cm
-
20న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై పది రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి అతిత్వరలో తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4.30 నిమిషాలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.కొత్త సీఎంను బీజేపీ పెద్దలు ఇంకా ఎంపిక చేయలేదు. బీజేపీ శాసనసభాపక్ష భేటీ నిర్వహించలేదు. మార్చి 8న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లివచ్చారు. సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగాల్సి ఉండగా.. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట నేపథ్యంలో ఈ భేటీ వాయిదా పడింది. బుధవారం శాసనభాపక్షం సమావేశం కానున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రివర్గ కూర్పుపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. -
హీరోయిన్గా ఛాన్స్.. రూ. 6 కోట్లు మోసపోయిన మాజీ సీఎం కూతురు
సినిమా అవకాశాల పేరుతో చాలామంది మోసపోతూ ఉంటారు. పలు నిర్మాణ సంస్థల పేర్లు చెప్పుకొని అమాయకులను ట్రాప్ చేసి తమ బుట్టలో వేసుకుంటారు. ఆపై వారి టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఉడాయించేస్తారు. ఇలాంటి ఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. అయితే, సినిమా ఛాన్సుల పేరుతో తనను మోసం చేశారని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ కుమార్తె ఆరుషి నిషాంక్ ఫిర్యాదు చేశారు. ముంబైకి చెందిన మాన్సి వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లాపై డెహ్రాడూన్ నగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.ఆరుషి నిశాంక్ ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్లలో నటించారు. ఆమె ఒక క్లాసికల్ డ్యాన్సర్, నటి, నిర్మాత, మోడల్ కూడా.. సినిమాలపై మక్కువతో ఆమె ఒక నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసుకుంది. ఆయితే, ఆమెకు సినిమాల్లో హీరోయిన్గా రాణించాలనే కోరిక ఉంది. దానిని ఆసరా చేసుకున్న ఇద్దరు కేటుగాళ్లు ఒకరోజు డెహ్రాడూన్లోని ఆమె ఇంటికి వెళ్లి తమను తాము సినిమా నిర్మాతలమని పరిచయం చేసుకున్నారు. మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా కొత్త సినిమాలు తెరకెక్కిస్తున్నామని ఆమెతో తెలిపారు. షానయా కపూర్, విక్రమ్ మాస్సేతో ఒక సినిమా తీస్తున్నామని ఆమెతో చెప్పారు. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉంటుందని, నటించే వారికి స్టార్డమ్ వస్తుందని నమ్మబలికారు. అయితే, సినిమా కోసం రూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టాలని ఆమెను నమ్మించారు. ఆపై హీరోయిన్గా నటించే ఛాన్స్ కూడా దక్కుతుందని ఆమెకు ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ మీకు ఆ పాత్ర నచ్చకపోతే రూ. 5 కోట్లకు గాను ఏడాదికి 20 శాతం వడ్డితో కలిపి ఇస్తామని, రెండు నిర్మాణ సంస్థల పేరు మీద సినిమా తీస్తామని ఆమెని నమ్మించారు.ఆ కేటుగాళ్ల మాటలను నమ్మిన ఆరుషి నిశాంక్.. సంయుక్తంగా సినిమా నిర్మింద్దామని వారికి రూ. 4 కోట్లు అప్పజెప్పింది. అయితే, కొన్ని రోజుల తర్వాత, వివిధ రకాల కారణాలతో ఎంఓయూ నిబంధనలకు విరుద్ధంగా, గతేడాది అక్టోబర్ 27న మరో రూ.25 లక్షలు, అక్టోబర్ 30న రూ.75 లక్షలు, నవంబర్ 19న కోటి రూపాయలు తీసుకున్నారు. అయితే, రోజులు గడుస్తున్నాయి. సినిమా పనులు ఎంతవరకు వచ్చాయని ఆమె ప్రశ్నించింది. దీంతో కొన్ని నకిలీ ఫోటోలను ప్రచురించి పంపిణీ చేశారు. కొత్త హీరోయిన్ను తీసుకున్నామని నమ్మబలికారు. వారి మోసాన్ని పసిగట్టిన ఆరుషి.. తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆమెను చంపుతామని బెదిరించారు. ఆపై ఆమె పరువు తీస్తామని హెచ్చరించారు. ఆరుషి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సినిమా అవకాశం పేరుతో రూ. 6 కోట్లు సమర్పించుకున్న ఆరుషిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంత డబ్బు చేతిలో ఉండగా నువ్వే సొంతంగా సినిమా నిర్మించవచ్చు కదా అంటూ ఫైర్ అవుతున్నారు.ఉత్తరాఖండ్ 5వ ముఖ్యమంత్రిగా రమేష్ పోఖ్రియాల్భారతీయ జనతా పార్టీకి చెందిన రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఉత్తరాఖండ్ 5వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు. గతంలో మానవ వనరుల అభివృద్ధి శాఖతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రమేశ్ పోఖ్రియాల్ 75కు పైగా పుస్తకాలు రచించారు.సాహిత్య రంగంలో పలు అవార్డ్స్ కూడా ఆయన అందుకున్నారు. View this post on Instagram A post shared by Aarushi Nishank (@arushi.nishank) -
సినిమా వాళ్లేమైనా ప్రత్యేకమా? పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశారు... అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విమర్శలు
-
ప్రతిపక్షాలకు రాజ్యాంగంపై విశ్వాసం లేదు: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
నాగ్పూర్: ప్రతిపక్ష పార్టీలకు రాజ్యాంగంపై నమ్మకం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆదివారం మంత్రి వర్గ విస్తరణ, డిసెంబర్ 16న జరగనున్న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల కోసం ఫడ్నవీస్ నాగ్పూర్లో అడుగుపెట్టారు.ఈ సందర్భంగా విలేకరులతో ఫడ్నవీస్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రిగా నా జన్మభూమి, కర్మభూమికి (స్వస్థలం, పార్టీ కార్యాలయం) రావడం చాలా సంతోషకరమైన క్షణం. నాగ్పూర్ నా కుటుంబం, నా కుటుంబం నేడు నాకు సాదర స్వాగతం పలుకుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని మహాయుతి (కూటమి) పేదలు, గిరిజనులు, రైతులు, దళితులు, ఓబీసీలు ఇతరుల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా మహిళలు, లడ్కా, షెత్కారీ (రైతులు), లడ్కే , ధంగార్లు, మరాఠాలు, ఇతరులు ఇలా అన్ని వర్గాలు ప్రభుత్వంపై నమ్మకముంచినందువల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది. మహాయుతిని ఆశీర్వదించి, నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు 14 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలు తమకు సేవ చేసేందుకు, వారి జీవితాలను, మహారాష్ట్రను మార్చేందుకు మహాయుతిని ఎంచుకున్నారు. ప్రజల కలను నెరవేర్చేందుకు నేను, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కలిసి పనిచేస్తాం. ‘ఈ ప్రభుత్వం ప్రజల కోసం 24 గంటలూ నిబద్ధతతో పనిచేస్తుంది’అన్నారు. నిరాశతోనే ప్రేలాపనలు.. ఈవీఎంల వ్యవహారంపై ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించడం పట్ల ఫడ్నవీస్ను ప్రశి్నంచగా, ‘‘ఈ వ్యక్తులు (ప్రత్యర్థులు) నిరాశ చెందారు, వారికి ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల సంఘంపై నమ్మకం లేదు. సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్పై విశ్వాసం లేదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్పై నమ్మకం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని విశ్వసించరు. ’అని మండిపడ్డారు. నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో విజయం సాధించి మహాయుతి కూటమి విజయం సాధించడంతో డిసెంబర్ 5న ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్లలో (ఈవీఎం) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: ఏ–332 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు మళ్లీ మొదలు ‘భూమిపుత్రుడికి’ స్వాగతం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించిన తరువాత సీఎంగా నాగ్పూర్కు చేరుకున్న ఫడ్నవీస్కు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాగ్పూర్ విమానాశ్రయం నుంచి ధరంపేట్లోని ఫడ్నవీస్ నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫడ్నవీస్ తన భార్య అమృతా ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఇతరులతో కలిసి అలంకరించబడిన ఓపెన్–టాప్ వాహనంలో ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగే దారి పొడవునా ‘మట్టి కుమారుడికి స్వాగతం’ పలుకుతూ బ్యానర్లు వెలిశాయి. ఈసందర్భంగా ఫడ్నవీస్ తన మద్దతుదారులను ఉద్దేశించి ’ఏక్ హై తో సేఫ్ హై’, ’మోడీ హై తో ముమ్కిన్ హై’ నినాదాలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ -
షిండేకు భారీ షాక్? శివసేన నేత కీలక వ్యాఖ్యలు
-
సాక్షి కార్టూన్ 26-11-2024
-
Maharashtra: ఇద్దరు డిప్యూటీ సీఎంలు.. కుదిరిన ఒప్పందం?
ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అవుతున్నాయి. మహాయుతిలో సీఎం పదవికి సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేసేందుకు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ అంగీకరించింది. తాజాగా జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేసేందుకు అజిత్ పవార్తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం. అయినప్పటికీ షిండే శిబిరంలోని ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీఎం ఏక్నాథ్ షిండేనే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే లాడ్లీ బహనా యోజనను సీఎం ఏక్నాథ్ షిండే ప్రారంభించారని, ఇది మహాయుతికి లబ్ధి చేకూర్చిందని వారు చెబుతున్నారు.ఏక్నాథ్ షిండే సీఎం అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లోనూ, ఇతర మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రయోజనం చేకూరుతుందని షిండే క్యాంపు అభిప్రాయపడింది. అయితే బీజేపీకి అత్యధిక సీట్లు దక్కినందున దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.కాగా మహారాష్ట్రలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా మళ్లీ రిపీట్ కావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమనే మాట వినిపిస్తోంది. ఫడ్నవీస్ను సీఎం చేయడానికి మహాయుతిలోని అజిత్ గ్రూపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. ఫడ్నవీస్ సీఎం అయితే ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులు కావచ్చని భావిస్తున్నారు.ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వంటి కీలక పోర్ట్ఫోలియోలు ఇవ్వవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే సమయంలో అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆర్థిక శాఖ కూడా దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ తమ తమ పార్టీల నాయకులుగా ఎన్నికయ్యారు. తాజాగా బీజేపీ అగ్రనాయకత్వంతో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నేతల సమావేశం జరగనుంది.ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్యూలో విచిత్ర పరిణామం -
ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర రాజకీయాలు.. డైవర్షన్ పాలిటిక్స్పై జనం ఆగ్రహం
-
ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్
న్యూఢిల్లీ:'దానా' తుఫాను ఒడిశా తీరం దాటిన నేపధ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పరిస్థితిని సమీక్షించారు. ఇకపై రాష్ట్రం సురక్షితమని, అధికారుల టీమ్ వర్క్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.విలేకరుల సమావేశంలో సీఎం మాఝీ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ‘ఒడిశా ఇప్పుడు సురక్షితంగా ఉంది. తుఫాను తాకిడి తరువాత, పరిస్థితిని సమీక్షించాము. అధికారుల సమిష్టి కృషి కారణంగా, ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మేము ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. సహాయ కేంద్రాల్లో వారికి వసతి కల్పించాం. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. 1.75 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమైనమయ్యాయి. బుధబలంగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది’ అని పేర్కొన్నారు. The deep depression (remnant of severe cyclonic storm “DANA”) over north Odisha remained practically stationary during past 6 hours, weakened into a Depression over the same region and lay centred at 2330 hrs IST of yesterday, the 25th October near latitude 21.4°N and longitude… pic.twitter.com/Bb7LrXjHTT— India Meteorological Department (@Indiametdept) October 25, 2024'దానా' తుఫాను గంటకు ఏడు కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ ఒక పోస్ట్లో ఒకటి తెలిపింది. ఇది ఉత్తర ఒడిశా మీదుగా పశ్చిమ దిశలో పయనించి, రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావం గురించి భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమనాథ్ దత్తా మాట్లాడుతూ ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తుపాను ప్రభావం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఇది కూడా చదవండి: అందరి చూపు షిల్లాంగ్ వైపే -
4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈనెల 4న (శుక్రవారం) సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇకపై కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండనున్నారు. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది కేజ్రీవాల్కు వివిధ పనులు నిర్వహణకు ఎంతో అనువుగా ఉండనున్నదని తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయనున్నారని, ఆయన కొత్త ఇంటి కోసం వెదుకులాట జరుగుతోందని పార్టీ ఇటీవలే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉండే ఇంటికోసం వెదికారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున కేజ్రీవాల్ తన సమయాన్ని, వనరులను ఉపయోగించుకునేందుకు అనువుగా ఉండే ఇంటి కోసం వెదికారు. మాజీ సీఎం కేజ్రీవాల్కు ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్మికులు, వివిధ సామాజిక, రాజకీయ ప్రముఖులు వసతి కల్పించేందుకు ముందుకువచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. డిఫెన్స్ కాలనీ, పితంపురా, జోర్బాగ్, చాణక్యపురి, గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, హౌస్ ఖాస్తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో అరవింద్ కేజ్రీవాల్కు వసతి కల్పిస్తామంటూ అనేక ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలను కలిసే సౌలభ్యం ఉండే అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారు.కేజ్రీవాల్ జాతీయ పార్టీ అధినేత పదవిలో ఉన్నందున ఆయనకు అధికారిక నివాసం కల్పించాలని పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేజ్రీవాల్ తన భార్య, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని కౌశాంబిలో ఉన్నారు. 2013లో తొలిసారిగా ఢిల్లీ సీఎం అయ్యాక తిలక్ లేన్లోని బంగ్లాలో నివాసమున్నారు. 2015లో రెండోసారి ఢిల్లీ సీఎం అయిన తర్వాత నుంచి ఫ్లాగ్స్టాఫ్ రోడ్డులో నివాసం ఉంటున్నారు.ఇది కూడా చదవండి: HCA: అజారుద్దీన్కు ఈడీ సమన్లు -
శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ ఆరోపణల విషయంలో వాస్తవాలు నిర్ధారణ కాక ముందే కల్తీ జరిగినట్లు సీఎం చంద్రబాబు రాజకీయ ప్రకటనలు చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు
-
వాడని నెయ్యి.. తయారుకాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’ గోల
-
మహారాష్ట్ర భావి ముఖ్యమంత్రి రష్మీ ఠాక్రే?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముంబైలోని మాతోశ్రీ (ఉద్ధవ్ ఠాక్రే నివాసం)లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించి కొత్త పేరు వినిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆమె చిత్రంతో కూడి పెద్దపెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే ఏమైందోఏమో వాటిని కొద్దిసేపటికే తొలగించారు.బ్యానర్ల కలకలంమాతోశ్రీలో రష్మీ ఠాక్రేను సీఎం చేయాలనే బ్యానర్ పెట్టడంతో రాష్ట్రంలో రాజకీయ కలకలం రేగింది. గంట వ్యవధిలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన యువ కార్యకర్తలు మాతోశ్రీలోని ఆ బ్యానర్లను తొలగించారు.నేడు రష్మీ ఠాక్రే పుట్టినరోజుఇటీవలే మహారాష్ట్రలో మహిళా ముఖ్యమంత్రి అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈరోజు (సోమవారం) రష్మీ ఠాక్రే పుట్టినరోజు. దీనిని దృష్టిలో ఉంచుకుని శివసేన యువసేన మాతోశ్రీ వెలుపల రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు ప్రదర్శించింది. ఈ పోస్టర్లు పెట్టిన కొద్దిసేపటికే పార్టీ అగ్రనేతలు హడావుడిగా వాటిని తొలగించారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేను సీఎం చేయాలని పార్టీలో ఒక వర్గం భావిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలుమరికొద్ది నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మహావికాస్ అఘాడీ, మహాయుతి దళ్ నాయకులు తమ సత్తా చాటేలా ఇప్పటికే ఎన్నికల సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించడం మొదలుపెట్టారు.ఇది కూడా చదవండి: ‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్తో పొత్తుపై ఒమర్ -
హిమాచల్ సీఎం సుఖూకు అస్వస్థత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపధ్యంలో సీఎం జమ్మూ ఎన్నికల పర్యటన వాయిదా పడింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం సీఎం సుఖూ శనివారం ఉదయం ఐజీఎంసీలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయడంతో పాటు వైద్యులు అతని రక్త నమూనాలు కూడా తీసుకున్నారు. సీఎం ఆరోగ్యంపై ఐజీఎంసీ ఎంఎస్ డాక్టర్ రాహుల్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు.సీఎం సుఖూ తనకు కడుపు పైభాగంలో నొప్పి వస్తోందని తెలిపారని, ఈ నేపధ్యంలోనే అతనికి అల్ట్రాసౌండ్ చేయించామన్నారు. దీని రిపోర్టు నార్మల్ గా ఉందని, అయితే ముందుజాగ్రత్తగా రక్తపరీక్ష కూడా చేశామన్నారు. ఈ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందన్నారు. కాగా గత ఏడాది సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ కడుపునొప్పితో బాధపడుతూ వారం రోజుల పాటు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.ఇది కూడా చదవండి: తెరుచుకున్న జార్ఖండ్- బెంగాల్ సరిహద్దు -
రేపే సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపే (సెప్టెంబర్ 17) తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా రేపు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో భేటీ అయ్యేందుకు అపాయిట్మెంట్ అడిగినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నిహిత వర్గాలు తెలిపాయి.కేజ్రీవాల్ రేపు సాయంత్రం 4:30 గంటలకు సక్సేనాను కలిసే అవకాశం ఉందని, ఆ తర్వాత ఆయన రాజీనామాను సమర్పించవచ్చని సమాచారం. ఇదిలా ఉండగా, పార్టీ తదుపరి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఆప్ సీనియర్ నాయకులు ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారు.లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆప్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన తొలి ప్రసంగంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నాను . ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు సీఎం సీట్లో కూర్చోను. ప్రతి ఇంటికి, ప్రతి వీధికి వెళ్తాను.. తప్ప సీఎం కుర్చీలో కూర్చోను. ప్రజల నుంచి నాకు తీర్పు వస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి : గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు -
ఆయన తప్పకుండా సీఎం అవుతారు: ది గోట్ నటుడు కామెంట్స్
కోలీవుడ్ నటుడు ప్రేమ్గీ అమరేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ మూవీ ది గోట్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ తమిళనాడు సీఎం అవుతారని అమరేన్ జోస్యం చెప్పారు. నా ఓటు కూడా విజయ్కే వేస్తానని.. తప్పకుండా 2026లో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హామీ ఇస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా.. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రేమ్గీ స్నేహాకు సోదరుని పాత్రలో నటించినట్లు ఆయన తెలిపారు. తనకు తలైవా, సూపర్స్టార్ రజినీకాంత్ అంటే విపరీతమైన అభిమానం అని వెల్లడించారు. అజిత్, విజయ్లంటే అమితమైన ప్రేమ అని.. కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ స్టార్ మాత్రమేనన్నారు.కాగా.. 'గోట్' చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
Madhya Pradesh: ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’
ఉజ్జయిని: ‘నేను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు. నా ప్రియతమ సోదరీమణులకు ప్రధాన సేవకుడిని’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అన్నారు. వెంటనే అక్కడున్న ఆడపడుచులంతా ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’ అంటూ నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో నేడు (సోమవారం) రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ కుటుంబమంతటి శ్రేయస్సును ఇంటి ఆడపడుచులు కోరుకుంటారని, వారు సంతోషంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని అన్నారు. భారతీయ సంస్కృతిలో సోదరీమణులను ఎప్పటి నుంచో దేవతలుగా పూజిస్తున్నారని, ఇందుకు ఉదాహరణగా పలు పండుగలు నిలుస్తున్నాయని అన్నారు. రాఖీ సందర్భంగా సీఎంకు పలువురు మహిళలు రాఖీ కట్టారు. సీఎం రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. -
18వసారి జెండా ఎగురవేసిన సీఎం నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వాతంత్య్ర దినోత్సవ వేళ అరుదైన రికార్డు సాధించారు. రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్లో నితీశ్ కుమార్ 18వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఘనత సాధించిన తొలి బీహార్ సీఎంగా ఆయన ఘనత సాధించారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతం ఆయన ఆ జెండాకు వందనం చేశారు.ఈ సందర్భంగా సీంఎ నితీష్ కుమార్ మాట్లాడుతూ నేడు మనం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, కొన్ని వందల మంది త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అనంతం ఆయన బీహార్ ప్రభుత్వం సాధించిన అభిృద్ధి గురించి వివరించారు. బాలికల విద్య, పోలీసుశాఖలో మహిళల నియామకం, ఉపాధ్యాయుల నియామకంలో ప్రభుత్వం ఎంతో చొరవచూపిందన్నారు. బీపీఎస్సీ ద్వారా రెండు లక్షల 20 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు.రోగులకు ఆహారం అందించేందుకు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో దీదీకి రసోయ్ను ప్రారంభించామని సీఎం నితీశ్కుమార్ పేర్కొన్నారు. 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాట్నాలో ఎయిమ్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపారని, దీని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. పట్నాలో ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ రోడ్లు, ఓవర్ బ్రిడ్జిలతో సహా అనేక కొత్త రోడ్లను నిర్మించామని తెలిపారు. Patna, Bihar: On the occasion of the 78th Independence Day, Chief Minister Nitish Kumar hoisted the flag at his residence on 1 Anne Marg pic.twitter.com/I8CqqCULsO— IANS (@ians_india) August 15, 2024 -
సీఎం అపాయింట్మెంట్ కోసం యత్నించాం: టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దర్శక, నిర్మతా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాము సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని వెల్లడించారు. కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. అందువల్లే సీఎంను కలిసే అవకాశం దక్కలేదని తమ్మారెడ్డి తెలిపారు.గద్దర్ పేరుతో అవార్డ్స్ తీసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కోసం రెండు, మూడుసార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిస్ కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. సీఎం రేవంత్ రెడ్డికాగా.. అంతకుముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. -
బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది మృతి?
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలకనంద నదిలో ఒక టెంపో వాహనం పడిపోయింది. ఈ టెంపోలో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, వారిలో 10 మంది వరకూ మృతి చెందివుంటారని సమాచారం.రుద్రప్రయాగ్కు ఐదు కిలోమీటర్ల దూరంలో హైవేపై రతౌలీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్తులు పోలీసులు, పరిపాలనా అధికారులు, డీడీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. టెంపో నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి, హెలికాప్టర్ ద్వారా గుప్తకాశీలోని ఆస్పత్రికి తరలించారు.ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, పరిపాలనా అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై ఆయన ఒక ట్వీట్లో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తేలితే అతనిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. VIDEO | Uttarakhand: Around eight people lost their lives after a tempo, they were travelling in, fell into a gorge on Rishikesh-Badrinath national highway. More details are awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/DrcaPhTfBX— Press Trust of India (@PTI_News) June 15, 2024 -
ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో సాయంత్రం సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం, పింఛన్లు రూ.4 వేలకు పెంపు ఫైల్పై మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సస్పై ఐదో సంతకం చేశారు.కాగా, ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎంగా చంద్రబాబు.. మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. వీరి ఇద్దరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. -
నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి/గన్నవరం: ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు గన్నవరం ఐటీ పార్కు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైంది. మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్పై చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చేలా ప్రమాణ స్వీకార వేదికపైనే సంబంధిత ఫైలుపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుకు సంబంధించిన అంశంపైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. హాజరుకానున్న ప్రధాని, రాజకీయ ప్రముఖులుఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్షా, నడ్డా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులను తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు అతిథులుగా ఆహ్వానించగా చిరంజీవి కుటుంబంతో సహా ఇప్పటికే విజయవాడ వచ్చారు. ఐటీ పార్కు ప్రాంగణం సిద్ధం ప్రమాణ స్వీకారానికి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల ప్రాంగణాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ, మిగిలిన 11.5 ఎకరాల్లో నాయకులు, ప్రజల కోసం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, వెలుపల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటుకు సమీపంలోనే ఉన్న సభా వేదిక వద్దకు ప్రధాని, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునే సౌకర్యం కల్పించారు.వీఐపీల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. నాయకులు, కార్యకర్తల కోసం 36 గ్యాలరీలుగా విభజించారు. ఈ కార్యక్రమానికి వచ్చే బస్సులు, కార్లు, ఇతర వాహనాల కోసం గన్నవరం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు, పారిశుధ్యం వంటి పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం కోసం 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ సమన్వయాధికారి ప్రద్యుమ్న ఐఏఎస్లు, ఐపీఎస్లతో సమావేశం నిర్వహించారు.రద్దీగా మారిన గన్నవరం ఎయిర్పోర్టుప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది వీఐపీలు వస్తుండడంతో గన్నవరం ఎయిర్ పోర్టు రద్దీగా మారిపోయింది. ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్టుల నుంచి పలు ప్రత్యేక విమానాల్లో అతిథులు రావడంతో గన్నవరం ఎయిర్పోర్టు సందడిగా మారింది. బుధవారం ఉదయం ఇంకా రద్దీగా మారే పరిస్థితి ఉండడంతో ఎయిర్పోర్టులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని ఎయిర్పోర్టు అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని, కానీ ముందుగా ఎయిర్పోర్టుకు చేరుకోవాలని సూచిస్తున్నారు.తిరుమల వెళ్లనున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. -
ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ మాఝీ
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ అధిష్ఠానం.. మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభా పక్షం మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ఎన్నుకుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ మాఝీకి బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించింది. డిప్యూటీ సీఎంలుగా కనకవర్థన్ సింగ్ దేవ్, ప్రవతి పరిడా ఎన్నికయ్యారు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం తరఫున కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్భవన్కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
న్యూఢిల్లీ: ఒడిశా సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒడిశా బీజేపీ కీలక నేత మాజీ కేంద్ర మంత్రి నేత ధర్మేంద్ర ప్రదాన్కు మోదీ3.0 కేబినెట్లో మళ్లీ బెర్త్ దక్కింది. దీంతో సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నట్లయింది. మిగిలిన సీనియర్ నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు.సీఎం ఎవరనేది తేల్చడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు అగ్రనేతలను సోమవారం(జూన్10) పరిశీలకులుగా నియమించింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్తో పాటు భూపేందర్యాదవ్కు ఈ పని అప్పగించింది. 11న భువనేశ్వర్లో ఒడిషా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 12న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారని ఒడిషా బీజేపీ ఇంఛార్జ్ విజయ్పాల్సింగ్ తోమర్ తెలిపారు. సీఎం పదవి రేసులో బ్రజరాజ్నగర్ ఎమ్మెల్యే సురేష్ పూజారీ, బీజేపీ స్టేట్ చీఫ్ మన్మోహన్ సమాల్తో పాటు సీనియర్ నేతలు కేవీ సింగ్, మోహన్ మాజీలు ఇప్పటివరకు ముందున్నారు. కాగా, రాష్ట్రంలోని 21 ఎంపీ సీట్లలోనూ బీజేపీ 20 గెలుచుకుంది. వరుసగా 24 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బిజూజనతాదల్ను మట్టి కరిపించి బీజేపీ ఒడిశా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. -
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి సీఎం పీఠం ఎక్కనున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం సమీపంలో సభ ఏర్పాటుచేసి ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్షాను కలిసిన తర్వాత ప్రమాణస్వీకారం, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.తన ప్రమాణస్వీకారానికి మోదీ, బీజేపీ పెద్దలు, ఎన్డీఏ ముఖ్యులను చంద్రబాబు ఆహ్వానిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీచేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాబు ప్రమాణస్వీకారోత్సవం సమయంలోనే జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్యనేతలు ఒకరిద్దరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. మలివిడతలో మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబును నియమించేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.ఈ మేరకు చంద్రబాబుతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు టీడీపీ వర్గాలు లీకులిచ్చాయి. బాబు ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవడం, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏలో ఆ పార్టీ కీలకంగా మారింది. దీంతో బాబును కన్వీనర్గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫలితాలు వెల్లడైన తర్వాత చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్చేసి అభినందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు మంగళవారం జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. -
ఓటు వేశాక పంజాబ్ సీఎం భార్య ఏమన్నారంటే..
లోక్సభ ఎన్నికల చివరి దశలో పంజాబ్లోని మొత్తం 13 స్థానాలకు ఈరోజు(శనివారం) పోలింగ్ జరుగుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్తో కలిసి సంగ్రూర్లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో పంజాబ్ సీఎం భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాట్లాడుతూ సాధారణంగా మహిళల ఓటింగ్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి మహిళలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ విషయంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ, నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా మీడియాతో మాట్లాడారు. పంజాబ్ ప్రజలకు ఓటు హక్కుపై పూర్తి అవగాహన ఉందని, వారు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని భావిస్తున్నానని అన్నారు. పంజాబీలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి, ఓటు హక్కు వినియోగించుకుని బాధల్లో, సంతోషాల్లో అండగా ఉండే మంచి ప్రతినిధులను ఎన్నుకోవాలని అన్నారు. అలాంటి వారు లోక్సభ మెట్లు ఎక్కినప్పుడే మంచి చట్టాలు కూడా వస్తాయన్నారు.పంజాబ్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 70 నుంచి 80 శాతం ఓటింగ్ నమోదైందని, ఇప్పుడు కూడా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గడచిన 25 రోజుల్లో తాను 122 ర్యాలీలు నిర్వహించానని, ఏ సీటునూ తేలిగ్గా తీసుకోలేదని అన్నారు. తాను అందించిన కరెంటు, నీళ్లు, ఉద్యోగాలు లాంటి సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు అడిగానన్నారు. తన మీద ఎన్నికల కమిషన్కు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు. -
విదేశాల నుంచి ఆప్ ఎంపీ .. సీఎం కేజ్రీవాల్తో భేటీ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. ఆయన గత కొన్ని నెలలుగా బ్రిటన్లో ఉన్నారు. అక్కడ ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగింది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో రాఘవ్ చద్దా ఇక్కడ లేరు. రాఘవ్ చద్దా గైర్హాజరుపై ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల్లో రాఘవ్ చద్దా ఒకరు. ఆయన బహిరంగ వేదికలపై పార్టీకి మద్దతుగా మాట్లాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు బ్రిటన్ వెళ్లారు. ఆ దరిమిలా ఆమ్ ఆద్మీ పార్టీ పలు సమస్యలను ఎదుర్కొంది. మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనిపై పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.ఆమ్ ఆద్మీ పార్టీలో గందరగోళం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాఘవ్ చద్దా విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఇటీవల రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను తనను కొట్టారని, సీఎం సభలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.కాగా స్వాతి ఇదంతా బీజేపీ డైరెక్షన్లో చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. స్వాతి మలివాల్ సీఎం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని, వారిని బెదిరించారని ఆప్ నేత అతిషి ఆరోపించారు. -
ఓటు వేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్లో లోక్సభ నాల్గవ దశ పోలింగ్ ఈరోజు(సోమవారం) జరుగుతోంది. ఈ దశలో రాష్ట్రంలోని ఎనిమిది లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 74 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఉజ్జయిలోని ఒక పోలింగ్ బూత్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఓటు వేశారు. #WATCH | After casting his vote fro #LokSabhaElections2024 , Madhya Pradesh CM Mohan Yadav says "I am very happy that I could cast my vote. I want to appeal to the people of the state to come out and cast their votes. BJP is going to win with a huge majority and we are going to… pic.twitter.com/EqbNEgwkRu— ANI (@ANI) May 13, 2024 అనంతరం ఆయన మాట్లాడుతూ తాను తన ఓటు హక్కు వినియోగించుకున్నంటుకు చాలా సంతోషిస్తున్నానని, రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో బీజేపీ 29 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయం ఏడు గంటలకే ఓటర్లు తరలివచ్చారు. #WATCH | Indore, Madhya Pradesh: Free breakfast and ice cream are being distributed to early voters at the city's famous 56 Dukan restaurant. pic.twitter.com/KTos1zpi79— ANI (@ANI) May 13, 2024 -
ఢిల్లీలో పంజాబ్ సీఎం ఎన్నికల ప్రచారం!
దేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగున్నాయి. వివిధ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేసి, ప్రచారాలు ముమ్మరం చేశాయి. దేశరాజధాని ఢిల్లీలో జరిగే లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున ప్రచారం చేయనున్నారు.సీఎం భగవంత్ మాన్ మే 11న తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లిన తర్వాత సునీతా కేజ్రీవాల్ రాజకీయాల్లో చురుకుగా మారారు.ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను మే 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ తీహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. -
స్టార్ హీరో ఇంటికెళ్లిన సీఎం.. !
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కలిశారు. కాల్పుల ఘటనపై ఆయనను కలిసి ఆరా తీశారు. సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి భద్రతా గురించి అడిగి తెలుసుకున్నారు. ఫైరింగ్ ఘటనపై పోలీసుల తీసుకున్న చర్యలపై సల్మాన్తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈనెల 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లోని భుజ్లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. #WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde arrived at the residence of actor Salman Khan. pic.twitter.com/ncJUz4n6C9 — ANI (@ANI) April 16, 2024 #WATCH | Mumbai | Maharashtra CM Eknath Shinde met actor Salman Khan at his residence. Inside visuals from the residence. (Source: Eknath Shinde office) pic.twitter.com/lbMmfCOBNm — ANI (@ANI) April 16, 2024 -
జేఎంఎంకు సీతా సోరెన్ రాజీనామా!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. సీతా సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్కు పెద్ద కోడలు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వదిన. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. నాటి జేఎంఎం ప్రధాన కార్యదర్శి దుర్గా సోరెన్ బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి అతని వయస్సు కేవలం 39 సంవత్సరాలు. దుర్గో సోరెన్ మృతికి అతని కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని చెబుతుంటారు. సోదరుని మరణానంతరం పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. కాగా రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపించేవారు. ఒడిశాలోని మయూర్భంజ్లో జన్మించిన సీతా సోరెన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తండ్రి పేరు బోడు నారాయణ్ మాంఝీ. తల్లి పేరు మాలతీ ముర్ము. అక్టోబర్ 2021లో ఆమె కుమార్తెలు రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తమ తండ్రి పేరిట పార్టీని స్థాపించారు. దీనికి దుర్గా సోరెన్ సేన అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తెలిపారు. రాజశ్రీ బిజినెస్ మేనేజ్మెంట్, జయశ్రీ లా కోర్సు చదువుకున్నారు. -
స్టైలిష్గా ఉన్న ఈయన ఓ రాష్ట్ర సీఎం.. ఎవరో తెలుసా?
ఇక్కడ స్టైలిష్గా కనిపిస్తున్న ఈయన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా (Meghalaya CM Conrad Sangma). మౌడియాంగ్డియాంగ్లో నిర్మాణమవుతున్న మేఘాలయ శాసనసభ నూతన భవనాన్ని ఆయన తాజాగా పరిశీలించారు. స్పీకర్ థామస్ సంగ్మా, డిప్యూటీ స్పీకర్ తిమోతీ డి షిరా, ఉప ముఖ్యమంత్రి ప్రిస్టోన్ టైన్సాంగ్ నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. మేఘాలయ శాసనసభ నూతన భవన నిర్మాణం ఆ రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయి. నిర్మాణం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో శాసనసభ భవనం ప్రారంభోత్సవం కోసం మేఘాలయ పౌరులలో నిరీక్షణ పెరిగింది. ఈ మైలురాయి రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపుతుంటారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే కొందరు సీఎంలు మాత్రం ఏదో ఒక వ్యాపకంతో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఒకరు. ఐరన్ మైడెన్ పాటకు ఆయన ఎలక్ట్రిక్ గిటార్పై వాయిస్తున్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంగీతం తనకు అంతులేని ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుందని సీఎం సంగ్మా చెబుతుంటారు. తాను ఎప్పుడూ సంగీతంలోనే ఉంటానని, అవకాశం దొరికినప్పుడల్లా ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేస్తానని చెప్పారు. క్యాబినెట్ సహచరులతో ఉన్నప్పుడు, ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాల అనంతరం లైవ్ ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడుతుంటానని తెలిపారు. -
ఛూ మంతర్.. ఒక చంద్రబాబు.. వెయ్యి అబద్దాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 'హామీల అనుభవాలు' ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిచితమే. చంద్రబాబు మాట నీటి మూట. ఆంధ్రప్రదేశ్లో ఈ నానుడి బాగా ఫేమస్. చంద్రబాబు మాటలనే కాదు.. ఆయనను కూడా ప్రజలు నమ్మడం లేదు. 'జయహో బీసీ' పేరుతో టీడీపీ - జనసేన సంయుక్తంగా సభ నిర్వహించాయి. 2014లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు 600లకు పైగా హామీలిచ్చారు. ఒక్క హామీనైనా 100 శాతం అమలు చేశారా..? అమలు చేస్తే చంద్రబాబు మేనిఫెస్టో దాచి పెట్టే పరిస్థితి, టీడీపీ అధికార వెబ్ సైట్ నుంచి తొలగించి పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పగలరా..? . "చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాది పూచి" అన్న పవన్ కల్యాణ్ ఏనాడైనా చంద్రబాబును ప్రశ్నించారా...? ఈ రోజున ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్నవే. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్లు సమాధానం చెప్పి బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తే బాగుండేది. "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు.. వారి తెలివి ఉండదని" కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు బడుగులకు న్యాయం చేస్తానని సభ నిర్వహిస్తే ప్రజలు నమ్ముతారా...? తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు వస్తే "మీ తోకలు కత్తిరిస్తా" అని వేలు చూపిస్తూ బెదిరించింది చంద్రబాబు కాదా..? "సార్ మేం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి" అని మత్స్యకారులంటే "ఏయ్.. నోరు మూసుకో తోలు తీస్తా" అని బెదిరించింది చంద్రబాబు కాదా...?. బీసీల పిల్లలు పెద్ద చదువులు చదవడానికి తోడ్పాటు ఇవ్వకుండా ఇస్త్రీ పెట్టెలు, మోకులు, కత్తెరులు ఇచ్చింది చంద్రబాబు కాదా..? ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకునే, తన అనుకూల మీడియాలో చెప్పించుకునే చంద్రబాబు ఇస్త్రీ పెట్టెలు, కత్తిరెలు ఇవ్వడం ఏంటనీ సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదివి, విమానాల్లో వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని బీసీ మేధావులు గుర్తు చేస్తున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో పరిస్థితి చూస్తే.. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడిని ఏనాడైనా నారా లోకేష్ గౌరవించాడా...?. టీడీపీ కీలక నిర్ణయాల్లో అచ్చెన్నాయుడి భాగస్వామ్యం ఉందా...? టీడీపీ వ్యూహాత్మక భేటీల్లో బీసీ నేత అయిన అచ్చెన్నాయుడి ఆలోచనలు పరిగణనలోకి తీసుకుంటున్నారా..? గుండె మీద చేయి వేసుకుని ఆత్మ సాక్షిగా అచ్చెన్నాయుడే ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలరా..? బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందని బాబు అంటున్నారు. బీసీల డీఎన్ఏలో టీడీపీ ఉంటే 23 సీట్లు ఇచ్చి మూలన ఎందుకు కూర్చోబెడతారు..? కుప్పం నియోజకవర్గంలో 30 వేలకే మీ మెజార్టీ ఎందుకు తగ్గిపోయింది..? బీసీల సీటు మంగళగిరిలో నారా లోకేష్ ఘోరంగా ఎందుకు ఓడిపోయారు..? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా..? అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4 వేలు చేస్తానని బాబు చెబుతున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో 40 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేవారు. బాబు హయాంలో నెలవారీ పింఛన్ బడ్జెట్ కేవలం రూ.400 కోట్లు. వైఎస్ జగన్ పాలనలో 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఈ జనవరి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్ రూ.3 వేలకు పెంచారు. సీఎం జగన్ పాలనలో నెలవారీ పింఛన్ బడ్జెట్ రూ.2 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే.. చంద్రబాబు రూ.4 వేల పింఛన్ కాదు రూ.5 వేలు ఇస్తానన్నా ఆయనను నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు హయాంలో పింఛన్ తీసుకోవాలంటే నడుచుకుంటూ వెళ్లాలి.. గంటలు కొద్దీ వెయిట్ చేయాలి..లైన్లో నుంచోలేక పండుటాకులు ప్రాణాలు వదిలిన సందర్భాలు అనేకం. కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫస్ట్ తేదీ వచ్చిందంటే చాలు వలంటీర్ వచ్చి చేతిలో పింఛన్ డబ్బులు పెట్టి వెళ్తున్నారు. ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారు. కళ్లతో చూస్తున్నారు. విచిత్రం ఏమంటే.. కర్ణాటక, తెలంగాణ మేనిఫెస్టోలు కాపీ కొట్టడమే కాదు.. చివరికు వైఎస్ఆర్ సీపీ నినాదాలు కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నారు. "బీసీలు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాసెస్" అని మొదట నినదించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చివరకు ఈ నినాదాన్ని కూడా బాబు బ్యాచ్ కాపీ కొట్టడంపై జనాలు నవ్వుకుంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీ ఏలూరులో బీసీ గర్జన సభ నిర్వహించింది. ఈ సభలో ఇచ్చిన హామీల కంటే 58 నెలల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగానే చేశారు. డీబీటీ - నాన్ డీబీటీ కింద వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రూ.1.71 లక్షల కోట్లు బీసీలకు లబ్ధి చేకూర్చింది. సంక్షేమ పథకాల్లో సింహభాగం బీసీ లబ్ధిదారులే. 2014లో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున ఏడాదికి రూ.50 వేల కోట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఐదేళ్లలో వాస్తవానికి ఆయన ఇచ్చింది కేవలం రూ.19 వేల కోట్లు. 2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోటయ్య కమిటీ వేసి కోతలు, వాతలు పెట్టారు. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు రూ.15 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేసి అన్నదాతలకు ఇచ్చిన మాట తప్పారు. అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు.. ఈ రుణాలు కూడా మాఫీ చేయకపోవడంతో ఆ రుణాలు వడ్డీలతో కలుపుకుని రూ.25 వేల కోట్లు అయ్యాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ ఆసరా పేరుతో చంద్రబాబు ఎగ్గొట్టిన డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నారు. డ్వాక్రా రుణాల చెల్లింపు సాధ్యం కాదని ఆనాటి మంత్రి పరిటాల సునీత ద్వారా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారు. అంటే.. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాటను అసెంబ్లీ సాక్షిగా తప్పారు చంద్రబాబు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా బీసీలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు విశ్వసనీయతలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ తేడానే 2024 ఎన్నికల్లో నిజమైన ఫలితాన్ని ప్రజల ముందుంచనుంది. - YV రెడ్డి -
Vizag : విశాఖ స్వప్నం సాకారం దిశగా జగన్ పాలన
ఇవాళ వైజాగ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం విన్న ఎవరికైనా మనసులో ఒకటి కచ్చితంగా అనిపించి ఉంటుంది. ఏంటీ.. సీఎం జగన్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు.? ఇంత బలంగా మాట్లాడుతున్నారని మనసులో తప్పకుండా అనుకుని ఉంటారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సీఎం జగన్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. విశ్వాసం పెరిగిపోతుంది. దీనికి తన పాలనపై తనకు నమ్మకం ఉండటం వలన కావొచ్చు. ఒక పక్క టీడీపీ - జనసేన పొత్తులతో కుస్తీ పడుతుంటే.. వైఎస్ఆర్ సీపీ మాత్రం తన ప్రశాంతంగా చేసుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ తాడే పల్లి ప్యాలస్.. తాడేపల్లి ప్యాలస్ అని కామెంట్ చేసినవారు.. ఇప్పుడు ఆ ప్యాలెస్లో ప్రశాంతంగా కూర్చొని ..సీఎం జగన్ ఆడే రాజకీయ చదరంగం చూసి వణికిపోవడమే కాదు బెంబేలెత్తుతున్నారు. "వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానన్నారు." ఈ పదాలు పలుకుతున్నప్పుడు సీఎం జగన్ ముఖంలో ఆత్మవిశ్వాసం చూశారా.. యస్ నేను సాధిస్తాననే నమ్మకంలో ఆయన ముఖంలో అణువణువునా కనిపించింది. ఈ రోజు విశాఖలో జగన్ ఇచ్చిన స్పీచ్ ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి భరోసానిచ్చింది. ఉత్తరాంధ్ర విజన్నే కాదు విశాఖ భవిష్యత్తును రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోట్ల మంది కళ్లకు కనబడేలా ప్రసంగించారు. భవిష్యత్తులో విశాఖ నగరం హైదరాబాద్, చెన్నైల కంటే ఎక్కువుగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు సీఎం జగన్. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించామని చెప్పారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని.. భవిష్యత్తులో రూ.10 నుంచి 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని సీఎం జగన్ చెప్పారు. విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకు 6 లైన్ల రహదారి విశాఖకు మణిమకుటం కానుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 70 శాతం వృద్ధి సాధించామని సీఎం జగన్ చెప్పారు. 58 నెలల వైఎస్ జగన్ పాలనలో ఆయన తీసుకొచ్చిన వ్యవసాయ రంగంలోని సంస్కరణలు ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాయి. RBKలు విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటున్నాయి. భవిష్యత్తులో ఆర్బీకేలు లావాదేవీ కేంద్రాలుగానే కాకుండా ప్రయోగ కేంద్రాలుగా కూడా మారబోతున్నాయి. ఉత్పత్తి రంగంలో ఏపీ మెరుగ్గా దూసుకెళ్తుందని చెప్పారు సీఎం జగన్. మూలపేట, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం రేవులతో ఆంధ్రా తీరం రూపురేఖలు మారిపోతోంది. ఏపీలో తలసరి ఆదాయం తెలంగాణ కంటే ఎక్కువుగా పెరిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తమ ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొచ్చిన పరిశ్రమలు వలన రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం తగ్గిందన్నారు సీఎం జగన్. డీబీటీ ద్వారా నేరుగా కోట్ల మందికి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. నిజంగా ఇది దేశంలోనే అత్యద్భుతమైన ప్రయోగమని ఆర్ధిక నిపుణులు, సామాజిక వేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా నిరుద్యోగిత రేటు తగ్గడం కాకుండా యువత క్రైం వైపు, టెర్రరిజం, మావోయిజం వైపు మొగ్గు చూపకుండా తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఉద్యోగాలు చేసుకుంటారు. ఈ వాతావరణం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. మెగా, భారీ పరిశ్రమల వలన కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వల్ల 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ విశాఖ వేదికగా చెప్పారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలకు, వ్యాపార వేత్తలకు కనీస విలువ ఉండేది కాదు. చంద్రబాబు హయాంలో అవినీతి గురించి కొందరు విదేశీ వ్యాపారులు కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారంటేనే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇక.. భవిత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జాబ్ ఓరియంటెడ్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నామన్నారు. స్కూల్లో 3వ తరగతి నుంచే సబ్జక్ట్ టీచర్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు. 158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్ధులకు శిక్షణ ఇచ్చాయన్నారు. విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మాటలు భవిష్యత్ తరానికి ఆశాకిరణంగా కనిపించాయి. పిల్లలను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గ వనరులను కల్పిస్తున్నారు. మంచి ఇంగ్లిష్ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చనేది సీఎం జగన్ అనుకుంటున్నారు. ఇది నిజం. చేతిలో విద్య అనే ఆయుధముంటే విశ్వాన్నిగెలవచ్చు. సీఎం జగన్ నాణ్యమైన విద్య గురించి, నాణ్యమైన మానవ వనరుల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో ముందు చూపు ఉన్న నాయకుడు మాత్రమే ఇలా మాట్లాడగలరు. సీఎం జగన్ ప్రసంగంలోని కాన్పెన్స్కు ప్రధాన కారణం.. నిజాయితీ, అవినీతిలేని పాలన. తాను చేయాలి అనుకున్నది చేసుకుంటూ పోవడం. ప్రజలకు మంచి చేస్తున్నానే సంతృప్తి. పారదర్శక పాలన. ఇవన్నీ ఆయనలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. - YV రెడ్డి -
40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం
ఏపీలో చిట్టచివరి నియోజకవర్గం, ఒక మూలకు విసిరేసినట్లు ఉండే కుప్పానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను చెప్పినట్లే తాగునీరు, సాగునీరు విడుదల చేశారు. ఇందుకు అవసరమైన కాల్వలను తవ్వించి, ఇతర ఏర్పాట్లు చేసి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా నీటిని కుప్పం వరకు తీసుకువెళ్లగలిగారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, ముప్పైఐదేళ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. తద్వారా ఈ ప్రజల దాహార్తిని తీర్చే యత్నం చేశారు. అలాగే ఆరువేల ఎకరాలకు సాగు నీరు కూడా ఇవ్వడానికి సంకల్పించారు. ఇందుకోసం సుమారు అరు వందల కోట్ల రూపాయలను వ్యయం చేశారు. కుప్పంలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ "ఇంతకాలం చంద్రబాబును ఈ నియోజకవర్గ ప్రజలు భరించినందుకు జోహార్లు" అని వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఈ సభలో చంద్రబాబు టైమ్లో కుప్పంకు జరిగిన పనులు, తన హయాంలో జరిగిన కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గ ప్రజలకు వివిధ స్కీముల ద్వారా 1400 కోట్ల మేర లబ్ది జరిగిన విషయాలను లెక్కలతో సహా వివరించారు. తాను ప్రాంతం, కులం, మతం, పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా స్కీములు అమలు చేశానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తనపై కోపం వచ్చినప్పుడల్లా, పులివెందుల , కడప, రాయలసీమ ప్రజలను దూషిస్తుంటారని, తాను మాత్రం ఎప్పుడు అలా చేయలేదని ప్రజల మనసులను ఆకట్టుకునే యత్నం చేశారు.ఇంతవరకు ఒప్పుకోవలసిందే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని వద్ద కాపు ఉద్యమకారులు రైలును దగ్దం చేస్తే, ఆ పని చేసింది కడప రౌడీలంటూ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. కాని పోలీసులు అన్నిటిని విచారించి ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారిని అరెస్టు చేశారు. అలాగే ఆయన తనకు ఓటు వేయని వారికి తాను ఎందుకు సదుపాయాలు కల్పించాలని అనేవారు. తనకు ఓటు వేయకపోతే తాను వేసిన రోడ్డు, తాను మంజూరు చేసిన మరుగు దొడ్డి ఎలా వాడతారని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించేవారు. కానీ జగన్ అందుకు విరుద్దంగా తనకు ఓటు వేసినా, వేయకపోయినా, తన ప్రభుత్వ స్కీములు ప్రాంతం, కులం, పార్టీ,మతం వంటివాటితో సంబంధం లేకుండా అమలు చేస్తున్నారు. కుప్పం ప్రజలు సైతం అందులో భాగమేనని, అందుకే మాట ఇచ్చిన ప్రకారం నీరు అందించానని, వివిధ అబివృద్ది పనులు చేపట్టానని సీఎం జగన్ చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుప్పంలోని గ్రామీణ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా భారీ ఎత్తున జనం రావడం, వారు ఆయా సమయాలలో అనుకూల నినాదాలతో హోరెత్తించడం కనిపించింది. దీంతో టిడిపి అధినేత కుప్పంలో తన పోటీపై గట్టిగా ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. కుప్పం ప్రజలు చంద్రబాబును ఇంతకాలం భరించినందుకు వారికి జోహార్లు అని జగన్ చమత్కరించారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా కుప్పం ప్రాముఖ్యత తగ్గదని ప్రజలకు ఆయన సంకేతం ఇచ్చారు. గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలలో YSRCP విజయఢంకా మోగించడం, కుప్పానికి నీరు, బలహీనవర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు, కుప్పం మున్సిపాలిటీగా మారడం, రెవెన్యూ డివిజన్ ఇవ్వడం వంటివి పార్టీకి ప్లస్ అవుతాయి. జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న పట్టుదలతో పనులు చేశారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికైతే చంద్రబాబు గతంలో మాదిరి నల్లేరు మీద బండి మాదిరి ఎన్నిక చేసుకోలేకపోవచ్చని, తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన టైమ్ లో కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేయలేకపోవడం పెద్ద వైఫల్యంగా చెప్పాలి. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రతిపాదన ఎన్.టి.ఆర్.టైమ్ లో వచ్చినా,దానిని ఆచరణ లో పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చివరిలో ఉన్న కుప్పంకు సైతం నీరు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కుప్పం ప్రాంతానికి శాశ్వతంగా నీటి సమస్య తీర్చడానికి వీలుగా రెండు రిజర్వాయర్లను నిర్మించడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రకంగా కుప్పం ప్రజల అభిమానం పొందడానికి జగన్ యత్నించారు. కాగా చంద్రబాబు మాత్రం పులివెందుల ప్రజలను తరచుగా అవమానించేవారు. కుప్పంకు నీరు ఇవ్వడంపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా సరిగా లేదు. నిజానికి ఆయన హర్షం వ్యక్తం చేసి ఉంటే హుందాగా ఉండేది. ఆ పని చేయకపోగా, కుప్పం ప్రజలను దోచుకున్నారంటూ, ఏదో హింస జరిగిందంటూ పిచ్చి ఆరోపణలను చంద్రబాబు చేసి తన విలువను మరింత తగ్గించుకున్నారు. పులివెందులలో పొలాలు ఎండిపోతున్నాయని అంటూ ఏవేవో మాట్లాడారు. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులకు అదికంగా ఖర్చు చేసింది తానేనని ఆయన ప్రకటించుకున్నారు. పదమూడు శాతం పనులు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మిగిలాయని, కాని జగన్ మొత్తం తానే చేసేసినట్లు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతే తప్ప తాను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం కు ఎందుకు నీళ్లు తేలకపోయింది మాత్రం చెప్పలేకపోయారు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కాకపోతే బుకాయింపులో దిట్ట కనుక యధాప్రకారం డబాయిస్తూ ప్రకటన చేశారు. దానిని ఈనాడు,ఆంధ్రజ్యోతి బాకా మీడియాలు ప్రచారం చేశాయి. ఈనాడు అయితే కుప్పంను తానే ఉద్దరించినట్లు జగన్ మాట్లాడడం విని స్థానికులు విస్మయం చెందుతున్నారని ఒక దిక్కుమాలిన కధనాన్ని ఇచ్చింది. కుప్పంకు 35 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పటికీ పట్టణాన్ని ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు? ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు? ఎందుకు 15వేలమందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయారు? అసలు కుప్పంలో కొన్ని వార్డులకు వెళ్లడానికి సరైన రోడ్లే ఎందుకు లేవు? రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కుప్పం కన్నా పులివెందుల ఎంత చక్కగా ఉంటుందో స్వయంగా ఎవరైనా వెళ్లి చూడవచ్చు. పులివెందుల చుట్టూ రోడ్డు, పరిశ్రమలు, పలు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీ మొదలైనవి ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి కాదా? కుప్పంకు ఎయిర్ పోర్టు ఇస్తానని పిచ్చి ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమనైనా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? వీటన్నిటిని కప్పిపుచ్చుతూ, జగన్ కుప్పం కు నీళ్లు ఇవ్వడాన్ని చూసి ఓర్వలేక ఈనాడు ఇలాంటి దద్దమ్మ వార్తలు ఇస్తోంది. చంద్రబాబు ఇంతకాలం దొంగ ఓట్లపై ఆధారపడి ఎక్కువ మెజార్టీ పొందగలిగారన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఆ దొంగ ఓట్లను చాలావరకు తొలగించినట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. అందుకే చంద్రబాబు ఎక్కువగా కంగారు పడుతున్నారు. దానికి తోడు జగన్ కుప్పంపై దృష్టి పెట్టి అభివృద్ది పనులు, సంక్షేమ స్కీములు అమలు చేశారు. కుప్పంకు నీరు కూడా వచ్చేలా చేశారు. ఇది YSRCPకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టిడిపి మీడియాలు నీరు విడుదల చేసిన మరుసటి రోజు కాల్వలో నీరు లేదంటూ ఒక తప్పుడు కదనాన్ని వండి జనాన్ని ఏమార్చడానికి యత్నించారు. ఇంకా నీళ్లురాని కాల్వలో దిగి టిడిపి నేతలు యాగీ చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడుతున్నదీ తెలుసుకోవచ్చు. గెలుపు ఓటములు సంగతి ఎలా ఉన్నా, జగన్ మాత్రం కచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్ధి అని కూడా చూడకుండా, తన పార్టీకి ఓటు వేశారా? లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా కుప్పం ప్రజలకు కూడా మేలు చేశారన్నది నిజం. అందుకు ఎవరైనా అభినందించాల్సిందే. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం!
మధ్యప్రదేశ్లోని దిండోరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు. 21 మంది గాయపడినట్లు సమాచారం. షాపురా పోలీస్ స్టేషన్- బిచియా పోలీస్ పోస్ట్ ఏరియా పరిధిలోని బద్జార్ ఘాట్లో ఒక పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడినవారంతా షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. బాధితులంతా డియోరి గ్రామానికి చెందిన వారని చెబుతున్నారు. ఈ ఘటనపై ఎంపీ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని సీఎం కోరుతున్నారు. కాగా మృతుల్లో 9 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన 21 మందిలో తొమ్మిది మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు బాధితులను జబల్పూర్కు ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరు మార్గంమధ్యలోనే మృతి చెందారు. मुख्यमंत्री डॉ. मोहन यादव ने डिंडोरी जिले में हुई वाहन दुर्घटना में कई अनमोल जिंदगियों के असामयिक निधन पर गहन शोक व्यक्त किया है। उन्होंने ईश्वर से दिवंगत आत्माओं की शांति व परिजनों को यह वज्रपात सहन करने की शक्ति देने की प्रार्थना की है। मुख्यमंत्री जी ने कहा कि घटना में… — Chief Minister, MP (@CMMadhyaPradesh) February 29, 2024 -
హిమాచల్ సీఎం రేసులో ప్రతిభా సింగ్? ఆమె నేపథ్యం ఏమిటి?
హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ గందరగోళం నెలకొంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో సీఎంను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖును తొలగించి, సీనియర్ నేత ప్రతిభా సింగ్ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత ప్రతిభా సింగ్ దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య. వీరభద్ర సింగ్ ఆరుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిభా సింగ్ 1998 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. హిమాచల్లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే నాడు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2004 లోక్సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2012లో ఆమె భర్త వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన లోక్సభకు రాజీనామా చేశారు. దీంతో 2013లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో నిలిచి, బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ను ఓడించారు. 2014లో లోక్సభ ఎన్నికల్లో మోదీ వేవ్లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ 39 వేలకు పైగా ఓట్ల తేడాతో ప్రతిభా సింగ్పై విజయం సాధించారు. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతిభా సింగ్ ఓటమితో నేతలంతా కంగుతిన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత 2021లో ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో విజయం సాధించారు. 2022, ఏప్రిల్ 26న, హైకమాండ్ ప్రతిభా సింగ్ను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ 32వ అధ్యక్షురాలిగా నియమించింది. ప్రతిభా సింగ్ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో 1956 జూన్ 16న జన్మించారు. ప్రతిభా సింగ్ వీరభద్ర సింగ్ను 1985లో వివాహం చేసుకున్నారు. ప్రతిభ అతనికి రెండవ భార్య. వీరభద్ర సింగ్ మొదటి భార్య కుమార్తె అభిలాషా కుమారి గుజరాత్లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్ల కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా రూరల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పనిచేశారు. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఎనిమిదిమంది మృతి!
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలు లభ్యమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఘటన జిల్లాలోని కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ పట్టణంలో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాక్టరీలో చిక్కుకున్న 10 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో ఇంకా ఎనిమిది మంది చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న యూపీ సీఎం యోగి అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. -
భ్రమరావతిని వీడి.. కళ్లు తెరిచి నిజాలు చూడండి
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదనేవారికి, సంపద సృష్టించడం లేదనేవారికి, పరిశ్రమలపై అబద్దాలు రాసే వారికి ఇది పెద్ద సమాధానమే అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక కధనం ప్రకారం గత మూడేళ్లలో ఆదాయపన్ను రిటర్న్ లు ఫైల్ చేస్తున్న వారిలో పెరుగుదల వివరాలు చూస్తే ఏపీ దేశంలోనే మొదటిస్థానం సాధించింది. ఈ మూడేళ్లలో ఏపీలో 18 లక్షల మంది అదనంగా ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేశారు. ఇదేదో ఊహాగానం కాదు. కల్పిత విషయం అంతకన్నా కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ITRలపై ఇచ్చిన తాజా నివేదిక వెల్లడించిన సంగతి. ఆదాయపన్ను వసూళ్లలో అగ్రస్థానంలో ఉండే మహారాష్ట్రలో గడిచిన మూడేళ్లలో 13.9 లక్షల మంది కొత్త అస్సెసీలు పెరిగితే, ఉత్తరప్రదేశ్ లో 12.7 లక్షలు, గుజరాత్ లో 8.8 లక్షల మంది కొత్త అస్సెసీలు వచ్చారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో విచిత్రంగా ఆదాయపన్ను మదింపుదార్లు పెరగకపోగా తగ్గిందని SBI నివేదిక చెబుతోంది. మొత్తం అన్ని రాష్ట్రాల ర్యాంకింగ్ లలో తెలంగాణ 20వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళలలో సగటున 3.4 లక్షల మందే కొత్త ఆదాయపన్ను అసెసీలు వచ్చారని ఈ నివేదిక పేర్కొంది. దీనికి కారణాలు కూడా ఈ నివేదిక విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్ లో మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలు, సంస్థలు బాగా పెరగడం వల్లే అని అందులో స్పష్టం చేశారు. ఏపీలో మొత్తం మీద పదిన్నర లక్షల MSME రిజిస్ట్రేషన్ లు జరిగాయని నివేదికలో తెలిపారు. ఏతావాతా చూస్తే AP ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు కూడా ఇందుకు బాగా దోహదపడ్డాయని అర్ధం అవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో పెండింగ్ లో ఉన్న సబ్సిడీ బకాయిలను సుమారు వెయ్యి కోట్లకు పైగా విడుదల చేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన రాయితీలను చాలావరకు ప్రభుత్వం ఇస్తూ వస్తోంది. దాంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో ఉపాది పొందేవారికి రక్షణ కల్పించినట్లయింది. ఒక భారీ పరిశ్రమ పెట్టడానికి వేల కోట్లు అవసరం అవుతాయి. పరిశ్రమను నెలకొల్పడానికి సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూనే చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తే లక్షల మదికి ఉపాధి కలుగుతుందన్నది ఆర్దిక రంగ నిపుణులు చెబుతారు. దానికి అనుగుణంగా YSRCP ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావించవచ్చు. ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలు చేసే స్థాయికి పద్దెనిమిది లక్షల మంది వెళ్లారంటే వారి ఆర్దిక స్తోమత పెరిగిందన్నమాట. దీనిని ఒక రకంగా సంపద సృష్టించడం అన్నమాట. అందులోను కొత్త పరిశ్రమలు నెలకొల్పి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే స్థితికి వచ్చారని అర్ధం చేసుకోవచ్చు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నిత్యం ఏపీలో అసలు ఏమీ జరగడం లేదని విషం చిమ్ముతుంటుంది. వారు ఇలాంటి వార్తలను, అసలు నిజాలను కప్పిపుచ్చుతుంటారు. చంద్రబాబు ప్రభుత్వ టైమ్లో సంపద అంటే రియల్ ఎస్టేట్ సంపదే అనే అభిప్రాయం కల్పించారు. అందులో ధనవంతులు మరింత ధనికులు అవడమే ఆ విదానం. కేవలం దళారులు బాగుపడడం అందులో జరుగుతుంది. కాని చిన్న పరిశ్రమలు ఎక్కువగా రావడం వల్ల పేద, మద్య తరగతివారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే GSDPలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి నాలుగు స్థానాలలో ఉంటోంది. దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే అన్న విశ్లేషణ వస్తుంది. RBI మాజీ గవర్నర్ రఘురామరాజన్ దీనిని సమర్ధిస్తుంటారు. ఇందులో ఆయా స్కీముల కింద ప్రజల చేతులలోకి నేరుగా డబ్బు వెళ్లేటట్లు చేయడం, దీనివల్ల అవినీతి పూర్తిగా లేకుండా పోయి లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలో సొమ్ము జమ అవుతుంది. ఈ డబ్బు పొందినవారంతా పేదలు, మధ్య తరగతి వారే కనుక దానిని పొదుపు చేసుకునే పరిస్థితి ఉండదు. వెంటనే వారు తమ అవసరాల కోసం మార్కెట్ లో వెచ్చిస్తారు. తద్వారా ఆయా ఉత్పత్తులకు గిరాకి పెరుగుతుంది. వ్యాపారాలు అధికం అవుతాయి. తద్వారా పన్నులు కూడా ప్రభుత్వానికి జమ అవుతుంటాయి. ఇదంతా ఒక ప్రక్రియ. పైకి చూస్తే డబ్బు పంపిణీనే అనుకుంటారు. కాని ఇందులో లోతుగా పరిశీలిస్తే ఈ విషయాలు అర్ధం అవుతాయి. జగన్ చేపట్టిన మరో స్కీమ్ చేయూత కింద నలభై ఐదేళ్లు పైబడిన ప్రతి మహిళకు ఏడాదికి 18,750 రూపాయలు చొప్పున ఆర్దిక సాయం చేశారు. ఈ డబ్బును తీసుకున్నవారు వ్యాపారులు, కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి వీలుగా బ్యాంకులతో టై అప్ చేశారు. వారి ఉత్పత్తుల విక్రయానికి గాను రిలయన్స్, ఐటిసి తదితర మల్టి నేషనల్ సంస్థలతో టై అప్ చేశారు. తద్వారా సుమారు నాలుగు లక్షల మంది యూనిట్లు నెలకొల్పుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది కూడా ఆర్ధిక అభివృద్దికి దోహదం చేసేదే. మరో అంశం చూద్దాం. జగన్ ప్రభుత్వం ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు సమకూర్చింది. అక్కడ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టింది. సగటున గ్రామం, పట్టణం,నగరాలను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో లబ్దిదారుడికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆస్తి సమకూరింది. దీనిని లెక్క వేస్తే ఎన్ని వేల కోట్ల సంపద సృష్టించింది తెలుసుకోవచ్చు. చంద్రబాబు టైమ్ లో ఇలాంటివి ఒక్కటైనా చేసి తాను సంపద సృష్టించానని చెప్పగలరా? లేదా ఆయన తరపున ప్రచారం చేసే రామోజీరావు ,రాధాకృష్ణ వంటివారు టీడీపీ తెచ్చిన సంపద ఏమిటో వివరించగలుగుతారా? ఇవే కాదు. స్కూళ్లు బాగు చేయడం, అక్కడ డిజిటల్ క్లాస్ లు పెట్టడం తదితర చర్యల వల్ల ఎన్ని లక్షల టీవీలు,ఇతర పరికరాలు కొనుగోలు చేశారో అంచనా వేసుకోండి. అలాగే వేలాది స్కూళ్లను బాగు చేయడం ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించారు. గ్రామ,వార్డు సచివాలయాలను వేల సంఖ్యలో నిర్మించారు. రైతు భరోసా కేంద్రాలను, విలేజ్ క్లినిక్స్ ను కొత్త భవనాలు ఏర్పాటు చేసి నెలకొల్పారు. మరి అదంతా సంపద కింద రాదా? కేవలం అమరావతిలో ఒక ఏభై అంతస్థుల భవనం కడతామని, అది కట్టలేకపోయిన చంద్రబాబు ఏమో సంపద సృష్టించినట్లు ప్రచారం చేస్తుంటారు. ప్రాక్టికల్గా గ్రామాలలో, నగరాలలో ప్రత్యక్షంగా కనిపించేలా సంపదను ప్రజలకు అందిస్తేనేమో జగన్ పై దుర్మార్గపు విష ప్రచారం చేస్తుంటారు. అదంతా విధ్వంసం అని అబద్దపు రాతలు రాస్తారు. అభివృద్ది పరంగా చూస్తే చంద్రబాబు టైమ్ లో నిర్మించలేకపోయిన ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ బాదితులకు ఆస్పత్రి, భారీ నీటి పధకం , విశాఖ అభివృద్ది , ఇన్ ఫోసిస్, అదాని డేటా సెంటర్, నక్కపల్లి ఫార్మాహబ్ మొదలైనవి జగన్ చేపట్టిన ప్రగతికి నిదర్శనంగా నిలుస్తాయి. విద్యుత్ రంగంలో లక్ష మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తికి గాను మెరుగైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యక్షంగా అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం వల్ల ఏపీ అభివృద్ది పధంలో సాగుతోందని చెప్పవచ్చు. అందుకే ఏపీలో ఆదాయపన్నుశాఖ చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వాస్తవాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఏపీ వ్యతిరేక మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ, ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రం సంతోషం కలిగించే విషయమే అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
కొత్త సీఎంగా చంపయ్ సొరెన్ ఎంపికకు అసలు కారణం ఇదే?
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా చేయడంతో రాష్ట్రానికి నూతన సీఎంగా చంపయ్ సొరెన్ను ప్రకటించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సొరెన్ అధికార మహాఘటబంధన్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రాసిన లేఖలో చంపయ్ సొరెన్ను జేఎంఎం శాసనసభా పక్షానికి అధిపతిగా ప్రకటించారు. చంపయ్ సొరెన్ను ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. హేమంత్ సొరెన్ తన వారసుడిగా చంపయ్ను ఎన్నుకునే ముందు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు? హేమంత్ సొరెన్ తండ్రి శిబు సొరెన్తో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపక సభ్యులలో చంపయ్ సొరెన్ ఒకరు. అయితే హేమంత్ సొరెన్కు అతనిపై నమ్మకం ఉండటానికి ఇది మాత్రమే కారణం కాదు. చంపయ్ సొరెన్.. హేమంత్ సొరెన్కు విధేయుడు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి తండ్రి శిబు సోరెన్కు సన్నిహితుడు. అదీగాక చంపయ్ సొరెన్ కొల్హాన్ ప్రాంతానికి చెందినవారు. కొల్హాన్ బీజేపీకి కంచుకోటగా ఉంది. జార్ఖండ్కు ఇప్పటి వరకు కొల్హాన్ నుండి ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇద్దరు బీజేపీ నుండి అర్జున్ ముండా (2010 నుండి 2013 వరకు), రఘువర్ దాస్ (2014 నుండి 2019 వరకు). జార్ఖండ్ రెండవ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్కు చెందిన మధు కోడా.. 2006 నుండి 2008 వరకు సీఎంగా పనిచేశారు. జార్ఖండ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాన్లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పేలవంగా ఉంది. అయినప్పటికీ సీఎం హేమంత్ సొరేన్కు ఈ ప్రాంతంపై సరైన ఆధరణ లేదు. చంపై సోరెన్ను తన వారసుడిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీకి ఎదురుదెబ్బ ఇచ్చినట్లవుతుందని సొరెన్ భావించారు. 'టైగర్ ఆఫ్ కొల్హన్' గా పేరున్న చంపయ్ సొరెన్ జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించడానికి సులభమవుతుందని భావించినట్లు సమాచారం. ఇదీ చదవండి: రసకందాయంలో జార్ఖండ్ రాజకీయం.. హైదరాబాద్ హోటల్కు ఎమ్మెల్యేలు -
అరెస్టులను ఎదుర్కొన్న ముగ్గురు జార్ఖండ్ సీఎంలు!
జార్ఖండ్ ప్రస్తుతం పెను రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భూ కుంభకోణం కేసులో రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపధ్యంలోనే హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి గవర్నర్కు తన రాజీనామా పత్రం సమర్పించారు. హేమంత్ రాజీనామా తర్వాత చంపై సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. జార్ఖండ్ సీఎం పదవిలో ఉన్న నేత అరెస్ట్ కావడం ఇదేమీ తొలిసారి కాదు. జార్ఖండ్ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు సీఎంలు రాష్ట్రాన్ని పాలించారు. వీరిలో ముగ్గురు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. దీంతోపాటు రాష్ట్రంలో మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ 2005లో 10 రోజులు, 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకు జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. 1994లో ప్రైవేట్ సెక్రటరీ శశినాథ్ ఝా కిడ్నాప్, హత్య కేసులో 2006లో ఢిల్లీ కోర్టు శిబు సోరెన్కు జీవిత ఖైదు విధించింది. అయితే 2007లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టు శిబు సోరెన్ను నిర్దోషిగా ప్రకటించింది. 2018లో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. 2004లో జమ్తారా సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శిబూ సోరెన్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఆయన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే 2008 మార్చి లో సాక్ష్యాలు లేవని పేర్కొంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోరెన్ను నిర్దోషిగా విడుదల చేసింది. మధు కోడా 2006 నుంచి 2008 మధ్య జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం వంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. మైనింగ్ కుంభకోణానికి పాల్పడి రూ.4,000 కోట్లకు పైగా సంపాదించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కోడాను 2009లో అరెస్టు చేసి 2013లో విడుదల చేశారు. 2017లో కోడా దోషిగా తేలారు. దీంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష. రూ. 25 లక్షల జరిమానా విధించారు. జార్ఖండ్ రాష్ట్రం 2000, నవంబరు 15న ఏర్పడింది. నేటి వరకు ఆరుగురు నేతలు సీఎంలుగా వ్యవహరించారు. వీరిలో రఘువర్ దాస్ మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. బాబులాల్ మరాండీ, అర్జున్ ముండా, రఘువర్ దాస్ జార్ఖండ్ సీఎంలుగా పనిచేశారు. -
జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సొరెన్
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సొరెన్ తప్పుకున్నారు. నూతన సీఎంగా చంపై సొరెన్ నియమితులు కానున్నారు. చంపై సొరెన్ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నట్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ను కలిశారు చంపై సొరెన్. హేమంత్ సొరెన్పై ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీ ప్రారంభించినప్పటి నుండి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్తో కలిసి పనిచేసిన సీనియర్ నాయకుడు చంపై సోరెన్. చంపై సొరేన్ జార్ఖండ్ రవాణా శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిగా కూడా ఉన్నారు. సరైకేలా-ఖర్సావాన్ జిల్లాకు చెందిన రైతు సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు చంపై సొరెన్. హేమంత్ సొరెన్ కుటుంబానికి బాగా సన్నిహితుడు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కూడా చంపై సొరెన్ కృషి చేశారు. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సొరెన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అంతకుముందే సీఎం పదవికి హేమంత్ సొరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. నూతన సీఎంగా చంపై సొరెన్ను ఎన్నుకున్న జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు గవర్నర్ నివాసానికి వెళ్లారు. ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సొరెన్ మొదట్లో ఆయన భార్య కల్పనా సోరెన్ నూతన సీఎంగా ఎన్నికవుతారని అందరూ భావించారు. కానీ కల్పనా సొరెన్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. అటు ఈ ఏడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కల్పనా సొరెన్కు సీఎం పదవి ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది. ఇదీ చదవండి: ఈడీ అధికారులపై కేసు పెట్టిన సీఎం సొరెన్ -
జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం?
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం (జనవరి 29) ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లింది. అయితే అక్కడ సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో, ఈడీ స్క్వాడ్ 13 గంటలకు పైగా అక్కడే మకాంవేసి, సీఎం నివాసంలో సోదాలు జరిపింది. దర్యాప్తు సంస్థ జార్ఖండ్ సీఎం నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారు (హర్యానా నంబర్తో నమోదైంది)ను స్వాధీనం చేసుకుంది. అలాగే కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఈడీ చర్యను హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు చేసిన ప్రణాళికాబద్ధమైన కుట్రగా అభివర్ణించింది. మరోవైపు అరెస్టు భయంతో సీఎం సోరెన్ 18 గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ ఆరోపించింది. సోమవారం నాడు ఢిల్లీ పోలీసులతో కలిసి ఈడీ బృందం దక్షిణ ఢిల్లీలోని ఆయన నివాసమైన శాంతి నికేతన్ భవన్కు ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకుంది. రాత్రి 10:30 గంటల వరకు ఈడీ బృందం అక్కడే ఉంది. సోరెన్ నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారును, కొన్ని పత్రాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం సోరెన్ జనవరి 27న రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లారని ఆయన పార్టీ జేఎంఎం తెలిపింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యకు భయపడి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత 18 గంటలుగా పరారీలో ఉన్నారని బీజేపీ జార్ఖండ్ యూనిట్ పేర్కొంది. భూ కుంభకోణం కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం అధికారిక నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోరెన్ను ప్రశ్నించింది. అనంతరం జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ సమన్లు జారీ చేసింది. దీనికి స్పందిస్తూ సోరెన్ ఏజెన్సీకి లేఖ పంపారని, అయితే తాను విచారణకు హాజరయ్యే తేదీని దానిలో పేర్కొనలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆదివారం (జనవరి 28) ఈడీకి పంపిన ఈ మెయిల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అడ్డుకోవడానికి రాజకీయ ఎజెండాతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోరెన్ ఆరోపించారు. -
అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్
పాట్నా: మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవని.. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. గవర్నర్కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నరగా మహా కూటమి ప్రభుత్వం సరిగ్గా ముందుకు వెళ్ళలేక పోయిందని నితీష్ కుమార్ అన్నారు. గతంలో ఉన్న ఎన్డీఏ కూటమితో వెళ్లాలని అనుకుంటున్నామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు రాజీనామా చేశారు. గవర్నర్కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి కూలిపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నితీష్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. బీజేపీతో చేతులు కలిపి నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అటు.. బీజేపీ ఇటు జేడీయూలు తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. బీజేపీ, జేడీ(యూ), జితిన్రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ కొత్త కూటమిలో పాల్గొననున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. ఇదీ చదవండి: Bihar political crisis: ఇలా రాజీనామా, అలా ప్రమాణం! -
‘సమాజ్వాది’ వస్తే.. సీఎంగా డింపుల్ యాదవ్?
యూపీలోని లక్నోలో గల సమాజ్వాదీ పార్టీ కార్యాలయం దగ్గర వెలసిన ఒక పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లో డింపుల్ యాదవ్ను యూపీకికి కాబోయే ముఖ్యమంత్రిగా చూపించారు. ఇంతేకాదు ఈ పోస్టర్లో డింపుల్ యాదవ్ ఫొటోను అఖిలేష్ యాదవ్ కంటే పెద్దదిగా చూపించారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్ వెనుక కథనం అంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ కార్యాలయం దగ్గర తరచూ పోస్టర్లు కనిపించడం సాధారణమే. అయితే తాజాగా వెలసిన డింపుల్ యాదవ్కు సంబంధించిన పోస్టర్ హెడ్లైన్స్లో నిలిచింది. ఈ హోర్డింగ్ను ఎస్పీ నేత అబ్దుల్ అజీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఇవ్వడంతో పాటు, డింపుల్ యాదవ్ను యూపీకి కాబోయే కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. జనవరి 15న డింపుల్ యాదవ్ పుట్టినరోజు. దీనికి ముందుగానే పార్టీ కార్యాలయం ముందు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ అనేక అర్థాలకు అవకాశమిస్తోంది. దీనిని చూసిన కొందరు ఇకపై అఖిలేష్ యాదవ్ దేశరాజకీయాలపై దృష్టిపెడతారని, అతని స్థానంలో డింపుల్ యాదవ్ యూపీ బాధ్యతలు చేపడతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుండగా అఖిలేష్ యాదవ్ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కన్నౌజ్, అజంగఢ్ లోక్సభ స్థానాల నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
పూజల్లో యూపీ సీఎం.. సూర్య నమస్కారాల్లో గుజరాత్ సీఎం!
ఈరోజు నూతన సంవత్సరంలో తొలి రోజు.. అందుకే ఈరోజును ప్రత్యేకంగా మార్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. చాలామంది కొత్త సంవత్సరం మొదటి రోజున ఆలయాలు సందర్శించి, దేవునికి పూజలు చేస్తుంటారు. ఫలితంగా ఈరోజు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంటుంది. కాగా పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, గవర్నర్లు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'havan' and 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur (Video source: CMO) pic.twitter.com/0juG1CX7Vd — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 1, 2024 యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (సోమవారం) ఉదయం గోరఖ్పూర్ చేరుకుని, గోరఖ్నాథ్ ఆలయంలో యాగం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో ‘జనతా దర్శన్’ కార్యక్రమంలో పాల్గొని సామాన్య ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ షాంఘ్వీ 2024 సంవత్సరం తొలి రోజు మోధేరా సూర్య దేవాలయంలో సూర్యనమస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ ‘ఈ రోజు అత్యధిక సూర్య నమస్కారాలు చేస్తూ గిన్నిస్ రికార్డ్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సూర్య నమస్కార కార్యక్రమంలో నాలుగువేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారన్నారు. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు #WATCH | Mehsana: Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi participate in the Suryanamaskar Program at Modhera Sun Temple, on the first morning of the year 2024. pic.twitter.com/t3z3iBBIuk — ANI (@ANI) January 1, 2024 -
కోటి ఆశలతో.. సీఎం హామీలపై నూతన సంవత్సరంలోకి అడుగులు!
నారాయణపేట: ‘కొడంగల్ ఎమ్మెల్యే తనను.. పేట ఎమ్మెల్యేగా పర్ణికారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపితే కొడంగల్, నారాయణపేటలను హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాలు ఎలా అభివృద్ధి చెందాయో ఆ విధంగా రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తా. కొడంగల్ అభివృద్ధికి నిధులు ఎలా మంజూరు చేస్తానో.. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గానికి ఇస్తా..’ అని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మాటిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగియడం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం.. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) పేరిట జీఓను విడుదల చేయించడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో సీఎం ఇచ్చిన హామీలన్నీ కొత్త సంవత్సరంలో అమలు కావాలని.. పేట అభివృద్ధి పరుగులు తీయాలని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన సంవత్సరంలో అడుగులు వేసి ప్రగతిలో పరుగులు తీయించాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలాఉండగా, 2023 సంవత్సరంలో జిల్లా అభివృద్ధి ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కి పడినట్లయింది. ఇండస్ట్రియల్ పార్క్లు.. జిల్లాలో ఉపాధి లేక ముంబయి, హైదరాబాద్, పూణె, బెంగళూర్ నగరాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్నారు. నారాయణపేట జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే.. నూతన సీఎం ఎనముల రేవంత్రెడ్డి కావడంతో జిల్లాకు పరిశ్రమలకు పునాదులు పడుతాయని ఈ ప్రాంత వలసజీవులు ఆశాభావంతో ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్కు, ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయితే ఈ ప్రాంతంలోని వలసజీవులకు ఇక్కడే జీవనోపాధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్, ఆత్మకూర్ ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లు చేయాలని జనం ఆకాంక్షించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనం ఎంతో ఆకాంక్షతో ఎదురుచూస్తున్నారు. నూతన ఏడాదిలో నారాయణపేట నియోజకవర్గంలో మూడు కొత్త మండలాలు గార్లపాడు, కానుకుర్తి, కోటకొండ మండలాలను ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల అవుతుందనే శుభావార్త వినాలని కోరుకుందాం. ఈ ప్రాంతంలో వ్యవసాయంపైనే ఆధారపడి ఎక్కువ కుటుంబాలు జీవిస్తుంటాయి. జాయమ్మ చెరువును నింపి సాగునీటిని అందించేందుకు పనులు ప్రారంభించాలని రైతులు ఆశాజనకంగా ఎదురుచూస్తున్నారు. కలెక్టరేట్.. జిల్లా ఆస్పత్రికి పునాదులు.. జిల్లాకు ప్రధాన కార్యాలయమైన కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు ఇతర కార్యాలయాలు, కలెక్టరేట్ కార్యాలయ సముదాయానికి రూ.55 కోట్లు, ఎస్పీ కార్యాలయానికి రూ.36 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆయా భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ భూములను గుర్తించి గతేడాది కలెక్టరేట్కు తాజా మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఎస్పీ కార్యాలయానికి ఇంకా పునాదులు పడలేదు. కొత్త ఏడాదిలో నూతన ప్రభుత్వంలో పునాదులు పడుతాయని ఆశిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి పనులు పూర్తయి, మెడికల్ కళాశాల ప్రారంభమై, విద్యార్థులకు వైద్య విద్యతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని ఆకాంక్షిస్తున్నారు. ఇవి చదవండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్ -
మందుబాబులకు వీఐపీ ట్రీట్మెంట్.. హిమాచల్ సీఎం ఆదేశాలు!
హిమాచల్ ప్రదేశ్లో పర్వతరాణిగా పేరొందిన సిమ్లాలో తొలిసారిగా సిమ్లా వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. ఏడు రోజుల పాటు కొనసాగే ఈ శీతాకాలపు కార్నివాల్.. సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్తో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సాంస్కృతిక కవాతును వీక్షించారు. కార్నివాల్ సందర్భంగా రిడ్జ్ గ్రౌండ్, మాల్ రోడ్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్నివాల్లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం స్నేహపూర్వకంగా కనిపించారు. అతిగా తాగి వచ్చే పర్యాటకులను పోలీస్ లాకప్లో కాకుండా హోటల్కు తరలించాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎవరైనా టూరిస్ట్ మద్యం తాగి రచ్చ చేస్తే పోలీసులు వారికి వీఐపీ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. సిమ్లా వింటర్ కార్నివాల్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ విపత్తు సమయంలో హిమాచల్ ప్రదేశ్లో పర్యాటక వ్యాపారం భారీగా నష్టపోయిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందన్నారు. భారీ సంఖ్యలో జనం హిమాచల్ ప్రదేశ్కు తరలివస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్ను 24 గంటలూ తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా పర్యాటకులను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులు నానా హంగామా చేయకూడదని, చట్టాన్ని గుర్తుంచుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సిమ్లా, మనాలిలకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలో బస చేస్తున్నారు. కాగా మనాలిలో పర్యాటకులు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఉదంతాలు వెలుగు చూశాయి. కొందరు పర్యాటకులు మద్యం సేవించి లోయల్లో హల్చల్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
మాంసం దుకాణాలపై కొరడా ఝుళిపిస్తున్న అధికారులు
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సూచనల మేరకు గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో అనుమతి లేకుండా బహిరంగంగా మాంసం, చేపలను విక్రయించడాన్ని నిషేధించింది. దీనిని అమలు చేసేందుకు అధికారులు నగరంలోని పలు మార్కెట్లలో దాడుల నిర్వహిస్తున్నారు. గ్వాలియర్ మార్కెట్లో లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న ఏడు మాసం దుకాణాలను అధికారులు మూసివేయించారు. అలాగే పలువురు వ్యాపారుల నుంచి వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. దీనికితోడు ఆయా వ్యాపారుల నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హర్ష్సింగ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనూజ్ శర్మ, డాక్టర్ వైభవ్ శ్రీవాస్తవ నేతృత్వంలో నగరంలో బహిరంగంగా మాంసం, చేపలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు బృందాలుగా ఏర్పడి చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన మాంసం, చేపలు విక్రయిస్తున్న వారి నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలిక దుకాణాల ఆక్రమణలను కూడా తొలగించారు. నిబంధనలను పాటించని దుకాణదారుల నుంచి మూడు వేల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేశారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
‘రాత్రుళ్లు ఎవరూ బయట నిద్రించకుండా చూడండి’
చలిగా ఉన్న రాత్రివేళల్లో ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో నిద్రించకుండా చూడాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ రోడ్డు పక్కన బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నట్లయితే వారిని నైట్ షెల్టర్లకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు. మకర సంక్రాంతి రోజున గోరఖ్నాథ్ ఆలయంలో నిర్వహించే ఖిచ్డీ జాతరకు వచ్చే భక్తులకు కూడా నైట్ షెల్టర్లలో వసతి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోరఖ్నాథ్ ఆలయంలో జనతా దర్శన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అనంతరం పౌర సదుపాయాలు, ఖిచ్డీ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాత్రిపూట గస్తీ నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నట్లు కనిపిస్తే, వారిని గౌరవప్రదంగా సమీపంలోని నైట్ షెల్టర్కు తీసుకెళ్లాలని అన్నారు. అనాథలైన వారు చలిలో రోడ్డుపై వణుకుతున్నట్లు కనిపించకుండా చూడాలన్నారు. ఎవరైనా మానసిక వ్యాధితో బాధపడుతూ ఆరుబయట పడుకుంటే వారిని మానసిక వికలాంగుల ఆశ్రయాలకు తరలించి వైద్యం చేయించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నైట్ షెల్టర్లలో తగిన సంఖ్యలో పడకలు, దుప్పట్లు ఏర్పాటు చేయాలని, పరిశుభ్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైనవారికి ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31 నాటికి ఖిచ్డీ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. జనవరి ఒకటి నుంచి భక్తులు రాక మొదలవుతుందన్నారు. ఈ జాతరకు వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మేయర్ డాక్టర్ మంగ్లేష్ శ్రీవాస్తవ, జోన్ ఏడీజీ అఖిల్ కుమార్, డివిజనల్ కమిషనర్ అనిల్ ధింగ్రా తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చూడండి: దుకాణాల్లోకి దూసుకెళ్లిన ట్రాలీ.. నలుగురు మృతి! -
ప్రభుత్వం మారగానే సీఎం కార్లకు కొత్త నంబర్లు!
ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారిన వెంటనే పాలనలో అనేక మార్పులు మొదలయ్యాయి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కాన్వాయ్లోని ఒక వాహనానికి గల బీబీ-0023 అనే నంబర్ ప్లేటును తొలగించారు. దీనిలో బీబీ అంటే అంటే భూపేష్ బఘేల్ (మాజీ ముఖ్యమంత్రి). అలాగే 23 అతని పుట్టినరోజు. దీని ప్రకారం నంబర్ ప్లేటును బీబీ-0023గా రూపొందించారు. ముఖ్యమంత్రి సచివాలయం అందించిన మార్గదర్శకాల ప్రకారం ఈ నంబర్ ప్లేట్ మార్చారు. నూతన సీఎం విష్ణు దేవ్ సాయి కారుకు వచ్చిన కొత్త నంబర్ సీజీ-03-9502. గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్లో సీజీ-02 నంబర్ ఉండేది. మాజీ సీఎం బఘేల్ తన కాన్వాయ్లో ఉన్న వాహనాలకు ప్రత్యేక నంబర్ను తీసుకున్నారు. ఇప్పుడు ఆ నంబర్లను సమూలంగా మార్చారు. అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన కాన్వాయ్లో ఉన్న వాహనాలను కూడా మార్చారు. నాడు సీఎం తన కాన్వాయ్లోని మిత్సుబిషి పజెరో వాహనాన్ని తొలగించారు. ఛత్తీస్గఢ్లో సీజీ-01, సీజీ-02, సీజీ-04 రిజిస్ట్రేషన్ను రాయ్పూర్ ఆర్టీఓ పర్యవేక్షిస్తుండగా, సీజీ-03 రిజిస్ట్రేషన్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో జరగడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది? -
ముఖ్యమంత్రి తండ్రి ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స!
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం కిషన్ స్వరూప్ శర్మ.. జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే సీఎం భజన్లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడంతో శుక్రవారం అర్థరాత్రి ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయనకు పరీక్షలు చేసి, చికిత్సనందిస్తోంది. శుక్రవారం సీఎం భజన్లాల్ శర్మ పుట్టినరోజు.. అదే రోజు ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా సీఎం భజన్లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ శుక్రవారం తన కుమారుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకోసం ఆయన భరత్పూర్ నుంచి జైపూర్ వచ్చారు. అర్థరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇది కూడా చదవండి: ‘నేనెక్కడికీ వెళ్లడంలేదు’ రోదిస్తున్న మహిళలకు శివరాజ్ భరోసా! -
రాజస్థాన్ నూతన సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం
జైపూర్: రాజస్థాన్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. భజన్ లాల్ శర్మ తన 56వ పుట్టిన రోజే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జైపూర్లో ఆల్బర్ట్ హాల్లో జరిగింది. గోవా సీఎం ప్రమోద్ సావంత్, త్రిపుర సీఎం మాణిక్ సాహా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారోత్సవానికి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భజన్ లాల్ శర్మ సంగనీర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్పై దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భజన్ లాల్ ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకి నాలుగు సార్లు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. రాజస్థాన్లో విడుదలైన ఫలితాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ 115 సీట్లను గెలుచుకుంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి 69 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తంగా 200 సీట్లకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. బీజేపీ విజయం సాధించిన తర్వాత కేంద్ర అధిష్ఠానం భజన్ లాల్ శర్మ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఇదీ చదవండి: Bjp: ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు? -
ఆరోగ్య ఉద్యానం.. వైఎస్సార్ సుజలధారను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధుల బాధితులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పలాసలో కొత్తగా నెలకొల్పిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలసి పని చేస్తాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును కంచిలి మండలం మకరాంపురంలో సీఎం జగన్ గురువారం తొలుత ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం రూ.85 కోట్లతో పలాసలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ బాలుర వసతి గృహాన్ని వరŠుచ్యవల్గా ఆరంభించారు. నూతన పారిశ్రామికవాడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలాస రైల్వే గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. నేను విన్నాను.. నేను చేశాను 2018 డిసెంబర్ 30న ఇదే పలాసలో పాదయాత్రలో మాటిచ్చా. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ రోజు చెప్పా. మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడే 200 పడకలతో కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తెస్తామని చెప్పా. 2019 సెప్టెంబర్లో రూ.85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రిని మంజూరు చేశాం. పనులకు శంకుస్థాపన చేసి ఎక్కడా ఆలస్యం లేకుండా పూర్తి చేశాం. ఉద్దానం ప్రాంతానికి సురక్షిత మంచి నీటిని తెచ్చేందుకు హిర మండలం రిజర్వాయర్ నుంచి పైపులైన్లు వేసి ఇంటింటికి తాగునీరు అందించేందుకు 2020 సెప్టెంబర్లో సుజలధార పథకం మంజూరు చేశాం. ఈ రెండు పథకాలు ఈ రోజు పూర్తి చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ మీ బిడ్డ మీ కళ్ల ఎదుట నిలబడ్డాడు. ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇక్కడి కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి పని చేస్తుంది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కాసేపటి క్రితం హెల్త్ సెక్రటరీ కృష్ణబాబుతో మాట్లాడా. ఈ ఫిబ్రవరిలోనే ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ (మూత్రపిండాల మార్పిడి చికిత్స) కూడా చేసి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తోందో రాష్ట్రానికి, దేశానికి చూపించాలని చెప్పా. కచ్చితంగా ఈ ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. మన ప్రాంతంలోనే బ్రహ్మాండమైన వైద్యం ఆస్పత్రిలో క్యాజువాలిటీ బ్లాక్, సెంట్రల్ ల్యాబ్ ఉంది. రేడియో డయోగ్నోసిస్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ డయాలసిస్, యూరాలజీ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్రే, యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్, యూరో డైనమిక్ మిషన్ లాంటి సదుపాయాలన్నీ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికో పరుగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే బ్రహ్మాండమైన వైద్యం అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈ రోజు పలాసలో ఉంది. ఇదే కిడ్నీ ఆస్పత్రిలో 42 మంది వైద్యులు, 154 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ పోస్టుల్లో మరో 220 మంది పని చేస్తున్నారు. మొత్తంగా 375 మంది సేవలందించేందుకు ఈ రోజుమీ అందరికీ అందుబాటులో ఉన్నారు. 7 మండలాల్లో స్క్రీనింగ్ ఉద్దానం ప్రాంతంలో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించగలిగితే వెంటనే మెరుగైన వైద్యం పేద ప్రజలకు అందించగలుగుతామనే తపన, తాపత్రయంతో కిడ్నీ ప్రభావిత మండలాల్లో స్క్రీనింగ్ కార్యక్రమం ఇప్పటికే చేపట్టాం. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, వజ్రపుకొత్తూరు, పలాసలో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తున్నాం. 25 ఏళ్లు పైబడిన వారిలో 2,32,898 మందిని స్క్రీనింగ్ చేయగా 19,532 మందికి సాధారణం కంటే సీరం క్రియాటిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీరిని గుర్తించి వైద్యం అందిస్తున్నాం. ఉద్దానంలో 10 పీహెచ్సీలు, 5 అర్బన్ పీహెచ్సీలు, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సెమీ ఆటో ఎనలైజర్లు అందుబాటులోకి తెచ్చాం. ఉచితంగా 37 రకాల మందులు కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు నిర్ధారించిన 37 రకాల ఔషధాలను అన్ని పీహెచ్సీలలో అందుబాటులోకి తెచ్చాం. వీటిని వైఎస్సార్ విలేజ్ క్లినిక్లకు అనుసంధానం చేస్తున్నాం. ఈ మందులన్నీ ప్రతి పేదవాడికీ గడప ముంగిటికే ఉచితంగా ఇచ్చేందుకు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే కవిటి, సోంపేట, పలాస, హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, టెక్కలి జిల్లా ఆస్పత్రిలో 69 డయాలసిస్ యంత్రాలను విస్తరించాం. బారువ, ఇచ్ఛాపురం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కంచిలి పీహెచ్సీలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రోగులకు రూ.10 వేల పెన్షన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 మాత్రమే ఉన్న పెన్షన్ను మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా రూ.10 వేలకు పెంచాడు. నాన్ డయాలసిస్ పేషెంట్లు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో సీకేడీ డిసీజ్తో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి వారికి రూ.5 వేల పింఛన్ ఇచ్చేలా చేసింది మనందరి ప్రభుత్వమే. గత సర్కారు హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటున్న వారు, పింఛన్లు పొందుతున్న వారు కేవలం 3,076 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ఖర్చు చేసింది అప్పట్లో కేవలం నెలకు రూ.76 లక్షలు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 13,140 పింఛన్లు పెంచాం. నెలా నెలా ఇందుకు ఖర్చవుతున్న సొమ్ము రూ.12.54 కోట్లు. ఇలా 55 నెలలుగా ప్రతీ నెలా ఖర్చు చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం దిశగా.. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు కారణాలను అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్తో పాటు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేపట్టింది. నాలుగు దశల అధ్యయనంలో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. ప్రపంచంలో అత్యుత్తమ వైద్యసంస్థగా పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్తో పాటు నార్త్ కరోలినా యూనివర్సిటీతో కలసి పనిచేసేలా మనందరి ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంటోంది. ఈ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఒక నోడల్ సెంటర్గా వ్యవహరించనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ ఇలాంటి సమస్య ఉందని గుర్తించడంతో తాగునీటికి ఉపరితల జలాలను అందించేందుకు వెలుగొండ టన్నెళ్లను పరుగెత్తించాం. మార్కాపురంలో మెడికల్ కాలేజీ, కిడ్నీ సేవల కోసం నెఫ్రాలజీ, యూరాలజీ డివిజన్ కూడా ఏర్పాటు చేశాం. చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం ఉద్దానంలో ఒక్క కిడ్నీ ఆస్పత్రితోనే సరిపుచ్చకుండా సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎవరి ఊహకూ అందని విధంగా రూ.700 కోట్లు ఖర్చు చేసి మరీ హిరమండలం నుంచి పైపుల ద్వారా నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసేలా అడుగులు వేశాం. ఇదీ మీపట్ల మీ జగన్కు ఉన్న కమిట్మెంట్. ఈ కమిట్మెంటే గత పాలకులకు, మనకు మధ్య తేడాను తెలియచేస్తుంది. మొత్తం 807 గ్రామాలకుగానూ ఈ నెలాఖరుకల్లా ప్రతి గ్రామం పూర్తిగా కనెక్ట్ అవుతుంది. 1.98 లక్షల కుటుంబాలు, 6.78 లక్షల జనాభాకు సురక్షిత తాగునీటిని అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైంది. ఈ పథకాన్ని ఫేజ్ 2 కింద ఇంకా విస్తరించబోతున్నాం. రూ.265 కోట్లతో పాతపట్నం నియోజకవర్గంలో 448 గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా మేలు చేసేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. దీనికి టెండర్లు, అగ్రిమెంట్లు, సర్వే పూర్తైంది. సంక్రాంతి తర్వాత ఆ పనులు మొదలుపెడతారు. -
ఆ కొత్త సీఎంకు ఏటా 20 వేల రాఖీలు..
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాష్ట్రంలోని మహిళల నుంచి ఎంతో ఆదరణ లభించింది. మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో శివరాజ్ సింగ్ ముందున్నారనే వాదన వినిపిస్తుంటుంది. రాష్ట్ర ప్రజలు ఆయనను ముద్దుగా ‘మామ’ అని పిలుచుకుంటారు. శివరాజ్కు ఇంతటి ప్రజాదరణ ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ అతని స్థానంలో మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే మోహన్ యాదవ్ కూడా రాష్ట్రంలోని మహిళల ఆదరణకు దక్కించుకున్నారు. గడచిన పదేళ్లుగా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని 20 వేల మంది అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీ కడుతున్నారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శివరాజ్ స్థానంలో మోహన్ యాదవ్ పేరును సీఎం పదవికి ప్రకటించడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మహిళా ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణ కూడా ఇందుకు ఒక కారణమంటున్నారు. పదేళ్ల క్రితం మోహన్ యాదవ్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఉజ్జయినిలోని బాగ్పురా, గోపాల్పురా ప్రాంతాలకు చెందిన వెయ్యిమంది మహిళలు మోహన్ యాదవ్కు రాఖీ కట్టారు. ఆ సంఖ్య నేడు 20 వేలకు చేరుకుంది. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు మోహన్ యాదవ్ కానుకలు ఇస్తుంటారు. మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ ఆనందీబెన్ కూడా మోహన్ యాదవ్కు రాఖీ కట్టారు. మోహన్ యాదవ్కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఒక సోదరి పేరు గ్యారాసి బాయి, మరొక సోదరి పేరు కళావతి యాదవ్. అతనికి ఇద్దరు సోదరులు నంద్లాల్ యాదవ్, నారాయణ్ యాదవ్. మోహన్ యాదవ్ ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. కళావతి యాదవ్ రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్నారు ఉజ్జయినిలోని వివిధ ప్రాంతాల నుండి ఆరుసార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కళావతి యాదవ్ ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మోహన్ యాదవ్కు భార్య సీమా యాదవ్, కుమారులు అభిమన్యు యాదవ్,వైభవ్ యాదవ్, కుమార్తె ఆకాంక్ష యాదవ్ ఉన్నారు. ఇది కూడా చదవండి: 2001- 2023.. అదే డిసెంబరు 13.. పార్లమెంట్ దాడుల్లో తేడా ఏమిటి? -
సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన సొంత ఊరు ఉజ్జయినిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మోహన్ యాదవ్ మద్దతుదారులు నగరాన్ని సీఎం అభినందనల పోస్టర్లతో నింపేశారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయినందుకు అతని అభిమాని ఒకరు తన రెస్టారెంట్లో రోజంతా ఉచితంగా టీ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం భోపాల్లో జరిగినప్పటికీ, ఉజ్జయినిలో పండుగ వాతావరణం కనిపించింది. మోహన్ యాదవ్ అభిమాని ఆశిష్ రాథోడ్.. ఘాస్ మండిలోని తన హరిఓమ్ రెస్టారెంట్లో అందరికీ ఉచితంగా టీ అందించారు. మన దేశ ప్రధాని ఒకనాడు టీ విక్రయించారని, మోహన్ యాదవ్ కూడా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నారని రాథోడ్ పేర్కొన్నారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో నగర కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయాన్నారు. ఈ సంబరాల నేపధ్యంలో తాను 300 లీటర్ల పాలు వినియోగించి, టీ తయారు చేసి, నగరవాసులకు ఉచితంగా అందిస్తున్నానన్నారు. ఇది కూడా చదవండి: లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు! -
మధ్యప్రదేశ్ సీఎం ప్రమాణస్వీకారం..హాజరైన ప్రధాని మోదీ
భోపాల్:మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా,బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితర ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు. కాగా, ఉప ముఖ్యమంత్రిగా జగదీష్ దేవ్డా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎం,డిప్యూటీ సీఎంలతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మూడు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్సింగ్ చౌహాన్ను కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్కు బీజేపీ ఈసారి మధ్యప్రదేశ్ సీఎంగా అవకాశం కల్పించింది. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ మార్పు చేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్ హత్య: ‘డుంకీ’ టెక్నిక్తో సూత్రధారి పరార్ -
రాజస్తాన్ సీఎం పీఠంపై ఫస్ట్టైం ఎమ్మెల్యే
జైపూర్: మధ్యప్రదేశ్లో రేస్లోలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన బీజేపీ అధిష్టానం మరోసారి అలాంటి అనూహ్య నిర్ణయమే తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మను రాజస్తాన్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు బీజేపీ మంగళవారం ప్రకటించింది. దీంతో ఇటీవల బీజేపీ విజయబావుటా ఎగరేసిన మూడు రాష్ట్రాలు.. ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్లలో కొత్త ముఖాలే సీఎం పీఠంపై కనిపించనున్నాయి. మంగళవారం జైపూర్లో 115 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై భజన్లాల్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ భేటీకి బీజేపీ అధిష్టానం తరఫున పార్టీ సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. సమావేశం తర్వాత భజనలాల్ వెంటనే రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మి శ్రాను కలిశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా భజన్లాల్కు గవర్నర్ ఆహ్వనం పలికారు. పదవుల్లో కులాల సమతుల్యం పాటిస్తూ బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్లాల్ను సీఎంగా, రాచరిక వారసురాలైన మహిళా ఎమ్మెల్యే దియా కుమారిని డిప్యూటీ సీఎంగా, దళిత నేత ప్రేమ్చంద్ బైర్వాలను డిప్యూటీ సీఎంగా, సింధ్ వర్గానికి చెందిన వాసుదేవ్ దేవ్నానీని స్పీకర్గా ఎంపికచేశారు. కాంగ్రెస్ అభ్యర్థిమరణంతో వాయిదాపడిన కరణ్పూర్ అసెంబ్లీ స్థానంలో జనవరి 5న పోలింగ్ జరగనుంది నేడు మోహన్కు పట్టం భోపాల్: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారు. సంస్థాగతం నుంచి సీఎం దాకా... భజన్లాల్ చాలా సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో సంస్థాగత పదవుల్లోనే కొనసాగారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. వెనువెంటనే ఆయన్ను సీఎం పదవి వరించడం విశేషం. భరత్పూర్ జిల్లాకు చెందిన 56 ఏళ్ల భజన్లాల్.. సంగనేర్ నియోజకవర్గం నుంచి 48,000కుపైగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. గతంలో ఈయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మంచి అనుబంధం ఉంది. విద్యార్థి దశలో రాజనీతి శాస్త్రంలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. -
రాజస్థాన్ సీఎం ఎంపికకు ఛత్తీస్గఢ్ ఫార్ములా?
రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరు? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ సీఎం ఎంపికకు మల్లగుల్లాలు పడుతోంది. రాజస్థాన్కు కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్నాథ్తో సహా ముగ్గురు పరిశీలకులకు పార్టీ హైకమాండ్ అప్పగించింది. ఈ నేపధ్యంలో వారు జైపూర్ చేరుకుని, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. అయితే ఇంతలోనే ఛత్తీస్గఢ్లో కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. దీంతో రాజస్థాన్లో సీఎంను ఎంపిక చేసేందుకు బీజేపీ ఛత్తీస్గఢ్ ఫార్ములాను అనుసరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవ్సాయిని ముఖ్యమంత్రిగా నియమించిన బీజేపీ తన భవిష్యత్ వ్యూహానికి సంబంధించిన అనేక లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో, జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన విజయ్ శర్మలను డిప్యూటీలుగా నియమించడం ద్వారా పార్టీలోని సామాజిక, రాజకీయ, అంతర్గత సమీకరణాలను చక్కదిద్దేందుకు బీజేపీ తన వంతు కృషి చేసింది. ఈ విధమైన ఫార్ములా ద్వారా లోక్సభ- 2024 ఎన్నికల వ్యూహానికి అనుగుణమైన రహదారిని ఏర్పాటు చేసింది. బీజేపీ తన ప్రత్యేక వ్యూహంలో భాగంగా గిరిజన సమాజాన్ని అక్కున చేర్చుకుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టింది. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయడం లేదా బిర్సా ముండా జన్మదినాన్ని గిరిజన దినోత్సవంగా ప్రకటించడం, తాజాగా గిరిజన ముఖ్యమంత్రిని ఎంచుకోవడం.. ఇవన్నీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు రాజస్థాన్లో వసుంధర రాజే, బాబా బాలక్నాథ్లు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారనే వాదన వినిపించింది. అయితే ఈ రేసులో నుంచి తాను తప్పుకుంటున్నట్లు బాబా బాలక్నాథ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు వసుంధర రాజేను సీఎం చేసే విషయమై పార్టీ ఇంతవరకూ ఏమీ తేల్చలేదు. మరోవైపు సీఎం రేసులో అశ్విని వైష్ణవ్, కిరోరి లాల్ మీనా, రాజ్యవర్ధన్ రాథోడ్, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా, దియా కుమారి, అర్జున్ రామ్ మేఘ్వాల్, సీపీ జోషి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజస్థాన్లో జాట్ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ కమ్యూనిటీకి చెందిన ఏ నేత కూడా ముఖ్యమంత్రి పదవికి చేరుకోలేకపోయాడనే అసంతృప్తి ఆ వర్గంలో ఉంది. గతంలో జాట్ కమ్యూనిటీకి చెందిన నేతల పేర్లు సీఎం రేసులో వినిపించాయి. అయితే చివరి నిముషంలో వారెవరికీ అవకాశం దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విషయంలో ఇదే జరిగింది. 1973లో రామ్నివాస్ మిర్ధా, 1998లో పరశ్రమ్ మదెర్నా, 2008లో శిశ్రామ్ ఓలా.. ఇలా ఈ ముగ్గురూ నాడు సీఎం పదవికి పోటీదారులుగా నిలిచారు. కానీ వారికి ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభించలేదు. ఈసారి కూడా జాట్ నేతను సీఎం చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనికి మద్దతుగా ఒక హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో ఉంది. రాజస్థాన్లోని 10 జిల్లాల్లో దాదాపు 65 స్థానాలపై జాట్ ఓటర్లు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాగే 100 సీట్లపై నిర్ణయం తీసుకునే కీల పాత్ర పోషిస్తున్నారు. అందుకే రాజస్థాన్ శాసనసభా పక్ష సమావేశంలో బీజేపీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా -
ప్రగతి భవన్ వద్దు.. ఇల్లు వెతుక్కుంటున్న సీఎం రేవంత్ రెడ్డి
-
ఈ మూడు కారణాలే బాబాను సీఎం రేసు నుంచి తప్పించాయా?
రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి రేసు నుంచి బాబా బాలక్నాథ్ తప్పుకున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే బాబా బాలక్నాథ్ పేరు ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపించింది. పార్టీ అంతర్గత సర్వేలో కూడా ఆయన ఆధిక్యత కనబరిచారు. ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత ఈ వాదన మరింత బలపడింది. పైగా బాబా బాలక్నాథ్.. బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో కూడా సమావేశం అయ్యారు. ఈ నేపధ్యంలో బాబా ముఖ్యమంత్రి అవుతారనే చర్చలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు ఆయన తాను ముఖ్యమంత్రి రేసులో లేనని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అయితే బాబా సీఎం కాకపోవడానికి మూడు కారణాలను కీలకంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొదటిది: బాబా బాలక్నాథ్ ఓబీసీ వర్గానికి చెందినవారు. రాజస్థాన్ పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో సీఎం పదవికి బలమైన పోటీదారులుగా ఓబీసీ నేతలు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో రాబోయే లోక్సభ ఎన్నికల దృష్ట్యా రెండు పొరుగు రాష్ట్రాలలో ఒకే సామాజికవర్గానికి చెందిన ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజీపీ సుముఖంగా లేదని తెలుస్తోంది. రెండవది: బాబా బాలక్నాథ్కు రాజకీయాలలో తగినంత అనుభవం లేదు. ఒక ప్రకటనలో ఆయన కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. బాబా బాలక్నాథ్ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఎంపీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కోణంలో చూస్తే బాబా రాజకీయ అనుభవం ఐదేళ్లు మాత్రమే. తగిన అనుభవం లేకపోవడంతోనే బాబా సీఎం కుర్చీ దూరమయ్యారనే మాట వినిపిస్తోంది. మూడవది: రాజస్థాన్కు పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్లోనూ బాబా బాలక్నాథ్ను సీఎం చేస్తే బీజేపీపై హిందుత్వ ముద్ర మరింత బలమవుతుంది. అప్పడు అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామని చెబుతున్న బీజేపీ హామీకి విలువలేకుండా పోతుంది. అందుకే బాబాను సీఎం రేసు నుంచి బీజేపీ తప్పించిందని అంటున్నారు. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ సీఎం ఎవరు? రాజస్థాన్లో ఏం జరుగుతోంది? -
మధ్యప్రదేశ్ సీఎం ఎవరు? రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాజస్థాన్ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఛత్తీస్గఢ్ కొత్త ముఖ్యమంత్రి పేరును ఆదివారం ప్రకటించారు. విష్ణుదేవ్ సాయికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఇంకా సీఎం ఎవరనేది ఖరారు కాలేదు. సోమవారం మధ్యప్రదేశ్లో శాసనసభా పక్ష సమావేశం జరగాల్సివుంది. అయితే రాష్ట్రపతి లక్నో పర్యటన కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. ఇప్పుడు ఈ సమావేశం మంగళవారం జరగనుంది. ఇక రాజస్థాన్ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన సత్తాను చాటుతున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రాజే జైపూర్లోని తన నివాసంలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. ఇదేవిధంగా పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్, మాజీ మంత్రి రాజ్పాల్ సింగ్ షెకావత్, మాజీ మంత్రి దేవి సింగ్ భాటీ కూడా రాజేను కలిశారు. మరోవైపు ఎమ్మెల్యేలతో ఆదివారం జరగాల్సిన పరిశీలకుల సమావేశం కూడా వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమ, మంగళవారాల్లో లక్నోలో పర్యటనలో ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన కారణంగానే శాసనసభా పక్ష సమావేశం వాయిదా పడిందని తెలుస్తోంది. వసుంధర రాజేను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్ కూడా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అటువంటి పరిస్థితిలో అనుభవమున్న నేత మాత్రమే చక్కదిద్దగలరని.. అందుకు వసుంధర రాజే మాత్రమే సరైనవారని పేర్కొన్నారు. కాగా ఆదివారం జైపూర్ చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ సీంఎం ఎంపికకు సంబంధించి త్వరలోనే పార్టీ హైకమాండ్, రాజస్థాన్ ఎమ్మెల్యేలు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇది కూడా చదవండి: 19న ‘ఇండియా’ భేటీ -
ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి
ఢిల్లీ: ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. దీంతో రాష్ట్రంలో సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. రాయ్పూర్లో బీజేపీ కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేల కీలక సమావేశం తర్వాత విష్ణు దేవ్ సాయిని సీఎంగా ప్రకటించారు. ఇటీవల ముగిసిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ పోటీలో నిలిచింది. మొత్తం 90 స్థానాలకు గాను 54 స్థానాలను కైవసం చేసుకుని ఘనవిజయం సాధించింది. గెలుపు అనంతరం సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై గత వారం రోజులుగా బీజేపీ పెద్దలు నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు నేటి సమావేశంలో విష్ణుదేవ్ సాయిని సీఎంగా ఎంపిక చేయడానికే బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. గిరిజన వర్గానికి చెందిన విష్ణు దేవ్ సాయి .. ఈ ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎత్తున గిరిజనుల మద్దతు కూడగట్టారు. #WATCH | Raipur: BJP leader Vishnu Deo Sai to become the next Chief Minister of Chhattisgarh. pic.twitter.com/PtAOM52JKa — ANI (@ANI) December 10, 2023 కుంకూరి అసెంబ్లీ స్థానంలో విష్ణు దేవ్ సాయి 87,604 ఓట్లతో విజయం సాధించారు. సీఎంగా గిరిజన సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలనుకుంటే మాజీ బీజేపీ రాష్ట్ర చీఫ్, విష్ణు దేవ్ సాయి మొదటి స్థానంలో నిలిచారు. మోదీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా, 16వ లోక్సభలో పార్లమెంటు సభ్యునిగా కూడా విష్ణు దేవ్ సాయి పనిచేశారు. प्रधानमंत्री श्री @narendramodi के नेतृत्व में सबका साथ-सबका विकास-सबका विश्वास-सबका प्रयास के मंत्र को आत्मसात करते हुए जनजातीय समाज को सर्वोच्च नेतृत्व देने की दिशा में एक और ऐतिहासिक कदम।@BJP4CGState विधायक दल की बैठक में श्री @vishnudsai को राज्य का मुख्यमंत्री मनोनीत किए… pic.twitter.com/M1HqIrmRro — BJP (@BJP4India) December 10, 2023 ఇదీ చదవండి: మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్ ఆనంద్ -
ఛత్తీస్గఢ్ సీఎం రేసులో వెనుకబడిన రమణ్ సింగ్!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపధ్యంలో బీజేపీ మరో విజయానికి ఇక్కడి నుంచే బీజం వేయాలని భావిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలలోనూ ప్రభావం చూపే నేతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ భావిస్తోంది. ఛత్తీస్గఢ్లో అధికారాన్ని ఓబీసీ గిరిజన నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ వ్యూహాల నేపధ్యంలో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ సీఎం రమణ్ సింగ్ పేరు వెనుకబడింది. సీఎం పదవికి బీజేపీ కొత్త పేరును పరిశీలిస్తోంది. చత్తీస్గఢ్లో సీఎం రేసులో ఎంపీ రేణుకా సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో, ఎంపీ గోమతి సాయి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా రేసులో ఉన్నారని చెప్పినప్పటికీ, మిగిలినవారు ఈ రేసులో ముందున్నారు. రమణ్ సింగ్ 71 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అతనిని పక్కన పెట్టాలని బీజేపీ భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ సీఎం రేసులో లతా ఉసేంది, రాంవిచార్ నేతమ్, విష్ణుదేవ్ సాయి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విష్ణుదేవ్ సాయి గిరిజన నాయకుడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఛత్తీస్గఢ్ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్గఢ్ సీఎం ఎంపిక కోసం ఈరోజు (ఆదివారం) జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముగ్గురు పరిశీలకులు, జార్ఖండ్ మాజీ సీఎం, గిరిజన నాయకుడు అర్జున్ ముండా, అస్సాం మాజీ సీఎం, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పరిశీలకులు సీఎం ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకుని పార్టీ హైకమాండ్కు తెలియజేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇది కూడా చదవండి: బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి? -
సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని, దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. ‘‘ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. ‘‘మేం పాలకులం కాదు.. మేం సేవకులం.. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా’’ అని రేవంత్ చెప్పారు. చదవండి: తెలంగాణ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసింది వీరే -
సీఎం పదవిపై భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి రాకపోవడంపై భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని తాను ఆశించిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. కేంద్ర నాయకులు ఏ పదవి ఇచ్చినా.. నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వంలో అందరికీ పదవులు దక్కడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. భట్టి విక్రమార్కకు సీఎం పదవి ఖాయమని ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అటు.. పాదయాత్రతోనూ భట్టి మంచి ప్రజాధరణ పొందారు. ఎస్సీ సామాజిక వర్గానికి అత్యున్నత పదవి కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్కు దక్కనుందని మేధావులు ఊహించారు. భట్టి కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కేంద్ర అధిష్ఠానం తర్జన భర్జన పడింది. చివరకు రేవంత్ పేరును ఖరారు చేశారు. రేవంత్తో పాటు 11 మంది మంత్రుల పేర్లను కూడా అధిష్ఠానం ఎంపిక చేసింది. వారంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదీ చదవండి: తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే.. -
TS CM Revanth Reddy: తెలంగాణ నూతన సీఎంగా ఎనుముల రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. రేవంత్రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 11 మంది నాయకులు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 2006లో మిడ్జెల్ జెడ్పీటీసీగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంఎల్సీగా గెలిచారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లోనూ మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా.. మరసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. 2021లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంపికై 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం పదవిని చేపట్టారు. ఇదీ చదవండి: తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే.. -
ఆ మూడు రాష్ట్రాల్లో సీఎం లేదా డిప్యూటీ సీఎంలుగా మహిళలు?
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి సహకారమందించిన మహిళలకు బీజేపీ మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోందని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలతో జరిగిన సమావేశంలో ఈ మూడు రాష్ట్రాల్లో మహిళలకు సీఎం లేదా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించారు. మూడు రాష్ట్రాల్లోనూ కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్లో ఇద్దరు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఒక్కొక్కరు చొప్పున డిప్యూటీ సీఎం పదవులు మహిళలకు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఈ నేపధ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందు మహిళలకు మరింతగా రాజకీయ సాధికారత కల్పించేందుకు పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. మూడు రాష్ట్రాల్లోనూ డిప్యూటీ సీఎంలుగా మహిళలను నియమించడం ఖాయమని పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ జనాభా పరంగా పెద్ద రాష్ట్రం కావడం, పలువురు సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో గెలుపొందిన కారణంగా ఇక్కడ ఇద్దరు మహిళలను డిప్యూటీ సీఎంలుగా నియమించే అవకాశం ఉందంటున్నారు. ఇంతేకాకుండా ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్పీకర్లుగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్లో ఓబీసీ, ఛత్తీస్గఢ్లో ఎస్టీ, రాజస్థాన్లో రాజకుటుంబానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి దక్కడం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్ స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్ను, రాజస్థాన్లో కిరోరీ లాల్ మీనాను స్పీకర్గా ఎంపిక చేయాలనే అంశంపై చర్చ సాగుతోంది. ఇది కూడా చదవండి: సీఎం ఎంపికపై మల్లగుల్లాలు.. ఢిల్లీకి వసుంధర రాజే! -
Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం
-
ఆరేళ్లలోనే... అత్యున్నత హోదాకు
సాక్షి, హైదరాబాద్: రేవంత్రెడ్డి ఆరేళ్లలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత హోదాకు చేరుకున్నారు. 2017 అక్టోబర్లో కాంగ్రెస్ పార్టిలో చేరిన ఆయన ఆరేళ్లు పూర్తి చేసుకునేలోపే అధిష్టానం మన్ననలు పొంది సీఎంగా ఎంపికయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రోజే పార్టిలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్న ఆయన ఇంటా, బయటా సర్దిచెప్పుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, సై అంటే సై అంటూ హైకమాండ్ నిర్ణయించే కీలక పదవి దక్కించుకోగలిగారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తట్టుకుంటూ హస్తం పార్టిలో ముందడుగులు వేసిన ఈ పాలమూరు నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు. వైఫల్యాలను అధిగమిస్తూ.. కాంగ్రెస్ పార్టిలో చేరిన తర్వాత రేవంత్రెడ్డి అనూహ్యంగా ముందు వరుసలోకి వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా దక్కించుకున్న కొద్దికాలంలోనే పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టారు. పార్టిలో అసమ్మతి, ఇంటిపోరును సమర్థవంతంగా ఎదుర్కొన్న రేవంత్ అటు ప్రజాక్షేత్రంలోనూ ప్రతికూల పరిస్థితులను చవిచూశారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ ఓటమి పాలైంది. అయినా వైఫల్యాలకు వెరవకుండా 2023 ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించారు. అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్పై కామారెడ్డిలో పోటీ చేసి ఢిల్లీ పెద్దల దృష్టిని కూడా ఆకర్షించారు. అటు పార్టీ కేడర్, నాయకులను ముందుకు కదిలిస్తూ ఈ ఎన్నికల్లో పార్టికి ఘనవిజయాన్ని చేకూర్చారని, అధిష్టానం వద్ద లభించిన ప్రత్యేక గుర్తింపే ఆయనకు పెద్ద పదవి లభించేలా చేసిందనే చర్చ జరుగుతోంది. -
‘జెడ్పీటీసీ’ టు సీఎం
పేరు : ఎనుముల రేవంత్రెడ్డి పుట్టిన తేదీ : 8–11–1967 స్వగ్రామం : కొండారెడ్డిపల్లి, వంగూరు మండలం (నాగర్కర్నూల్ జిల్లా) చదువు : బీఏ భార్య : గీతారెడ్డి కూతురు : నైమిష–సత్యనారాయణరెడ్డి (అల్లుడు) సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: విద్యార్థి దశ నుంచే రేవంత్రెడ్డి రాజకీయాల్లోకి అడుగిడారు. హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన బీజేపీ అనుబంధ విభాగమైన ఏబీవీపీతోపాటు ఆర్ఎస్ఎస్లో కూడా చురుగ్గా పనిచేశారు. కొంతకాలం మలక్పేటలో ఉన్న ఆయన నారాయణగూడకు మకాం మార్చారు. నారాయణగూడలో మిస్టర్ ఆడ్స్ పేరుతో ఓ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. రేవంత్రెడ్డి క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చాక ప్రింటింగ్ ప్రెస్ను తమ్ముడు కృష్ణారెడ్డికి అప్పగించారు. కృష్ణారెడ్డి బర్కత్పుర డివిజన్కు టీడీపీ తరపున ఎంసీహెచ్ కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. ► 2004లో టీఆర్ఎస్లో చేరి కల్వకుర్తి అసెంబ్లీ సీటు ఆశించారు. అయితే ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్క లేదు. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్రెడ్డి గెలిచారు. ► 2007లో మహబూబ్నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇండిపెండెంట్గా రేవంత్రెడ్డి గెలవడం అప్ప ట్లో సంచలనమే. అదే ఏడాదిలో టీడీపీలో చేరారు. ► 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ సెగ్మెంట్కు టీడీపీ తరఫున పోటీచేసిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డిని ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా రేవంత్రెడ్డి విజయం సాధించారు. ► 2015 మే 15న రేవంత్రెడ్డిని ఓటుకు కోట్లు కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కూతురి పెళ్లి సమయంలో తనను అరెస్ట్ చేయడం పట్ల రేవంత్ సీరియస్గా స్పందించారు. ‘నీ అంతు చూస్తా.. నిన్ను గద్దె దించడమే నా లక్ష్యం’అంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు. ► తెలంగాణలో టీడీపీ ప్రాభవం పూర్తిగా కోల్పోవడంతో 2017లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ► టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి మూడోసారి బరిలో దిగా డు. పట్నం నరేందర్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ► 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ► 2021 జూన్ 26న అధిష్టానం రేవంత్రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. జూలై 7న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జరిగిన గ్రేటర్, ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నా.. పట్టుదలతో ముందుకు కదిలి.. ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని సాధించిపెట్టారు. ► ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొడంగల్, కామారెడ్డి సెగ్మెంట్లలో రేవంత్ పోటీ చేయగా, కామారెడ్డిలో ఓటమిపాలై, కొడంగల్లో గెలిచారు. నాపై గెలిచిన వ్యక్తి నేడు సీఎం.. వెరీ హ్యాపీ నాపై పోటీ చేసిన వ్యక్తి నేడు తెలంగాణ సీఎం అవుతుండటం సంతోషంగా ఉంది. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే.. రేవంత్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన సీఎం అవుతున్నారంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. – ఎండీ రబ్బానీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, మిడ్జిల్ మండలం -
తెలంగాణ సీఎంగా రేవంత్రెడ్డి.. తొలి పోస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. సీఎంగా తన పేరు ప్రకటనకు కొద్ది నిముషాల ముందే రేవంత్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. ‘‘తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. — Revanth Reddy (@revanth_anumula) December 5, 2023 కాగా, తెలంగాణ రాజ్భవన్ వద్ద నిన్నంతా హైడ్రామా నడిచింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే.. నిన్న ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, ఇవాళ ఢిల్లీ పరిణామాల తర్వాత మంగళవారం సాయంత్రం జరిగిన సీఎల్పీ భేటీ అయ్యాక ఈ నిర్ణయం వెల్లడించింది. పలువురు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం, చివరకు రేవంత్ పేరునే ఖరారు చేసింది. -
TS:ఖర్గేతో డీకే శివకుమార్ కీలక భేటీ... సీఎం ఫైనల్ అయ్యే ఛాన్స్ !
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసలంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఠాక్రే ఏఐసీసీ చీఫ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు ఉత్తమ్, భట్టిలతో జరిగిన సమావేశ వివరాలపై డీకే ఏఐసీసీ చీఫ్కు నివేదిక అందించారు. సీఎం ఎంపికపై ఖర్గే నివాసానికి వెళ్లే ముందు డీకేఎస్ మీడయాతో మాట్లాడారు. ‘తెలంగాణ సీఎల్పీ నేతను హై కమాండ్ నిర్ణయిస్తుంది. ఫైనల్గా హై కమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుంది’ అని డీకే శివకుమార్ చెప్పారు. అంతకముందు హైదరాబాద్ నుంచి ఇవాళే ఢిల్లీకి వచ్చిన భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డిలతో డీకే శివకుమార్, ఠాక్రేలు విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం ఎంపికపై వారిరువురి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కాగా, ఉదయం ఇండియా కూటమి సమావేశానికి వెళ్లేముందు ఏఐసీసీ చీఫ్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలోగా సీఎం ఎంపిక ఉంటుందనేదానిపై క్లారిటీ ఇచ్చారు. సాయంత్రంలోగా సీఎం పేరును ప్రకటిస్తామని తెలిపారు. ఇదీచదవండి..సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్కు తెర! -
కొత్త సర్కారుకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. తాజా ఎన్నికల్లో గెలిచినవారి జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్రాజ్ సోమవారం గెజిట్ జారీ చేశారు. ఆ వెంటనే సీఈఓ వికాస్రాజ్ రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్రాజ్ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం గవర్నర్ తమిళిసైతో కొంతసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాససభాపక్ష (సీఎల్పి) నేతను ఎన్నుకోవడానికి సోమవారం సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డి ఎన్నికవుతున్నారని, ఆయన రాజ్భవన్కు చేరుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మరో ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్భవన్ ఉన్నతాధికారులు సోమవారం ఉదయమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాజ్భవన్ దర్బార్హాల్లో కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించడానికి వీలుగా పొడియంను, కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల కోసం కుర్చిలను సిద్ధం చేశారు. దర్బార్ హాల్ను అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం తీసుకుని సీఎల్పీ నేత రాజ్భవన్కు వచ్చే అవకాశం ఉండటంతో గవర్నర్ తమిళిసై, రాజ్భవన్ అధికారులు సాయంత్రం వరకు వేచిచూశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్భవన్ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. కాన్వాయ్లనూ సిద్ధం చేసినా.. కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం వారికి ప్రత్యేక కాన్వాయ్ల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్కుషా అతిథి గృహం వద్ద ఈ మేరకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం ఉండదనే స్పష్టత రావడంతో జీఏడీ అధికారులు రాజ్భవన్ నుంచి వెనుతిరిగారు. కొత్త కొత్తగా సచివాలయం నూతన సీఎం, మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సచివాలయంలో పాత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధుల నేమ్ ప్లేట్లను అధికారులు సోమ వారం తొలగించారు. కొత్త సీఎం, మంత్రుల కోసం చాంబర్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త సీఎం, మంత్రులకు సంబంధించి తమకు ఎలాంటి కబురు అందలేదని, అధికారికంగా సమాచారం అందగానే వారి కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సాధారణ పరిపాలన విభాగం అధికారులు తెలిపారు. అసెంబ్లీ కూడా ముస్తాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ భవనానికి రంగులు వేయడంతోపాటు పాత ఫర్నిచర్ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, సీఎం చాంబర్లను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రెండో శాసనసభ రద్దు కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు ఉత్తర్వులు ఆదివారం (డిసెంబర్ 3) మధ్యాహ్నం నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలును కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్కుమార్ వర్మ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కు లేఖ రాశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచి్చన విషయం తెలిసిందే. -
సీఎం రేసులో బాబా బాలక్నాథ్?.. అధిష్టానం నుంచి పిలుపు!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సమిష్టి నాయకత్వంలో పార్టీ పనిచేసింది. సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండానే బీజేపీ.. కాంగ్రెస్ను ఓడించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ గెలుపు తర్వాత రాష్ట్రానికి సీఎం ఎవరనేదానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో రాజస్థాన్కు చెందిన ప్రముఖ నేత, బాబా బాలక్నాథ్ను బీజేపీ కేంద్ర నాయకత్వం ఢిల్లీకి పిలిపించింది. మహంత్ బాలక్నాథ్.. నాథ్ శాఖకు చెందిన ఎనిమిదవ ప్రధాన మహంత్. రాజస్థాన్లోని అల్వార్ స్థానానికి చెందిన లోక్సభ ఎంపీ కూడా. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. అక్కడ ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్పై 6173 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజస్థాన్ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు నాటి నుంచి సీఎం అభ్యర్థిగా బాబా బాలక్నాథ్ పేరు వినిపిస్తోంది. రాజస్థాన్ కొత్త సీఎం రేసులో ముందంజలో ఉన్న బాబా బాలక్నాథ్ నేటి(సోమవారం) మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆయన బీజేపీ హైకమాండ్ నేతలతో భేటీ కానున్నారు. రాజస్థాన్లో బాబా బాలక్నాథ్కు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించవచ్చని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. రాజస్థాన్లో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని మొదటి నుంచి అంతా భావించారు. అయితే ఫలితాలలో బీజేపీ మెజారిటీ సాధించింది. బీజేపీ 115, కాంగ్రెస్ 69, భారతీయ ఆదివాసీ పార్టీ 3, బీఎస్పీ 2, ఆర్ఎల్డీ 1, ఆర్ఎల్టీపీ 1 సీట్లు గెలుచుకున్నాయి. ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. వీరిలో చాలా మంది బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: భార్యను ఓడించిన భర్త.. అన్నను మట్టికరిపించిన చెల్లి! -
అది కింగ్మేకర్ ప్రాంతం.. గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయం?
మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టేవారికి ‘మాల్వా-నిమాడ్’ ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఈ ప్రాంతం ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమని చెబుతుంటారు. మాల్వా-నిమాడ్ ప్రాంతంలోని 15 జిల్లాల్లో మొత్తం 66 సీట్లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత మాల్వా-నిమాడ్ మధ్యప్రదేశ్లో కింగ్మేకర్గా మారిపోయింది. ఈ ప్రాంతంలో తమ జెండాను ఎగురవేసిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాల్వా-నిమాడ్ ప్రాంతం కీలకంగా కనిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మాల్వా-నిమాడ్లో విజయం సాధించడమే ప్రధాన కారణమంటారు. ఇక్కడి 35 స్థానాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేవలం 28 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భోపాల్ సింహాసనాన్ని అధిష్టించేందుకు కాంగ్రెస్కు మాల్వా-నిమాడ్ విజయం ఎంతగానో సహాయపడింది. 2013 అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే మాల్వా-నిమాడ్లో బీజేపీ 57 సీట్లు గెలుచుకుని ప్రకంపనలు సృష్టించింది. నాడు కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. మాల్వా-నిమాడ్ సీట్లలో విజయం సాధించిన కారణంగా 2013లో బీజేపీ ప్రభుత్వం, 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే ఈసారి కూడా ఈ ప్రాంతంపై రెండు పార్టీలూ దృష్టిపెట్టాయి. ఇది కూడా చదవండి: అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం! -
లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం?
మిజోరం.. దేశంలోని ఒక చిన్న రాష్ట్రం... అసెంబ్లీ కూడా చిన్నదే. 40 మంది సభ్యుల ఈ అసెంబ్లీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలో నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కారణంగా దేశవ్యాప్తంగా మిజోరం రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈసారి మిజోరంలో ముక్కోణపు పోటీ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్తో పాటు, ఈసారి లాల్దుహోమా నేతృత్వంలోని జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ)కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దీంతో లాల్దుహోమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. యువత నుంచి లాల్దుహోమాకు అత్యధిక ఆదరణ దక్కుతోంది. మిజోరాం అభివృద్ధి గురించి, కాంగ్రెస్, ఎంఎన్ఎఫ్ నుంచి రాష్ట్రానికి విముక్తి చేయడం గురించి ఆయన మాట్లాడుతున్నారు. మిజోరాం సీఎంకు లాల్దుహోమా గట్టి పోటీదారు అని ఇక్కడివారంతా చెబుతున్నారు. ఇంతకీ లాల్దుహోమా ఎవరు? యువత ఆయనకు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? లాల్దుహోమా మిజోరంనకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. 1977లో ఐపీఎస్ పూర్తి చేశాక, గోవాలో స్క్వాడ్ లీడర్గా విధులు నిర్వహిస్తూ స్మగ్లర్ల ఆటకట్టించారు. లాల్దుహోమా సాధించిన విజయాలు మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. లాల్దుహోమా 1984లో ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన పేరిట ఓ ప్రత్యేక రికార్డు కూడా ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన మొదటి ఎంపీగా లాల్దుహోమా నిలిచారు. 1988లో కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకున్నందుకు లోక్సభ నుండి బహిష్కరణకు గురయ్యారు. లాల్దుహోమా.. జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ)వ్యవస్థాపక అధ్యక్షుడు. 2018 మిజోరాం శాసనసభ ఎన్నికల్లో జెడ్ఎన్పీ నేతృత్వంలోని జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) కూటమి మొదటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన నిలిచారు. ఐజ్వాల్ వెస్ట్-1, సెర్చిప్ నియోజకవర్గాల నుండి ఎన్నికైన లాల్దుహోమా.. సెర్చిప్కు ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గుచూపారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2020లో శాసనసభ సభ్యునిగా అనర్హుడయ్యారు. ఇది భారతదేశంలోని రాష్ట్ర శాసనసభలలో మొదటి ఉదంతంగా నిలిచింది. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో సెర్చిప్ నుంచి లాల్దుహోమా తిరిగి ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి! -
కార్మికులతో ఉత్తరాఖండ్ సీఎం విందు
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లోని తన నివాసంలో ఆ కార్మికుల కుటుంబాలతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ కార్మికుల కుటుంబాలతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. డెహ్రాడూన్లోని సీఎం నివాసం వద్ద పటాకులు పేల్చారు. అనంతరం సీఎం ఆ కార్మికుల కుటుంబాలను సన్మానించారు. ఈ వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. దీపావళి రోజున జరిగిన ఈ ప్రమాదంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబాలవారు దీపావళి జరుపుకోలేదు. అందుకే డెహ్రాడూన్లోని సీఎం నివాసంలో వారంతా ఇప్పుడు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రెస్క్యూ తర్వాత చిన్యాలిసాన్ సీహెచ్సీలో చేరిన కార్మికులకు సీఎం ధామి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు. ఇది కూడా చదవండి: థాయ్లాండ్లోనూ అయోధ్య.. ఇక్కడి రాజే రాముని అవతారం! #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami and family members of the 41 workers have dinner together at his residence in Dehradun during 'Igas Bagwal' celebrations. pic.twitter.com/MUzO60jlRG — ANI (@ANI) November 29, 2023 -
ఈడీ, ఐటీలతో కలిసి బీజేపీ పోటీ : ఛత్తీస్గఢ్ సీఎం
రాయ్పూర్ : బీజేపీని ఈ నెల 17 దాకా ఎంజాయ్ చేయనివ్వండని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్ చమత్కరించారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో వచ్చిన ఆరోపణలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశలపై ఏమైనా ప్రభావం చూపుతాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు భగేల్ నవ్వుతూ సమాధానమిచ్చారు. బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం లేదని తన మిత్రులు ఈడీ, ఐటీలతో కలిసి పోటీ చేస్తోందని భగేల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు తమ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ తెర మీదకు తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న విషయంలో ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అవసరమైతే పార్టీ తరపున ఫిర్యాదు చేస్తామన్నారు. ఈసీ ఈ విషయంలో విచారణ జరపాలని కోరారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ మంగళవారం జరగనుంది. రెండవ విడత పోలింగ్ ఈ నెల 17న నిర్వహిస్తారు. -
13 నుంచి కేసీఆర్ మలివిడత ప్రజా ఆశీర్వాద సభలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మలివిడత ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్ ఖరారైంది. తొలి విడతలో అక్టోబర్ 15 నుంచి ఈనెల 3 వరకు 30 నియోజకవర్గాల్లో ఇప్పటికే సభలను నిర్వహించారు. 5వ తేదీ నుంచి 8 వరకు మరో 11 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇవి పూర్తికాగానే 5 రోజుల విశ్రాంతి అనంతరం 13 నుంచి 28వ తేదీ వరకు 16 రోజుల పాటు నిర్విరామంగా సీఎం పర్యటన కొనసాగేలా మలి విడత షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో సీఎం పాల్గొంటారు. ఈనెల 25న హైదరాబాద్లో భారీ సభను నిర్వహించనున్నారు. రెండో విడత పర్యటనలో ఒక్కో రోజు 3–4 నియోజకవర్గాల్లో సభలను నిర్వహించనున్నారు. ప్రచారానికి చివరి రోజైన 28న గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ పర్యటన ముగియనుంది. దీంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తయ్యేలా షెడ్యూల్ను పార్టీ రూపొందించింది. -
బీసీ సీఎం ప్రకటనపై బీజేపీ కార్యాలయంలో సంబురాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని బీజేపీ అధిష్టానం చేసిన ప్రకటనకు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు సంబురాలు జరిపారు. పార్టీ ఆఫీస్ బయట పటాసులు కాల్చి, డప్పులు వాయిస్తూ, స్వీట్లు పంచుకున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పార్టీ నేతలు క్షీరాభిషేకం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఓబీసీ మెర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, పార్టీ నేతలు ఆకుల విజయ, టి.వీరేందర్గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా ప్రకటన చరిత్రాత్మకమని అన్నారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభా ఉన్నా రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించాయని చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని, దీనిపై బీసీ సమాజం ఆలోచించాలని అన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కేసీఆర్కు బీసీలంటే చిన్నచూపని ఆరోపించారు. బీజేపీ 40 స్థానాలకు పైగా బీసీలకు అవకాశాలు కల్పించబోతోందని, తెలంగాణ సమాజం నిండు మనస్సుతో పార్టీని ఆశీర్వదించాలని కోరారు. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదని అన్నారు. సీఎం స్థానం బీజేపీ బీసీలకు ఇవ్వడం బీసీ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. -
బీజేపీకి బీసీ బూస్ట్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన ఓవైపు.. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని ఆయన చేసిన ప్రకటన మరోవైపు ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాయి. బీసీలకు రాజ్యాధికారంలో ప్రాధాన్యత, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని కొంతకాలం నుంచి చెప్తున్న బీజేపీ అధిష్టానం.. అధికారికంగా బీసీ ఎజెండాను ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఆ వర్గాలు ఎంతమేర ప్రభావితం అవుతాయి, ఏ మేర ఓట్లుగా మారుతాయని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందే బీసీని సీఎం చేస్తామని ఇలా ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమేనని నేతలు అంటున్నారు. అంతేకాదు ఆ బీసీ అభ్యర్థి ఎవరనేది కూడా ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. బీజేపీ చిత్తశుద్ధిని చాటేలా.. 2014లోనే ఓబీసీ వర్గానికి చెందిన మోదీని ప్రధాని చేయడం, 2019లోనూ ఆయననే కొనసాగించడం, మోదీ కేబినెట్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా 27 మంది బీసీ, ఓబీసీ మంత్రులు, ఎస్సీ,ఎస్టీలకూ సముచిత సంఖ్యలో మంత్రి పదవులను బీజేపీ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా తెలంగాణలో బీసీ సీఎం ప్రకటన పార్టీ చిత్తశుద్ధిని చాటేలా ఉందని అంటున్నాయి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం రాష్ట్ర పర్యటన సందర్భంగా అమిత్షా పలువురు ముఖ్యనేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. గురువారం రాత్రి అమిత్షాతో కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ వేర్వేరుగా సమావేశమైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి శుక్రవారం ఢిల్లీ వెళ్లే ముందు బేగంపేట విమానాశ్రయంలో అమిత్షాను కలసి ‘ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్ట్’ప్రతిని అందజేశారు. దానిని జాతీయ నాయకత్వం పరిశీలించి ఖరారు చేయనుంది. -
CM KCR AI Looks: కేసీఆర్ కొత్త ఏఐ ఫొటోస్..
-
CM Breakfast Scheme: తెలంగాణలో సీఎం అల్పాహార పథకం ప్రారంభం
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో సర్కారీ బడుల విద్యార్థుల కోసం.. సీఎం అల్పాహార(బ్రేక్ఫాస్ట్) పథకం ప్రారంభమైంది. మహేశ్వరం మండలం రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు శుక్రవారం ఉదయం ఈ పథకం ప్రారంభించారు. మరోవైపు అదే సమయంలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలోని ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. విద్యార్థులను బడికి రప్పించడం, వారికి తగిన పౌష్టికాహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,147 సర్కార్ బడుల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ అందించనుంది. తరగతుల ప్రారంభం కంటే అరగంట ముందు విద్యార్థులకు ఈ టిఫిన్ అందిస్తారు. సాంబార్ ఇడ్లీ, పూరీ–ఆలూ కుర్మా, ఉప్మా, వెజిటబుల్ పలావ్, ఉగ్గాని.. ఇలా సర్కార్ బడులలో విద్యార్థులకు ఉచితంగా.. వేడి వేడిగా రోజుకో అల్పాహారం అందించేలా మెనూ ఇప్పటికే ఖరారయ్యింది. ఇక.. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవులు పూర్తి కాగానే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అల్ఫాహార నాణ్యతను పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు పాఠశాలల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేస్తారని ప్రభుత్వం చెబుతోంది. -
రాజస్థాన్లో బీజేపీ ముఖచిత్రం ఎవరంటే..?
చిత్తోఢ్: రాజస్థాన్లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల్లో అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. సీటు దక్కించుకోవడానికి నాయకుల అలకలు బయటపడుతున్నాయి. ఇటీవల బీజేపీ నిర్వహించిన పలు సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజేతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు గౌర్హాజరైన నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సీఎం అభ్యర్థిపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చిత్తోఢ్లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. నేరాల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రథమ స్థానంలో నిలిపిందని ఆరోపించారు. సీఎం అశోక్ గహ్లోత్ హయంలో రాష్ట్రంలో అల్లర్లు, రాళ్లదాడులు, మహిళలపై ఆకృత్యాలు, దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఇందుకే ఓటేశారా..? అని ప్రశ్నించారు. బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు చెలరేగుతున్న క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరని ప్రధాని మోదీని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు..' బీజేపీకి ముఖచిత్రం కమలమే. ప్రజలు కమలాన్ని మాత్రమే చూస్తారు. బీజేపీ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. రాజస్థాన్ అభివృద్ధికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన్యతనిస్తుంది.' అని అన్నారు. ఈ మేరకు చిత్తోఢ్లో రూ.7000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. మాజీ సీఎం వసుంధర రాజే, సీనియర్ నాయకుల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. సీఎం అభ్యర్థిగా తమను ప్రకటించాలని సీనియర్ నాయకులు అధిష్ఠానాన్ని అభ్యర్థిస్తున్నారు. మళ్లీ రాజేకే పట్టం కట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ చీఫ్ నడ్డా రాష్ట్ర నాయకులతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఇదీ చదవండి: విపక్షాలకు విజన్ లేదు, రోడ్మ్యాప్ లేదు -
యూపీ సీఎంపై మహంత్ తీవ్ర వ్యాఖ్యలు.. పోలీసులతో వాగ్వాదం
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని దాస్నాదేవి ఆలయ ప్రధాన పూజారి(మహంత్) యతి నరసింహానంద్ సరస్వతి సీఎం యోగి ఆదిత్యానంద్ను కలుసుకునేందుకు బయలుదేరారు. ఈ నేపధ్యంలో అతనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని నిందించడమే కాకుండా సీఎంను ఉద్దేశిస్తూ, ఆధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే యతి నరసింహానంద్ గత 27న మీరఠ్లోని ఖజురీ గ్రామానికి వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఏడాది క్రితం దీపక్ త్యాగి హత్య జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆ గ్రామానికి వెళ్లాలని భావించారు. అయితే స్థానిక పోలీసులు ఆయనను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో యతి నరసింహానంద్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్కు తన రక్తంతో ఒక ఉత్తరం రాశారు. ఘజియాబాద్ నుంచి లక్నో వరకూ పాదయాత్రగా వెళ్లి, ఆ ఉత్తరాన్ని యోగి ఆదిత్యానంద్కు ఇవ్వాలనుకున్నారు. అయితే పోలీసులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ములాయం, మాయావతి, అఖిలేష్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తనను పోలీసులు ఎప్పుడూ అడ్డుకోలేదని, ఇప్పుడు యోగి ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులు తనను అడ్డుకున్నారని ఆరోపించారు. యూపీ ముఖ్యమంత్రి రావణాసుసురుడికంటే తక్కువవాడేమీ కాదని పేర్కొన్నారు. సీఎం పోలీసుల మాటనే వింటున్నారని, తన మాట వినడం లేదని యతి నరసింహానంద్ ఆరోపించారు. కొద్దిసేపు యతి నరసింహానంద్కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం పాదయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో అతని శిష్యులు 10 రోజుల పాటు పాదయాత్ర చేసి, ఆ లెటర్ను అక్టోబరు 8న సీఎంకు అందివ్వనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్ -
కేటీఆర్ షాడో సీఎం
సుభాష్ నగర్ (నిజామాబాద్): మంత్రి కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని... తండ్రిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. వచ్చే నెల 3న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ కోసం నిజామాబాద్లోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ 1న పాలమూరులో, 3న ఇందూరులో నిర్వహించే బహిరంగ సభలలో ప్రధాని పాల్గొంటారన్నారు. ఇందూరు సభలో ప్రధాని మోదీ రామగుండం ఎన్టీపీసీలోని 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదేం? ప్రధాని రాష్ట్రానికి వచ్చే ముందు తెలంగాణకు ఏం మేలు చేశారో చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించడాన్ని విలేకరులు కిషన్రెడ్డి వద్ద ప్రస్తావించగా ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ కేటీఆర్ జాగీరు కాదంటూ విమర్శించారు. ప్రభుత్వం 17 సార్లు టీఎస్పీఎస్స్సీ పరీక్షలు నిర్వహించినా యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు. అలాగే దళిత సీఎం హామీతోపాటు దళితులకు మూడెకరాల చొప్పున భూపంపిణీ హామీని సైతం అటకెక్కించారని... రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఏం మేలు చేశారో చెప్పాలని ప్రతిగా కేటీఆర్ను ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయమై విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వంతో మాట్లాడి చెప్తానంటూ దాటవేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఉన్నారు. మోదీ సభకు లక్ష మందితో జనసమీకరణ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వచ్చే నెల 3న జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను జయప్రదం చేసేలా ప్రతి కార్యకర్త పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సూచించారు. మంగళవారం నిజామాబాద్లోని బస్వా గార్డెన్లో ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. సభకు లక్ష మందికిపైగా ప్రజలను సమీకరించాలన్నారు. మజ్లిస్ ప్రోద్బలంతోనే లవ్జిహాదీలు ఖలీల్వాడి: తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ ప్రోద్బలంతోనే లవ్జిహాదీలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లిలో మరో వర్గం యువకుడి దాడిలో గాయపడిన యువతి, వారి కుటుంబసభ్యులను మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కిషన్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మజ్లిస్ను బుజ్జగింపుల నేపథ్యంలోనే లవ్జిహాద్తో హిందూ, క్రిస్టియన్ యువతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రేమ పేరుతో వలలో వేసుకోవడానికి కొన్ని సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని ఆరోపించారు. -
తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ రోజు మరుపురానిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారని అన్నారు. ప్రగతి భవన్ వేదికగా ఆన్లైన్లో ఈ కార్యక్రమం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, భూపాలపల్లి, కుమరంభీమ్, సిరిసిల్ల,నిర్మల్, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ కలను సాధిస్తున్నామని అన్నారు. బోధన కాలేజీలే కాకుండా అనుబంధ ఆస్పత్రులను కూడా నెలకొల్పినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో 50 వేల పడకల్ని ఆక్సిజన్ బెడ్లుగా తయారు చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 500 టన్నుల ఆక్సిజన్ను రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణను ఎగతాళి చేసినవాళ్లకు ఇదో మంచి ఉదాహరణ అని అన్నారు. దేశంలో వైద్య రంగంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో మరణాల రేటు కూడా తగ్గించామని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య నాలుగు రెట్లకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 21కి చేరింది. కొత్త కాలేజీలతో కలిపి తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 8,515కు పెరిగింది. ఇదీ చదవండి: తెలంగాణలో ప్రారంభమైన టెట్ పరీక్ష -
ఆ ఊళ్లో బసచేస్తే మంత్రి పదవి ఊడిపోతుండట!
కొందరు బడాబాడా నాయకులకు సైతం అనేక మూఢనమ్మకాలను కలిగి ఉంటారు. ఇలాంటివారు కొన్ని నమ్మకాలను అనుసరిస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. ఈనాటికీ చాలామంది నాయకులు రాత్రివేళ ఆ ప్రాంతంలో బస చేయాలంటే సంకోచిస్తారట. ఇలా చేయడం వల్ల వారు తమ పదవులకు కోల్పోతారట. ఈ ప్రదేశం మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ ఏ ముఖ్యమంత్రి లేదా మంత్రి రాత్రి బసచేయాలంటే భయపడిపోతారు. ఎందుకంటే రాత్రిపూట అక్కడ బస చేసిన ఏ మంత్రీ తిరిగి అధికారంలోకి రాలేదని చెబుతుంటారు. చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రాత్రవేళ బసచేసే ధైర్యం చేయరు. మహాకాళేశ్వరుడు కొలువై ఉండటమే ఇందుకు కారణమని భావిస్తారు. ఉజ్జయినిలో కొలువైన మహారాజు.. మహాకాళేశ్వరుడేనని, అందుకే అక్కడ మరే ఇతర రాజు ఉండడం తగదని అంటుంటారు. అలా చేస్తే శిక్ష అనుభవించాల్సి వస్తుందని అంటారు. దీనికి పౌరాణిక కథలను ఉదాహరణలుగా చూపిస్తుంటారు. చాలామంది నేతలు ఇదే నమ్మకాన్ని కలిగివుండటంతో మిగిలిన నేతలు కూడా వారిని అనుసరిస్తున్నారు. మహాకాళీశ్వరుని ముందు తలవంచి, నమస్కరిస్తూ పూజలు చేసినప్పటికీ.. ఏనాయకుడూ రాత్రివేళ ఇక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఎంతటి అధికార బలం ఉన్నా ఇక్కడికి వస్తే వాటిని పోగొట్లుకోవడం ఖాయమని అంటున్నారు. ఇలాంటి నమ్మకాలు కేవలం ఉజ్జయినిలో మాత్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. కొంతమంది ఇందుకు వాస్తు దోషాలను కారణంగా చూపుతుంటారు. ఇది కూడా చదవండి: హిజ్రాల పెళ్లి వేడుక ఏడుపుతో ఎందుకు ముగుస్తుంది? ఇదేమైనా సంప్రదాయమా? -
TS Election 2023: సీఎం పర్యటనపై ఆసక్తి..! సిట్టింగ్లు, ఆశావహుల్లో టెన్షన్..!!
నల్లగొండ: సాధారణ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్కు సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించబోతున్నారు. వివిధ కార్యాలయాల ప్రారంభోత్సవాల అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నందున ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి తెర తీస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈసారి దక్షిణ తెలంగాణ నుంచే సీఎం తన ప్రచారాన్ని ప్రారంభిస్తారనే చర్చకు ఇది నాందికాబోతోందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయడంతోపాటు ప్రతిపక్షాలపై ఎలాంటి అస్త్రాలు సందిస్తారన్న చర్చ ప్రజల్లో సాగుతోంది. కాగా, సూర్యాపేటలో సీఎం బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలకు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించి జనసమీకరణ చేపట్టారు. ఒకరకంగా దీన్ని ఎన్నికల ప్రచార సభలాగే భావించి ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసినందున ఈ సభ ద్వారానే మళ్లీ ఎన్నికల వేడి పుట్టించేలా సీఎం ప్రసంగం ఉండబోతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో ఉత్కంఠ! రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల కసరత్తు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఏం మాట్లాడతారోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆశావహుల్లోనూ టెన్షన్ నెలకొంది. పార్టీ అభ్యర్థులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తారా? టికెట్లకు సంబంధించిన స్పష్టత ఇస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి టికెట్లను ఎవరికి ఇవ్వాలన్న విషయంలో అధినేత ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సభలో ఆ ప్రకటన చేస్తారా? లేదంటే ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేసి, చేసిన సంక్షేమాభివృద్ధినే ప్రాధాన్యంగా తీసుకొని మాట్లాడతారా? అన్న చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ.. ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి.. ఒకొక్కటి వదులుతాం అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి టూర్ షెడ్యూల్ ఇలా.. ఉదయం 11 గంటలకు సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల హెలిపాడ్కు చేరుకుంటారు. 11.10కి మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారు. 11.35కి ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను ప్రారంభిస్తారు. 12 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 12.30కి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 1.15కు కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. 1.45నుంచి 2.45 వరకు భోజన విరామం 2.45కి నూతన కలెక్టరేట్ నుంచి బయలుదేరి 3 గంటలకు ప్రగతి నివేదన సభకు హాజరవుతారు. 4.10కి సభాస్థలి నుంచి బయలుదేరి నేరుగా హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. 4.25కు హైదరాబాద్కు బయలుదేరుతారు. సిట్టింగ్లకే టికెట్లని చెప్పినా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని సీఎం పలుమార్లు స్పష్టం చేశారు. అయినా సర్వేల ఆధారంగానే గెలుపునకు అవకాశాలు ఉన్న వారికే టికెట్లు కేటాయించే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే పలు నియోజకవార్గల్లో ఆశావహులు టికెట్ తమకు ఇస్తారేమోనన్న ఆశతో ఫౌండేషన్లను ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని నాగార్జునసాగర్, దేవరకొండ తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్లో నోముల భగత్పై ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం వ్యతిరేకతతో ఉంది. బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్, కంచర్ల చంద్రశేఖర్రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. శనివారం పెద్దవూరలో కంచర్ల చంద్రశేఖర్రెడ్డి నిర్మించిన ఫంక్షన్ హాల్ను ఆయన అల్లుడు, సినీ హీరో అల్లు అర్జున్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సాగర్ నియోజకవర్గానికే చెందిన ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరు కావడం చర్చనీయంశంగా మారింది. దేవరకొండలో రవీంద్రకుమార్కు టికెట్ ఇస్తే తాము పనిచేయబోమని నియోజకవర్గ నేతలు ఆలంపల్లి నర్సింహ, దేవేందర్నాయక్ తదితరులు శనివారం హైదరాబాద్కు వెళ్లి మంత్రి హరీష్రావు, పల్లా రాజేశ్వర్రెడ్డిని కలిసి చెప్పారు. వీటితోపాటు కోదాడ, నకిరేకల్ వంటి నియోజకవర్గాల్లోనూ నెలకొన్న సమస్యలపై సూర్యాపేట సభ ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు. -
TS Election 2023: ఎన్నికలు వస్తున్నాయ్..! కేసీఆర్ సీఎం అవడం ఖాయం..! : మంత్రి గంగుల
కరీంనగర్: కరీంనగర్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. విదేశాల నుంచి మన దేశానికి వచ్చే పర్యాటకులు కరీంనగర్ను ఎంచుకునేలా నగరం మారబోతోందన్నారు. నూతనంగా నిర్మించిన గణేశ్నగర్ బైపాస్ రోడ్డును గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్పై వీధి దీపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. భావితరాలకు అద్భుతమైన నగరాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోగా ఎల్ఎండీ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు నీటిని నిలిపి, బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ తనకు ఇష్టమైన ప్రాజెక్టు అని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందబోతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన ఫౌంటెయిన్లలో మొదటిది యోషోలో, రెండోది చైనాలో ఉన్నాయని, మూడోది కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి స్వార్థం లేదని, నగర అభివృద్ధి, ప్రజల సంతోషమే ముఖ్యమన్నారు. గణేశ్నగర్ రోడ్డుకు డ్రైనేజీతో సమస్య ఉండేదని, అయితే దాన్నే మాయం చేయాలన్న ఆలోచనతో రోడ్డు నిర్మించామని తెలిపారు. నగరంలో మరో రూ.130 కోట్లతో అంతర్గత రోడ్లు నిర్మిస్తామన్నారు. కేసీఆర్.. మరోసారి సీఎం.. ఎన్నికలు వస్తున్నాయని, కేసీఆర్ మరోసారి సీఎం అవడం ఖాయమని మంత్రి గంగుల అన్నారు. మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ.. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న గణేశ్నగర్ బైపాస్ రోడ్డును మంత్రి చేతులమీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళా వాకర్స్ ఇబ్బంది పడకుండా అంబేడ్కర్ స్టేడియంలో లైట్లు, ప్రత్యేకంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రణాళిక ప్రకా రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తాను తమిళనాడుతోపాటు తెలంగాణలోని పలు పట్ట ణాలను చూశానన్నారు. కానీ కరీంనగర్ బా గుందని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి, మేయర్లకు కాలనీవాసులు మంగళహారతులతో స్వాగతం పలికి, సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఎస్పీ రఘువీర్రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్రెడ్డి మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీ దుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2021లో రాజమండ్రి ఇంటలిజెన్స్ విభాగంలో ఉత్తమ సేవలను అందించిన ఎస్పీని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం మెడల్ అందజేసి అభినందించారు. ఎస్పీ సర్వీసులో కొన్ని ముఖ్యమైన అంశాలు ► సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై లోతైన విచారణ చేశారు. 2019లో మంటూరు (దేవీపట్నం) పడవ ప్రమాదానికి గల కారణాలపై సాంకేతిక విశ్లేషణ, ఉదాసీనత కలిగిన ప్రభుత్వోద్యోగులు, ప్రమాదం సంభవించకుండా ఉండుటలో ప్రధాన పాత్ర పోషించారు. ► గోదావరి జిల్లాల్లోని పేదలకు, రంపచోడవరం చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ గిరిజనులకు వైద్య, ఆరోగ్య సదుపాయాలపై విశ్లేషణ, మెడికల్ కాలేజీ, మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ఆవశ్యకతపై చర్యలను ప్రభుత్వానికి సూచించారు. ► అన్నవరం దేవస్థానం పాలనాపరమైన ఆరోపణలపై విచారణ చేశారు. ► గోదావరి జిల్లాల్లో జరుగుతున్న నకిలీ పాస్పోర్టు మోసాలపై కొన్ని ఆధారాలతో పాటు ఆధారాలతో అప్రమత్తం చేశారు. ► తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్ల్లో ఇసుక రవాణా ప్రధాన సమస్య. దీంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటానికి, పారదర్శకతను కొనసాగించడానికి, ఇసుక రవాణాపై నిశిత నిఘా ఉంచారు. -
విస్తృత భేటీలు.. ముమ్మర ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్డ్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది. ఆయా భేటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, నేతలు అరవింద్ మీనన్, తరుణ్ఛుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు. పార్టీ నేతలతో జవదేకర్ భేటీ తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్ జవదేకర్ శుక్రవారం మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
లంచం ఇవ్వాలని మంత్రి ఒత్తిడి.. లేఖపై రాజకీయ దుమారం..!
బెంగళూరు: కర్ణాటకాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తమను నెలనెలా లంచం సమర్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఒత్తిడి చేస్తున్నారని సంబంధిత శాఖ డైరెక్టర్లు రాసిన లేఖ ఒకటి బయటపడింది. అది నకిలీదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రిపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి నెలకు రూ.8 లక్షల వరకు లంచం సమర్పించాలని ఆ శాఖకు చెందిన డైరెక్టర్లను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్కు బాధిత డైరెక్టర్లు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ ఒకటి బయటపడింది. ఇలా ఒత్తిడి చేస్తే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందంటూ బాధితులు గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరుగా ప్రభుత్వం మారిపోయిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఇది ప్రతిపక్షాల కుట్రగా పేర్కొన్నారు. ఆ లేఖ నకిలీదని గుర్తించినట్లు చెప్పారు. తన ప్రభుత్వంపై బురదజల్లడానికి బీజేపీ, జేడీఎస్లు ఆడిన నాటకని అన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ.. -
కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడంలో ఉమ్మడి కరీంనగరే కీలకం..
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయడంలో ఉమ్మ డి కరీంనగర్ జిల్లా కీలకపాత్ర పోషిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. 2001లో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తిరుగులేని ఆధిక్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, ఈసారి కూడా అది పునరావృతం అవుతుందని చెప్పారు. సోమవారం మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రగతిభవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్తో కేసీఆర్కు, తెలంగాణ ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. 2001 నుంచి నేటి వరకూ జిల్లా ప్రజలతో మమేకమై, తీసుకున్న ప్రతీ కార్యక్రమం విజయవంతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా పనిచేస్తుందన్నారు. తాజా సర్వేల్లోనూ, అన్ని నివేదికల్లోనూ ఈసారి ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు ఎదురులేదని స్పష్టమైందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ ల డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా రాబోయే మూడునెలలు పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులు మొదలు కార్యకర్త వరకూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేలా యాక్షన్ప్లాన్ రూపకల్పన చేయాలని ఆదేశించారు. చదవండి: కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడంలో ఉమ్మడి కరీంనగరే కీలకం.. బీఆర్ఎస్ కంచుకోటగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రౌండ్క్లియర్ ఉందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి జైత్రయాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పారు. కనీస పోటీనిచ్చే పరిస్థితిలో ప్రతిపక్షాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి, రమేశ్బాబు, సతీశ్కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డి, సంజయ్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఎల్.రమణ, పాడి కౌశిక్రెడ్డి పాల్గొన్నారు. -
న్యూడ్ కాల్తో.. మాజీ సీఎం ఓఎస్డీకి వల..
కర్ణాటక: ఆయనో పెద్ద అధికారి, పైగా మాజీ ముఖ్యమంత్రి వద్ద పనిచేస్తున్నారు, కానీ న్యూడ్ కాల్లో చిక్కుకుపోయి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. మాజీ సీఎం ఓఎస్డీ హనీట్రాప్లో ఇరుక్కున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు... బెంగళూరు మల్లేశ్వరం నివాసి ఓ మాజీ సీఎం వద్ద ప్రత్యేకాధికారిగా ఉన్నారు. పని మీద మహారాష్ట్ర నాసిక్ కు వెళ్లి అక్కడ అతిథి గృహంలో బసచేశారు. గత నెల 12 తేదీ రాత్రి 8 గంటల సమయంలో స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటికి వస్తుండగా గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ మాట్లాడగా అపరిచిత మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. వారే కాల్ కట్ చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం మరో నంబర్నుంచి కాల్చేసి మహేంద్రసింగ్ అని పరిచయం చేసుకున్నాడు. న్యూడ్ కాల్ చేశారని మహిళ ఫిర్యాదు చేసిందని, వీడియోను యూట్యూట్, ఫేస్బుక్, వాట్సాప్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. లేదంటే డబ్బివ్వాలని అడిగాడు, రత్నేశ్కుమార్ పేరుతో రెండు బ్యాంకు అకౌంట్లు పంపించి నగదు జమ చేయాలన్నాడు. ఓఎస్డీ మొత్తం రూ.4.80 లక్షలు పంపించాడు. మళ్లీ రూ.7.2 లక్షలకు డిమాండ్ చేయడంతో బాధితుడు బెంగళూరుకు చేరుకుని పోలీస్ కమిషనర్ దయానంద్ను కలిసి వివరించి సైబర్క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
థ్యాంక్యూ సీఎం జగన్ సార్!
విశాఖపట్నం: ఉన్నత విద్య అభ్యసించాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. కానీ ఇంట్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆలోచనల్లో పడేశాయి. ఇక అది కలగానే మిగిలిపోతుందని అనుకున్నాను. మధ్యతరగతి కుటుంబాలకు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడం సాధ్యం కాదని ఆశలు వదులుకున్నాను. కానీ జగనన్న ప్రవేశ పెట్టిన ఈ పథకం వల్ల నా కల నెరవేరింది. ప్రస్తుతం ఈ పథకం వల్ల అందిన సాయంతో న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్లో చేరబోతున్నాను. తీరదనుకున్న నా కలని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. థాంక్యూ సీఎం సార్. – సీహెచ్ లక్ష్మీకిరణ్మయి, మాధవధార -
ఆకాశమే హద్దు..!
సత్యసాయి: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపుతున్నారు. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా విప్లవమే తీసుకురావచ్చని భావించి దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, రైతులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంతోపాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విస్తృత ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు.. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కు అనుబంధంగా ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ (ఏపీడీసీ)ను 2018 నవంబరులో ఏర్పాటు చేశారు. ఎం.మధుసూదన్రెడ్డి దీనికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయటంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది. డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి, తయారీ, నిర్వహణ రంగంలో ఉన్న స్టార్టప్ కంపెనీలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. డీజీసీఏ నిబంధనల మేరకు డ్రోన్ల నిర్వహణను క్రమబద్ధం చేయటంతో పాటు రక్షణాత్మక చర్యలు చేపడుతోంది. డ్రోన్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నతంగా నిలబెట్టేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది. అన్ని రంగాల్లోనూ డ్రోన్ల వినియోగం.. రానున్న కాలంలో రైతులంతా డ్రోన్లను వినియోగించే నైపుణ్యం సాధిస్తారని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగం అన్ని రంగాల్లో పెరిగిపోతోందని చెప్పారు. పరిపాలన, పోలీస్, వ్యవసాయం, గనులు, ఇన్సూరెన్స్, మీడియా, వినోద రంగాల్లో డ్రోన్లను వినియోగించటం ద్వారా మానవ వనరులు, సమయం, డబ్బు ఆదా అవుతోందని, కచ్చితత్వం ఉంటోందని చెప్పారు. డ్రోన్ వినియోగ నిబంధనలను పౌర విమానయాన శాఖ సడలించినందున డ్రోన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేతో ప్రాధాన్యం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే కార్యక్రమంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కిసాన్ డ్రోన్లను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వచ్చే నెలలో మరో 500 కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ద్వారా రైతులకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇస్తున్నారు. పంటలకు ఎరువులు వేయటం, పురుగు మందులు చల్లడం వంటివి డ్రోన్ల ద్వారా చేపట్టటం ద్వారా వృథాను అరికట్టడంతో పాటు రైతులను ప్రమాదకర పురుగుమందుల బారి నుంచి రక్షించవచ్చు. నిబంధనలు సరళతరం.. డ్రోన్లు లేదా యూఏవీ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్)ల నిర్వహణను చట్టబద్ధం చేస్తూ 2021 ఆగస్టు 26న పౌర విమానయాన శాఖ కొత్త పాలసీని ప్రకటించింది. 2022లో నిబంధనలను మరింత సరళతరం చేస్తూ పాలసీలో సవరణలు తీసుకువచ్చింది. 2 కిలోల లోపు బరువు ఉన్న వినోదం కోసం ఉపయోగించే డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు ఎలాంటి రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ అవసరం లేదు. డ్రోన్లను ప్రభుత్వం అయిదు కేటగిరీలుగా వర్గీకరించింది. 250 గ్రాములలోపు బరువు ఉండేది నానో డ్రోన్. 250–2 కిలోల మధ్య బరువు ఉంటే మైక్రో డ్రోన్. 2 కిలోల నుంచి 25 కిలోల మధ్య బరువు ఉండేవి చిన్న డ్రోన్లు. 25–150 కిలోల మధ్య బరువు ఉండే డ్రోన్లను మధ్యస్థ డ్రోన్లుగానూ 150 కిలోల పైగా బరువు ఉండేవాటిని పెద్ద డ్రోన్లుగానూ వర్గీకరించారు. అనుమతులు తప్పనిసరి.. నానో, మైక్రో కేటగిరీల్లోని నాన్ కమర్షియల్ డ్రోన్లను మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల డ్రోన్ల ఆపరేషన్కు డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ ఫాం నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సిందే...డ్రోన్ల ద్వారా సరుకుల రవాణా కోసం ప్రభుత్వం ప్రత్యేక కారిడార్లను నిర్దేశిస్తుంది. రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందాలంటే అధీకృత సంస్థలో నిర్దేశిత కాలం పైలెట్ శిక్షణ పొంది ఉండాలి. శిక్షణ సంస్థ నుంచి పొందిన సర్టిఫికెట్తో పాటు నైపుణ్య పరీక్ష తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లిస్తే డీజీసీఏ(సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం) పైలెట్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఇది పది సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కనీసం టెన్త్ పాసై 18 ఏళ్లకుపైబడి 65 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలో శిక్షణ పొందిన ఎవరైనా రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందేందుకు అర్హులే. డ్రోన్ల వేగంపై పరిమితులు.. మైక్రో డ్రోన్ భూమికి 60 మీటర్ల ఎత్తుకుపైన, సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. చిన్న డ్రోన్ 120 మీటర్ల ఎత్తుకుపైగా...సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. మధ్యరకం, పెద్ద డ్రోన్లు డీజీసీఏ అనుమతుల మేరకు ఆ పరిధిలోనే ప్రయాణించాలి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లను ఆపరేట్ చేయటం నేరం. పౌరవిమానయాన శాఖ వెబ్సైట్లోని మ్యాప్లో ఆకుపచ్చ రంగు కలిగిన ప్రాంతంలో డ్రోన్లు ప్రయాణించవచ్చు. పసుపురంగు ప్రాంతంలో నిబంధనల మేరకు ప్రయాణించాలి. ఎరుపురంగు సూచించిన ప్రాంతంలో డ్రోన్లను అనుమతించరు. అంతర్జాతీయ విమానాశ్రయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో, ఇతర ఎయిర్పోర్టులకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను అనుమతించరు. అంతర్జాతీయ సరిహద్దులకు 25 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నిషేధించారు. హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కీలక ప్రాంతాల్లో డ్రోన్ల ఆపరేషన్కు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో సెక్రటేరియట్ కాంప్లెక్సుకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను అనుమతించరు. వీటితో పాటు నిషేధిత, ప్రమాదకర ప్రాంతాల్లో డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
పని చేయలేకున్నాం బాబోయ్.. మంత్రులపై సీఎంకు ఎమ్మెల్యేల లేఖలు..
బెంగళూరు: ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మూడు నెలలు గడవక ముందే కర్ణాటక కాంగ్రెస్లో ముసలం పట్టిందా..? బయటకు నేరుగా వెల్లడించకపోయినా.. నేతల్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయా? సొంత నియోజకవర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని 30 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మొరపెట్టుకున్నారా?.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు ఈ పుకార్లలో వాస్తవం లేదని చెబుతున్నా.. తాజా పరిణామాలు ఇవన్నీ నిజమేనా? అనే సందేహాలను కల్గిస్తున్నాయి. కర్ణాటకాలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దేశవ్యాప్తంగా నీరుగారుతున్న కాంగ్రెస్ ఆశల్ని పైకిలేపింది. సిద్ధరామయ్య నేతృత్వంలో చక్కగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య పీఠం అధిష్ఠించగానే ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ శ్రేయోరాజ్య స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచిందో లేదో.. ప్రభుత్వం కూలిపోనుందా? అనే పుకార్లు పుట్టాయి. పార్టీ నేతల్లో అసమ్మతి సెగలు కమ్ముకున్నట్లు వార్తలు వచ్చాయి. సొంత నియోజక వర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని 30 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మొరపెట్టుకున్నారని ఊహాగానాలు వచ్చాయి. దానికి తోడు తమ ప్రభుత్నాన్ని కూల్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేయడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అటు.. అభివృద్ధి పనులకు మంత్రులు సహకరించడం లేదని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. సీఎంను ఎలా కిందకు దించాలో తనకు తెలుసంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు.. ప్రభుత్వంలో నేతల మధ్య సఖ్యత దెబ్బతిందనే ఆరోపణలకు బలం చేకూర్చాయి. ఇదీ చదవండి: HD Deve Gowda: జేడీఎస్ భవిష్యత్పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు.. అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని సీఎం సిద్ధరామయ్య తాజాగా స్పష్టం చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు తనకు అసమ్మతి లేఖలు పంపలేదని వెల్లడించారు. ఈ వారం పార్టీ అసెంబ్లీ సభ్యుల సమావేశం ఉంటుందని చెప్పారు. గత వారం జరగాల్సిన మీటింగ్ పలు కారణాల వల్ల వాయిదాపడినట్లు చెప్పారు. అటు డీకే శివకుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేల మధ్య సయోద్యతో పాటు ప్రభుత్వ అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు చెప్పారు. మంత్రులపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బెంగళూరుకు బయట కుట్ర జరుగుతోందని డీకే శివకుమార్ వ్యాఖ్యలపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఎదురవుతున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు పలు నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఒక్క తన నియోజక వర్గంలోనే రూ.300 కోట్ల వరకు అవసరమవుతున్నట్లు చెప్పారు. పథకాలను అలాగే కొనసాగించాలని ఎమ్మెల్యేలు కోరుతున్న విషయాన్ని డీకే తెలిపారు. అయితే.. ఈ విషయాలను మరిచి ప్రజలతో మమేకమై నేతలు ఉండాలని సూచించినట్లు డీకే తెలిపారు. వర్షాలు, వరదల్లో ప్రజలకు తోడుగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్.. -
‘వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలి’
జగ్గయ్యపేట(ఎన్టీఆర్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి కూడా సీఎం కావాలని కోరుతూ తెలంగాణకు చెందిన వైఎస్సార్సీపీ నేత చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించింది. జనగామ జిల్లా బచ్చనపేట మండలం లింగంపల్లికి చెందిన బొడ్డు ప్రవీణ్ రెండోసారి జగన్ సీఎం కావాలని కోరుతూ ఈ నెల 21న జనగామ నుంచి తాడేపల్లి వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు యాత్ర చేరుకోవడంతో.. పట్టణంలోని బైపాస్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్ రెండో సారి కూడా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని తెలిపారు. చదవండి: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు -
ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి. పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేశారు.క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ పుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దాదాపుగా రూ.1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుందని, దీని వల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మూడు ప్లాంట్లకు శంకుస్ధాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్ను ప్రారంభిస్తున్నాను. శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతాయని ఆయన అన్నారు. ‘‘నెల్లూరులో క్రిబ్కో ఆధ్వర్యంలో దాదాపుగా రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ వస్తుంది. 12 నెలల్లోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో బయో ఇథనాల్ ప్లాంట్ రెండు దశల్లో ప్లాంట్ పూర్తయితే 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని సీఎం అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొండి. ఇదే నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పతున్న బయో ఇథనాల్ ప్లాంట్ ఇది. దీనివల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.315 కోట్లతో వచ్చే ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. చదువుకున్న మన పిల్లలకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘అదే విధంగా తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ కూడా ఫ్యాక్టరీ పెడుతోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో..ఏటా 16వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధ ఏర్పాటు చేస్తుంది.రూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్థంతో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణకు వెళ్తున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన కేవలం 9 నెలల్లోనే యూనిట్ను ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకే.. ‘‘ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల కూడా మరో 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు.. రూ.1425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మనం చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్న మంచి ఘడియలు ఇవి’’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ చొరవతో పరిశ్రమలు: మంత్రి కాకాణి బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ శంకుస్థాపన అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురుచూస్తూ ఉన్నాము. ఈరోజు సీఎం వైఎస్ జగన్ గారి చొరవతో ఇక్కడ ఈ పరిశ్రమలకు శంకుస్థాపన చేసుకోగలిగాము. ఈ పరిశ్రమకు కావాల్సిన భూమిని సమకూర్చిన వారికి పరిహారం కూడా ఇచ్చాము. ఆ కుటుంబాలు ఆర్ధికంగా ఎదగడానికి పరిశ్రమ యాజమాన్యాలు సహకరించాలని ఈ సందర్బంగా వారిని కోరుతున్నాను. రూ. 925 కోట్లతో నిర్మించనున్న ఈ రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ పూర్తయితే స్థానికంగా ఉండే సుమారు 75 శాతం మంది యువతకు ఉపాధి కలుగుతుంది. క్రిబ్కో విశ్వ సముద్ర ప్రవేట్ లిమిటెడ్ అధ్వర్యంలో ఈ రెండు ప్లాంట్స్ ను కాలుష్యం లేకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. -
విజయ్ అభిమానుల హంగామా!
సాక్షి, చైన్నె: దళపతి విజయ్ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు రాజకీయ ప్రస్తావనతో బుధవారం హంగామా సృష్టించారు. వాతలైవా..వా( రా.నాయకుడా రా), నాలై మొదల్వన్( రేపటి సీఎ) అన్న నినాదాలతో తమిళనాట పోస్టర్లను హోరెత్తించారు. సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశ చర్చ తరచూ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఇటీవల కాలంగా తన చిత్రాల్లో రాజకీయంగా చర్చకు తగ్గ వ్యాఖ్యల తూటాలను విజయ్ పేల్చుతూ వస్తున్నారు. ఇది వివాదాలకు సైతం దారి తీస్తున్నాయి. అలాగే, విజయ్ ఇటీవల వేస్తున్న అడుగులు 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పయనం సాగిస్తున్నట్టుగా ఉంది. అభిమానులతో జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలతో తరచూ విజయ్ బిజీ అవుతున్నారు. విజయ్ ఇయక్కంలో జాలర్లు, మహిళలు, విద్యార్థి విభాగాలను సైతం ఏర్పాటు చేసి ఉండడంతో రాజకీయ అరంగేట్రానికి సమయం ఆసన్నమవుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలో ఈనెల 17న చైన్నె వేదికగా విజయ్ నిర్వహించిన కార్యక్రమం మరింత రాజకీయ చర్చకు మార్గంగా మారింది. పది, ప్లస్టూ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించడమే కాకుండా ఓటు విలువ, రాజకీయాలు, భావినాయకుడి ఎంపిక అంశాలను తన ప్రసంగంలో విజయ్ గుర్తు చేశారు. దీంతో ఆయన 2026 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర రాజకీయాలలో కీలకం కావడం తథ్యమన్న ధీమాతో అభిమానులు ఉన్నారు. పోస్టర్ల హోరు.. గురువారం దళపతి విజయ్ 48వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన నటిస్తున్న లియో చిత్రం గురించిన కీలక టీజర్ లేదా పాటను విజయ్ విడుదల చేయడానికి సన్నద్ధమైనట్టు సమాచారం. అదే సమయంలో తమ అభిమాన హీరోను రాజకీయ తెరపైకి తెస్తూ అభిమానులు కోయంబత్తూరు, తిరునల్వేలి, మదురై, సేలం, తిరుచ్చి, పుదుచ్చేరి, దిండుగల్ నగరాలలో బుధవారం పోస్టర్లతో హంగామా సృష్టించారు. ఈ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగానే కాదు, రాజకీయంగా చర్చకు దారితీసింది. విజయ్ సచివాలయంలో కూర్చున్నట్టు, ఆయన పేరుకు ముందుగా సీఎం విజయ్ అని వ్యాఖ్యలతో ఫొటోలు పోస్టర్లలో ఉన్నాయి. అలాగే, రేపటి సీఎం, నేటి తలైవా..రేపటి తమిళ రక్షకుడు, వా తలైవా వా..ఉచిత విద్యను అందిద్దాం..అన్న పలు నినాదాలతో ఈ పోస్టర్లు హోరెత్తించారు. 2026లో విజయ్ సీఎం కావడం తథ్యమని తేల్చే రీతిలో ఈ పోస్టర్లను అభిమానులు హోరెత్తించి తమ ఉత్సాహాన్ని ప్రదర్శించడం గమనార్హం. -
సాత్విక్ చిరాగ్ ను అభినందించిన సీఎం జగన్
-
చంద్రబాబు పేదల వ్యతిరేకి
-
దేశ్ కి నేత వ్యూహం పనిచేస్తుందా?
-
తెలంగాణలో కేసీఆర్ విఫలం ఖాయం..?
-
మారుమూల గ్రామాలకు 4జి సేవలు ప్రారంభించిన సీఎం జగన్
-
క్వాలిటీ చాలా ముఖ్యం: సీఎం జగన్
-
సీఎం జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శం...
-
విద్వేషాలను రెచ్చగొట్టేవారికి చెక్... మినిష్టర్ వినూత్న ఆలోచన
కర్ణాటక : ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా "పీస్ఫుల్ కర్నాటక" పేరుతో ఒక హెల్ప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డి పరమేశ్వర, ఐటీ & గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గేలకు విజ్ఞప్తి చేశారు వాణిజ్యం & పరిశ్రమలు, మౌలికసదుపాయాల శాఖల మంత్రి ఎంబి పాటిల్. తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు... అంతకుముందు బెంగళూరు సౌత్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య పార్టీ కార్యకర్తలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో బీజేపీ ఒక హెల్ప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని, రాష్ట్రంలో ఎక్కడైనా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తే వెంటనే హెల్ప్ లైన్ ను ఆశ్రయించాలని కోరారు. తేజస్వి చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మినిష్టర్ కూడా అంతే దీటుగా స్పందించారు. మినిష్టర్ పాటిల్ కౌంటర్... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డి పరమేశ్వర, మంత్రి ప్రియాంక్ ఖర్గే గార్లకు మనవి. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా చూసేందుకు వీలుగా "పీస్ఫుల్ కర్నాటక" పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిగణలోకి తీసుకోగలరు.తద్వారా ఎక్కడైనా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వెంటనే ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, పురోగతి సాధించి బ్రాండ్ కర్నాటకను రక్షించుకోవడమే మా ఎజెండా అని పాటిల్ ట్వీట్ చేశారు. -
అవసరమైతే మ్యాజిక్కులు చేసుకుని బతుకుతా.. రాజస్థాన్ సీఎం కౌంటర్
జోధ్ పూర్లో నూతనంగా నిర్మించిన రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవం సందర్బంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీకి చేసిన "ఇంద్రజాలికుడు" వ్యాఖ్యలకు స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను పొట్టకూటి కోసం అవసరమైతే మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటాను కానీ జోధ్ పూర్ ప్రజలకు మచ్చ తెచ్చే పని మాత్రం చేయనని అన్నారు. రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవంలో... 15వ శతాబ్దానికి చెందిన మెహరాన్ ఘడ్ కోటకు సందర్శకుల రాకపోకలు సాగేందుకు వీలుగా నిర్మించిన రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒకప్పుడు జోధ్ పూర్ ఎలా ఉండేది? ఇక్కడ నీళ్లు ఉండేవి కాదు, రైలు సదుపాయం కూడా లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రోడ్లు, రైళ్లు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య ఇలా ఇప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ 42 ఏళ్లలో ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి అంతా చేశానని అన్నారు. మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటా... ఈ సందర్భాంగా కేంద్రం చేసిన అభివృద్ధిని తానే చేశానని చెప్పుకుంటూ ఇంద్రజాలం చేసి ప్రజలను మభ్య పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. అవును నేను ఇంద్రజాలికుడినే.. అవసరమైతే పొట్టకూటి కోసం మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటాను కానీ... జోధ్ పూర్ ప్రజలు తలదించుకునే పనిని ఎన్నడూ చేయనని అన్నారు. మాయ చేస్తోంది మీరు. మీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో చెప్పడానికి ఇదే రావు జోధా మార్గ్ ఉదాహరణ. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందే ప్రారంభమైన ఈ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఆలస్యం చేశారు. ఖర్చు కూడా 39 వేల కోట్ల నుండి 72 వేల కోట్లకు పెంచేశారు. ఇప్పటివరకు బీజేపీ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను కొనసాగించకుండా జాప్యం చేశారన్నారు. -
AP: ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించాను
-
అదిగదిగో రామాయపట్నం పోర్ట్ 851 ఎకరాల్లో కళ్ళు చెదిరేలా నిర్మాణం
-
100 సీట్లు గెలుస్తాం..!
-
నాకు సీఎం కావాలని లేదు
-
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు: పుదుచ్చేరి సీఎం
సాక్షి, చైన్నె: తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపొద్దని, తాను సైతం ప్రజలతో కలిసే వెళ్తానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి పోలీసులను సోమవారం ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం రంగస్వామి ప్రజలతో మమేకమైతిరిగే నాయకుడు. ఆయన తరచూ మోటారు సైకిల్పై సైతం చక్కర్లు కొడుతుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయనకు పోలీసులు భద్రతను పెంచారు. ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ను ఆపేస్తున్నారు. రోజూ గోరిమేడులోని ఇంటి నుంచి సచివాలయం వెళ్లే సమయంలో అనేక ప్రాంతాల కూడలిలో వాహనాలు నిలుపుదల చేస్తూ వస్తున్నారు. తన కారణంగా స్థానికులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఇబ్బందులు ఎదురు అవుతుండడాన్ని సీఎం పరిగణించారు. దీంతో తన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ఇకపై ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని పోలీసులను ఆదేశించారు. ప్రజల వాహనాలతో పాటే తన వాహనం కూడా ముందుకెళ్తుందని, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ప్రజల వాహనాలను కూడా ఆపొద్దని పోలీసులకు ఆయన సూచించడం విశేషం. చదవండి: వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి! -
నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటన
-
కేజ్రీవాల్ సర్కార్ కు భారీ ఊరట
-
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం
-
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభ వేడుక..!
-
తిరుపతిలో సీఎం కప్ పోటీలు
తిరుపతి అర్బన్: తిరుపతి నగరంలో సోమవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి వి. మురళీకృష్ణ ఆదివారం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 4700 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీతోపాటు పలు కళాశాలల్లోనూ పోటీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 8గంటల నుంచే క్రీడలు ప్రారంభమవుతాయని వివరించారు. ఆ మేరకు క్రీడాకారులకు అవసరం అయిన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. -
బీఆర్ఎస్కు అధికారం ఇస్తే మహారాష్ట్రలో ప్రతి ఇంటికి నీళ్లు
-
తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంలో పూర్తయిన విచారణ
-
ఈ చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా భాగమయ్యను..
-
ప్రకాష్ అంబేడ్కర్తో కలిసి మహా విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
-
అంబేడ్కర్ విగ్రహానికి హెలికాఫ్టర్ పైనుంచి పూలాభిషేకం
-
ముఖ్య అతిధి గా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్
-
125 అడుగుల అంబెడ్కర్ భారీ విగ్రహావిష్కరణ
-
మళ్ళీ జగనన్నే రావాలి
-
జగనన్నే మా భవిష్యత్ ప్రోగ్రాం ఎట్ విజయవాడ
-
బయ్యారం స్టీల్ప్లాంట్పై కుట్రలు చేశారు
-
పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆనందంగా ఉంది:జూపల్లి
-
నన్ను పార్టీనుండి సస్పెండ్ చేయడం హాస్యాస్పదం: పొంగులేటి
-
సీఎం స్టాలిన్ కు ఖర్గే ఫోన్..!
-
మేఘాలయ సీఎంగా మరోసారి సంగ్మా.. ఈనెల 7న ప్రమాణస్వీకారం!
షిల్లాంగ్: మేఘాలయాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రకటించారు. గురువారం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్ల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే మొత్తం 60 స్థానాలకు మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ని ఆయన పార్టీ అందులేకపోయింది. కానీ తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 32 సభ్యుల బలముందని సంగ్మా తెలిపారు. ఎవరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎన్పీపీకి బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. కాగా.. కాన్రాడ్ సంగ్మా మేఘాయల గవర్నర్ ఫాగు చౌహాన్ను కలిసి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈనెల 7న ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, ఎన్పీపీ ఈసారి విడిపోయి ఒంటరిగా పోటి చేశాయి. బీజేపీ తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడంతో సంగ్మా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. 2018 కంటే ఏడు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్కు చెరో ఐదు సీట్లు వచ్చాయి. ఎన్పీపీ మాజీ మిత్రపక్షం యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ 11 సీట్లు కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. త్రిపురలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్లో కూడా బీజేపీ కూటమే విజయం సాధించింది. మేఘాలయలో కూడా ఎన్పీపీకే ఆ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఈ ప్రభుత్వంలో కూడా భాగం కానుంది. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
Viral Video: చిన్నారులతో హుషారుగా డ్యాన్స్ వేసిన అసోం సీఎం హిమంత బిస్వా శర్మ
-
మళ్ళీ మీరే సీఎం కావాలి జగన్ మామా : విద్యార్థిని
-
మీ పేరు నిలబెడతాం.. థ్యాంక్స్ మామయ్య
-
సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భేటీ
-
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. రంగంలోకి కేంద్రం
బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే వారం భేటీ కానున్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై శనివారం మీడియాకు ఈ విషయం చెప్పారు. ‘‘వివాదంపై తమ ప్రభుత్వ వైఖరి, వాస్తవాలను షాకు ఫోన్లో వివరించా. దీనిపై అఖిలపక్షం కూడా నిర్వహిస్తాం’’ అన్నారు. మహారాష్ట్రలో విపక్ష కూటమి మహావికాస్ అగాడీ ఎంపీలు అమిత్ షాను కలవడం తెలిసిందే. ‘‘కర్నాటక బీజేపీ ఎంపీలు సోమవారం అమిత్ షాను కలవనున్నారు. నేనూ ఆయనతో మాట్లాడా. ఇరువురు సీఎంలతో సమావేశం నిర్వహిస్తానని షా చెప్పారు. డిసెంబర్ 14, లేదా 15 తేదీల్లో భేటీ ఉంటుంది’’ అని బొమ్మై వివరించారు. ఇదీ చదవండి: మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా? -
చత్తీస్గఢ్ సీఎం డిప్యూటీ సెక్రటరీ అరెస్టు
రాయ్పూర్: చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఈడి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ ఆరోపలపై సౌమ్యను అరెస్టు చేసినట్లు పేర్కొంది. గతేడాది చత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో దాడులు నిర్వహించి సుమారు రూ. 100 కోట్లకు పైగా హవాలా రాకెట్ను వెలికితీసినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. అంతేగాక హవాల లావదేవీల కింద అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించకుండా నగదు చేతులు మారుతోందని ఈడీ పేర్కొంది. ఫిబ్రవరి 2020లో చౌరాసియా ఇంటిపై కూడా దాడి చేసింది. ఐతే ముఖ్యమంత్రి భూపేష్ కేంద్ర ఏజెన్సీ చేసిన దాడిని రాజకీయ ప్రతీకార దాడి అభివర్ణించారు. పైగా తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. (చదవండి: కాంగ్రెస్ను వీడిన ముగ్గురు నాయకులకు...బీజేపీ కీలక భాద్యతలు) -
AP: మరిన్ని కొత్త ఫీచర్లతో సీఎం యాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచి, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూపొందించిన సీఎం యాప్ను మరింత ఆధునీకరించి రైతులకు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండేలా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది . ఆర్బీకే కేంద్రంగా అందించే సేవల కోసం ఏపీ మార్క్ఫెడ్ అభివృద్ధి చేసిన సీఎం యాప్లో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్స్ ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో రైతులతో పాటు వ్యాపారులు అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుంది. చదవండి: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు రైతులు తాము పండించిన పంటకు మార్కె ట్లో రేట్లు, నాణ్యత తదితర వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. వ్యాపారులు కొనుగోలు చేసిన పంట, ఏ సీజన్లో సాగు చేశారు, ఎప్పుడు కోతకు వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎప్పుడు లోడింగ్ చేశారు.. ఏ గోదాములో ఎంత కాలం నిల్వ చేశారు.. కోసినప్పుడు నాణ్యత ఎలా ఉంది.. ప్రస్తుతం నాణ్యత ఎలా ఉంది.. ఇలా ప్రతి విషయాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ యాప్ సేవలను ఆర్బీకేలలో పొందే అవకాశాన్ని కల్పించారు. ఉత్పత్తులకు రంగులు సీఎం యాప్లో కొత్తగా అప్గ్రేడ్ చేసిన క్యూఅర్ కోడ్ (సీల్) విధానం తీసుకొచ్చారు. బ్యాగ్పై ముద్రించే క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ఉత్పత్తిని ఏ ఆర్బీకే పరిధిలో ఏ గ్రామానికి చెందిన రైతు నుంచి కొన్నారో ట్రేడర్ తెలుసుకోవచ్చు. నాణ్యత ప్రమాణాలను బట్టి ఉత్పత్తికో రంగు కేటాయించారు. సాధారణ నాణ్యతకు తెలుపు, అత్యుత్తమ నాణ్యతతో ఉంటే నీలం, సేంద్రియ పంటలకు ఆకుపచ్చ రంగు కేటాయించారు. ఈ–వేలంలో కొనుగోలుదారులు వారికి కావాల్సిన ఉత్పత్తులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. నాణ్యతను ట్రాక్ చేయవచ్చు... కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్) ఫీచర్ ద్వారా ప్రతి లాట్ నుంచి ర్యాండమ్గా 2 లేదా 3 బ్యాగ్లను ఫొటోలు తీస్తే చాలు... వాటిపై ఉండే క్యూఆర్ కోడ్తో వాటి నాణ్యత, పండించిన గ్రామం, ఎప్పుడొచ్చాయి, రైతు పేరు, సేకరణ తేదీ వంటి మొత్తం వివరాలు వెంటనే వస్తాయి. ఆన్లైన్, ఈ–వేలంలో పాల్గొనే వ్యాపారులకు ఇది చాలా ఉపయోగకరం. ఫార్మర్ ఆప్షన్తో ధరల వివరాలు సీఎం యాప్లో కొత్తగా ఫార్మర్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా రైతులు పంట ఉత్పత్తుల మార్కెట్ ధరల వివరాలను స్వయంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్ఫెడ్, రైతు బజార్లు, రాష్ట్ర, కేంద్ర గిడ్డంగులు, రైతు సాధికార సంస్థ, ఆయిల్ఫె డ్, నాఫెడ్ వంటి సంస్థలు కూడా వినియోగించుకునేలా ఈ యాప్ని అప్గ్రేడ్ చేశారు. యాప్ ద్వారా ప్రస్తుతం వాయిస్ అసిస్టెన్స్, ఈ–క్రాప్, ఎస్ఎంఎస్ హెచ్చరిక, ఆటో సేకరణ షెడ్యూల్, బయోమెట్రిక్, జియో ఫెన్సిం గ్, ఈ–సైన్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఆటో–జనరేషన్ బిల్లు, గూగల్ మ్యాప్స్, రియల్ టైమ్ పేమెంట్ ట్రాకింగ్ తదితర సేవలు అందిస్తున్నారు. సకాలంలో చెల్లింపులు జరిగేలా రియల్టైమ్ గవర్నెన్స్ను కూడా తీసుకొచ్చారు. రసాయన అవశేషాలనూ తెలుసుకోవచ్చు సీఎం యాప్లో ఇకపై పంట పండించిన విధానం, పద్ధతులను కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా నేచురల్ ఫార్మింగ్, సేంద్రియ ఫార్మింగ్ ఆప్షన్లు తీసుకొచ్చారు. వీటి ద్వారా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల నుంచి నేరుగా కొనవచ్చు. యాప్లో రైతు సాధికార సంస్థ, ప్రైవేటు ఏజెన్సీల కెమికల్ పరీక్షల రిపోర్టులను అప్లోడ్ చేస్తారు. దీనివల్ల పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. -
భారీ ట్రక్కుని ఢీ కొట్టిన ఖడ్గమృగం.... డ్రైవర్కి ఊహించని షాక్
ఒక ఖడ్గమృగం రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద చోటు చేసుకుంది. వాస్తవానికి వాహనం వేగంగా వెళ్తుంటే ఖడ్గమృగం నాదారికే అడ్డుగా వస్తావా అన్నట్లుగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆ జంతువుకు ఎలాంటి గాయాలు కాలేదు. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. అయితే సదరు వాహనాన్ని పోలీసులు ఆపి జరిమాన విధించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోని అస్సాం ముఖ్యమంత్రి ట్విట్టర్లో షేర్ చేస్తూ...ఈ రహదారిలో ఆ జంతువులకు ఇబ్బంది కలిగిస్తే ప్రయాణించేందుకు అనుమతించం అని ట్వీట్ చేశారు. తాము ఈ కజిరంగా వద్ద జంతువులను రక్షించాలనే ఉద్దేశంతో సుమారు 32 కి.మీ ఎలివేటర్ కారిడర్ని అధికారులు చేత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ రహదారిలో వాహనాలు వేగంగా వెళ్తే చెట్లకు, జంతువులకు ఇబ్బంది కలగవచ్చని కొందరూ, మరికొందరూ నుమాలిగర్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న వంతెన పూర్తి అయితే వాహనాలను అటు మళ్లించే ఏర్పాట్లు చేయడమే కాకుండా అంతవరకు ఈ రహదారిలో వాహనాలు తక్కువ వేగంతో వెళ్లేలా చూడాలంటూ సలహలిస్తూ...ట్వీట్ చేశారు. Rhinos are our special friends; we’ll not allow any infringement on their space. In this unfortunate incident at Haldibari the Rhino survived; vehicle intercepted & fined. Meanwhile in our resolve to save animals at Kaziranga we’re working on a special 32-km elevated corridor. pic.twitter.com/z2aOPKgHsx — Himanta Biswa Sarma (@himantabiswa) October 9, 2022 (చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్) -
సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజు.. సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరు వులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆట పాటలతో, పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగ తిస్తూ ముగిసే 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. చదవండి: బతుకమ్మ బంగారం.. విదేశీ పూల సింగారం -
ఇదేం మర్యాద, సీఎం సభకు ఆహ్వానించి.. అడ్డుకుంటారా?
మంథని: పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీకృత భవన సము దాయం ప్రారంభోత్సవానికి జిల్లా ఎమ్మెల్యేగా ఒకవైపు ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం పంపి, మరోవైపు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని మంథని శాసనసభ్యుడు డి.శ్రీధర్బాబు మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లిలో సీఎం సభకు వెళ్లకుండా శ్రీధర్బాబును మంథనిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయనను ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు. సాయంత్రం తన అనుచరులతో కలసి ఇంటి నుంచి సీఎం సభ కోసం బయలుదేరగా పోలీసులు గేట్లు వేశారు. దీంతో పోలీసుల తీరుపై శ్రీధర్బాబు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త మండలాల ఏర్పాటుతోపాటు పలు అంశాలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నానని తెలిపారు. ఇప్పుడు వాటిని సీఎం కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపిస్తానని చెప్పారు. -
కొత్త డ్యామ్కు సమ్మతి తెలపండి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాశయానికి అనుసంధానంగా వరద కాల్వతో పాటు 52 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ‘నావలి’బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించేందుకు ఆమోదం తెలపాలని సీఎం కేసీఆర్కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విజ్ఞప్తి చేశారు. పూడికతో తుంగభద్ర నిల్వ సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.885 టీఎంసీలకు పడిపోయిన నేపథ్యంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేవలం వరదల సమయంలో జలాశయం నుంచి వరద ప్రవాహ కాల్వ ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీళ్లను మళ్లిస్తామని వివరించారు. బెంగళూరు లేదా మరోచోట ఈ ప్రతిపాదనలపై చర్చిద్దామని సూచించారు. ఈ మేరకు బొమ్మై ఇటీవల ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తుంగభద్ర కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో వరద కాల్వ, కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు తెలుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేదు.. కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ట్రాల్లోని అన్ని కాల్వలకు కృష్ణా ట్రిబ్యునల్–1 ఆవిరి నష్టాలను కలుపుకొని 230 టీఎంసీలను కేటాయించింది. ఆవిరి నష్టాలు పోగా 212 టీఎంసీల నీళ్లను వాడుకోవాల్సి ఉండగా, 1976–77 నుంచి 2017–18 మధ్య కాలంలో ఏటా సగటున 164.4 టీఎంసీలను మాత్రమే వాడుకోగలిగామని బొమ్మయ్ తెలిపారు. ఏటేటా పూడిక పేరుకుపోతుండటంతో పాటు అకస్మాత్తుగా స్వల్ప కాలం వరదలు పోటెత్తడం, కేవలం జూలై, ఆగస్టు నెలల్లోనే భారీ ప్రవాహం ఉండడంతో ఈ నీళ్లను నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోతోందని, తద్వారా తమ రాష్ట్రంలోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేకపోతున్నామని వివరించారు. తుంగభద్రలో పూడిక తొలగించడం లేదా అదనపు నిల్వల కోసం కొత్త రిజర్వాయర్ నిర్మించడం ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రతిపాదనలపై చర్చించడానికి ముందుకు రావాలని కేసీఆర్ను కోరారు. గతంలోనే తిరస్కరించిన నీటిపారుదల శాఖలు.. వాస్తవానికి ఈ ప్రతిపాదన కర్ణాటక ప్రభుత్వం రెండేళ్ల కిందటే చేసింది. అప్పుడే తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖలు ఇందుకు నిరాకరించాయి. ఎగువన కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతో దిగువన ఉన్న తమ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపాయి. అయితే ఈసారి స్వయంగా రంగంలో దిగిన కర్ణాటక సీఎం.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలనే నిర్ణయం తీసుకున్నారు. తుంగభద్రలో పూడికను తొలగించడానికి రూ.12,500 కోట్ల వ్యయం అవుతుందని, నావలి వద్ద 492 అడుగుల గరిష్ట నిల్వ సామర్థ్యం (ఎఫ్ఆర్ఎల్)తో 52 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.9,500 కోట్లు, 486 ఎఫ్ఆర్ఎల్తో నిర్మాణానికి రూ.6,000 కోట్ల వ్యయం అవుతుందని కర్ణాటక జలవనరుల శాఖ అంచనా వేసింది. -
ఎన్నికల్లో ఓడినా.. సీఎంగా ఆయనే!
సాక్షి డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సీఎం ఎవరంటూ...గత 11 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మళ్లీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి కొనసాగుతారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం డెహ్రాడూన్లో జరిగిన బీజెపీ శాసనసభా పక్షం సమావేశం తదనంతరం రాజ్నాథ్ సింగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజెపీ నాయకులు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖి తదితరలు పాల్గొన్నారు. ఈ క్రమంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ..పుష్కర్ సింగ్ ధామి శాసనసభా పక్ష నాయకుడిగా ప్రకటిస్తున్నాం. నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో ఉత్తరాఖండ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 46 సీట్లు గెలుచుకుని వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉదంసింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయారు. 2012, 2017లో ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన పుష్కర్ సింగ్ ధామి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6 వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఆయన మార్చి 11న ఉత్తరాఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ భారీ విజయానికి ధామీని చేసిని కృషి బీజెపీ నాయకులు అభిమానాన్ని చూరగొంది. అదే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించేలా చేసింది. అయితే ఈ అత్యున్నత పదవీ కోసం దాదాపు అరడజను మంది పేర్లు తెరపైకి వచ్చాయి కానీ వారందరీలో పుష్కర్ సింగ్ ధామి పేరే అధికంగా వినిపించడంతో ఓడిపోయినప్పటికీ.. మళ్లీ సీఎంగా ఐదేళ్లు పదవిలో కొనసాగే ఛాన్స్ కొట్టేశారు. (చదవండి: ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం) -
పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ హెచ్చరికలు
ఛండీగఢ్: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలకు.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక సందేశం పంపించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో దందాలకు పాల్పడవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే.. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను తప్పనిసరిగా కలవాలని కేజ్రీవాల్ అన్నారు. గతంలో.. పంజాబ్ ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలంగా ఉండే ఎస్పీలు/ఎస్ఎస్పీలను బదిలీ చేయించుకుని.. తమ నియోజకవర్గాల్లో దందాలను నడిపించుకున్నారని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు మాత్రం అలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పోలీసుల బదీలీలకు సంబంధించిన ప్రక్రియను సీఎం భగవంత్మాన్కు, మంత్రులకు వదిలేయాలని.. ఎమ్మెల్యేలు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని, కేవలం నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటే చాలని అన్నారు. అలా కాకుండా అధికార ధోరణి ప్రదర్శిస్తే.. పరిణామాలు వేరుగా ఉంటాయని, చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలంతా టీమ్గా పని చేయాలని కోరారు. మన వ్యక్తిగత ఆశయాలను వదిలి.. జట్టుగా పని చేస్తే పంజాబ్ పురోగమిస్తుంది అని కేజ్రీవాల్ పిలుపు ఇచ్చారు. ఈ జట్టుకు భగవంత్ మాన్ నాయకుడని కేజ్రీవాల్ నొక్కి చెప్పారు. పార్టీ నాయకులు, వాలంటీర్లు ఎల్లప్పుడూ హుందాగా వ్యవహరించాలని, అసభ్య- అభ్యంతరకరమైన ప్రవర్తనలను సహించేదే లేదని కేజ్రీవాల్ హెచ్చరించారు. (చదవండి: దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. అది జరిగితే..) -
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ విద్యాధికులే.. వివరాలు ఇవిగో
మతకల్లోలాలు, రాజకీయ వివాదాలు, వెనుకబాటుతనం, గూండాల అరాచకాలు వంటి అంశాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అధికార పీఠాన్ని అధిరోహించిన ముఖ్యమంత్రులంతా ఉన్నత విద్యను అభ్యసించినవారే. యూపీ మొదటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మొదలు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరకు మొత్తం 21 మంది అధికార పీఠంపై కూర్చోగా, అందులో 8 మంది గ్రాడ్యుయేట్లు కాగా, 10 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మరో ఇద్దరు సీఎంలు పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్లు పొందగా, సీఎం బనారసీ దాస్ మాత్రం రాజకీయాల కోసం గ్రాడ్యుయేషన్ను మధ్యలోనే వదిలేశారు. అయితే వీరిలో ఏడుగురు న్యాయశాస్త్ర డిగ్రీలను పొందారు.