
మా గోడు అరణ్య రోదనే
- పి.గన్నవరం మండలం గాజులపాలెంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు నిర్వహించారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
- రామచంద్రపురం మున్సిపాలిటీ ఆరో వార్డులోని శీలం వారి సావరం, రైలుగట్టు ప్రాంతాల్లో కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డా.యనమదల మురళీకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి శంకర్రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
- రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కొంతమూరు గ్రామం జంగాల కాలనీలో కోఆర్డినేటర్ గిరిజాల వీర్రాజు(బాబు) కార్యక్రమం నిర్వహించారు. వర్షం వస్తే కాలనీ ప్రధాన రోడ్డు బురదమయంగా మారుతోందని స్థానికులు గిరిజాల వద్ద వాపోయారు.
- కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట, కాకినాడ నగరపాలక సంస్థ ఒకటో డివిజన్లో కార్యక్రమం జరిగింది. స్థానిక నేత వాసిరెడ్డి సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు గడపగడపకూ వెళ్లి ప్రజా బ్యాలెట్ ప్రజలకందించి, చంద్రబాబు హామీలపై మార్కులు వేయాలని కోరారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగం రవి తదితరులు పాల్గొన్నారు.
- సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామంలో కార్యక్రమాన్ని కోఆర్టినేటర్ తోట సుబ్బారావు నాయుడు నిర్వహించారు. తమ ఇళ్లు కాలిపోయాయని, కొత్త ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది నెలలైనా ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బంగారు కృష్ణ, మాజీ ఎంపీపీ మేడిశెట్టి వీరభద్రరావు, కార్యకర్తలు ఉన్నారు.
- మండపేట పట్టణం ఐదో వార్డులో నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మరో కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి పట్టణంలోని పదో వార్డులో కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ ప్రతిప„ý Sనేత శాఖా ప్రసన్నకుమార్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు.