికంగా అర్బన్ జిల్లాలోనే... రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో మూడు పోలీస్ స్టేషన్లలో మూడు బెట్టింగ్ ముఠాలను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. - వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీవై కాలనీ వద్ద ఒక భవనంలో బెట్టింగ్ ముఠా స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసి రూ. 1.60 లక్షలు, 8 సెల్ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. - టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్కట్ తోటలో ఒక క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ . 92 వేలు నగదు, ఒక సెల్ఫోన్, ద్విచక్ర వాహనం, స్వాధీనం చేసుకున్నారు. - త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాస్కర నగర్లో ఒక దంత వైద్యుడి ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ 1.48 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
చైర్మన్ పీఠానికి ‘నామం’
చైర్పై నెహ్రూ తనయుడు - నామనకు పార్టీ జిల్లా పగ్గాలు సాక్షిప్రతినిధి, కాకినాడ : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే’ సామెత జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు విషయంలో నిజమవుతున్నట్టుగానే ఉంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి దక్కకపోవడంతో దాని ప్రభావం నామన పదవికి ఎసరుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కోనసీమలో పి.గన్నవరం నియోజకవర్గం మగటపల్లికి చెందిన నామన పార్టీ ఆవిర్భావం నుంచి వివాదరహితుడనే పేరుంది. లోక్సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాం నుంచి పార్టీలో పలు పదవులు నిర్వర్తించారు. ఈ కారణాలతోనే జెడ్పీ పీఠానికి నామనను అప్పట్లో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. జెడ్పీ చైర్మన్గా మూడేళ్లు పూర్తి కావస్తోంది. మునుపటి చైర్మన్లు మాదిరిగా నిధులు, విధులు మాటెలా ఉన్నా కనీసం బుగ్గకారు, ప్రోటోకాల్, హోదా ఇటు పార్టీలోను, అటు అధికారికంగాను అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి వర్గ విస్తరణలో మెట్ట ప్రాంతానికి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మొండి చేయి ఎదురైనప్పుడే చర్చంతా జెడ్పీ పీఠంపైకి మళ్లింది. ఎందుకంటే నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయంగా అతని కుమారుడు, జగ్గంపేట జడ్పీటీసీ సభ్యుడు నవీన్కు జెడ్పీ పీఠాన్ని అçప్పగిస్తారని పార్టీలో విస్తృతమైన ప్రచారానికి తెరలేచింది. నెహ్రూ జీవితాశయం మంత్రి పదవి అధిష్టించడం. ఆ పదవితో పాటు మరికొన్ని ప్రలోభాల ఎరలోపడి చంద్రబాబు మాట నమ్మి నెహ్రూ టీడీపీలో తిరిగి చేరారని బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలోనే తాజా మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఖాయమని గంపెడాశతో నిరీక్షించిన నెహ్రూకు చివరకు రిక్తహస్తమే ఎదురైంది. ఈ పరిణామం అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు నామన పీఠానికి ఎసరుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని టీడీపీలో చర్చ నడుస్తోంది. మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడంతో అంతర్మథనం చెందుతున్న నెహ్రూకు గుడా (గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ లేదా, అతని తనయుడు నవీన్కు జెడ్పీ చైర్మన్ పీఠం రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ విషయాన్ని పార్టీ జిల్లా నేతలు మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గుడా చైర్మన్ రేసులో ఇప్పటికే పార్టీ రాజమహేంద్రవరం నాయకుడు గన్ని కృష్ణ ఉన్నారు. అందునా నెహ్రూ కూడా గుడా చైర్మన్ గిరీని ఆమోదిస్తే తన స్థాయి తగ్గించుకోవడమే అవుతుందనే భావనలోనే ఉన్నారంటున్నారు. అటువంటి పరిస్థితి వస్తేగిస్తే అసలు ఏ పదవి వద్దనుకోవాలనే నిర్ణయంతో ఉన్నారని అనుచరవర్గం చెబుతోంది. జడ్పీ చైర్మన్ పీఠంపై కుమార్డు నవీన్ను కూర్చోపెట్టడానికి మాత్రం నెహ్రూ సుముఖంగానే ఉన్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మూడు దశాబ్థాల రాజకీయాల్లో నెహ్రూ జీవితాశయం మంత్రి పదవి ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ద్రాక్ష అందలేదు అందుకే... కనీసం తనయుడు నవీన్ను జెడ్పీ చైర్మన్గా చేస్తే రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసినట్టు అవుతుందనే ఆలోచనతో నెహ్రూ ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. అది జరగాలంటే ప్రస్తుత చైర్మన్ రాంబాబు చైర్మన్ పీఠం కదిలిపోవడం ఖాయమేనంటున్నారు. నవీన్కు చైర్మన్ పీఠం అప్పగించి రాంబాబుకు పార్టీ జిల్లా పగ్గాలతో సరిపెట్టాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని తెలిసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు మృతి చెందిన దగ్గర నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం తనయుడు, మంత్రి లోకేష్ కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో బసచేసిన సందర్భంలో ఈ అంశంపై కొద్దిసేపు జిల్లా టీడీపీలో ఇద్దరు ముఖ్యనేతల మధ్య చర్చ సీరియస్గా సాగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడా యనమల పితలాటకమేనా...! నెహ్రూతో మెట్ట ప్రాంతంలో రాజకీయంగా బద్ధ వైరం ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జెడ్పీ చైర్మన్ పీఠం నవీన్కు అప్పగించే విషయంలో ఏమంత సుముఖంగా లేరని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అలాగని ఎక్కడా పెదవి విప్పని యనమల వర్గీయులు నెహ్రూతో పడని నేతలను వ్యూహాత్మకంగా ఎగదోస్తున్నారని పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. పార్టీని కాలదన్ని వెళ్లిపోయి స్వార్థం కోసం నిన్నగాక మొన్న పార్టీలోకి తిరిగొచ్చిన వారికి అత్యున్నత పదవులు కట్టబెడితే పార్టీ శ్రేణులకు ఏ రకమైన సంకేతాలు వెళతాయని అనుమాన బీజాలు నాటుతున్నారు. ఈ అంశానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రచారం ముమ్మరం చేయించే పనిలో నెహ్రూ వైరివర్గం చాపకింద నీరులా గోతులు తవ్వేస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎటువైపు దారితీస్తాయోనని వేచి చూడాల్సిందే. -
అంతా ఆర్భాటమే..
చిన్నబాబు రాకతో అనవసర హైరానా సీఎం కుమారుడైనందునే అతి ప్రాధాన్యం కరప సభలో నవ్వులపాలు అంబేడ్కర్ జయంతికి వర్ధంతి అన్నట్టుగానే తాగునీరు లేని ఇబ్బందులు కలుగజేస్తానంటూ ఉపన్యాసం కాబోయే సీఎం అంటూ చినరాజప్ప భజనతో జనం చిరాకు ‘సాక్షి’పై అక్కసు షరా మామూలే ∙ ప్యాకేజీ గొప్పంటూ పాత పాటే సాక్షి ప్రతినిధి, కాకినాడ : మునుపెన్నడూ జిల్లాలో మరే మంత్రికి ఇవ్వని ప్రాధాన్యం చినబాబు కు ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి జిల్లాకు వచ్చిన నారా లోకేష్కు మంగళవారం జిల్లా పార్టీ నాయకులు, అధికారులు ఇచ్చిన ప్రాధాన్యం పార్టీ సీనియర్లను విస్మయానికి గురి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కల్పించిన ప్రాధాన్యం ఇప్పుడు కనిపించింది. సీఎం చంద్రబాబు తనయుడు కావడంతోనే అటు పార్టీ నేతలు, ఇటు అధికారులు అంత టి అగ్రతాంబూలం వేయడానికి కారణమైందని చర్చ జరుగుతోంది. లోకేష్ పర్యటన ఏర్పాట్లు చూసిన వారంతా సీఎం చంద్రబాబు పర్యటనలో కంటే మించిపోయాయని చర్చించుకోవడం కనిపించింది. పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం కరప సభలో లోకేష్ ప్రసంగిస్తూ తాగునీరు లేని ఇబ్బందులు కలుగజేస్తానంటూ గొంతెత్తి చెప్పడంతో గొల్లున జనం నవ్వడంతో తరువాత సర్దుకున్నారు. లోకేష్ ప్రసంగంలో తన తండ్రి చంద్రబాబు గొప్ప నాయకుడిగా చెప్పే ప్రయత్నం చేస్తూ పేరు ఎత్తకుండానే ప్రతిపక్షనేత, దొంగ పత్రిక, దొంగ చానల్ అంటూ ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కారు. తన తండ్రి సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో యు టర్న్ తీసుకోవడం తప్పు కాదన్నట్టు ప్యాకేజీయే గొప్ప అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. తండ్రి చంద్రబాబు సీఎం అయ్యాక మూడేళ్లుగా జనం మంచినీటి సమస్యతో కొట్టుమిట్టాడుతుంటే వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో అన్ని గ్రామాలకు తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లువంటి మౌలిక వసతులు కల్పిస్తానని లోకేష్ ప్రకటించడం జనానికి విడ్డూరంగా అనిపించింది. తన తండ్రి చంద్రబాబు స్టైల్లోనే కేంద్ర ప్రభుత్వంతో విబేధిచాలంటే రెండు నిమిసాలు పట్టదని, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు రాబడుతున్నామని గొప్పలు చెప్పడంలో లోకేష్ తండ్రిని మించిపోయారని పర్యటనలో జనం గుసగుసలాడుకోవడం వినిపించింది. పల్లె తల్లిలాంటిది, పట్నం ప్రియురాలు వంటిదని చెబుతూ, తల్లి రమ్మంటుంది, ప్రియురాలు తెమ్మంటుందంటూ పలు ఛలోక్తులు కూడా వేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను ఇటీవల పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నిలబెట్టి మాట్లాడినట్టు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో ఇక్కడకు వచ్చేసరికి లోకేష్ ఉప ముఖ్యమంత్రికి ఎనలేని గౌరవం ఇచ్చినట్టు కనిపించారు. వేదికపై తన కోసం వేసిన సింహాసనంలాంటి కుర్చీలో చినరాజప్పను కూర్చోబెట్టి తనపై పడ్డ మచ్చను చెరిపేసుకునే ప్రయత్నం చేశారు. రాయించి తెచ్చుకున్న స్ట్రిప్ట్ను కరప సమావేశంలో 17 నిమిషాలు ప్రసంగించే సందర్భంలో లోకేష్ తడబడటమే కాకుండా తాగునీరు సమస్య పరిష్కారిస్తామనేందుకు బదులు రెండు మూడేళ్లలో ప్రతి పల్లెటూరుకు తాగునీరులేని ఇబ్బందిని కలుగజేస్తాననడంతో ఆశ్చర్యపోవడం జనం వంతైంది. కొద్దిసేపటికి తేరుకున్న లోకేష్ రెండేళ్లలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సర్థిచెప్పుకునే ప్రయత్నం చేయడం కనిపించింది, అనుకున్న సమయానికన్నా రెండున్న గంటలు ఆలస్యం అవ్వడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు విసుగెత్తిపోయారు. పలు శంఖుస్థాపనలు,,, జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డుకు ఎంపికైన సామర్లకోట మండలం జి. మేడపాడు గ్రామంలో జరిగిన అభివృద్ది పనులను సమీక్షించి వేళంగి, కరప గ్రామాల్లో రూ.24 కోట్లతో నిర్మించిన సామూహిక రక్షితమంచినీటి ప«థకాలకు, నడకుదురులో రూ.30 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనానికి, కరపలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు రూ.80 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంఖుస్ధాపన, తూరంగి బుల్లబ్బాయిరెడ్డి కాలనీ సమీపంలో రూ.10 కోట్లతో తాగునీటి పథకం నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. వాకలపూడి అంగన్ వాడీ కేంద్రానికి వస్తారని వాకలపూడిలోని 177 అంగన్ వాడీ కేంద్రానికి తీసుకు వచ్చిన గర్భిణీలు, బాలింతలు, చిన్నారులను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిరీక్షింప చేయడంతో నరక యాతన అనుభవించారు. దేనికీ స్పందించని జనం... డ్వాక్రా మహిళలను పెద్ద సంఖ్యలో ఆటోల్లో, ట్రాక్టర్ల, వ్యానుల్లో కరప తరలించారు. 24 గంటలు కరెంటు ఉంటుందా లేదా, మహిళలకు ,రైతులకు రుణమాఫీ జరిగిందా లేదా అంటూ వచ్చిన జనాన్ని లోకేష్ చేతెలెత్తమని అడిగినా స్పందన కనిపించ లేదు. కరపలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక మూడు నెలలకే 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని గొప్పలకు పోయిన లోకేష్కు కాకినాడ అంబేడ్కర్ భవన్లో పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో హఠాత్తుగా కరెంటుపోయి హాలులో చీకటి అలుముకోవడంతో బిత్తరపోయారు. వెంటనే నిర్వాహకులు జనరేటర్తో విద్యుత్ను పునరుద్ధరించడంతో ఊపిరిపీల్చుకోవడం కనిపించింది. గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించుకోలేకపోయారని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని స్వపక్షానికి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులే గోడు వెళ్లబోసుకోవడంతో లోకేష్ సమాధానం చెప్పలేక చూద్దాం, చేద్దాం అంటూ ముక్తాయించారు. -
‘బాబు’కు ఇంధ్రభవనం పేదలకు ‘చంద్ర’గ్రహణం
- మూడేళ్లుగా ఇళ్ల కోసం లక్ష దరఖాస్తులు - ఇందులో 60 వేలు ఆన్లైన్లో - విమర్శలు వెల్లువెత్తగా జిల్లాకు 23 వేల ఇళ్లు మంజూరు - మొదలు పెట్టిన ఇళ్లకు అరకొర చెల్లింపులు - వై.ఎస్.హయాంలో ప్రతి ఏటా ఇళ్ల మంజూరే - తరువాత వచ్చిన సీఎంల హయాంలో మంజైరైన వాటికీ గతి లేదు సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిరుపేద, మధ్య తరగతి వర్గాలకు సొంత ఇంటి కల ఒక కలగానే మిగిలిపోయింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎడాపెడా హామీలు గుప్పించేసిన చంద్రబాబు ఎన్నికలయ్యాక గాలికొదిలేశారు. సీఎం గద్దెనెక్కి మూడేళ్ల కాలంలో ముచ్చటగా మూడు ఇళ్లు కూడా నిర్మించిన దాఖలాలు జిల్లాలో లేవు. సొంత ఇంటి కల సాకారం చేసుకునేందుకు వేలాది మంది దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మించిన పాపాన పోలేదు. పేదల గోడు మాట దేవుడెరుగు సీఎం మాత్రం ఇంద్రభవనం లాంటి భవంతిలో ఇటీవలనే గృహ ప్రవేశం కూడా చేశారు. ఎదురు చూపులు ... ఎండమావులు సొంత ఇల్లు నిర్మించుకోవాలని మూడేళ్లుగా జిల్లాలో సుమారు లక్ష మంది దరఖాస్తు చేసుకుని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఇది అధికారికంగా గృహనిర్మాణ సంస్థకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రమే. ఈ లక్ష దరఖాస్తుల్లో సుమారు 60 వేల దరఖాస్తులను గృహనిర్మాణ సంస్థ ఆన్లైన్లో నమోదు చేసింది. గ్రామాల్లో పర్యటనలకు వెళుతున్న సందర్భంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారి నుంచి నిరసన ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు మొత్తుకోగా ప్రభుత్వం ఆరు నెలలు క్రితం జిల్లాకు 23 వేల 348 ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో 17 వేల 390 ఇళ్ల నిర్మాణాలను గత అక్టోబరు నెలలో లబ్థిదారులు ప్రారంభించారు. నెల రోజుల తరువాత నవంబరు నెలలో ఇళ్లు మొదలుపెట్టిన వారికి మాత్రం మొదటి విడత ఆన్లైన్లో అరకొర చెల్లింపులతో సరిపెట్టేశారు. మొదటి విడతగా ఒక్కో ఇంటికి 50 నుంచి 100 బస్తాలు సిమెంట్, రూ.6000లు నగదు చెల్లించారు. అంటే ఇళ్లు మొదలుపెట్టాక మొక్కుబడిగా ఒక నెల బిల్లులంటూ ఆర్భాటం చేసి ఆ తరువాత లబ్థిదారులను గాలికొదిలేశారు. 2016 డిసెంబర్ నుంచి నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదు. ఆ రకంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 3.40 కోట్లు లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా డిసెంబరు నెల నుంచి ఇంతవరకు అంటే ఐదు నెలలుగా ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న లబ్థిదారులకు చంద్రబాబు సర్కార్ చిల్లిగవ్వ విడుదల చేసిన దాఖలాలు లేవు. గడచిన మూడేళ్లుగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టకుండా ఆర్భాటపు ప్రచారాల్లో ప్రభుత్వం మునిగితేలుతుందన్న విమర్శలున్నా దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా నేతలు పట్టించుకోవడం లేదు. ఆ రోజులే వేరు... చంద్రబాబు సర్కార్ మూడేళ్లలో ఒక్క ఇల్లూ నిర్మించని పరిస్థితి ఇలా ఉంటే మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2004 నుంచి ప్రతి ఏటా దరఖాస్తు చేసుకొన్న ప్రతి లబ్ధిదారునికీ ఇల్లు మంజూరు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నంత కాలం జిల్లాకు ప్రతి ఏటా 60 వేలకు పైనే ఇళ్లు మంజూరు చేస్తూ వచ్చారు. మంజూరు చేయడమే కాకుండా ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తూ వచ్చారు. వై.ఎస్. హఠాన్మరణం తరువాత కిరణ్ కుమార్రెడ్డి, రోశయ్య సీఎంలుగా ఉండగా నిర్మించిన సుమారు 18 వేల ఇళ్లు ఇప్పటికీ పలు దశల్లో నిలిచిపోయి మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. ఈ ఇళ్ల లబ్థిదారులకు సుమారు రూ.12 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు గద్దెనెక్కాక ఈ బకాయిల ఊసే ఎత్తడం లేదు. సరికదా కొత్తగా మంజూరుచేసి నిర్మాణం చేపట్టిన ఇళ్లకు కూడా పైసలు ఇవ్వడం లేదు. ఫలితంగా లబ్థిదారులు లబోదిబోమంటున్నారు. ఇళ్లు మంజూరయ్యాయి నిర్మాణాలు చేపట్టాలని హడావిడి చేశారు. తీరా ఇళ్లు మొదలుపెట్టాక బిల్లులు విడుదల చేయకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక లబ్థిదారుల పరిస్థితి అయోమయంగా తయారైంది. -
శ్రేణుల్లో నిరుత్సాహం
హామీలపై లేదు భరోసా! అంతా ప్రసంగాల ప్రయాస.. చప్పగా సాగిన పంచాయతీ రాజ్ మహోత్సవం సమస్యలను ఏకరువు పెట్టిన అధికార పక్షం సభ్యులు దాటవేత ధోరణిలో లోకేష్ భానుగుడి(కాకినాడ) : పంచాయతీరాజ్ మహోత్సవం–2017 పేరుతో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఆశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులు, సమస్యలపై మంగళవారం అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన సమావేశం పార్టీ శ్రేణుల్లో, అధికారుల్లో తీవ్ర నిరుత్సాహాన్ని నింపింది. చినబాబు రాకతో నిధులు వరదలా వస్తాయనుకున్న నేతల ఆశలు ఆవిరయ్యాయి. మంత్రి కేవలం సమస్యలను విని వాటిని ముఖ్యమంత్రితో చర్చిస్తానని ప్రతి విషయంలో దాటవేత «ధోరణి ప్రదర్శించడం, నిధులడిగితే రిక్తహస్తం చూపడంతో సమావేశం ఆద్యంతం విమర్శలకు తావిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 8గంటల వరకు సాగినా పలు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు మినహా సమావేశంలో ఏ విషయం పెద్దగా ఆకట్టుకోలేదు. తొలుత పంచాయతీరాజ్, ఎన్ఆర్ఈజీయస్ శాఖల ప్రగతి నివేదికలను కలెక్టర్ అరుణ్కుమార్ సమావేశం ముందుంచారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, పంచాయతీరాజ్ కమిషన్ బి.రామాంజనేయులు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, తెదేపా హయాంలో జరిగిన పనులపై వివరించారు. సమస్యలను ఏకరువుపెట్టిన అధికార పక్షం సభ్యులు ప్రభుత్వంపై గ్రామాల్లో ఉన్న వ్యతిరేకతను సమావేశంలో అధికార సభ్యులే ఏకరువు పెట్టడంతో చినబాబు కంగుతిన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రసంగాల్లో కోరుమిల్లి సర్పంచ్ సలాది వీరబాబు ఉచిత ఇసుక విధానంలో ఉన్న లోపాలను వివరించారు. గ్రామాల్లో గృహరుణాలు ఇవ్వకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రంపచోడవం సర్పంచ్ నిరంజనీదేవి గ్రామాల్లో నీటి కొరత విపరీతంగా ఉన్నా పట్టించుకునే నాథుడు కరవయ్యాడని పేర్కొన్నారు. పాఠశాల భవనాలు కూలిపోతున్నా ఎవరికీ చిత్తశుధ్ధి లేదని వాపోయారు. జెడ్పీటీసీ సభ్యులు నాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు కనీసం ఎంపీడీవో కార్యాలయాల్లో ఒక గదిని కేటాయించలేని అ«ధ్వాన స్థితిలో ఉన్నామన్నారు. ఉచిత ఇసుక విధానం కారణంగా జెడ్పీకి సీనరేజీ ఆదాయం లేకపోవడం, 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే జమ కావడం కారణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఏజెన్సీ మండలాల ప్రజాప్రతినిధులు తమతమ గ్రామాల్లో కనీస వైద్యసదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామీణాభివృద్ధికి కేటాయించింది రూ.940 కోట్లే.. హోం మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యేల ప్రసంగాల అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పల్లె తల్లి లాంటిది.. పట్నం ప్రియురాలు లాంటిదని, తల్లి ఇస్తే ప్రియురాలు తెమ్మంటుందంటూ ఛలోక్తులు విసరారు. కన్వర్షన్ ఆఫ్ ఫండ్స్ అనే పదం ఒకప్పుడు ముఖ్యమంత్రి వాడారని, మూడేళ్ల క్రితం ఆ పదం ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకుంటే గాని అర్థం తెలియలేదన్నారు. గ్రామీణ అభివృద్ధి కోసం కేవలం రూ.940 కోట్లు ఖర్చుచేశామని చెప్పడం, మైనర్ పంచాయతీల కరెంటు బిల్లులపై ప్రజాప్రతినిధులకు సరైన హామీ ఇవ్వలేకపోవడం, ప్రతి విషయానికీ దాటవేత ధోరణి ప్రదర్శించడంతో ప్రసంగం ఆద్యంతం సభికుల్లో నిరుత్సాహాన్ని నింపింది. కులాల మధ్య చిచ్చుపెట్టింది మీరు కాదా? : జెడ్పీ ప్రతిపక్షనేత శాఖా ప్రసన్నకుమార్ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని సా«గిస్తున్న అరాచకాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, ప్రజా సమస్యలను అక్షర సత్యాలుగా అందిస్తున్న ‘సాక్షి’పై మంత్రి నారా లోకేష్ విమర్శించడం తగదని జెడ్పీ ప్రతిపక్షనేత శాఖా ప్రసన్నకుమార్ అన్నారు. నాయకులు ప్రజల్లోంచి రావాలని, వంశాన్ని, పలుకుబడిని అడ్డుపెట్టికుని వచ్చిన లోకేష్కు ప్రజాపాలన గురించి ఏం తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు. సాక్షి పత్రిక కుల మతాల గురించి చిచ్చు రేపుతుందంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఎస్సీ వర్గీకరణ పేరుతో చిచ్చుపెట్టింది తెదేపా ప్రభుత్వం అని, కాపులు, బిసీ కులాల మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేస్తోంది ఎవరి ప్రభుత్వమో తెలుసుకోవాలని ఆయన విమర్శించారు. -
కొత్త కలెక్టర్గా కార్తికేయ మిశ్రా
- అరుణ్కుమార్ బదిలీ - కర్నూలు కలెక్టర్గా జేసీకి పదోన్నతి సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ను ప్రభుత్వం సోమవారం రాత్రి బదిలీ చేసింది. ఆయన స్థానంలో జిల్లా నూతన కలెక్టర్గా కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన ఏ క్షణాన్నైనా వెలువడే అవకాశం ఉంది. పరిశ్రమల శాఖ డైరెక్టర్గా పని చేసిన కార్తికేయ మిశ్రా 2009 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. రాష్ట్రంలో పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లుగా డైరెక్ట్ ఐఏఎస్లను నియమించాలనే సీఎం చంద్రబాబు ఆలోచనల్లో భాగంగానే ఈ నియామకం జరిగింది. కాగా, బదిలీ అయిన కలెక్టర్ అరుణ్కుమార్ సెర్్ప సీఈఓగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణను పదోన్నతిపై కర్నూలు కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం రాత్రి ‘సాక్షి’కి ధ్రువీకరించారు. బదిలీ అయిన కలెక్టర్, జేసీలు ఇద్దరూ కన్ఫర్డ్ ఐఏఎస్లు. వీరిద్దరూ జిల్లాకు వచ్చి సుమారు రెండేళ్లు పూర్తవుతోంది. వారిద్దరినీ ప్రభుత్వం ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. జిల్లా జేసీగా ఎవరిని నియమిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. -
లోకేష్ పర్యటన ఏర్పాట్లలో అపశ్రుతి
ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం యువకుడికి తీవ్ర గాయాలు కాకినాడ రూరల్ : నాయకుల పర్యటనలు యువకుల ప్రాణాల మీదకు వస్తున్నాయి. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న యువకులు నాయకులు, మంత్రులు, ప్రభుత్వాధినేతల పర్యటనల సందర్భంగా స్థానిక నాయకులు మంత్రులు, పార్టీ నాయకుల మెప్పు పొందేందుకు వేస్తున్న ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనే కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో సోమవారం చోటు చేసుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, వివిధ ఫ్యాక్టరీలకు చెందిన యజమానులు భారీగా ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఫ్యాక్టరీల నుంచి ఫ్లెక్సీలు కట్టాలని డిమాండ్ చేసి మరీ టీడీపీ నాయకులు వేయించారు. దీనిలో భాగంగా వలసపాకలలో ఫ్లెక్సీలు కట్టేందుకు రమణయ్యపేట ఇందిరాకాలనీకి చెందిన దున్నా అనిల్కుమార్ అనే యువకుడు కాంట్రాక్ట్కు ఒప్పుకున్నాడు. ఫ్లెక్సీ బోర్డులు ఇనుప ఊచలతో ఉండడంతో విద్యుత్ స్తంభాలకు కడుతుండగా షాక్కు గురై కిందపడిపోయాడు. చేతులు, కాళ్లు, ఉదర భాగంలో తీవ్రంగా కాలిపోయాయి. మనిషి మొత్తం నల్లగా మారిపోయాడు. దాదాపు 80 శాతం పైగా కాలిపోవడంతో స్థానికులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్కుమార్ చావుబతుకుల మధ్య జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఫ్లెక్సీలను వలసపాకల జన్మభూమి కమిటీ సభ్యుడు తాతపూడి రామకృష్ణ దగ్గరుండి కట్టిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో అనిల్కుమార్తో పాటు తాతపూడికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు పట్టుకొని అక్కడ నుంచి పారిపోయినట్టు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన అనిల్కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది బాబు ఉన్నాడు. అనిల్కుమార్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
లోకేశ్ రాకతో నిబంధనలు హుష్
– ఉపాధి కూలీలతో రోడ్లు ఊడ్పించిన అధికారులు - మంత్రి సభకు వస్తే నాలుగు రోజుల మస్తర్లు - రాకుంటే వారం రోజులు పనిలోకి తీసుకోరని బెదిరింపు కాకినాడ రూరల్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ మంగళవారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో కాకినాడ నుంచి వేళంగి వరకు ప్రధాన రోడ్డు వెంబడి ఉన్న తుప్పలు, రోడ్డుపై ఉన్న ఇసుకను ఉపాధి కూలీలతో తుడిపించి అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు దగ్గరుండీ మరీ ఉపాధి కూలీలతో పనులు చేయించారు. గ్రామాల్లో రోడ్ల పక్కన ముళ్ల కంపలతో ఇబ్బందులు పడుతున్నాం, తొలగించండని మొర పెట్టుకున్నా పట్టించుకోని ఉపాధి, మండల పరిషత్ అధికారులు లోకేశ్ వస్తున్నారని మండుటెండలో ఉపాధి కూలీలతో పనులు చేయించారని పలువురు విమర్శిస్తున్నారు. రోడ్డు మీద ఇసుక రేణువు కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధి కూలీలదేనంటూ అధికారులు ఆదేశించినట్టు కూలీలు చెబుతున్నారు. సోమవారం కాకినాడ అన్నమ్మగాటీ సెంటర్ నుంచి తూరంగి, నడకుదురు, పెనుగుదురు, కరపల మీదుగా వేళంగి వరకు వందలాది మంది ఉపాధి కూలీలు రోడ్డు పక్కన పిచ్చిమొక్కలు, రోడ్డుపై ఉన్న ఇసుక తొలగింపు పనులు చేశారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఉపాధి పనులు చేస్తున్నామని, అయితే మంత్రి లోకేశ్ వస్తున్నారని మధ్యాహ్నం 2 గంటలు అయినా పనులు చేయిస్తున్నారని కూలీలు చెప్పారు. మంగళవారం కరపలో జరిగే లోకేశ్ సభకు భారీగా ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలు తరలి రావాలని కరప, కాకినాడ రూరల్ ప్రాంతాల్లోని అధికారులు హుకుం జారీచేశారు. ఎవరైనా సభకు రాకపోతే రుణాలు పొందే అర్హత కోల్పోతారని, ఏ డ్వాక్రా సంఘానికి చెందిన వ్యక్తుల రావడం లేదో జాబితా తయారు చేయించాలంటూ మండల మహిళా సంఘాల ప్రతినిధులను టీడీపీ కార్యకర్తలు హెచ్చరించినట్టు చెబుతున్నారు. సభకు వచ్చే ఉపాధి కూలీలకు మూడు నుంచి నాలుగు రోజులు పనులు చేసినట్టు మస్తర్లు వేయాలని కరపకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఉపాధి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అన్ని గ్రామాల్లో ప్రచారం చేయాలని చెప్పినట్టు ఆయా ప్రాంతాల కూలీలు చెబుతున్నారు. సభకు రాకపోతే వారం రోజులు పనిలోకి తీసుకోవద్దని చెప్పడంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల లోకేశ్ను స్వాగతిస్తూ అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అధికారులు కిమ్మనలేదన్న విమర్శలు వినిపించాయి. -
నిను వీడని.. నీడను నేను
- ఐదు నెలలైనా... నగదు కష్టాలే - ఖాతాలన్నీ ఖాళీ నిండుకున్న నిల్వలు - వీడని... కరెన్సీ కష్టాలు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎవరికైనా పైసాయే పరమాత్మ. పైసాలేందే ఒక్క అడుగు ముందుకు పడదు. నెలంతా కష్టపడ్డ ఉద్యోగులు జీతాల కోసం బ్యాంకులకు వెళితే డబ్బు లేదంటున్నారు. ఏటీఎంలకు వెళుతుంటే నగదు లేదనే బోర్డులు వేలాడుతున్నాయి. కిరాణా తెచ్చుకుందామంటే చేతిలో సొమ్ముల్లేవు. పిల్లలకు స్కూల్, కళాశాల ఫీజులు కట్టాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. అలా అని బ్యాంక్ ఖాతాల్లో నిల్వలున్నా చేతికి మాత్రం చిల్లిగవ్వ రావడం లేదు. పెద్దనోట్ల రద్దయి ఐదు నెలలు గడిచినా దాని ప్రభావం మాత్రం ఇంకా జిల్లాను వెంటాడుతూనే ఉంది. ఏటీఎంలలో రెండు, మూడు లక్షలు ఇలా పెడుతుంటే అలా క్షణాల్లో అయిపోతున్నాయి. క్యూలైన్ క్యూలైన్లానే ఉంటున్నాయి. జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ వర్గాన్ని కదిపినా కరెన్సీ కష్టాలే చెప్పుకొస్తున్నాయి. పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలవడంతో వారి బాధలు వర్ణణాతీతం. మార్చి తరువాత కూడా మారని పరిస్థితి... పెద్ద నోట్ల రద్దుతో మొదలైన కరెన్సీ కష్టాలు మార్చి నెల తరువాత అంతా సర్థుకుంటాయని ప్రజలు భావించారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా భరోసా కల్పించేలా ప్రకటనలు చేసింది. ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగా మానసికంగా సిద్ధపడ్డారు. కానీ ఏప్రిల్ మొదలై రెండో వారంలో అడుగుపెట్టేసినా పైసల కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఏటీఎం అంటే ‘ఎనీ టైమ్ మూత’గా తయారైంది. ప్రజలు బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లో నిలబడి సొమ్ములు డ్రా చేసుకునే రోజులు ఎప్పుడో మరిచిపోయారు. కరెన్సీ కోసం పూర్తిగా ఏటీఎంలకు అలవాటుపడ్డారు. ఇప్పుడు ఆ ఏటీఎంలలో సొమ్ములు ఉండటం లేదు. అలా అని బ్యాంకులకు వెళితే గంటల తరబడి క్యూలో నిలబడ్డ తరువాత తీరిగ్గా సొమ్ముల్లేవని తిప్పి పంపేస్తున్నారు. లేదంటే ఐదు వేలకు రెండు వేలు, వెయ్యి చేతిలో పెడుతున్నారు. చేసేది లేక ఇచ్చినంతా పుచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు లబోదిబోమంటున్నారు. నగదు నిల్వలు నిండుకోవడంతో చేయగలిగేదేమీ లేదని దాదాపు బ్యాంకులన్నీ చేతులెత్తేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్బ్యాంకుల బ్రాంచీలుæ 757 వరకూ ఉన్నాయి. ఈ బ్రాంచీల ద్వారా గతంలో జిల్లాలో ప్రతి రోజు రూ.250 కోట్లు లావాదేవీలు జరుతుండేవి. ప్రస్తుతం నగదు కొరత ఏర్పడ్డ తరువాత కేవలం రూ.80 లేదా రూ.90 కోట్లు మించి లావాదేవీలు జరగడం లేదు. అరకొర నగదుతో ఏటీఎంలు... బ్యాంకు బ్రాంచీలకు అనుబంధంగా జిల్లా వ్యాప్తంగా 811 ఏటీఎం సెంటర్లున్నాయి. ఒక్క ఏటీఎం మెషిన్లో ఒకప్పుడు నగదు కొరత అనేదే ఉండేది కాదు. అప్పట్లో ఒక్కో ఏటీఎంలో రోజుకు రూ.15 నుంచి రూ.20 లక్షలు నగదు పెట్టేవారు. అటువంటిది పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడ్డ నగదు కొరత కారణంగా ప్రస్తుతం రూ.2 లక్షలు నుంచి రూ.4 లక్షలు మాత్రమే పెడుతుండడంతో గంటల్లోనే ఖాళీ అయిపోతున్నాయి. తరువాత మూతేస్తున్నారు. ఉదాహరణకు కాకినాడ మెయిన్ రోడ్డులోని స్టేట్బ్యాంక్ మెయిన్ బ్రాంచీలో ప్రతి రోజు కోటి రూపాయల నగదు ఉంచగా ఖాతాదారులు వాటిని సాయంత్రంలోగా ఖాళీ చేసేశారు. భయంతో విత్ డ్రాలు ... గత ఏడాది అన్ని బ్యాంకు బ్రాంచీల్లో ఖాతాదారులు సుమారు రూ.4000 కోట్లు జమ చేశారని అంచనా. ప్రారంభంలో నగదు ఉపసంహరణకు పరిమితి విధించడంతో నగదు లావాదేవీలు నియంత్రణలో నడిచాయి. పరిమితి ఎత్తేయడంతో మరోసారి ఈ పరిస్థితి పునరావృతం అవుతుందనే ముందు చూపుతో ప్రజలు ఖాతాల్లో ఉన్న నగదులో మూడొంతులు ఉపసంహరించేసుకుని ఇళ్లల్లో బీరువాల్లో దాచేశారు. ప్రస్తుతం బ్యాంకులలో 20 శాతం నగదు మాత్రమే మిగిలి ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఉపసంహరించిన సొమ్ము తిరిగి బ్యాంకుల్లో వేయడానికి ఖాతాదారులు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే బ్యాంకుల్లో జమచేసినా తిరిగి తీసుకోవడానికి ఇబ్బందులు తప్పవనే ముందుచూపే కారణమంటున్నారు. ఫలితంగా బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకున్నాయి. పోనీ రిజర్వు బ్యాంకయినా కరెన్సీ కోటా విడుదలచేసిందా అంటే అదీ లేదు. దీంతో ఖాతాదారులు నానా పాట్లు పడుతున్నారు. రూ.600 కోట్లు అవసరం... జిల్లాలో కరెన్సీ కష్టాలు గట్టెక్కాలంటే అత్యవసరంగా రూ.600 కోట్లు కావాలని నెల రోజులుగా ఆర్బీఐకు లేఖలపై లేఖలు పంపిస్తూనే ఉన్నారు. కానీ ముక్కుతూ మూలుగుతూ సోమవారం ఆర్బీఐ నుంచి రూ.100 కోట్లు జిల్లాకు వచ్చాయి. ఈ సొమ్ముల్లో ఎస్బీఐకు రూ.40 కోట్లు బదలాయించగా, మిగిలిన రూ.60 కోట్లు లీడ్ ఆంధ్రా బ్యాంక్కు జమ య్యాయి. ఆ రూ.80 కోట్లు ఏ మూలకొస్తాయని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కరెన్సీ కష్టాలు తీరాలంటే కనీసం వెయ్యి కోట్లు విడుదల చేయాలంటున్నారు. నగదు రహితం ఎక్కడా... నగదు కొరతకు ఆన్లైన్ చెల్లింపులపై వ్యాపారవర్గాలు ఆసక్తి చూపకపోవడం కూడా పెద్ద ఇబ్బందికరంగా మారింది. నగదు రహితానికి కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా నిర్వహణ భారంతో 90 శాతం వ్యాపారులు స్వైపింగ్ మిషన్లు పెట్టుకోలేదు. రాజమహేంద్రవరం మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లో 1500 దుకాణాలుంటే పట్టుమని 10 స్వైపింగ్ మెషిన్లు కూడా లేకపోవడం జిల్లాలో వాస్తవ పరిస్థితికి అద్దంపడుతోంది. ఈ కరెన్సీ ఇబ్బందుల నుంచి ప్రజలు గట్టెక్కాలంటే వెయ్యి కోట్లు అత్యవసరంగా విడుదల చేయాలి తప్ప మరో మార్గం లేదంటున్నారు. డబ్బు కావాలని ప్రతిపాదనలు పంపించాం. ప్రజలు తమ నగదును బ్యాంకు నుంచి డ్రా చేసిన తరువాత వాటిని తిరిగి బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించడం లేదు. గడచిన నెల రోజులు నుంచి జిల్లాకు ఆర్బీఐ నుంచి ఆశించిన స్థాయిలో సొమ్ము రాలేదు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మును ఖాతాదారులు మొత్తం డ్రా చేసేశారు. బ్యాంక్ ఖాతాలో ఉంటే సొమ్ము తీసుకోలేమనే భయంతో ఆ పని చేశారు. కానీ తీసుకున్న సొమ్ము చలామణీలోకి వస్తేనే నగదు లావాదేవీలకు ఇబ్బందులుండవు. ఈ నెల 10న జిల్లాకు రూ.100 కోట్లు రాగా స్టేట్బ్యాంక్కు రూ.40 కోట్లు, ఆంధ్రాబ్యాంక్కు రూ.60 కోట్లు విడుదల చేశాం. రిజర్వ్బ్యాంక్కు నగదు కోసం ప్రతిపాదనలు పంపించాం.త్వరలో వస్తాయని ఎదురుచూస్తున్నాం. -
దార్శనికుడు జ్యోతిరావుఫూలే
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కాకినాడ : సమాజాన్ని ప్రభావితం చేసేలా జ్యోతిరావుఫూలే అనుసరించిన విధానాలు ఆయనను దార్శనికునిగా నిలిపాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. జ్యోతిరావుఫూలే 191వ జయంతిని మంగళవారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రి సమీపంలోని ఫూలే విగ్రహానికి కన్నబాబు, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ విప్లవాత్మకమైన ఆలోచనలతో అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించాలన్న లక్ష్యంతో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ప్రధానంగా మహిళలు, రైతులు, కార్మికవర్గాల సమస్యలపై ఆయన ఎంతగానో ఉద్యమించారన్నారు. మహిళా విద్య కోసం ఆయన పాటుపడ్డారన్నారు. సరికొత్త ఆలోచనలతో సమాజాన్ని ప్రభావితం చేసి ఇప్పుడు వెనుకబడిన వర్గాలతోపాటు, ఇతర వర్గాల హృదయాల్లో కూడా సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్నబాబుతోపాటు వైఎస్సార్ సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్, పార్టీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లిరాజబాబు మాజీ ఎంపీ గుబ్బల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ జవ్వాది సతీష్, మాజీ కౌన్సిలర్ చింతపల్లి చంద్రశేఖర్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్బషీరుద్దీన్, పార్టీ మైనార్టీ, వాణిజ్యవిభాగం కన్వీనర్లు అక్బర్ అజామ్, పెద్దిరత్నాజీ, పార్టీ నాయకులు ముత్యాల సతీష్, కడియాల చినబాబు, చింతపల్లి చంద్రశేఖర్, పుప్పాల బాబి, గోపిశెట్టి బాబ్జి, రొంగలి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి త్రిమూర్తులు, రమణాతిమురళి, గంజా సత్తిబాబు, పోరాడ దుర్గాప్రసాద్, గోపిశెట్టి బాబ్జి, నక్కా వీరన్న పాల్గొన్నారు. పోరాటాలకు స్ఫూర్తి ఫూలే – మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం భానుగుడి (కాకినాడ): పొగొట్టుకున్న హక్కులు పోరాడితేగాని రావన్న స్ఫూర్తిని నింపిన మహనీయుడు జ్యోతిరావుఫూలే అని మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డిసుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక అంబేడ్కర్ భవన్లో బీసీ వెల్ఫేర్శాఖ ఏర్పాటు చేసిన పూలే 191 జయంత్యుత్సవంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తొలుత శాంతిభవన్ సెంటర్లో ఫూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆర్ఎస్ మాట్లాడుతూ ఫూలే ఆశయాలను, ఆలోచనలను అర్థం చేసుకుని ముందుకు సాగాలన్నారు. శూద్రులకు విద్యలేనందున జ్ఞానం లేదని, జ్ఞానం లేనందున నైతికత లేదని, నైతికత లేనందున ఐక్యమత్యం లేదని, ఐక్యమత్యం లేనందున శక్తి లేదని ఈ కారణాల చేతనే శూద్రులు చరిత్రలో అణచివేతకు గురయ్యారని, వారిని ఉన్నత స్థితికి తీసుకురావడానికి పూలే అహర్నిశలు కృషి చేశారన్నారు. ఫూలేకు భారత రత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేదిక నుంచి డిమాండ్ చేశారు. కలెక్టర్ అరుణ్కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్లో గొప్ప నాయకుల జన్మదినోత్సవాలు ఉన్నాయని, వారు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విజయాలు దిక్సూచిగా మందుకు సాగాలన్నారు. జెడ్పీ చైర్మన్ నామనరాంబాబు మాట్లాడుతూ పూలే పేదలకోసం పాటుపడి చరిత్రలో నిలిచారని, యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో పలు పథకాల్లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కెవీ.సత్యనారాయణరెడ్డి, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, బీసీ వెల్ఫేర్ డీడీ చినబాబు, సమాచారశాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్, ఆర్డీవో రఘుబాబు పాల్గొన్నారు. -
అధికార మదం.. రౌడీ.. రాజకీయం
- ప్రజాపక్షాన నిలుస్తున్నవారిపై అక్రమ కేసులు - భయభ్రాంతులకు గురి చేసేందుకు యత్నాలు - వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యం - ఆ పార్టీ నేతలు రౌడీషీటర్లట..! - శ్రుతి మించుతున్న పాలకపక్ష అరాచకత్వం ప్రభుత్వ విధానాలవల్ల అణచివేతకు, అన్యాయానికి గురయ్యేవారిపక్షాన నిలిచి, గొంతెత్తడం.. అవసరమైతే వారి తరఫున ఉద్యమించడం ప్రతిపక్షాల బాధ్యత. ప్రజలను వంచిస్తూ సాగే పాలకుల అవినీతి బాగోతాలను ఎండగట్టడం, అక్రమాలపై నిలదీయడం వాటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడమే.. అధికార టీడీపీ నేతలకు కంటగింపవుతోంది. బడుగులకు అండగా నిలబడడాన్నే.. అధికార మదం తలకెక్కిన వేళ.. వారు పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు. ప్రజాపక్షాన అలుపెరుగని సమరం చేస్తున్నవారిపై.. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ నేతలపై రౌడీ ముద్ర వేస్తూ.. సరికొత్త అరాచకీయానికి తెర తీస్తున్నారు. అక్రమ కేసులతో వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో వింత సంస్కృతికి తెలుగుదేశం పాలకులు తెర తీస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నమోదు చేసే రౌడీ షీట్లను.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాధ్యత కలిగిన నేతలపై అన్యాయంగా తెరుస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరిపైనా డజన్లకొద్దీ అక్రమ కేసులు పెట్టారు. రెండు లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న కనీస ఆలోచన కూడా మరిచి.. ఎమ్మెల్యేలపై సహితం కేసులు పెడుతున్నారు. శాసనసభలో ప్రతిపక్షం నోరు నొక్కేస్తున్నట్టే.. జిల్లాలో కూడా అధికార పార్టీ నేతల ఆదేశాలతో ప్రతిపక్ష నేతలపై కేసులపై కేసులు పెట్టేసి ఊపిరాడకుండా చేస్తున్న వైనం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబు పునరాగమనం.. చరిత్ర పునరావృతం రాజకీయంగా చైతన్యవంతమైన రాజమహేంద్రవరానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. జిల్లా కేంద్రం కాకినాడ అయినప్పటికీ ఒకప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగానే రాజకీయం నడిచేది. 2004కు ముందు చంద్రబాబు అధికారంలో ఉండగా.. ప్రతిపక్ష నేతగా ఉన్న అప్పటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కంపూడి రామ్మోహనరావు ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లు ఆయనకు నెలలో 15 రోజులు కేసులు, కోర్టులు, బెయిళ్లకే సరిపోయేది. అయినా ఆందోళనలకు వెనుకడుగువేయని రామ్మోహనరావుపై అప్పట్లో 70 పైగా కేసులు నమోదు చేశారు. చివరకు రౌడీ షీట్ తెరచిన పాలకపక్షం.. ఒక దశలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్కు కూడా వెనుకాడలేదు. చంద్రబాబు 2014లో తిరిగి అధికారంలోకి వచ్చాక గడచిన మూడేళ్లుగా దాదాపు అదే పంథాను కొనసాగిస్తున్నారు. ప్రజల తరఫున బలమైన వాణి వినిపిస్తున్న ప్రతిచోటా వైఎస్సార్ సీపీ నేతలను అక్రమ కేసులతో అణచివేస్తున్నారు. జిల్లాలో ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా అన్నిచోట్లా ప్రతిపక్ష పార్టీ నేతలపై లెక్కకు మిక్కిలిగా అక్రమ కేసులు నమోదయ్యాయి. ఇవిగో ఉదాహరణలు - గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని తుని నియోజకవర్గ ప్రజలు చావుదెబ్బ కొట్టారు. దానినుంచి కోలుకోలేని అధికార పార్టీ అక్కడి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సహా పార్టీ నేతలపై.. గడచిన మూడేళ్లుగా అక్రమ కేసులు పెడుతూనే ఉంది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే రాజా సహా పలువురిపై అత్యాచార కేసులు పెట్టారు. దీనినిబట్టి పాలకపక్షం ఏ రీతిన వ్యవహరిస్తోందో స్పష్టమవుతోంది. - తుని మండలం టి.తిమ్మాపురానికి చెందిన పోల్నాటి ప్రసాద్పై రౌడీ షీట్ తెరిచారు. - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణపై కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ తెరిచారు. మండపేట రైతుబజార్లో షాపులను నిజమైన రైతులకు కాకుండా, బినామీ పేర్లతో అధికార పార్టీ నేతలకు అద్దెలకు కట్టబెట్టడం.. కపిలేశ్వరపురం ఇసుక ర్యాంపులో తెలుగు తమ్ముళ్ల అక్రమాలను నిలదీసి, ఇసుక లారీల అడ్డగించడం.. కోరుమిల్లిలో కూలీలకు, పావలా వడ్డీ కోసం ఉద్యమిస్తున్న మహిళలకు బాసటగా నిలవడం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రవాణా చార్జీల రూపంలో అధికార పార్టీ నేతలు అడ్డదారిలో నొక్కేయడాన్ని నిలదీయడం.. రూరల్ మండలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఉద్యమించడం వంటి చర్యలతో లీలాకృష్ణ పాలకపక్షానికి కంటగింపుగా మారారు. పలువురిని ఇబ్బందిపెడుతూ, అలజడి సృíష్టిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై రౌడీ షీట్ తెరచినట్టు అక్కడి ఎస్సై వాసా పెద్దిరాజు ‘సాక్షి’కి చెప్పారు. అంతకంటే ముందు మూడు రోజుల వ్యవధిలో ఆరేడు సెక్షన్లతో నాలుగు కేసులు పెట్టినా పాలకపక్షం కోపం చల్లారకపోవడంతో ఇప్పుడు రౌడీషీట్ కూడా తెరిచారు. - ఎక్కడైనా రాజకీయాలు వారసత్వంగా వస్తుంటాయి. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కేసులు, రౌడీషీట్లు కూడా వారసత్వంగా వస్తాయని రాజమహేంద్రవరం పోలీసులు నిరూపించారు. దివంగత జక్కంపూడి రామ్మోహనరావుకు రాజకీయ వారసుడిగా ఉన్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై పాలకపక్ష ఒత్తిడితో సుమారు 16 కేసులు పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తుంటే అడ్డుకున్న పోలీసులను ప్రశ్నించినందుకు ప్రకాష్నగర్ పోలీసు స్టేషన్లో రాజా, పార్టీ సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాజా సోదరుడు, యువజన నాయకుడు గణేష్పై రౌడీషీట్ తెరిచారు. ప్రజల తరఫున పోరాడటం, పాలకపక్ష అవినీతిని నిలదీయడమే రాజా చేసిన నేరంగా కనిపించింది. - ఏజెన్సీలో అధికార పార్టీకి అడ్డుకట్ట వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్పై కూడా రౌడీషీట్ తెరిచారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏజెన్సీలో టీడీపీ అడ్రస్ కూడా లేకుండా చేసిన మన్యంవాసులు వైఎస్సార్ సీపీని అందలమెక్కించారు. ఇదే ఇందులో క్రియాశీలక పాత్ర పోషించడమే అనంతబాబు చేసిన తప్పయింది. వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీలోకి ఫిరాయించాక అనంతబాబుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసు పెట్టిన పోలీసులు.. తరువాత ప్రజల శాంతికి భంగం కలిగిస్తున్నారంటూ 2014 జూలైలో రౌడీ షీట్ తెరిచారు. - అమలాపురంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి వాసంశెట్టి సుభాష్ సహా నాయకులు దొంగ శ్రీను, వాకపల్లి శ్రీనివాస్, కేతా భానుతేజ తదితరులపై రౌడీ షీట్లు తెరిచారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. -
తూర్పు మన్యంలో ప్రకృతి సేద్యం
జిల్లాలోనే ముందంజ సత్ఫలితాలు సాధిస్తున్న రంపచోడవరం వ్యవసాయశాఖ రంపచోడవరం : తూర్పు ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. జిల్లాలోనే ప్రకృతి సేద్యంలో అందరికంటే ముందంజలో ఇక్కడి వ్యవసాయశాఖ ఉంది. 2016–17 సంవత్సరంలో ఎటపాక డివిజ¯ŒSలో రికార్డు స్థాయిలో ఎకరాకు 45 క్వింటాళ్ల వరకు మిర్చి పండించారు. క్వింటాకు రూ. 15 వేలు రైతులు మార్కెట్ చేసుకున్నారు.దీంతో ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతంలో మిర్చి పంటలో రసాయనాల వాడకం వల్ల తెల్ల దోమ పెరిగి వైరస్ తెగుళ్లు అధికమై దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఎకరానికి 4 క్వింటాళ్లకు దిగుబడి పడిపోయింది. ఇలాంటి పరిస్థితిలోనే మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారి పురుగు మందుల నుంచి తేరుకుని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. దీనికి కారణం కొండ ఆవుల సంపద వేల సంఖ్యలో ఉండడం, గోమూత్రం, గోమయం సుమారుగా 70 రెట్లు జెర్సీ ఆవుకంటే పురుగులు, తెగుళ్లు నివారించడంలో ముందుంది. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం డివిజ¯ŒSలో జీడిమామిడిపై ప్రకృతి వ్యవసాయాన్ని ప్రస్తుతం ఆరు గ్రామాల్లో ప్రారంభించారు. గిరిజన రైతులకు గోమయం, గోమూత్రం ద్వారా జీవామృతం తయారు చేసుకోవడంపై శిక్షణ ఇచ్చారు. జీడిమామిడి కాపు గుత్తులుగా కాయడం, గింజ పెద్దదిగా ఉండడం, టీదోమ మటుమాయం కావడం, తెగుళ్లు దరిదాపునకు రాకపోవడం వంటి అంశాలు గిరిజన రైతాంగం ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి కారణమైయింది. ఇటీవల ఏజెన్సీలో పర్యటించిన ప్రభుత్వ రైతు సాధికారత సంస్థ వైస్ చైర్మన్, రాష్ట్రప్రభుత్వ వ్యవసాయశాఖ ప్రత్యేక సలహాదారు పి.విజయకుమార్ ప్రకృతి సేద్యం చేస్తున్న క్లస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ప్రకృతి సాగుకు ప్రోత్సహించేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు ఏజెన్సీలో దాదాపు 75 శాతం వ్యవసాయం వర్షాధారంపైనే ఆధారపడుతున్నదని వ్యవసాయశాఖ ఏడీఏ దల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. రంపచోడవరం డివిజ¯ŒSలో భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవీ ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయ అభివృద్థికి ఆటంకం లేకుండా రైతులకు 135 ఆయిల్ ఇంజన్లు, 195 స్ప్రింక్లర్లు పైపులను 2016 సంవత్సరంలో రైతులకు అందించి ప్రోత్సహించాం. ఇలాంటి చర్యల ఫలితంగా మొక్కజొన్న 1825 హెక్టార్లు, పత్తి 1660 హెక్టార్లు, వరి 10330 హెక్టార్లలోను, మినుము 3009, పెసర 1900 హెక్టార్లలో సేద్యం చేస్తున్నారన్నారు. పూర్తిగా వర్షాధారంతో జొన్న 1692 హెక్టార్లు, నువ్వులు 2000 హెక్టార్లు, కంది 600 హెక్టార్లు, జీడిమామిడి 40 వేల హెక్టార్లు సాగు చేయడం జరిగిందన్నారు. రికార్డుస్థాయిలో మొక్కజొన్న, మినుములు దిగుబడి వచ్చిందన్నారు. ఈ రబీలో కొత్త వంగడాలతో నువ్వుల పంటలో భారీ దిగుబడి సాధించాం. కందులు 584 హెక్టార్లకు ఉచితంగా ఇచ్చి పోడు వ్యవసాయంలోను, మిశ్రమ పంటకు ప్రోత్సహించినట్టు తెలిపారు. వీటితో పాటు ఏజెన్సీలో కనుమరుగవుతున్న చిరుధాన్యాలు కొర్రలు, జొన్న, సామా, రాగి, సజ్జలను పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారంతో అభివృద్థి చేస్తున్నామన్నారు. చిరుధాన్యాలను మూడు వేల ఎకరాల్లో సాగు చేసేందుకు కోవెల ఫౌండేషన్, శక్తి, ఏఎస్డీఎస్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో మారుమూల గ్రామాల్లో కూడా వ్యవసాయాభివృద్థిలో ప్రగతి సాధించాలని కార్యచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆ గళం..కొండంత బలం..
‘అగ్రిగోల్డ్’పై సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టిన జగన్ ప్రతిపక్ష నేత ‘సభాసమరం’తో బాధితులకు భరోసా న్యాయం జరుగుతుందన్న ఆశాభావం సాక్షి ప్రతినిధి, కాకినాడ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేందుకు అసెంబ్లీ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొనసాగించిన పోరాటం వారికి ఎంతో ఊరటనిచ్చింది. బాధితుల తరఫున మేమున్నామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై తాజాగా గురువారం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని నిగ్గదీశారు. సర్కార్ వైఖరిని జగన్మోహన్రెడ్డి ఎండగట్టిన తీరును టీవీలలో చూస్తూ త్వరలో కొంతైనా న్యాయం జరుగుతుందని జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు విశ్వసిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు 20 లక్షల మంది ఉంటే జిల్లాలో లక్ష మంది వరకు ఉన్నారని అంచనా. అగ్రిగోల్డ్లో లక్షలు పెట్టుబడులు పెట్టి రోడ్డు పాలైన బాధితులు అగ్రిగోల్డ్లో ఏజెంట్లుగా పనిచేసిన వారిపై విరుచుకుపడుతున్నారు. జిల్లాలో ఈ రకంగా ఏజెంట్లుగా పని చేస్తున్న వారి సంఖ్య 10 వేలకు పైనే ఉంది. అధిక లాభాలు వస్తాయనే గంపెడాశతో అప్పట్లో జిల్లాలో దాదాపు ప్రతి ప్రాంతంలో అనేకులు అగ్రిగోల్డ్లో జాయినయ్యారు. వారిలో చిన్న, మధ్యతగరగతి కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. అగ్రిగోల్డ్ నిర్వాకంతో బాధిత కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి రోడ్డున పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఖాతాదారులకు జమ చేయాల్సిన సొమ్ములు విడుదల కాకపోవడంతో బాధితులు ఏజెంట్లపై విరుచుకుపడుతున్నారు. రాజమహేంద్రవరంలో కంచర్ల వీరవెంకటదుర్గాప్రసాద్ అనే అగ్రిగోల్డ్ ఏజెంట్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజమహేంద్రవరానికి చెందిన దుర్గాప్రసాద్ తనకు పరిచయస్తులు, బంధువులను అగ్రిగోల్డ్లో చేర్పించి కోట్లు సేకరించి సంస్థకు అప్పగించారు. ఆ సొమ్ము చెల్లించాలంటూ బాధితుల నుంచి వచ్చిన వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి మూడు లక్షలు ఇస్తామంటోందని, రూ.10 లక్షలు ఇవ్వాలంటున్నారు. బాధితుల నుంచి ఎదురవుతున్న అవమానాలు భరించలేక ఏజెంట్లు బయటకు వెళ్లలేక నరకయాతన పడుతున్నారు. చివరకు బంధువన్నిళ్లలో శుభకార్యాలకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడ నిరసన జరిగిన తరలుతున్న జిల్లా బాధితులు పిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహాల కోసం అగ్రిగోల్డ్లో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని ఆశపడిన కుటుంబాలు ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఏ మూల ఆందోళన జరిగినప్పటికీ జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు ఎంతో ఆశతో అక్కడికి తరలి వెళుతున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కూడా జిల్లా నుంచి బాధితులు పెద్ద ఎత్తున తరలివెళ్లి తమ నిరసనను తెలియచేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై సర్కారు పెద్దల కన్ను చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్ ఆస్తులకు బహిరంగ వేలం వేయకపోగా, ఆ ఆస్తులను దొడ్డిదారిన కొట్టేసే ఎత్తుగడలు వేస్తున్నారు తప్ప తమకు న్యాయంచేయడానికి ఆయనకు చేతులు రావడం లేదని బా«ధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ వెన్నుదన్నుగా నిలవడమే కాక అసెంబ్లీలో బాధితులకు న్యాయం చేయాలని నిర్దిష్టంగా డిమాండ్ చేసిన జగన్మోహన్రెడ్డి తమకు ఎంతో కొంత మేలుచేసినట్టేనని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. కోట్ల విలువైన ఆస్తులు అగ్రిగోల్డ్కు ఉండగాకి చిత్తశుద్ధి ఉంటే గనక వెయ్యి కోట్లు అడ్వాన్సుగా ఇచ్చి లక్షలాది మంది బాధితులకు న్యాయం చేసేదేనంటున్నారు. అలా కాక అగ్రిగోల్డ్లో ప్రధానంగా మంగళగిరిలో హాయ్లాండ్ను చంద్రబాబు అండ్ కో స్వాధీనం చేసుకునే ఎత్తుగడలు వేస్తోందని ఆరోపిస్తున్నారు. రెండున్నరేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులను గాలికొదిలేసిన చంద్రబాబుపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి నిలదీసిన తీరుతో తమకు కొండంత ధైర్యం వచ్చిందని అగ్రిగోల్డ్ బాధితులు పేర్కొంటున్నారు. నిబద్ధతతో బాధితుల వాణి వినిపించిన జగన్ చంద్రబాబు సర్కార్ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోంది. అగ్రిగోల్డ్ యాజమాన్య ఆస్తులు కొట్టేసేందుకు చూపుతున్న శ్రద్ధ బాధితులకు న్యాయం చేయడంలో చూపడం లేదు. అసెంబ్లీలో చాలా నిబద్ధతతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితుల తరఫున తన వాణిని వినిపించారు. సీఎం చంద్రబాబు మంత్రి పుల్లారావు అంశాన్ని ఆసరాగా చేసుకుని అగ్రిగోల్డ్ విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వెయ్యి కోట్లు అడ్వాన్సుగా ఇచ్చి బాధితులకు న్యాయం చేయడం చంద్రబాబు సర్కార్కు పెద్ద విషయం కాదు. కానీ ఆ మేరకు చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదు. -మీసాల సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం రూ.1,100 కోట్లు ఇచ్చి ఆదుకోవాలి.. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ.1100 కోట్లు విడుదల చేసి ఆదుకోవాలి. రాష్ట్రంలో పెళ్ళిళ్ళు, తదితర అవసరాల నిమిత్తం సుమారు 19 లక్షల మంది అగ్రిగోల్డ్లో డబ్బులు దాచుకున్నారు. అయితే ఆ సంస్థ ఆ డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మళ్ళించడంతో నేడు డబ్బు దాచుకున్న వారంతా బాధితులుగా మిగిలారు. ఆర్థిక ఒత్తిడులతో ఇంత వరకూ 105 మంది చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణం. హాయ్ల్యాండ్ యథావిధిగా నడుస్తున్న ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం అనుమానాలు రేకెత్తిస్తుంది. అగ్రిగోల్డ్ వ్యవహారాల్లో మంత్రి పత్తిపాటి పుల్లారావు తదితర టీడీపీ నేతల ప్రమేయం ఉండటం వల్లనే అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. రూ.1.50 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో బాధితులకు రూ.1,100 కోట్లు విడుదల చేస్తే బాధితులు సమస్యలు తీరతాయి. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి ఆ సొమ్ము మినహాయించుకోవచ్చు. దీనిపై అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నిలదీస్తే వేరే అంశాలను లేవనెత్తి చర్చను పక్కదోవ పట్టించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ జరిపించి బాధితులకు ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. -చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట ఏజెంట్ల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి అగ్రిగోల్డ్ సంస్థలో పని చేసి ఖాతాదారుల ఒత్తిళ్ళకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఏజెంట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. ఖాతాదారుల ఒత్తిళ్ళకు మరి కొందరు ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం వెంటనే బాధితులకు నష్టపరిహారం అందించాలి. –పురెడ్ల శేషు కుమార్, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు వెంటనే ఖాతాదారులకు నష్టపరిహారం చెల్లించాలి.. అప్పులు చేసి అగ్రిగోల్డ్ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన అగ్రిగోల్డ్ ఖాతాదారులకు వెంటనే ప్రభుత్వం నగదు చెల్లించాలి. ఎన్నో అశలతో తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఖాతాదారులు అగ్రిగోల్డ్ సంస్థలో చేరారు. అయితే ప్రభుత్వం సంస్థకు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పటికీ నష్టపరిహారం అందించడంలో జాప్యం చేస్తోంది. దీని వలన ఖాతాదారులు నిరాశకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం ఖాతాదారులకు నష్టపరిహారం అందించాలి. –ఎం.వి.వి.సత్యనారాయణ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి -
అన్ని కులాల వారికీ సమన్యాయం
రాజ్యాంగబద్ధంగానే కులాల మార్పు, చేర్పులు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ బీసీల్లో కాపుల చేర్పుపై కాకినాడలో ప్రజాభిప్రాయసేకరణ కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయమై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు జస్టిస్ మంజునాథ కమిషన్ బుధవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన విచారణను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. కమిషన్కు తమ వాదనలు, ఆవేదనలు వినిపించేందుకు జిల్లా నలుమూలల నుంచీ బీసీ సామాజికవర్గాల వారు, కాపు సామాజిక వర్గాల వారు పెద్ద సంఖ్యలో కాకినాడకు తరలి వచ్చారు. తమ వాదనలను పూర్తిగా వినిపించకుండా ఆటంకం కల్పించారని బీసీ ప్రతినిధులు కమిషన్ ముందు నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. కాగా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ సీఎంకు బాకా ఊదడానికే వచ్చారని ఆ సామాజిక వర్గీయులు విరుచుకుపడ్డారు. కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆర్ఎంసీ కళాశాల పరిసరాలు, నగరంలో ముఖ్యకూడళ్లలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. బోట్క్లబ్ (కాకినాడ సిటీ) : అన్ని కులాల వారికీ సమన్యాయం చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే అంశం, వెనుకబడిన వివిధ కులాల వారి గ్రూపుల మార్పుపై ఆయన నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన బీసీ కమిషన్ బుధవారం కాకినాడ రంగరాయ వైద్యకలాశాల ఆడిటోరియంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మంజునాథ మాట్లాడుతూ అన్ని కులాల వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామన్నారు. ఇప్పటికే 12 జిల్లాల్లో నిర్వహించగా తూర్పు గోదావరి జిల్లా 13వది అన్నారు. 1994 నుంచి అనేక కులాల వారు బీసీల్లో చేర్పు కోసం , గ్రూపుల మార్పు కోసం దరఖాస్తులు పెట్టుకున్నారని చెప్పారు. కమ్మకులం తప్ప అన్ని అగ్రకులాలూ బీసీ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు. అన్ని కులాల వారి ఆర్థిక, సామాజిక తదితర స్థితిగతులు తెలుసుకొనేందుకు సమగ్ర పల్స్ సర్వే చేయాలని కమిషన్ ప్రభుత్వాన్ని కోరిందన్నారు. ఈ సర్వేలో అందరూ పాల్గొని ఉంటారని కమిషన్ భావిస్తోందన్నారు. ఈ సర్వే అన్ని జిల్లాల్లో చేపట్టి ఆరు రకాల ప్రశ్నావళిని కమిషన్ వెబ్సైట్లో పెట్టామన్నారు. మార్పులు కోరిన కులాలు, చేర్పులు కోరిన కులాలకు సంబంధించి చర్యలు తీసుకోవడానికి ప్రజాభిప్రాయం చాలా ముఖ్యమైనదిగా కమిషన్ భావిస్తోందన్నారు. ఏ కులాన్నైనా బీసీల్లో చేర్చాలంటే నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించరాదనేది నిబంధన అన్నారు. దీనికి బీసీ కమిషన్ కట్టుబడి ఉంటుందన్నారు. బీసీల్లో గ్రూపుల మార్పు లేదా బీసీల్లో చేర్పు కోరుతున్న వారు దానికి గల అన్ని అర్హతలతో పాటు పూర్తి సమాచారాన్ని కమిషన్కు ఇవ్వాలన్నారు. మాదే కులమో మాకే తెలియదు.. తోలు బొమ్మల వారు ఏ కులానికి చెందిన వారో ప్రభుత్వం చెప్పటం లేదని ఆ సామాజికవర్గానికి చెందిన బాలకృష్ణ వాపోయారు. తమని బీసీలో చేర్చాలని కోరగా రాష్ట్రంలో అన్ని తోలు బొమ్మలాట వర్గాల వారు ఒకే కులం పేరుతో ముందుకు వస్తే కమిషన్ పరిశీలిస్తుందని జస్టిస్ మంజునాథ చెప్పారు. యాదవులను బీసీ ‘డి’ నుంచి బీసీ ‘ఎ’కు మార్చాలని ఆ కులానికి చెందిన కుండల సాయికుమార్ కోరారు. కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన నాగిరెడ్డి భాస్కర్ కూలి పనులతో జీవిస్తున్న తమని బీసీ ‘డి’ నుంచి ‘ఎ’కు మార్చాలని కోరారు. శాలివాహన కులానికి చెందిన వీరభద్రరావు మాట్లాడుతూ కుమ్మర్లుగా పిలిచే తాము స్టీల్ సామగ్రి వచ్చాక కుల వృత్తికి దూరమయ్యామని తమ కులాన్ని బీసీ నుంచి ఎస్టీలోకి మార్చాలని కోరారు. భోజన విరామం అనంతరం కాపు కులాలను బీసీల్లో చేర్చాలని కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ కోరారు. కాపులు దుర్భరమైన, భద్రత లేని వృత్తులు నిర్వహించడంతో పాటు కూలి, పాచిపనులు కూడా వెళుతూ జీవనాన్ని గడుపుతున్నారని వివరించారు. ఈ స్థితి గతులను పరిగణనలోనికి తీసుకొని న్యాయం చేకూర్చాలని కోరారు. కాపు నాయకులు మాట్లాడాక తమకు ప్రతిసారి అవకాశం ఇవ్వాలని కొందరు బీసీ ప్రతినిధులు కోరగా చైర్మన్నిరాకరించారు. మొదట వారు చెప్పింది వినాలని, తర్వాత అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ దశలో బీసీ నాయకులు వాదోపవాదాల నడుమ ప్రజాభిప్రాయ సేకరణ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం జస్టిస్ మంజునాథ అర్ధాంతరంగా ప్రజాభిప్రాయసేకరణను ముగించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన నిజమైన వెనుక బడిన తరగతులు వారి హక్కులను పరిరక్షించాలని కోరుతూ కమిషన్కు వినతిపత్రం సమర్పించారు. ప్రజాభిప్రాయ సేకరణలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వేంకటేశ్వరరావు, ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరరావు, ప్రొఫెసర్ శ్రీమంతుల సత్యనారాయణ, కలెక్టర్ హెచ్ అరుణ్కుమార్, జాయింట్ కలెక్టర్ –2 రాధాకృష్ణమూర్తి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం జ్యోతి, కాపు ఉద్యమ జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, కల్వకొలను తాతాజీ, ఆకుల రామకృష్ణ, ప్రూటీ కుమార్, సంగిశెట్టి అశోక్, బీసీ నాయకులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పాటి శివకుమార్, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కుట్రలో భాగంగానే రామానుజయ హాజరు : కాపునేతలు కుట్రలో భాగంగానే కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యారని కాపు నేతలు మిండగుదిటి మోహన్, పేపకాయల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు వాపోయారు. ప్రజాభిప్రాయ సేకరణ అర్ధాంతరంగా ముగిశాక వారు విలేకరులతో మాట్లాడుతూ బీసీలు మాట్లాడుతున్నంత సేపు తాము ఏమీ మాట్లాడలేదని, తాము మాట్లాడుతుంటే బీసీలు కావాలనే రభస చేశారని, కాపు కార్పొరేషన్ చైర్మన్ పేరు తాము ఇచ్చిన జాబితాలో లేకున్నా అతనితో ఎలా మాట్లాడించారని వాపోయారు. కాగా కాపు కల్యాణమండపంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ఇది ప్రభుత్వ ప్రచార వేదికలా రామానుజయ మాట్లాడారని విమర్శించారు. ప్రజాభిప్రాయసేకరణ ప్రభుత్వ పథకాల ప్రచారం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వేర్వేరుగా విచారణ చేపట్టాలన్నారు.