godavari
-
సోదరుడి అస్థికలను గోదావరిలో కలిపిన జయప్రద (ఫోటోలు)
-
‘బనకచర్ల’పై మన అభ్యంతరాలు బేఖాతరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోకుండా గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రాజెక్టు డీపీఆర్ను ఇప్పటికే సిద్ధం చేయగా, పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు అలైన్మెంట్ ఖరారు చేసేందుకు వ్యాప్కోస్ ఆధ్వర్యంలో లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్(లైడార్) సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తోంది. మూడు విభాగాలు(సెగ్మెంట్స్)గా ప్రాజెక్టును విభజించి నిర్మించనుండగా, రెండు విభాగాలకు సంబంధించిన లైడార్ సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. మూడో సెగ్మెంట్కు సంబంధించిన లైడార్ సర్వే మరో ఒకటిరెండు రోజుల్లో పూర్తి కానుంది. లైడార్ సర్వే ద్వారా తీసిన త్రీడీ, పోటోగ్రఫిక్ చిత్రాల ఆధారంగా కాల్వలు/సొరంగాల అలైన్మెంట్తోపాటు లెవల్ను ఖరారు చేస్తారు. సర్వే పూర్తయితే ప్రాజెక్టు పనులను ఏపీ ప్రారంభిస్తుంది. రెండు సెగ్మెంట్ల సర్వే పూర్తితొలి సెగ్మెంట్లో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధానకాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులను పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ ప్రతిపాదించింది.రెండో సెగ్మెంట్ కింద కృష్ణానది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో గుంటూరు జిల్లాలో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. ఈ సెగ్మెంట్లో భాగంగానే నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కు నీటిని తరలిస్తామని మరో లింక్ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ రెండు సెగ్మెంట్లకు సంబంధించిన లైడార్ సర్వే ఇప్పటికే పూర్తయ్యిందని అధికారవర్గాలు తెలిపాయి.మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో నీటిని లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ క్రమంలో నల్లమల అటవీప్రాంతంలోని కొండల్లో 26.8 కి.మీల సొరంగాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఈ పనులకు సంబంధించిన లైడార్ సర్వే చివరి దశలో ఉంది.‘సాగర్’లింక్పై సైతంనాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తామని ఈ ప్రాజెక్టు కింద ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపణ తెలిపింది. ఈ పనులకు సంబంధించిన సర్వే పనులను ఏపీ పూర్తి చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. రూ.80వేల కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీలు చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి తరలిస్తామని ఏపీ పేర్కొంటోంది. -
బనకచర్లకు గోదారెలా?
-
పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ మేరకే ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్ వేను 2021 జూన్ 11 నాటికే ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ.. కేంద్ర కేబినెట్ గతేడాది ఆగస్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వకు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు. అంటే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు అంగీకరించిందన్న మాట. అయితే.. ప్రాజెక్టులో 42 మీటర్ల స్థాయి నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించేలా గోదావరి–బనకచర్ల అనుసంధానం చేపడతామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఇదెలా సాధ్యమని నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. 42 మీటర్ల నుంచి జలాలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయగలిగితేనే.. జలాలను గరిష్టంగా ఒడిసిపట్టి, ఇటు గోదావరి–బనకచర్ల, అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి జీవం తీసి.. బనకచర్లకు తరలిస్తామనడం చూస్తే ఆ అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేదని అర్థం చేసుకోవచ్చని నిపుణులు దెప్పిపొడుస్తున్నారు.కుడి కాలువ ఆయకట్టు, కృష్ణా డెల్టాకే చాలవు..పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఆ స్థాయిలో 119.4 టీఎంసీలనే నిల్వ చేయవచ్చు. పోలవరం కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకూ నీటిని తరలించవచ్చు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎలా నిల్వ చేస్తారని, బనకచర్లకు నీటి తరలింపు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. బనకచర్లకు గోదావరి ఇలా..గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను కృష్ణా నది, నాగార్జునసార్ కుడి కాలువ, కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల అభయారణ్యంలో 26.8 కిలీమీటర్ల టన్నెల్ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తద్వారా 80 లక్షల మందికి తాగునీరు, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందిస్తామని, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ కింద 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 20 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం సరఫరా చేస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.80,112 కోట్ల వ్యయం అవుతుందని, ఇంట్రా స్టేట్ లింక్ (రాష్ట్ర పరిధిలో అనుసంధానం) ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరింది. ఆ నివేదికలో పేర్కొన్న మేరకు గోదావరి–బనకచర్ల అనుసంధానం ఇలా..తొలి దశ..– పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తు నుంచి రోజుకు 38 వేల క్యూసెక్కులు తరలిస్తారు. ఇందుకు వీలుగా ఈ–శాడిల్ డ్యాం, ఎఫ్–శ్యాడిల్ డ్యాం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతారు. కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38 వేల క్యూసెక్కులకు పెంచుతారు.– తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యం 1400 నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచుతారు. తాడిపూడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి, 178 కిలోమీటర్ల వరకూ పొడగిస్తారు. ఇందులో 5 వేల క్యూసెక్కులను ఆయకట్టుకు, మిగతా 5 వేల క్యూసెక్కులను భలేరావు చెరువులోకి తరలిస్తారు. – బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా నీటి తరలింపులో సమస్యలను నివారించడానికి బుడమేరులో పులివాగు కలిసే ప్రాంతం నుంచి కొత్తగా మళ్లింపు కాలువ తవ్వి కృష్ణా నదిలోకి తరలిస్తారు.– తొలి దశ పనులకు 560 హెక్టార్ల ప్రైవేటు, 32 హెక్టార్ల అటవీ భూమి సేకరించాలి. ఈ పనులకు రూ.13,511 కోట్లు వ్యయం అవుతుంది.రెండో దశ– కృష్ణా నదిలో 12.5 మీటర్లు (సముద్ర మట్టానికి) ఎత్తు నుంచి 144.5 మీటర్ల ఎత్తుకు ఐదు దశల్లో రోజూ 2 టీఎంసీలను లిఫ్ట్ చేసి.. నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకూ సామర్థ్యాన్ని పెంచి గోదావరి జలాలను తరలిస్తారు. – సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి జలాలను 142 మీటర్ల నుంచి 221 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి, పల్నాడులో బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు. ఆ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే 150 టీఎంసీల నుంచి 400 టీఎంసీల వరకూ నిల్వ చేసుకోవచ్చు. ఈ రిజర్వాయర్లో ప్రస్తుతానికి 150 టీఎంసీలు నిల్వ చేయాలంటే బొల్లాపల్లి మండలంలో 15 గ్రామాలకు పునరావాసం కల్పించాలి.– రెండో దశ పనులకు 28,560 కోట్లు వ్యయం అవుతుంది.మూడో దశ:– బొల్లాపల్లి రిజర్వాయర్లో 172 మీటర్ల నుంచి మూడు దశల్లో 300.4 మీటర్లకు ఎత్తిపోసి.. నల్లమలలో తవ్వే సొరంగం ద్వారా తరలించి, అక్కడి నుంచి 118.21 కిలోమీటర్ల పొడవున కాలువ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్కు తరలిస్తారు. మూడో దశ పనులకు 38,041 కోట్లు వ్యయం అవుతుంది.– ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికి 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం. బొల్లాపల్లి రిజర్వాయర్, కాలువల తవ్వకానికి 40,500 ఎకరాల భూమి సేకరించాలి. ఇందులో 17 వేల ఎకరాలు అటవీ భూమి. -
పులస ఏమవుతోంది!
ఏయూ క్యాంపస్ (విశాఖ): సముద్రంలో ఇలసగా పిలిచే చేప నీటికి ఎదురీదుకుంటూ నదిలోకి చేరుతుంది. అక్కడ తన రంగు, రుచి, పోషకాలను పూర్తిగా మార్పు చేసుకుంటుంది. అత్యంత ఖరీదైన చేపగా మారుతుంది. ప్రధానంగా వర్షాకాలంలో గోదావరి జిల్లాల్లో పులస చేప వలలో పడిందంటే మత్స్యకారుల సంతోషానికి అవధులు ఉండవు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పులస చేప (Pulasa Fish) ప్రస్థానం, పోషకాల మార్పులపై సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) ప్రత్యేక అధ్యయనం చేసింది. కానీ.. ఇలస నదిలోకి వలస వచ్చాక పులసగా మారి సముద్రంలోకి తిరిగి వెళుతోందా లేక నదిలోనే ఉండిపోతోందా అనే సందేహాలు శాస్తవేత్తలను వెంటాడుతున్నాయి. లోతైన పరిశోధన చేస్తేనే..గుడ్లు పెట్టేందుకు గోదావరి (Godavari) నదిలోకి వచ్చే సమయంలోనే పులసలు మత్స్యకారుల వలలో చిక్కి ఆహారంగా మారిపోతున్నాయా అనే సందేహాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. పులసల్ని వచ్చినవి వచ్చినట్టుగా పట్టేస్తుంటే పులసల పునరుత్పత్తి దెబ్బతిని ఆ చేప జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అదేవిధంగా గోదావరిలో పుట్టిన పులస పిల్లలు సముద్రంలోకి వెళుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు లోతైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. పులసల గమనాన్ని ప్రత్యేకంగా ట్యాగింగ్ చేసి ట్రాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వీటి మైగ్రేషన్ డైనమిక్స్ని సైతం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అప్పుడే పులస చేపలను సంరక్షించడం సాధ్యపడుతుందని పేర్కొంటున్నారు. కనీసం 20 శాతం పులసలు పునరుత్పత్తి చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.భారత్లో గంగ, గోదావరి నదులకే రాకబంగాళాఖాతం, అరేబియా సముద్రం, వియత్నాం, ఎర్రసముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో హిల్సా చేపలు లభిస్తాయి. బంగ్లాదేశ్లోని పద్మా నది, ఇరాక్లో యూప్రటిస్, మయన్మార్లోని ఇరావడి, పాకిస్తాన్లో సింధు, భారత్లోని గంగా, గోదావరి నదీ ప్రాంతాల్లోకి ఇవి వలస వచ్చి పులసలుగా రూపాంతరం చెందుతాయి. నది నుంచి సముద్రంలోకి ప్రవాహం కలిసే ప్రాంతంలో ఇవి లభిస్తాయి. వీటి లభ్యత ఇటీవల కాలంలో తగ్గిపోతోంది. గోదావరి తీరంలో లభించే పులస మెరుస్తూ ఉంటుంది. వీటిని సాధారణ ప్రజలు గుర్తించడం కష్టమే. నిపుణులు మాత్రమే గుర్తిస్తారు. ఇలస, పులసలో పోషకాల వ్యత్యాసం ఇలా..సముద్రంలోని ఉప్పునీటిలో ఉండే ఇలసలో 12 శాతం శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 100 గ్రాముల ఇలసలో సోడియం 183 మి.గ్రా., పొటాషియం 573 మి.గ్రా., క్యాల్షియం 133 మి.గ్రా., ఫాస్పరస్ 910 మి.గ్రా., ఐరన్ 29 మి.గ్రా. ఉన్నట్టు సీఐఎఫ్టీ పరిశోధనలో వెల్లడైంది. పులస విషయానికి వస్తే.. కొవ్వు శాతం 8నుంచి 11 శాతం మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. పులసలో అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈపీఏ, డీహెచ్ఏ ఒమేగా–3 ఆమ్లాలు అధికంగా ఉన్నాయి. 100 గ్రాముల పులసలో సోడియం 83 మి.గ్రా., పొటాషియం 1,187 మి.గ్రా., క్యాల్షియం 166 మి.గ్రా., పాస్ఫరస్ 1,151 మి.గ్రా., ఐరన్ అధికంగా 32.5 మి.గ్రా. ఉన్నట్టు గుర్తించారు. రివర్ మౌత్ వద్ద లభించే ఇలస చేపల్లో కొవ్వు శాతం అత్యధికంగా 17 శాతం ఉన్నట్టు గుర్తించారు. ఇలస నుంచి పులసగా మారే సమయంలో దీని పోషకాలలో వ్యత్యాసం, మార్పులు స్పష్టంగా తెలుస్తున్నాయి. గుడ్లు పెట్టడానికి, పిల్లలుగా మారడానికి అవసరమైన విధంగా తన శరీరాన్ని, పోషకాలను మార్పు చేసుకోవడం ఈ చేపల విశేషం. ఉప్పు నీటి నుంచి మంచి నీటికి వచ్చే సమయంలో తట్టుకోవడానికి సైతం ఇవి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయి.సీఐఎఫ్టీ అధ్యయనం ఏం చెబుతోందంటే..సముద్రంలో పెరిగే చేపను ఇలస (హిల్సా) అని పిలుస్తారు. అవి వయసుకు వచ్చాక సముద్రంలో నుంచి, మంచినీటి నదిలోనికి ఎదురీదుతూ వెళ్తాయి. నదిలోనే గుడ్లు పెడతాయి. సముద్రపు నీటిలో ఇలసకు, మంచి నీటిలో పులసగా రూపాంతరం చెందిన చేపకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాము జన్మించిన స్థానానికే వచ్చి పులస మళ్లీ గుడ్లు పెడుతుందని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) (central institute of fisheries technology) అధ్యయనం చెబుతోంది. జూన్, జూలై నెలల్లో రుతుపవనాలు, వర్షాకాలం ప్రారంభం అయ్యే సమయంలో సముద్రంలోని ఇలసలు నదుల వైపు ప్రయాణం మొదలుపెడతాయి. నదుల్లోకి వీటి రాక నవంబర్ వరకు కొనసాగుతుంది. వర్షం కురిసిన సమయంలో నదుల్లోని బురద నీరు సముద్రంలో కలుస్తుంది. దీనిని గుర్తించి ఉప్పునీటి నుంచి మంచినీటి దిశగా ఇలస తన ప్రయాణం ప్రారంభిస్తుంది. వర్షం తగినంత లేకపోతే వీటి వలస ఆగిపోతుంది.పులస జాతిని సంరక్షించాలిపులస జాతిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రధానంగా నదులు కలుషితం కాకుండా చూడాలి. అప్పుడే ఆరోగ్యకరమైన చేపలు లభిస్తాయి. ముఖ్యంగా ఇలస నుంచి పులసగా మారే మార్గంలో వాటి ప్రయాణానికి అవరోధాలు లేకుండా చూడటం ఎంతో అవసరం. వీటిని పట్టుకోవడంలో ఒక నియమం అనేది లేదు. నదిలోకి వచ్చిన వాటిని వచ్చినట్టుగా పట్టేస్తూ ఉంటే పునరుత్పత్తి దెబ్బతింటుంది. అదేవిధంగా పుట్టిన పిల్లలు సముద్రంలోకి వెళుతున్నాయా లేదా అనే విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గుడ్లు పెట్టిన పులస నదిలోనే ఉండిపోతోందా లేక సముద్రంలోకి తిరిగి వెళుతోందా అనే విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంది.– డాక్టర్ బి.మధుసూదనరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఐసీఏఆర్–సీఐఎఫ్టీ, విశాఖపట్నం -
ఆ 45 టీఎంసీలూ ఏపీవే
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి మళ్లించే 80 టీఎంసీలకుగాను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మిగిలే 45 టీఎంసీల కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కే దక్కుతాయని కేడబ్ల్యూడీటీ–2కు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ డైరెక్టర్ అనిల్ కుమార్ (ఏకే) గోయల్ స్పష్టం చేశారు. విభజన చట్టం 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులకు ఆ 45 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని చెప్పారు. జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 విచారణ శుక్రవారం కొనసాగింది. ఏపీ ప్రభుత్వం తరఫు సాక్షి ఏకే గోయల్ను తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తున్నందున నాగార్జున సాగర్ నుంచి ఆ మేరకు కృష్ణా డెల్టాకు విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చు కదా అంటూ తెలంగాణ న్యాయవాది అడిగిన ప్రశ్నలకు తగ్గించుకోవచ్చునని గోయల్ చెప్పారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించిన సంవత్సరంలో మాత్రమే.. సాగర్ నుంచి విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చునని చెప్పారు. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించే ఒప్పందం 1978 ఆగస్టు 4న ఉమ్మడి రాష్ట్రంలోనే బేసిన్లోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిందన్నారు. గోదావరి జలాలను మళ్లించే ప్రాంతం, మళ్లించిన జలాలను వినియోగించుకునే ప్రదేశం రెండూ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నందున.. మళ్లించిన గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కే దక్కాలని తేల్చిచెప్పారు. గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా బేసిన్లో 45 టీఎంసీల లభ్యత అదనంగా ఉందన్నది వాస్తవమేనా అని తెలంగాణ న్యాయవాది ప్రశ్నించగా.. ఆ అంశాన్ని ట్రిబ్యునల్ తేల్చాలని గోయల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు), ఎస్సెల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ)లను గుర్తించలేదని తెలిపారు. ఎస్సెల్బీసీ పూర్తయ్యేంత వరకూ ఏఎమ్మార్పీ ద్వారా నీటిని వాడుకోవచ్చునని, ఎస్సెల్బీసీ పూర్తయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలనే ప్రతిపాదన ఉందని చెప్పారు.మీరు రూపొందించిన ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిలో విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులను చేర్చారని, కానీ నెట్టెంపాడు ఎత్తిపోతలను ఎందుకు చేర్చలేదని తెలంగాణ న్యాయవాది అడగ్గా.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్కు మాత్రమే ఆ నియమావళిని రూపొందించానని గోయల్ చెప్పారు. జూరాల ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తరలిస్తారని ఎత్తిచూపారు. సాక్షిగా మీరు స్వతంత్రంగా వాంగ్మూలం ఇస్తున్నట్లు లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు సాక్షిగా పూర్తిగా అవాస్తవాలు చెబుతున్నారు కదా అన్న తెలంగాణ న్యాయవాది వాదనను గోయల్ తోసిపుచ్చారు.ముగిసిన సాక్షుల విచారణఏపీ ప్రభుత్వం తరఫు సాక్షిని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్, మౌఖిక వాంగ్మూలం ముగిసినట్లు ట్రిబ్యునల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2న దాఖలు చేసిన ఇంటర్లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అంగీకరించింది. తదుపరి విచారణను జనవరి 16, 17కు వాయిదా వేసింది. -
అంగీకరించకపోతే పక్కన పెట్టేస్తాం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి– కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు రాష్ట్రా లన్నీ సమ్మతి తెలపాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కోరారు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్రాలు నాలుగేళ్లుగా నాన్చుడు వైఖరిని అవలంబిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్లు గడిచినా ప్రాజెక్టు ముందుకు కదలదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలు సహకరించకపోతే ప్రాజెక్టును పక్కనపెట్టక తప్పదని తేల్చి చెప్పారు. రాష్ట్రాలన్నింటికీ సాధ్యమైనంత గరిష్టంగా నీటి కేటాయింపులు చేశామని, ప్రాజెక్టు ద్వారా 148 టీఎంసీలే తరలిస్తున్నందున కేటాయింపులు పెంచాలన్న రాష్ట్రాల డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని కూడా చెప్పారు. నదుల అనుసంధానంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) సమావేశంలో ఆమె మాట్లాడారు. నెలాఖరులోగా రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధిపతులతో ఢిల్లీలో ప్రత్యక్ష విధానంలో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించాలని ఎన్డబ్ల్యూడీఏకు దేబశ్రీ సూచించారు. జనవరిలో అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. తెలంగాణకు 50% కోటా ఇవ్వలేం..ప్రాజెక్టు ద్వారా తరలించనున్న 148 టీఎంసీల్లో 50 శాతం తమకు కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్ను దేబశ్రీ తోసిపుచ్చారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించడానికి బదులు సమ్మ క్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలనే తెలంగాణ ప్రతి పాదనలను పరిశీలి స్తున్నామని చెప్పారు. సమ్మక్క బరాజ్లో 83 మీటర్ల నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉండే నీళ్లను మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగంగా తరలించాలని, ఆ మేరకు నీటి లభ్యతను తేల్చడానికి సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలన్న రాష్ట్రం సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాలో రెండు కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని రాష్ట్రం చేసిన మరో ప్రతిపాదనకు సూత్రప్రాయంగా సమ్మతి తెలిపారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్, సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్ డీడీ సుబ్రమణ్యం ప్రసాద్ మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చిన తర్వాతే నాగార్జునసాగర్ ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వినియోగించుకోవాలని చెప్పారు. తక్కువ భూసేకరణ చేసేలా ప్రాజెక్టు అలైన్మెంట్ను రూపొందించాలని కోరగా దేబశ్రీ అంగీకరించారు. పోలవరం నుంచి అనుసంధానం సాధ్యం కాదుపోలవరం ప్రాజెక్టు నుంచి నదుల అనుసంధానం చేపట్టాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని దేబశ్రీ తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలిస్తే ఏపీ, తమిళనాడు, పాండిచ్చేరి మాత్రమే లబ్ధి పొందుతాయని, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భాగస్వామ్యం కోల్పోతాయని స్పష్టం చేశారు. ఏపీ భూభాగం పరిధిలో రెండు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకకు కోటా పెంచలేం..తమ రాష్ట్ర భూభాగంలో మాత్రమే జరగనున్న బెడ్తి–వార్దా నదుల అనుసంధానం ప్రాజెక్టును గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు పరిధి నుంచి తొలగించాలని కర్ణాటక చేసిన విజ్ఞప్తిపై దేబశ్రీ ముఖర్జీ సానుకూలంగా స్పందించారు. గోదావరి–కావేరి ప్రాజెక్టులో కర్ణాటకకు 16 టీఎంసీల తాగునీరు మాత్రమే కేటాయించారని, సాగునీరును సైతం కేటాయించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. తాము ఇప్పటికే సమ్మతి తెలుపుతూ ఎంఓయూపై సంతకాలు చేశామని తమిళనాడు, పుదుచ్చేరిలు తెలిపాయి. తమ రాష్ట్రం సొంతంగా చేపట్టిన దామన్గంగా–వైతర్ణ–గోదావరి నదుల అనుసంధానాన్ని గోదావరి–కావేరి ప్రాజెక్టు కింద చేర్చాలని మహారాష్ట్ర విజ్ఞప్తి చేసింది. -
పోలవరం కాలువ గట్లపై మట్టిని తవ్వేస్తున్న జనసేన, టీడీపీ నేతలు
-
అందం.. అత్యద్భుతం
సాక్షి, అమలాపురం/ కాట్రేనికోన: గౌతమీ నదీ సాగర సంగమ ప్రాంతం. పాయలు.. పాయలుగా విడిపోయే నది. వాటిని ఆనుకుని ఇరువైపులా చిట్టిపొట్టి మొక్కలు.. చిక్కని గుబురు పొదలు. వాటి మధ్య సాగే పడవ ప్రయాణం. మడ పీతలు.. అందమైన పక్షులు.. అరుదైన వృక్షజాతులు.. ఔషధ మొక్కలు ఇలా దారి పొడవునా కనిపించే అందమైన సుందర దృశ్యాలు ఎన్నో మరెన్నో. అంబేడ్కర్ కోనసీమ జిల్లా బలుసుతిప్ప శివారు మగసానితిప్పకు వెళ్లే పడవ ప్రయాణం పైరు పచ్చని కోనసీమలో సరికొత్త అందాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. కొబ్బరి తోటలు.. పచ్చని పొలాలు.. పంట కాలువల అందాలనే కాదు.. మడ అడవులు.. నదీపాయలు.. పడవ ప్రయాణాలు.. ఇలా ‘స్వర్గమే కళ్లముందు’ కదలాడుతోంది. మగసానితిప్ప ఓ కుగ్రామం (Maasaani Tippa Village). గోదావరి నదీపాయలు, మడ అడవులు నడుమ ఒక చిన్న దీవి. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పంచాయతీ శివారు గ్రామం. అగ్నికుల క్షత్రియులు ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే పడవ ఒక్కటే మార్గం. అటువంటి గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం కాల భైరవస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి సుమారు 1,800 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు.గతంలో స్వామివారి ఆలయాన్ని సమీపంలో ఉన్న బలుసుతిప్ప గ్రామంలో చౌళరాజులు నిర్మించారని ఆలయ చరిత్ర చెబుతోంది. తుపాను సమయంలో మూలవిరాట్ సముద్రంలో కూరుకుపోతుండగా, మత్స్యకారులు అడ్డుకుని ఊరికి ఈశాన్యంగా ఉన్న మగసానితిప్పలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆలయం నిర్మించి వందేళ్లకు పైబడి అవుతోంది. తొలుత మత్స్యకార పద్దెలు పూజాదికాలు నిర్వహించగా, గత 80 ఏళ్లుగా బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు.పర్యాటకంగా ప్రోత్సహించాలిపర్యాటకంగా ప్రోత్సహిస్తే ప్రయాణికులు, భక్తుల సంఖ్య మరింత పెరగనుంది. ఏకో టూరిజంలో భాగంగా గతంలో పలు సందర్భాల్లో పర్యాటక బోట్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా తరువాత పట్టించుకునేవారు లేకుండా పోయారు. బలుసుతిప్ప, జి.మూలపొలం నుంచి ప్రత్యేక పర్యాటక బోట్లు ఏర్పాటు చేయడం, మగసానితిప్పలో సేద తీరేందుకు ఏర్పాట్లు చేస్తే పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. పెరిగిన తాకిడిఅతి పురాతన ఈ ఆలయానికి ఇటీవల కాలంలో భక్తుల తాకిడి పెరిగింది. గతంలో అప్పుడప్పుడు ఒకరిద్దరు భక్తులు మాత్రమే బయట నుంచి వచ్చేవారు. మహాశివరాత్రి నాడు మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు. కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మరీ ముఖ్యంగా కార్తిక మాసంలో రోజూ భక్తులు వస్తుండగా ఆయ్యప్ప, భవానీ మాలధారులు భారీగా వస్తున్నారు. ప్రతి నెలా అష్టమి రోజు ఇక్కడ గుమ్మడి కాయలో దీపం పెట్టడం వల్ల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం.ఆనవాయితీగా దీపారాధన కాల భైరవస్వామి వెలసి 18 దశాబ్దాలు దాటిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించి వందేళ్లు దాటుతోంది. ఏడు దశాబ్దాలుగా మా తండ్రి, తరువాత నేను అర్చకత్వం చేస్తున్నాం. గతంలో భక్తులు పెద్దగా వచ్చేవారు కాదు. ఇప్పుడు పెరిగింది. అష్టమి రోజున ఇక్కడ గుమ్మడికాయలో దీపారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనిపై నమ్మకంతో భక్తులు అధికంగా వస్తున్నారు. – ఓం నమశ్శివాయ, ఆలయ పూజారి, మగసానితిప్పముచ్చటగొలిపేలా..ఈ గ్రామానికి వెళ్లేందుకు రెండు జల మార్గాలున్నాయి. ఒకటి బలుసుతిప్ప, రెండోది ఐ.పోలవరం మండలం జి.మూలపొలం నుంచి ఇంజన్ పడవల (బోట్లు) మీద రాకపోకలు సాగించాల్సి ఉంది. ఈ పడవల ప్రయాణం ఒక అద్భుతం. మనో ఫలకంపై చెరగని ముద్రగా నిలిచిపోతోంది అంటే అతిశయోక్తి కాదు. ఒంపులు తిరుగుతూ సాగే నదీపాయల మధ్య బోటు ప్రయాణం.. ఇరువైపులా దట్టమైన పొదరిల్లుగా అల్లుకుపోయిన మడ చెట్లు.. నీటి మీద తేలియాడే వాటి వేర్లు ముచ్చటగొల్పుతాయి. అడవుల్లో ఉండే ఔషధ మొక్కల నుంచి వచ్చే పరిమళాలు ప్రకృతి ప్రేమికులను మరో లోకానికి తీసుకుపోతాయి. చెట్ల కొమ్మల మీద పాకుతున్న మడ పీతలు.. అక్కడక్కడా కనిపించే మడ పిల్లులు.. విదేశీ పక్షులు కనువిందు చేస్తాయి.చిన్న కాలువలుగా.. వెంటనే పెద్ద నదిని తలపించే పాయలు.. తీరాన్ని ఆనుకుని గోదావరి దీవుల మధ్య సంప్రదాయ పద్ధతిలో జీవనం సాగించే అగ్నికుల క్షత్రియులు (మత్స్యకారులు). చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ మడ అడవుల్లో పీతలు, చేపల, రొయ్యల వేట ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. మడ అడవులను ఆనుకుని మత్స్య సంపద కోసం ఏర్పాటు చేసిన వలలు, వాటి వద్ద మత్స్యకారుల సందడి ముచ్చట గొల్పుతాయి. పడవలకు ఎదురుగా వచ్చే వేట పడవలు... రాకపోకలు సాగించే గ్రామస్తులు, గంటపాటు సాగే ప్రయాణంలో కంటిని కట్టిపడేసే అందచందాల గురించి ఎలా ఎన్ని చెప్పుకొన్నా.. ఎంత చెప్పుకొన్నా తక్కువే. ప్రకృతి ప్రేమికులు జీవితంలో ఒక్కసారైనా ప్రయాణం చేయాలనిపించే ప్రాంతం ఇది. -
గోదావరి.. అపార జలసిరి
సాక్షి, అమరావతి: గోదావరిలో జలసిరులు అపారంగా ఉన్నాయని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) స్పష్టంచేసింది. ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని తాజాగా తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని సీడబ్ల్యూసీ వెల్లడించింది. గోదావరిలో ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించిన అధ్యయనాల్లో నిర్ధారించిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉందని ప్రకటించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరులు, బచావత్ ట్రిబ్యూనల్ సమయంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం గల ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయాలంటే వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకోవాలని చెబుతున్నారు. బేసిన్లో కొంతకాలం అధిక వర్షపాతం కురవడం... ఆ సమయంలో ఒకేసారి గరిష్టంగా వరద రావడం తదితర కారణాల వల్లే గోదావరిలో నీటి లభ్యత పెరగడానికి కారణమని నీటిపారుదలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోదావరి బేసిన్ ఇదీ.. దేశంలో రెండో అతి పెద్ద నది గోదావరి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్లో సముద్రమట్టానికి 1,067 మీటర్ల ఎత్తులో జని్మంచిన గోదావరి... మహారాష్ట్ర, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో 1,465 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏపీలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.గోదావరికి ప్రవర, పూర్ణ, మంజీర, పెన్గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ప్రధాన ఉప నదులు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పుదుచ్చేరిలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ..» గోదావరిలో 1985–86 నుంచి 2022–23 వరకు ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉంది. » 2013–14లో గరిష్టంగా 8,664.82 టీఎంసీల లభ్యత ఉండగా... 2009–10లో నీటి లభ్యత కనిష్టంగా 2,066.62 టీఎంసీల లభ్యత ఉంది. » బేసిన్లో సగటున 1,167 మి.మీ. వర్షపాతం కురుస్తుంది. దీనివల్ల గోదావరిలో ఏటా సగటున 12,869.74 టీఎంసీల ప్రవాహం ఉంటుంది. 1994–95లో గరిష్టంగా 1,484 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గరిష్టంగా 17,054.89 టీఎంసీల ప్రవాహం ఉంది. 2015–16లో బేసిన్లో కనిష్టంగా 914 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గోదావరిలో కనిష్టంగా 9,608.43 టీఎంసీల ప్రవాహం ఉంది. » 1985–2023 మధ్య ఏటా సగటున 850.38 టీఎంసీలను మాత్రమే సాగునీటి కోసం వినియోగించుకున్నారు. » 2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, పశువులకు తాగునీటి కోసం 70.28 టీఎంసీలు వాడుకున్నారు. » బేసిన్లో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటున 181.52 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ నిర్ధారించింది. -ఆలమూరు రామగోపాలరెడ్డి -
శాంతిస్తున్న ‘గోదావరి’
సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురి సౌత్: కాటన్ బ్యారేజీ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. ఇక్కడ శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు నీటిమట్టం 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం రాత్రి 7 గంటలకు మరింత తగ్గుతూ నీటిమట్టం 12.10 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజీ నుంచి 10,33,672 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 9,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద శనివారం పూర్తిగా ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించే అవకాశమున్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32.440 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే నుంచి 9.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39.40 అడుగులకు చేరుకుంది.తేరుకుంటున్న కోనసీమ లంకలుమరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ లంకలు నెమ్మదిగా తేరుకుంటున్నాయి. కానీ, జిల్లాలో ప్రధాన కాజ్వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి.దీంతో ఆయా ప్రాంతాల లంకవాసులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, శనివారం ఉదయం ముంపు మరింత తగ్గే అవకాశమున్నందున ఆదివారం నుంచి లంక గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముంది.శ్రీశైలానికీ తగ్గుతున్న వరద..ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికీ ఎగువ నుంచి వచ్చే వరద తగ్గింది. ఇక్కడకు గురువారం నుంచి శుక్రవారం వరకు 1,25,938 క్యూసెక్కుల నీరు రాగా.. శ్రీశైలం నుంచి దిగువకు 1,20,367 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 211.457 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్కు శ్రీశైలం నుంచి వచ్చే నీటి చేరిక తగ్గింది. -
వరదతో లంకవాసుల జీవితం ఛిద్రం
సాక్షి, అమలాపురం/సాక్షి, భీమవరం: గోదావరి, వశిష్ట గోదావరి మరోసారి పోటెత్తడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు లంక గ్రామాల్లోని ప్రజల జీవితం ఛిద్రమైంది. ఈ ఏడాది గోదావరి వరద లంక గ్రామాలను ముంచడం ఇది మూడోసారి. జూలైలో వచ్చిన వరదకంటే ఇప్పుడు వరద భారీగా ఉంది. జూలై చివర్లో వచ్చిన వరదలకే పలు పంటలకు నష్టం వాటిల్లగా ప్రస్తుత వరదలకు అక్కడక్కడా మిగిలిఉన్న కాస్త పంటలు కూడా దెబ్బతిన్నాయి. వరదల ప్రభావం అంబేడ్కర్ జిల్లాలోని పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలపై అధికంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లోని లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 12 మండలాల్లోని 44 శివారు గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. కాజ్వేలతోపాటు ప్రధాన రోడ్లపై 5 అడుగుల ఎత్తున నీరు చేరడంతో లంకవాసులు, విద్యార్థులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. అప్పనపల్లి గ్రామం, బి.దొడ్డవరం ఇందిరమ్మ కాలనీ, అయినవిల్లి మండలంలో వీరవల్లిపాలెం, పొట్టిలంక, ముమ్మడివరం మండలంలోని లంకాఫ్ ఠాన్నేల్లంక, కూనాలంక, గురజాపులంక, అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో వరద మరింత పెరిగింది. జిల్లాలోని మత్స్యకార గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఉద్యాన పంటలు మరోసారి పెద్ద ఎత్తున నీట మునిగాయి. అరటి, కంద, కోకో, కొబ్బరి, కూరగాయ పంటలు నీట నానుతున్నాయి. పాడి రైతులు పాలు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మత్స్యకారులు పది రోజులుగా వేట లేక ఇబ్బంది పడుతున్నారు.లంక భూములను ముంచెత్తిన వశిష్ట గోదావరిఎగువ నుంచి ఉరకలెత్తుతూ వస్తున్న జలాలతో వశిష్ట గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని పలు లంక గ్రామాలను వరద ముంచెత్తింది. ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని 600 ఎకరాల్లో కూరగాయలు, 80 ఎకరాల్లో తమలపాకుల పంటలకు నష్టం వాటిల్లింది. 200 ఎకరాల్లోని అరటి తోటలను వరద ముంచెత్తింది. యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక, దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం గ్రామాల్లో వరదనీరు చేరింది. వడ్డిలంక వద్ద స్లూయిజ్ గేటు సక్రమంగా మూసుకోకపోవడంతో గోదావరి నీరు నక్కల డ్రెయిన్లోకి ఎగదన్నుతోంది. -
రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం (ఫొటోలు)
-
Updates: ‘అధికారులెవరూ రాలేదండీ’
AP And Telangana Floods News Latest Updates In Teluguశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద జలాశయం 2 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో : 1,38,833 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 96,081 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 884.60 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు .. ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిజయవాడ 12 రోజులైనా ముంపు ప్రాంత ప్రజలకు తప్పని తిప్పలు ఇంకా మోకాళ్ల లోతు నీటిలోనే నానుతున్న అంబాపురంలోని కాలనీలు వరదలో ఉండలేక ఇళ్లను వదిలి వెళ్లిపోయిన ప్రజలు దొంగల భయంతో మళ్లీ ఇళ్లకు చేరుకుంటున్న కొందరు ప్రభుత్వం నుంచి ఈరోజు వరకూ తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆగ్రహం మంచినీరు కూడా సప్లై చేయడం లేదంటున్న అంబాపురం ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇళ్ల నుంచి బయటికి వస్తున్న వరద బాధితులు ఎన్యుమరేషన్ దాదాపు పూర్తైందంటున్న అధికారులు.. తమ వద్దకు ఏ ఒక్కరూ రాలేదంటున్న వరద బాధితులువాలంటీర్ వ్యవస్థ ఉంటే తమకు ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదంటున్న అంబాపురం వాసులునల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలభద్రాచలంతగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహంఈరోజు ఉదయం 11 గంటలకు 42.7అడుగుల గోదావరి నీటిమట్టంమొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులుసూర్యాపేటఅనంతగిరి, కోదాడ మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందంఅనంతగిరి మండలం గోండ్రియాల, కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడిలో ధ్వంసం అయిన ఇళ్లలు, నష్టపోయిన పంట, కోతకు గురైన రహదారులను పరిశీలించిన కేంద్ర బృందం క్లిక్ చేయండి: దేవుడా ఈ నరకం ఇంకెన్నాళ్లూ! ప్రకాశం బ్యారేజీ వద్ద కేంద్ర బృందంప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందంబోటు ప్రమాదంలో దెబ్బ తిన్న బ్యారేజీని పరిశీలించిన సభ్యులుఖమ్మం ఖమ్మం నగరంలోని వరదల్లో నీట మునిగిన నయా బజార్ కాలేజీ ని పరిశీలించిన ఎమ్మెల్సీ కోదండరాం అనంతరం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కొనసాగుతున్న ఆపరేషన్ బోట్ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమంనిన్నంతా కష్టపడ్డ అండర్ వాటర్ టీంఇవాళ కూడా కొనసాగనున్న పనులుబోట్లను ముక్కలు చేసి ఆపై బెలూన్లతో తొలగించే యత్నంమెదక్ఏడుపాయాల ఆలయం మళ్లీ మూసివేతసింగూరు గేట్లు ఎత్తేయడంతో భారీగా నీరుఆలయాన్ని తాకుతూ నీటి ప్రవాహంరెండ్రజుల కిందటే తెరుచుకున్న ఆలయంఈలోపే మళ్లీ మూసేసిన నిర్వాహకులుబ్యారేజీకి కేంద్ర కమిటీనేడు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కేంద్ర కమిటీ ప్రకాశం బ్యారేజీ చెంతకు కమిటీప్రస్తుత బ్యారేజీ పరిస్థితిపై ఆరా తీయనున్న సభ్యులు ఎన్టీఆర్ జిల్లా:వరద ప్రభావిత ప్రాంతాల్లో అనిల్ సుబ్రహ్మణ్యం నేతృతంలో కేంద్ర బృందం పర్యటనకలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన కేంద్ర బృందంవరద ముంపు ప్రాంతాల డ్రోన్ విజువల్స్ పరిశీలననష్టంపై కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ జి.సృజనకేంద్ర బృందాన్ని కలిసి తమకు జరిగిన నష్టంపై వినతిపత్రం అందజేసిన కృష్ణామిల్క్ యూనియన్ (విజయ డైరీ ) చలసాని ఆంజనేయులుఫోటో ఎగ్జిబిషన్ అనంతరం ప్రకాశం బ్యారేజ్, బుడమేరు గండ్లు పడిన ప్రాంతం, ఈలప్రోలు, రాయనపాడు, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం నంద్యాల:శ్రీశైలం జలాశయానికి కోనసాగుతున్న వరద నీరుజలాశయం 1 గేటు 10 అడుగులు మేరకు మరొక్కసారి ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో: 1,38,833 క్యూసెక్కులుఔట్ ఫ్లో: 96,081 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలుప్రస్తుతం: 212.9198 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి విజయవాడ:విజయవాడలో ఇంకా ముంపులోనే పలు కాలనీలు12 రోజులైనా బురదలోనే ముంపు ప్రాంతాలుశుభ్రం చేసుకునేందుకు అవస్థలుపడుతున్న కాలనీల వాసులునీళ్లలో నానుతున్న ఎల్బీఎస్ నగర్, కండ్రిక, తోటివారి వీధిముంపులోనే ప్రకాశ్ నగర్, అంబపురంలోపల కాలనీల ప్రజలకు అందని సాయం రోడ్ల మీద బురద పేరుకుపోవటంతో ప్రజలకు అవస్థలుప్రచార ఆర్భాటంగా ఎన్యుమరేషన్మ్యాపింగ్ ఉంటేనే ఎన్యుమరేషన్ అంటున్న అధికారులుఇంట్లోని సామాన్లకు మాత్రమే జరుగుతున్న ఎన్యుమరేషన్ ఖమ్మం జిల్లాఖమ్మం నగరంలో బొక్కలగడ్డ, ధంసలాపురం ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టంఈరోజు ఉదయం 9 గంటలకు 43.3 అడుగులుకు చేరిన గోదావరి నీటిమట్టంఅమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరికఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.స్పిల్ వే ఎగువన 33.750 మీటర్లుస్పిల్ వే దిగువన 25.580 మీటర్లు నీటిమట్టం నమోదు.48 రేడియల్ గేట్ల ద్వారా 12,46.342,క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల.ఏలూరు జిల్లాజంగారెడ్డిగూడెం మండలం కొంగ వారిగూడెం ఎర్రకాలవ జలాశయానికి తగ్గిన వరద నీరు.పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 81.87ఇన్ ఫ్లో 1565 క్యూసెక్కులు అవుట్ ఫ్లో గేట్లు ఎత్తి 1806 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేసిన అధికారులునల్లగొండ జిల్లానాగార్జునసాగర్ ప్రాజెక్టు కు తగ్గిన వరదక్రస్ట్ గేట్లు మూసివేతఇన్ ఫ్లో: 68235 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో : 43298 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 310.8498 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఎడమ కాలువకు నీటిని నిలిపివేసి నేటికి 12 రోజులుసూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద ఇంకా పూడ్చివేయని కాలువ గండిసూర్యాపేట జిల్లా:పులిచింతల అప్డేట్ఇన్ ఫ్లో 31,182క్యూసెక్కులుఅవుట్ ఫ్లో:16,000క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం:175 అడుగులుప్రస్తుత నీటి మట్టం:172.767 అడుగులుపూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 38.765 టీఎంసీలుపవర్ జనరేషన్ :16000 క్యూసెక్కులు.నిజామాబాద్ జిల్లాశ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుఔట్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 80 టీఎంసీలుప్రస్తుతం 1090 అడుగులు, 80 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కమిటీ పర్యటన.ఖమ్మం, సూర్యాపేటలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బృందం.వరద బాధితులను ఆదుకోవాలని నిన్న సెంట్రల్ కమిటీకి నివేదిక ఇచ్చిన సిఎస్.ఇవ్వాల్టితో ముగియనున్న రాష్ట్ర పర్యటన.జూరాల అప్డేట్మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద13 గేట్స్ ఎత్తివేతఇన్ ఫ్లో : 1 లక్ష 26 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1 లక్ష 26 వేల 243 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.270 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 318.350మీటర్లుపూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 9.316 టీఎంసీలుఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాగోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుబ్యారేజ్ వద్ద 15.3 అడుగులుగా నమోదైన గోదావరి వరద నీటిమట్టం15 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలబ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలుసఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక టేకి శెట్టిపాలెం మధ్య వరద నీరు రావడంతో పడవలపై రాకపోకలుఅప్పనపల్లి-పెదపట్నం లంక మధ్య వరద నీరు రావడంతో అవస్థలు పడుతున్న స్థానికులుఇప్పటికే నీట మునిగిన గంటి పెదపూడి, ఎదురుబిడియం, కనకాయలంక కాజ్వేలువరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు రోజులపాటు వినాయక నిమజ్జనాన్ని చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన అధికారులుకోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న వశిష్ట , గౌతమి, వైనతేయ నదులు -
గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం అర్బన్/ఏటూరునాగారం: గోదావరి నదికి ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 7:32 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరింది. దీంతో ఆర్డీ ఓ దామోదర్రావు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం అంతకంతకూ పెరు గుతూ సాయంత్రం 5:15 గంటలకు 48 అడుగులు దాటి ప్రవహించడంతో రెండో ప్ర మాద హెచ్చరిక కూడా జారీ చేశారు. వరద పెరుగుతున్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ సూచించారు.అధికారులు అప్రమత్తంగా ఉండి, ముంపు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రం నాటికి 15.80 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాలైన రామన్నగూడెం, ఏటూరునాగారం గ్రామంలోని ఓడవాడ, 1, 2, 10 వార్డుల్లోని ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో నది ప్రవహిస్తోంది. 15.83 మీటర్లకు చేరితే.. రెండు ప్రమాద హెచ్చరిక, 17.33 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి కరకట్ట వద్ద పోలీసులు, రెవెన్యూ, కేంద్ర జలవనరుల శాఖ, ఇరిగేషన్ అధికారులు పహారా కాస్తున్నారు. సాగర్ 26 గేట్లూ ఎత్తివేతనాగార్జునసాగర్/ దోమలపెంట: నాగార్జునసాగర్ జలాశయానికి వరద పెరిగింది. దీంతో మంగళవారం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 2,50,257 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆరుగేట్లు కూడా... కృష్ణానదికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు పైకెత్తి 1,64,592 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. -
శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాల ప్రవాహం పెరిగింది. శ్రీశైలానికి జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 1,47,682 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో శుక్రవారం 6 గేట్లను తెరచి నాగార్జునసాగర్కు 1,67,076 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 212.91 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం స్పిల్వే, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో శుక్రవారం నాగార్జున సాగర్ జలాశయానికి 2,04064 క్యూసెక్కులు జలాలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి 20 క్రస్ట్ గేట్లు ఎత్తి స్పిల్వే మీదుగా 1,61,800 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో మరో 28,339 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, ఏఎమ్మారీ్ప, వరద కాల్వల ద్వారా 13,925 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి 1,31,803 క్యూసెక్కులు వస్తుండగా 202 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నారు. మిగులుగా ఉన్న 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. శాంతిస్తున్న గోదావరి ధవళేశ్వరం: ఉరకలెత్తిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.10 అడుగులకు చేరింది. గురువారం రాత్రి 11.75 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అనంతరం క్రమేపీ పెరుగుతూ శుక్రవారం ఉదయానికి 12.30 అడుగులకు చేరింది. సాయంత్రం 6 గంటలకు స్వల్పంగా తగ్గింది. కాటన్ బ్యారేజీ నుంచి 10,36,440 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. డెల్టా కాలువలకు 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ∙ఆరు గేట్ల ద్వారా 1,67,076 క్యూసెక్కులు విడుదల ∙ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి -
పెరుగుతున్న గోదారమ్మ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం, ప్రధాన పాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉప నదులు వరదెత్తడంతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చి0ది. బుధవారం సాయంత్రం 6 గంటకు భద్రాచలం వద్దకు 8.79 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 45.55 అడుగులకు చేరుకుంది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం అర్ధరాత్రికి భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉంది. అప్పుడు అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. పోలవరంలోకి ఎగువ నుంచి వల్చిన వరదను వల్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 7,02,506 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్కులను విడుదల చేస్తున్న అధికారులు మిగులుగా ఉన్న 7,00,706 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.ఎగువన తెలంగాణలోని ప్రాజెక్టుల్లోనూ గోదావరి పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ధవళేశ్వరం బ్యారేజ్కి వరద మరింత పెరగనుంది. గురువారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 48 గ్రామాలకు నిలిచిన రాకపోకలు గోదావరి పెరుగుతుండడంతో శబరి నది ఎగపోటుకు గురై చింతూరు మండలంలో వాగులు పొంగుతున్నాయి. దీంతో విలీన మండలాల్లో రహదారులు ముంపునకు గురై 48 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, వీఆర్పురం మండలాల నడుమ, చింతూరు మండలంలో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
గోదా‘వడి’ పెరుగుతోంది
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 3.05 లక్షల క్యూసెక్కులు వరద నీరు చేరింది. గోదావరి డెల్టాకు 3 వేల క్యూసెక్కులు వదులుతూ.. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో బ్యారేజ్లో ఫ్లడ్కుషన్ ఉంచడానికి కొంతమేర ఖాళీ చేస్తూ సముద్రంలోకి 3.09 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శ్రీరాంసాగర్లోకి 2.45 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. గేట్లు ఎత్తేసి 2.40 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దాని దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 4.72 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ప్రాణహిత ఉద్ధృతితో కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారేజ్)లోకి 9.02 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. దాని దిగువన సమ్మక్క బ్యారేజ్లోకి 7.23 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్లోకి 7.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద మంగళవారం రాత్రికి గోదావరి 39 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ఇది క్రమేపీ పెరుగుతూ అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దిగువన పోలవరం ప్రాజెక్టు వద్ద 29.550 మీటర్ల మేర నీటిమట్టం ఉంది. స్పిల్వే నుంచి 4 లక్షల 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భారీ వర్షాల కారణంగా వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
Nashik: ఉప్పొంగిన గోదావరి.. నీట మునిగిన ఆలయాలు
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు.నాసిక్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం ఎనిమిదిన్నర వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. ఫలితంగా రాంకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి.గంగాపూర్ డ్యాం సహా పలు డ్యాంల నుంచి అధికారులు క్రమంగా నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్లోని హోల్కర్ వంతెన కింద నుంచి 13,000 క్యూసెక్కుల వేగంతో నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్ పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, నది ఒడ్డున ఉన్న గ్రామాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
కావేరికి దారేది?
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) విఫలమవుతోంది. దీంతో ఏడేళ్లుగా ఈ ప్రతిపాదనలో ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి. నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలను ఎన్డబ్ల్యూడీఏ తీసుకోకుండా గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదన రూపొందించడమే దానికి కారణమని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తొలుత అకినేపల్లి.. ఆ తర్వాత జానంపల్లి.. ఇప్పుడు ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించేలా డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను ఎన్డబ్ల్యూడీఏ సిద్ధం చేసింది. తమ కోటా నీటిని కావేరికి ఎలా తరలిస్తారని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానానికి అంగీకరించే ప్రశ్నే లేదని తెలంగాణ సర్కార్ చెబుతోంది.బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచి కావేరికి గోదావరి జలాలను తీసుకెళ్లేలా ప్రతిపాదనలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ఎన్డబ్ల్యూడీఏ విఫలమవుతున్న నేపథ్యంలో కావేరితో గోదావరి అనుసంధానం కష్టమేనని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఏకపక్షంగా ప్రతిపాదన.. గోదావరిలో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీలకు 107 టీఎంసీల మిగులు జలాలను జతచేసి 248 టీఎంసీలను అకినేపల్లి నుంచి కావేరికి తరలించేలా 2017లో ఎన్డబ్ల్యూడీఏ డీపీఆర్ను రూపొందించింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా జానంపేట నుంచి 248 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా 2018లో డీపీఆర్లో మార్పులు చేసింది. దీనిపై కూడా మూడు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఛత్తీస్గఢ్ ససేమిరా అంటున్నాగోదావరిలో మిగులు జలాలే లేవని.. నీటి లభ్యతే లేనప్పుడు అనుసంధానం ఎలా చేపడతారని 2020లో ఏపీ ప్రభుత్వం ఎన్డబ్ల్యూడీఏను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. దాంతో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీలను ఇచ్ఛంపల్లి నుంచి కావేరికి తరలించేలా 2022లో డీపీఆర్లో ఎన్డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానం చేపడితే దేవాదుల, సీతారామ ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచే కావేరికి గోదావరి జలాలను తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ కోటా నీటిని కావేరికి తరలించడానికి అనుమతించే ప్రశ్నే లేదని.. కాదూ కూడదని అనుసంధానం చేపడితే న్యాయపోరాటం చేస్తామని ఛత్తీస్గఢ్ సర్కార్ స్పష్టం చేసింది. కానీ.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచే ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని నీటిని కావేరికి తరలించే ప్రతిపాదననే ఎన్డబ్ల్యూడీఏ మళ్లీ తెరపైకి తేవడంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
గొట్టిముక్కల ఎగువన రెండు జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా గొట్టిముక్కలకు ఎగువన లోయ తరహాలో ఉన్న ప్రాంతాల్లో రెండు జలాశయాలను నిర్మించాలని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ)ను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలను కేటాయించారని.. కానీ ఆ నీటితో ప్రతిపాదించిన 5.30 లక్షల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే 3 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ–2 ద్వారా నీళ్లు అందుతున్నాయని వివరించింది. అందువల్ల ఈ 45 టీఎంసీల నీటిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి రెండు జలాశయాలను నిర్మించాలని కోరింది.గోదావరి–కావేరి అనుసంధానంపై శుక్రవారం జలసౌధలో తెలంగాణతో ఎన్డబ్ల్యూడీఏ సమావేశం నిర్వహించింది. ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్, సీఈ దేవేందర్రెడ్డి, ఈఈ శ్రీనివాస్, రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్ పాల్గొన్నారు. భేటీలో రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. అనుసంధానం ప్రాజెక్టుపై రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటి సరఫరా కోసం 250 టీఎంసీలు అవసర మని చెప్పారు. అందువల్ల ప్రాజెక్టు ద్వారా తరలించే నీటిలో 50 శాతాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు.రాష్ట్రం చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవీ..⇒ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీటి తరలింపు కోసం ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని మా అధ్యయనంలో తేలింది. సమ్మక్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలి. రాష్ట్ర అవసరాల కోసం సమ్మక్క బరాజ్లో 83 మీటర్ల వరకు నిల్వలను సంరక్షిస్తూ ఆపై నిల్వలను మాత్రమే తరలించాలి. తెలంగాణకు సీతమ్మసాగర్ ప్రాజెక్టు కింద 70 టీఎంసీలు, సమ్మక్క ప్రాజెక్టు కింద 50 టీఎంసీలు, దేవాదుల కింద 38 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీల అవసరాలు ఉన్నాయి. వాటిని సంరక్షించాలి. సీతమ్మ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి అవసరమైన కనీస నిల్వలను కాపాడాలి.⇒ సమ్మక్క బరాజ్లో 87 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే ఛత్తీస్గఢ్లో జరిగే ముంపు విషయంలో ఆ రాష్ట్రాన్ని ఒప్పించే బాధ్యతను ఎన్డబ్ల్యూడీఏ తీసుకోవాలి. ఛత్తీస్గఢ్ వాడుకోకపోవడంతో మిగిలే 148 టీఎంసీల గోదావరి జలాలను గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించనున్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఛత్తీస్గఢ్ను ఒప్పించి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై ఆ తర్వాతే సంతకాలు చేస్తాం.⇒ అనుసంధానం ప్రాజెక్టులో కాల్వలు, సొరంగాల కోసం సేకరించాల్సిన భూముల్లో రెండు పంటలు పండే ఆయకట్టు భూములున్నాయి. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రం నిర్మించనున్న కాల్వల వ్యవస్థనే అనుసంధానం ప్రాజెక్టు అవసరాలకూ వాడుకోవాలి.⇒అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని నాగార్జునసాగర్కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి కావేరికి తరలించాలని ప్రతిపాదించారు. అయితే కీలకమైన కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు వచ్చే వరకు సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడుకోరాదు. సాగర్ నిర్వహణ ప్రొటోకాల్తోపాటు ఏపీ, తెలంగాణలకు నీటి కేటాయింపులపై స్పష్టత వచ్చాకే ఈ విషయంలో ముందుకు వెళ్లాలి.50 శాతం వాటా మినహా మిగతావి ఓకే: ఎన్డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్అనుసంధానం ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో తెలంగాణకు 50 శాతం కేటాయించాలనే డిమాండ్ విషయంలో పట్టువీడాలని ఎన్డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ కోరారు. రెండు కొత్త జలాశయాల నిర్మాణం, సమ్మక్క బరాజ్ నుంచే నీటి తరలింపు, ఛత్తీస్గఢ్ నుంచి సమ్మతి తీసుకోవడం తదితర అంశాలన్నింటి పట్ల సానుకూలంగా ఉన్నామని తెలిపారు. తదుపరి చర్చల్లో ఈ అంశాలపై మరింత పురోగతి సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎంఓయూ చేసుకోవాలని కోరారు.గౌరవెల్లి కాల్వల పనులకు అనుమతిసాక్షి, హైదరాబాద్: శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు–ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఐఎఫ్ఎఫ్సీ) ప్రాజెక్టులోని ప్యాకేజీ– 7లో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లను తరలించే కాల్వల నిర్మాణం కోసం రూ.431.30 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన అనుమ తులు జారీ చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధి లోని 1,06,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ఈ పనులు చేపట్టనున్నారు. భూసేకరణలో పురోగతితో సంబంధం లేకుండా మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
హైదరాబాద్కు మల్లన్నసాగర్ జలాలు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ‘నీటి’కబురు చెప్పింది. నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి మంచినీటి సరఫరా ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ మంగళవారం ఉత్తర్వులు (జీవో నంబర్ 345) జారీ చేశారు. ఈ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పునరుజ్జీవింప చేయనుంది. హైబ్రిడ్ యాన్యుటీ (బీఓటీ + ఈపీసీ) మోడ్లో పనులు పూర్తి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు వివిధ మార్గాల ద్వారా 580 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నుంచి 600 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. అయితే 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా 170 ఎంజీడీల జలాల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఈ అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్–2ను చేపట్టాలని నిర్ణయించింది. 2030వ సంవత్సరం నాటికి హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీలకు పెరుగుతుందనే అంచనా ఉండగా, 2050 నాటికి ఇది 1,014 ఎంజీడీలకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. డీపీఆర్ సిద్ధం చేసిన వాప్కోస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను వాప్కోస్ కంపెనీ సిద్ధం చేసింది. ప్రాజెక్టులో భాగంగా పంప్హౌస్లు, సబ్స్టేషన్లు, మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3,600 ఎంఎం డయా భారీ పైప్లైన్ నిర్మించనున్నారు. ఘన్పూర్ వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపడతారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.3849.10 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.5,560 కోట్లు కేటాయించడంతో మొత్తంగా నగరానికి రూ.9410 కోట్లు కేటాయించినట్లయింది. మొత్తం 15 టీఎంసీల తరలింపుగోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్ల్యూఎస్) పథకం ఫేజ్–1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా రెండో దశ పథకం ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీల నీటిని నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగతా ఐదు టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను పునరుజ్జీవింప చేసేందుకు ఉపయోగించనున్నారు. -
సాగర సంబురం
సాక్షి,హైదరాబాద్/దోమలపెంట: శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతుండగా,నాగార్జునసాగర్ ప్రాజెక్టు సైతం జలకళను సంతరించుకుంటోంది. బిరబిరా కృష్ణమ్మ తరలివస్తుండడంతో నాగార్జునసాగర్లో గంట గంటకూ నీటినిల్వ పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం రాత్రి 7 గంటలకు 4,13,178 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 883.5 అడుగుల వద్ద 207.41 టీఎంసీలకు చేరుకుంది.ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటం.. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది, దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 60,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం స్పిల్వే గేట్లు, విద్యు దుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది.నాగార్జునసాగర్లోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1,55,716 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 517.2 అడుగుల వద్ద 144.22 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.. పూర్తి నిల్వసామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 170 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారంరోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశముంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో పశి్చమ కనుమల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణా, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.కృష్ణా ప్రధానపాయ నుంచి ఆల్మట్టి డ్యామ్లోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్లోకి 2.85 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.77 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్లోకి 70 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మళ్లీ గోదావరికి పెరిగిన వరదమహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా వర్షాలుసాక్షి, హైదరాబాద్: గోదావరినది పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది.భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ బుధవారం గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుందని కేంద్ర జలసంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులను హెచ్చరించింది. ప్రాణహితలో వరద పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్లోకి వరద ప్రవాహం 7.71 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దానికి ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క సాగర్) బరాజ్లోకి 9.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.సీతమ్మసాగర్(దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 9.64 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్దకు మంగళవారం సాయంత్రం 8.45 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. నీటి మట్టం 43.7 అడుగులుగా నమోదైంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 10.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.ధవళేశ్వరం బరాజ్లోకి 11,26,625 క్యూసెక్కులు చేరుతుండగా.. 11,19,425 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బరాజ్ వద్ద నీటిమట్టం 12.6 అడుగులుగా నమోదవుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక కూనవరం వద్ద శబరి ఉధృతితో నీటిమట్టం 39.25(సముద్రమట్టానికి) మీటర్ల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. -
దోబూచులాడుతున్న గోదావరి
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం/అమలాపురం: గోదావరి నదిలో వరద ప్రవాహం దోబూచులాడుతోంది. దిగువన వరద తగ్గుతుండగా.. ఎగువన పెరుగుతోంది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఖమ్మం జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకు బుధవారం గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని కేంద్ర జలసంఘం అధికారులను హెచ్చరించింది. కూనవరం వద్ద శబరి వరద ఉధృతి అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుందని వెల్లడించింది. ప్రాణహితలో వరద పెరగడంతో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి వరద ప్రవాహం 7.71 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. అదేస్థాయిలో బ్యారేజీ నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దానికి ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బ్యారేజీలోకి 9.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్లోకి చేరుతున్న 9.64 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 10.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి మంగళవారం మరింత తగ్గింది. సాయంత్రం 6 గంటలకు 175 గేట్లను ఎత్తి బ్యారేజీ నుంచి 11,30,731 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేశారు. దిగువన వరద తగ్గడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో ముంపు వీడుతోంది. -
లంక గ్రామాలు అస్తవ్యస్తం
సాక్షి, అమలాపురం : పాడి పంటలు.. అన్నపానీయాలు అందించి డెల్టాను సస్యశ్యామలంగా మార్చిన గోదావరే.. ఏటా ఉగ్రరూపం దాల్చి గ్రామాలను ముంచెత్తుతోంది. పాడి పంటలకు అంతులేని నష్టాన్ని మిగులుస్తోంది. అపారమైన నష్టాన్ని కలగజేస్తోంది. రోడ్లు, డ్రెయిన్లు, కాలువలను ఏకం చేస్తోంది. వాహనాలను పక్కనబెట్టి పడవల మీద రాకపోకలు సాగించేలా చేస్తోంది. చేలు, చెరువులు, ఉద్యాన పంటలను కబళిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే లంక గ్రామాలను అస్తవ్యస్థం చేస్తోంది. వరుసగా రెండుసార్లు ముంచెత్తిన గోదావరి వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వరద ముంపులో 21వేల కుటుంబాలు.. గోదావరి వరదలవల్ల జిల్లాలో 12 మండలాల్లోని 47 శివారు గ్రామాలు నీట మునిగాయి. 21,492 కుటుంబాలు వరద ముంపు బారినపడ్డాయి. పి. గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, ఐ.పోలవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ఇది అధికంగా ఉంది. వరదకు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ స్థానికులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. ఎటుచూసినా వరద నీరు తప్ప మరొకటి కనిపించడంలేదని లంక వాసులు వాపోతున్నారు. అల్లవరం మండలం బోడసుకుర్రు, ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 293 కుటుంబాలకు చెందిన 809 మందికి పునరావాసం కల్పించి ఆహార పొట్లాలను అందిస్తున్నారు. ఎనిమిది గృహాలు దెబ్బతిన్నాయి. 3,943.30 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అరటి, కంద, పసుపు, కర్ర పెండలం, కోకో పంటలతోపాటు కూరగాయ పంటలకు అధిక నష్టం కలిగింది. పన్నెండు రోజులుగా నదీపాయల్లో వరద కొనసాగుతుండడంవల్ల డెల్టాలోని మురుగునీటి కాలువల ద్వారా ముంపు నీరు దిగడంలేదు. వరద నీరు రాకుండా అవుట్ ఫాల్ స్లూయిజ్లు మూసివేశారు. ఇదే సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డెల్టాలో వరిచేలు నీట మునగడంతో పంట దెబ్బతింది. అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ 2,734 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కానీ, ఇంతకు రెట్టింపు నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. వీటితోపాటు 300 ఎకరాల్లో వెనామీ రొయ్యల సాగు తుడుచుపెట్టుకుపోయిందని అంచనా. పాలు మా వద్దే ఉండిపోతున్నాయి.. నాకు మూడు గేదెలున్నాయి. రోజుకు ఆరు లీటర్ల పాలు వస్తాయి. పాలు కొనుగోలు చేసే వ్యాపారులు వరదలు కారణంగా రావడంలేదు. ఇంట్లోనే కొంత వాడాల్సి వస్తోంది. వరదలవల్ల పచ్చగడ్డి కొరత అధికంగా ఉంది. గతంలో వరదల సమయంలో ఎండు గడ్డి ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడంలేదు. – కుసుమ కోటేశ్వరరావు, అయినవిల్లి లంక, అయినవిల్లి మండలం ఈ నాలుగు నెలలు పడవ ప్రయాణమే.. వరదలు ఉండే ఈ నాలుగు నెలలు పడవ మీదనే రాకపోకలు చేయాల్సింది. ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు రేవు దాటి బస్సుపై నరసాపురం వెళ్తుంటా. తిరిగి వచ్చేసరికి రాత్రి ఏడవుతుంది. ఎక్కువ సమయం పడవ మీదే సరిపోతోంది. తిరిగొచ్చే వరకూ ఇంట్లో వారికి ఆందోళనే. – దొడ్డా శివ, బూరుగుపూడి, పి.గన్నవరం మండలం బీర, బెండ పంట దెబ్బతింది.. రెండు ఎకరాల్లో బీర, బెండ పాదులు సాగుచేశా. ఎకరాకు రూ.40 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. పంట మంచి కాపు మీద ఉంది. దిగుబడి బాగా వస్తుందని ఆశించాను. 11 రోజులుగా వరదలు ముంచెత్తడంతో కాయగూర పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. పాదులు కుళ్లిపోయాయి. పెట్టుబడులు కూడా వచ్చే అవకాశంలేదు. లంక గ్రామాల్లో రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, మమ్ముడివరం మండలంచెరువులను ముంచేసింది అన్నంపల్లిలో నాలుగు ఎకరాల్లో ఆక్వా సాగుచేశా. ఈసారి కౌంట్ అనుకున్నంత వేగంగా రాలేదు. దీంతో చెరువుల పట్టుబడులు ఆలస్యమయ్యాయి. ఆగస్టులో రావాల్సిన వరద జూలైలో వచి్చంది. చెరువులు మొత్తం మునిగిపోయాయి. కౌంట్ 120 ఉన్న సమయంలో పట్టుబడులు చేసినా అనుకున్నంత రేటు రాలేదు. నష్టాలను చవిచూడాల్సి వచి్చంది. – దంతులూరి నానిరాజు, అన్నంపల్లి, ఐ.పోలవరం మండలం సాయం అందించాలి.. ఏటా వరదల సమయంలో వేటకు విరామం ప్రకటించాల్సి వస్తోంది. మాకు చేపల వేట మాత్రమే జీవనోపాధి. వేటకు వెళ్లకపోతే కుటుంబ పోషణ కష్టం. వరదల సమయంలో ప్రభుత్వం నిత్యావసర వస్తువుల రూపంలో ఇచ్చే సాయం కంటే ఆర్థికంగా సాయం అందించాలి. – సంగాడి ముత్యాలు, మత్స్యకారుడు, మసకలపల్లి. కె.గంగవరం మండలం -
శాంతిస్తున్న గోదావరి
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగు లు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో సోమవారం గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. ఉగ్రరూపం దాలి్చన గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు.దానికి ఇంద్రావతి ప్రవాహం తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క) బ్యారేజ్లోకి చేరుతున్న 8.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బ్యారేజ్లోకి 9.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద సోమవారంరాత్రి 9 గంటలకు నీటిమట్టం 42.90 అడుగులకు చేరుకుంది.దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమ య్యాయి. కాగా ముంపు కాలనీ వాసులను సోమవారం సైతం పునరావాస శిబిరాల్లోనే కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం 11.78 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో స్పిల్ ఎగువన నీటిమట్టం 33.46 మీటర్లకు తగ్గింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి వచ్చిన వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 14,50,084 క్యూసెక్కులు చేరుతుండగా.. 14,42,384 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
నీట మునిగిన యానాం
-
నెమ్మదించిన గోదారి
సాక్షి, హైదరాబాద్: గోదావరి పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాతో పాటు తెలంగాణలో వర్షాలు తెరపి ఇవ్వడంతో ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్కి శనివారం సాయంత్రం 6 గంటలకు 5,39,200 క్యూసెక్కుల ప్రవాహం రాగా ఆదివారం అదే సమయానికి 4,06,510 క్యూసెక్కులకు తగ్గింది. సమ్మక్క బరాజ్ (తుపాలకుగూడెం)కి వరద 9,75,910 క్యూసెక్కుల నుంచి 8,45,560 క్యూసెక్కులకు తగ్గింది. సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) బరాజ్కి సైతం వరద 13,95,637 క్యూసెక్కుల నుంచి 11,65,362 క్యూసెక్కులకు పడిపోయింది. ఈ మూడు బరాజ్లకు వచి్చన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద ఉదయం నుంచి తగ్గుముఖంశనివారం అర్ధరాత్రి భద్రాచలం వద్ద 53.60 అడుగులతో మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన వరద, ఆదివారం ఉదయం 6 – 7 గంటల మధ్య 53 అడుగుల దిగువకు రాత్రి 11గంటల కల్లా 47.20 అడుగులకు తగ్గింది. దీంతో తొలుత అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఆ తర్వాత రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ప్రవాహం సైతం 14,36,573 క్యూసెక్కుల నుంచి 11,08,154 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు ఏపీలోని చింతూరు, కూనవరం వద్ద శబరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టులోకి 13,35,413 క్యూసెక్కు లు చేరుతుండగా స్పిల్ వే 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. వరద కాల్వకు జలకళ బోయినపల్లి (చొప్పదండి): మెట్టప్రాంత రైతుల వరప్రదాయని వరద కాల్వ ఆరు నెలల తర్వాత జలకళను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలు కరీంనగర్ జిల్లా రామడుగు లక్ష్మీపూర్ గాయత్రీ పంప్హౌస్ నుంచి వరదకాల్వ మీదుగా రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మ«ధ్య మానేరుకు చేరుకుంటున్నాయి. రామడుగు మండలం లక్ష్మీపూర్ నుంచి బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర వరద కాల్వలో జలసవ్వడులు వినిపిస్తున్నాయి.భద్రాచలంలో ఇళ్లల్లోకి నీళ్లుభద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే పట్టణంలోని ఏఎంసీ కాలనీకి ఎగువ భాగాన ఉన్న కరకట్ట స్లూయిజ్ నుంచి ఆదివారం సైతం వరద నీరు లీక్ కావడంతో అశోక్నగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు గ్రామాల నడుమ ఇంకా రాకపోకలు సాగడం లేదు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా వరద నీరు తగ్గింది. -
మరింత పెరిగిన ‘గోదావరి’
సాక్షి, అమరావతి/సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం సా.6 గంటలకు బ్యారేజ్లోకి 15,99,761 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. డెల్టా కాలువలకు తొమ్మిది వేల క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 15,90,761 క్యూసెక్కుల ప్రవాహాన్ని అధికారులు 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ధవళేశ్వరం బ్యారేజ్లోకి గరిష్టంగా వచ్చిన వరద ఇదే. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 15.7 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.మరోవైపు.. శనివారం రాత్రి నుంచి బేసిన్లో వర్షాలు కాస్త తెరిపివ్వడంతో ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రావతి తదితర ఉప నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం కూడా క్రమేణ తగ్గుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు 48.4 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక చింతూరు, కూనవరం వద్ద శబరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వీఆర్పురం, కూనవరం మండలాల్లో గ్రామాలు, రహదారులు ముంపులోనే ఉన్నాయి. చింతూరు డివిజన్లోని నాలుగు మండలాల్లోని 191 గ్రామాలు వరదలకు ప్రభావితమైనట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. 35,746 కుటుంబాలను 149 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టులోకి 13,35,413 క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే 48 గేట్ల ద్వారా ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వే ఎగువన నీటి మట్టం 34.12 మీటర్లకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలోని పోలీస్ చెక్పోస్ట్లో రెండు అడుగుల మేర నీరు చేరింది. దీంతో దీనిని మరోచోటుకి మార్చారు. ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలో కూడా ఐదు అడుగుల మేర వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, ఏజెన్సీ సిబ్బంది కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటుచేశారు. ఇక ఎగువన వరద ప్రవాహం క్రమేణ తగ్గుతుండడంతో సోమవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టనుంది. లంక గ్రామాలను ముంచెత్తుతున్న వరద..మరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోసీమ జిల్లాలో గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లో శనివారం కన్నా ఆదివారం సాయంత్రం అడుగున్నర నుంచి రెండడుగుల ఎత్తున వరద పెరిగింది. మరో రెండడుగుల వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని లంక గ్రామాల్లో జూన్ 19న మొదలైన వరద ముంపు పది రోజులుగా కొనసాగుతోంది. పి. గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో వరద తీవ్రత అధికంగా ఉంది. పలు లంక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద చేరుతోంది. వరదలు, భారీ వర్షాలవల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డెల్టాలో మురుగునీటి కాలువలు పొంగి పొర్లుతుండడంతో సుమారు 5 వేల ఎకరాల్లో చేలు నీట మునిగాయి. అలాగే, లంక గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో అరటి, కంద, కూరగాయ పంటలు నీట మునిగాయని అంచనా. మరో నాలుగు రోజులపాటు వరద ముంపు ఉండే అవకాశం ఉన్నందున నష్టం మరింత పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్లు కె.గంగవరం మండలం కోటిపల్లి వరద ప్రాంతాల్లో పర్యటించారు.పరిహారమివ్వండి.. పునరావాసం కల్పించండి..వరద నీటిలో బాధితుల ఆందోళనఏటా వరదల కారణంగా బాధలు పడలేకపోతున్నామని, తమకు పోలవరం పరిహారం ఇచ్చి సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో వరద బాధితులు ఆదివారం వరదనీటిలో ఆందోళన చేపట్టారు. ఏటా జూలై నుంచి సెప్టెంబరు వరకు తమకు ఈ వరద కష్టాలు తీరడంలేదని, ఏడాది పొడవునా సంపాదించిందంతా వరదల సమయంలో సామాన్ల తరలింపుకే ఖర్చయిపోతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వడంతో పాటు ఇతర ప్రాంతాల్లో పునరావాసం కల్పించి తమను ఇక్కడినుంచి తరలించాలని బాధితులు డిమాండ్ చేశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న ఐటీడీఏ పీఓ కావూరి చైతన్య హామీతో వారు ఆందోళన విరమించారు. -
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చిం ది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 14,36,573 క్యూసెక్కుల వరద ప్రవాహంతో నీటి మట్టం 53.2 అడుగులకు చేరుకుంది. దాంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. (గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న భద్రాచలం వద్దకు గరిష్టంగా 27.02 లక్షల క్యూసెక్కుల వరద వచి్చనప్పుడు నీటి మట్టం 75.6 అడుగులుగా నమోదైంది). కూనవరం వద్ద శబరి ఉధృతి మరింత పెరిగింది. నీటి మట్టం 41.35 మీటర్ల (సముద్ర మట్టానికి)కు చేరుకోవడంతో కూనవరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారుపోలవరం ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 11,87,497 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో పోలవరం స్పిల్ వే ఎగువన నీటి మట్టం 33.5 మీటర్లకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 13,29,774 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 9,500 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 13,20,274 క్యూసెక్కులను 175 గేట్లు పూర్తిగా ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్య గోదావరి బేసిన్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదివారం కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అప్రమత్తం చేసింది. నీట మునిగిన రహదారులు » గోదావరికి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంతర్గత రహదారులు నీట మునిగాయి. » ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నుంచి బూర్గంపాడుకు వెళ్లే రహదారులు పలు చోట్ల వరద నీట మునిగి రాకపోకలు స్థంభించాయి. వెంకటాపురం నుంచి తిమ్మంపేట వెళ్లే రహదారి వరద నీటితో నిండిపోయింది. వరద పెరిగితే కుక్కునూరు నుంచి అశ్వారావుపేట వెళ్లే రహదారి సైతం నీట మునిగే అవకాశం ఉంది. పలు గ్రామాల్లో పంట చేలను ముంచెత్తింది. పలు గ్రామాల్లో ఇళ్లు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. » తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లపూడి, పెరవలి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో పంటలు నీట మునిగాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్పనపల్లి, ఎదురుబిడెం, కనకాయలంక కాజ్వేలపై వరద నీరు ప్రవహిస్తోంది. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. మలికిపురం, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. » పలు డ్రెయిన్ల నుంచి ముంపు నీరు అవుట్ఫాల్ స్లూయిజ్ల ద్వారా గౌతమి, వృద్ధ గౌతమీ, వైనతేయ, వశిష్ట గోదావరి నదీపాయల ద్వారా దిగాల్సి ఉంది. అయితే గోదావరి వరదతో స్లూయిజ్ల గేట్లు మూసుకుపోయాయి. దీంతో డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో 4,151 ఎకరాల్లో వరి పంట దెబ్బ తింది. ఈ నష్టం మరింత పెరగనుందని రైతులు వాపోతున్నారు.వరద నష్టం లేనిచోట మంత్రుల పర్యటనవేలేరుపాడు/తణుకు టౌన్: పెద్దవాగు ప్రవాహం వల్ల తమ ఇళ్లు కొట్టుకుపోయి సర్వస్వం కోల్పోయిన వరద బాధితుల గ్రామాల్లో పర్యటించాల్సిన నలుగురు రాష్ట్ర మంత్రులు ఏ నష్టం జరగని ప్రాంతాల్లో శనివారం పర్యటించడం పట్ల జనం విస్తుపోతున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని మేడేపల్లి, కమ్మరిగూడెం, అల్లూరినగర్, ఒంటిబండ, కోయమాధారం, రాళ్లపూడి, రామవరం, ఉదయ్నగర్, ఊటగుంపు, యిప్పలగుంపు, సొందే గొల్లగూడెం, వసంతవాడ, మద్దిగట్ల, పాత పూచిరాల తదితర గ్రామాల్లో ఈ నెల 18న పెద్దవాగు ఆనకట్ట తెగిపోవడంతో 12 గ్రామాల్లో 513 ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆయా గ్రామాల బాధితులు సర్వస్వం కోల్పోయారు. ఈ గ్రామాల్లో పర్యటించకుండా ఏ సమస్యలూ లేని కన్నాయిగుట్టను సందర్శించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొలుసు పార్థసారథి శనివారం ఆ ప్రాంతంలో పర్యటించారు. జల దిగ్బంధంలో ఉన్న తిర్లాపురం గ్రామానికి వెళ్లకుండానే కన్నాయిగుట్ట వద్ద గోదావరిని పరిశీలించి వెనుదిరిగారు. ఆ తర్వాత శివకాశీపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనం చేసి, వరదపై తూతూమంత్రంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తణుకు మండలం దువ్వలో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. -
భద్రాచలం వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/ధరూరు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో శుక్రవారం రాత్రికి మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. గోదావరికి ఎగువన ఉన్న మహా రాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు కాళేశ్వరం, సమ్మక్క బ్యారేజీ వద్ద నుంచి పెరిగిన వరద గోదావరికి చేరుతుండగా నీటిమట్టం తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. గురు వారం రాత్రి 11 గంటలకు 48.10 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం ఉదయం 8గంటలకల్లా తగ్గి 46.90 అడు గులకు చేరింది.దీంతో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కానీ ఆతర్వాత పెరుగుతూ రాత్రి 9:15 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, వరదతో ముంపు గ్రామాల రైతులు పంట కాలం ఆలస్యమవుతుందని ఆందోళన చెందుతుండగా.. రహదా రుల పైకి నీరుచేరి ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రవాణా స్తంభించింది. నిలకడగా జూరాలజూరాల ప్రాజెక్టులో వరద నిలకడగా కొనసాగుతోంది. శుక్రవా రం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టుకు 2,65,000 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 36 క్రస్టు గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 2,30,283 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 19,668 క్యూసెక్కులు, భీమా, నెట్టంపాడు, కుడి, ఎడమ కాల్వలకు కలిపి మొత్తం 2,53,290 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
తగ్గుతున్న గోదావరి ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/ఏలూరు: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 7 గంటలకు 14,08,117 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువల ద్వారా 3,900 క్యూసెక్కులను వదులుతున్న అధికారులు.. మిగులుగా ఉన్న 14,04,217 క్యూసెక్కుల (121.35 టీఎంసీల)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 393 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వదిలేయాల్సి వచి్చంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.70 అడుగుల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి బేసిన్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో ఎగువన వరద క్రమేణా తగ్గుతోంది. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి 7.87 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజీ నుంచి 9.75 లక్షలు, దుమ్ముగూడెం బ్యారేజీ నుంచి 10.22 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45.3 అడుగులకు తగ్గింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగుతోంది. ఇక పోలవరం బ్యారేజీలోకి 11,68,897 క్యూసెక్కులు చేరుతుండగా. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వే ఎగువన 33.42 మీటర్లకు నీటి మట్టం తగ్గింది. ఎగువ వరద తగ్గిన నేపథ్యంలో గురువారం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి దూకుడు తగ్గనుంది.జలదిగ్బంధంలోనే వేలేరుపాడు వేలేరుపాడు మండలం జల దిగ్బంధంలోనే ఉంది. 33 గ్రామాల్లోకి నీరు ప్రవేశించి రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద తీవ్రత లేదనే కారణంతో బుధవారం ఉదయం నుంచి పునరావాస కేంద్రాలను అధికారులు నిలిపివేశారు. గ్రామాల్లో నీరు నిలిచి ఉన్నా ప్రజలు ఊళ్లకు వెళ్లాల్సి వచి్చంది. విలీన మండలాల్లోని కమ్మరిగూడెం, అల్లూరు నగర్, కోయ మాధవరం, రామవరం ఉదయ్నగర్, రాళ్లపూడిలో 208 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. 146 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. -
భారీగా పెరిగిన గోదావరి నీటిమట్టం
-
ఉరకలేస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, తూర్పుగోదావరి/ఖమ్మం: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు భారీగా వస్తోంది. నీటిమట్టం 13.9 అడుగులకు చేరడంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 13 లక్షల 9వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అన్నంపల్లి అక్విడెట్, యానాం దగ్గర గౌతమి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.భద్రాచలంలో కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ప్రస్తుతం 52 అడుగులకు నీటిమట్టం చేరింది. 13 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 53 అడుగులకు చేరితే చివరిదైనా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో గోదారి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.గోదావరి నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం, చర్ల మండలాలకు వెళ్లే మార్గంలో తూరుబాక బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం మొండికుంట నుంచి ఇరవెండి రహదారిపై గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రామచంద్రాపురం స్టేజి వద్ద గల కడియాలబుడ్డి వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.విజయవాడ: ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రభావం తగ్గింది. ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 6470 క్యూసెక్కులు ఉండగా, అడుగు మేర 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా: మిడ్ మానేరుకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 640 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 62 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ సామర్థ్యం 27.5 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం 5.80 టీఎంసీలు.అనకాపల్లి జిల్లా: మాడుగుల మండలం, తెన్నేటి విశ్వనాథం పెద్దేరు జలాశయంకు వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం కెపాసిటి 137 కాగా. ప్రస్తుతం 136కి చేరుకుంది. జలాశయం లోకి ఇన్ ఫ్లో 518 క్యూసెక్కుల నీరు. మూడు గేట్లు ద్వారా 456 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.కర్నూలు జిల్లా: తుంగభద్ర డ్యామ్కు వరద కొనసాగుతోంది. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 90 టీఎంసీలు. ఇన్ ఫ్లో.. 92,636, ఔట్ ఫ్లో..11,657 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికాలు జారీ చేశారు.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరదలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదికి వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. సోమవా రం మంత్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్య టించారు. గోదావరి తీరంలో కరకట్టలను పరిశీలించి, జిల్లా అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని.. వరద తగ్గేవరకు కూనవరం– భద్రాచలం– దుమ్ముగూడెం రోడ్ల మీదుగా రాకపోకలను నిలిపేయాలని సూచించారు. భద్రాచలంలోకి చేరే వరద నీటిని నదిలోకి ఎత్తిపోసేలా మోటార్లు సిద్ధం చేయాలన్నారు. అనంతరం బూర్గంపాడు మండలంలో పొలాలను పరిశీలించారు. ‘పెద్దవాగు’పై అధికారుల వైఫల్యం అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండ్లు పడటానికి ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమని పొంగులేటి పేర్కొన్నారు. పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారీ వరద వస్తుంటే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని.. ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేయించలేదని మండిపడ్డారు. అధికారులకు నోటీసులు ఇచ్చామని, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం గత పదేళ్లుగా తగినంత శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు.ప్రాజెక్టు విషయంలో తప్పు జరిగిన విషయాన్ని అంగీకరిస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుని తిరిగి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తారని తెలిపారు. ఆలోగా ఫీడర్ చానల్ లేదా రింగ్బండ్ నిర్మించి ఆయకట్టు రైతులకు నీరు అందించేందుకు ప్రయతి్నస్తామన్నారు. ప్రాజెక్టు గండ్లు, వరదలతో నష్టపోయిన వారిని మంత్రి పరామర్శించారు. ప్రభుత్వంతోపాటు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా సాయం అందిస్తామని ప్రకటించారు. వరద కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రెండు నెలల్లో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ముగ్గురు ఇంజనీర్లపై చర్యలకు సిఫారసు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు ‘పెద్దవాగు’. 16 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా 1981లో దీనిని నిర్మించారు. 40,500 క్యూసెక్కుల వరదను విడుదల చేసేలా స్పిల్వేను డిజైన్ చేశారు. కానీ 1989లో 70 వేల క్యూసెక్కుల వరద రావడంతో స్పిల్వేకు ఎడమవైపు 200 మీటర్ల వరకు కట్టకు గండిపడింది. ఇప్పుడు 75వేల క్యూసెక్కుల వరద రావడంతో మళ్లీ గండ్లు పడ్డాయి.దీనికి నిర్వహణ లోపమే కారణమని.. ఎగువ నుంచి భారీ వరద రానుందని సమాచారమున్నా ఇంజనీర్లు సకాలంలో గేట్లు ఎత్తలేదని.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలేవీ జారీ చేయకుండా నీటిని విడుదల చేశారని అధికారులు గుర్తించారు. ప్రాజెక్టు నిర్వహణలో విఫలమైన డీఈఈ, ఏఈఈ, ఏఈలపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రాజెక్టుకు గండ్లు పడటంతో 16 గ్రామాలు నీట మునిగాయి. రూ.100 కోట్ల మేర నష్టం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. -
గంట గంటకు పెరుగుతున్న గోదావరి ముంపు గ్రామాలు ఖాళీ
-
భద్రాచలం: గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తుతున్న వరద
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఉదయo 10 గంటలకు 37.7 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. దీంతో 7 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు.పర్ణశాల వద్ద నారా చీరల ప్రాంతం నీట మునిగింది. తెలంగాణాతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న సరిహద్దు రాష్ట్రలైన ఛత్తీస్గడ్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగి గోదావరిలోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే భారీ వరదల కారణంగా అనేక చోట్ల రవాణకీ తీవ్ర అంతరాయం కాగా, పలుగ్రామాల్లో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. అధికారులు అప్రమతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ ఆదేశాలు జారీ చేశారు.భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీటిమట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ విలీన మండలాల్లో భారీ వర్షాల ప్రభావంతో కొండవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి సోకిలేరు వాగు, అన్నవరం వాగు కొండరాజుపేట, వాగు చీకటి వాగు, అత్త కోడళ్ళ వాగు ఉదృతంగా ప్రవహించడంతో రహదారులపైకి వరద నీరు చేరుకుంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శబరి నది కూడా పోటెత్తి ప్రవహిస్తోంది. శబరి గోదావరి సంగమ ప్రాంతం సముద్రాన్ని తలపిస్తోంది. -
ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..ఉధృతంగా గోదావరి
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న వరద ప్రవాహం శనివారం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోనుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కులను దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 174 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 0.74 టీఎంసీలకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీలోకి 6,064 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 6,596 క్యూసెక్కులను వదులుతున్నారు. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్లోకి 1,08,270 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. శనివారం తుంగభద్ర డ్యామ్లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అంచనా వేసింది. పెరిగిన గోదా‘వడి’తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి శుక్రవారం మరింత పెరిగింది. ప్రాణహిత, ఇంద్రావతి, సీలేరు, కిన్నెరసాని, శబరి ఉప నదులతో పాటు కొండ కాలువల నీళ్లు కూడా కలవడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 40.2 మీటర్ల(సముద్ర మట్టానికి)కు చేరింది. పోలవరం ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 48 గేట్లను ఎత్తేసి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. శుక్రవారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటిమట్టం 7 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3,48,191 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 1,800 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 3,46,391 క్యూసెక్కులను బ్యారేజీ నుంచి 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. శనివారం వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. జల వనరుల శాఖ అధికారుల అప్రమత్తమే ధవళేశ్వరంలోని ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి బ్యారేజీ వద్ద పరిస్థితిని పరిశీలించారు. -
కృష్ణాలో నిలకడగా..
సాక్షి, అమరావతి/రాయచూరు రూరల్: పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద నిలకడగా కొనసాగుతోంది. గురువారం కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్లోకి 72,286 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 65,580 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్లోకి 68,797 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 46,329 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ 25,174 క్యూసెక్కులు దిగువకు వదులుతోంది. ఈ జలాలు శుక్రవారానికి శ్రీశైలానికి చేరుకోనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. ఇందుకోసం 7,064 క్యూసెక్కులను దిగువకు తరలిస్తుండటంతో శ్రీశైలంలో నీటి నిల్వ 32.37 టీఎంసీలకు తగ్గిపోయింది. శ్రీశైలం నుంచి తరలిస్తున్న జలాలతో నాగార్జున సాగర్లోకి 23,851 క్యూసెక్కులు వస్తున్నాయి. దీంతో సాగర్లో నీటి నిల్వ 123.34 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగి తుంగభద్ర డ్యామ్లోకి 82,491 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడ నీటి నిల్వ 46.80 టీఎంసీలకు చేరుకుంది. శుక్రవారం తుంగభద్ర డ్యామ్లోకి లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది.గోదావరిలో పెరుగుతూ..పోలవరం వద్దకు 2.30 లక్షల క్యూసెక్కుల వరదసాక్షి, అమరావతి/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం పోలవరం ప్రాజెక్టులోకి 2.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా వచ్చిన జలాలను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్లోకి 2,31,161 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 8.3 అడుగులకు చేరుకుంది. గోదావరి డెల్టా కాలువలకు 7,200 క్యూసెక్కులు వదులుతూ మిగతా 2,23,961 క్యూసెక్కులను బ్యారేజ్ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలంలో నీటిమట్టం గురువారం సాయంత్రం 18.20 అడుగులకు చేరింది.పాపికొండల విహార యాత్రకు బ్రేక్బుట్టాయగూడెం: పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటం, తుఫాన్ హెచ్చరికలు, గోదావరి నదికి వరద తాకిడి పెరగడం వల్ల యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి ప్రవాహం భారీగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి 22 అడుగుల వరకు పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. -
పోలవరం నుంచి కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరి నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షిస్తూ పోలవరం నుంచి గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్యూడీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం నుంచి గోదావరి జలాలను బొల్లాపల్లి వద్ద 300 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే రిజర్వాయర్లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి కావేరికి తరలించాలని సూచించింది. ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని, దీని ద్వారా తరలించే నీటిలో 50 శాతం తమకు కేటాయించాలని తెలంగాణ ప్రతిపాదించింది. తెలంగాణ ప్రతిపాదనను ఛత్తీస్గఢ్ వ్యతిరేకించింది. సమ్మక్క, ఇచ్చంపల్లి బ్యారేజ్ల వల్ల తమ రాష్ట్రాంలో ముంపు ఉత్పన్నమవుతుందని, దీనికి తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని, ఇందుకు త్వరలోనే ఆ రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పష్టం చేశారు. వాడీవేడిగా ఎన్డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశందేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఎన్డబ్ల్యూడీఏ పాలక మండలి 73వ సమావేశం సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్, ఏపీ ప్రభుత్వం తరఫున హైడ్రాలజీ విభాగం సీఈ కుమార్, తెలంగాణ తరఫున ఈఎన్సీ అనిల్కుమార్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించి, అక్కడి నుంచి జలాలను కావేరికి తరలించాలన్న ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదనను తెలంగాణ ఈఎన్సీ అనిల్ వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్రానికి 158 టీఎంసీల (దేవాదులకు 38, సీతారామకు 70, తుపాకులగూడెంకు 50 టీఎంసీ) నీటి అవసరాలున్నాయని, ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే తెలంగాణ, ఏపీ అవసరాలతోపాటు గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టు అవసరాలను ఏకకాలంలో ఎలా తీరుస్తారని ప్రశి్నంచారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి అనుసంధానం చేపట్టాలని కోరారు.దీనిపై ఛత్తీస్గఢ్ సర్కారు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజ్ల వల్ల తమ ప్రాంతం ముంపునకు గురవుతుందని, అందువల్ల ఆ బ్యారేజ్ల నిర్మాణానికి అంగీకరించబోమని తేలి్చచెప్పింది. ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజ్లను ఎగువ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ సీఈ కుమార్ ప్రతిపాదించారు. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి సోమశిలలోకి, అక్కడి నుంచి కావేరికి తరలించాలన్న ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని తేలి్చచెప్పారు.గోదావరికి జూలై ఆఖరు నుంచి ఆగస్టు వరకు భారీ వరద ఉంటుందని, ఆగస్టులో కృష్ణాకు కూడా వరద వచ్చి నాగార్జునసాగర్ కూడా నిండుగా ఉంటుందని వివరించారు. గోదావరి–కావేరి అనుసంధానంలో నాగార్జున సాగర్ను భాగం చేస్తే దాని ఆయకట్టుకు కూడా విఘాతం కలుగుతుందన్నారు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచి గోదావరి జలాలను కొత్తగా బొల్లాపల్లి వద్ద నిరి్మంచే రిజర్వాయర్లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి సోమశిల.. అటు నుంచి కావేరికి తరలించాలని సూచించారు.ఇదే ప్రతిపాదనను ఎన్డబ్ల్యూడీఏ అధికారులు గతంలో రాష్ట్రంలో పర్యటించినప్పుడు అందజేశామని, దాన్ని పరిశీలించాలని కోరారు. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలిస్తున్న 80 టీఎంసీలకుగానూ.. ఆ మేరకు సాగర్ ఎగువన కృష్ణా బేసిన్లో వాడుకునేలా రాష్ట్రాలకు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిందని ఏపీ, తెలంగాణ అధికారులు గుర్తు చేశారు.మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీలు అదనంగా వాడుకుని, గోదావరి–కావేరి అనుసంధానం వల్ల కృష్ణా జలాలను ఆ రాష్ట్రాలకు అదనంగా వాడుకోవడానికి అవకాశం కలి్పస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడ్డాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని తెలంగాణ ఈఎన్సీ అనిల్ స్పష్టం చేశారు. -
సమ్మక్క నుంచే అనుసంధానం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలకు బదులుగా ఇప్పటికే నిర్మించిన సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే నీళ్లను తరలించాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిపై సోమవారం జరగనున్న నేషనల్వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని సైతం చేర్చినట్టు ఎన్డబ్ల్యూడీఏ రాష్ట్రానికి సమాచారం ఇచి్చంది. అలాగైతే అన్నీ సమస్యలే: తెలంగాణ ఆరు నెలల కిందట గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్ను తెలంగాణకు అందించిన ఎన్డబ్ల్యూడీఏ దానిపై అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బరాజ్ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇచ్చంపల్లి బరాజ్ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తమ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదంటూ తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సమ్మక్క సాగర్ బరాజ్కి బ్యాక్వాటర్ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు సైతం నష్టం కలుగుతుందని పేర్కొంది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ పేర్కొంటుండగా, ఈ నీటి వినియోగం లెక్కలను సమరి్పంచాలని గతంలో ఎన్డబ్ల్యూడీఏ కోరింది.దీంతో సమ్మక్కసాగర్ బరాజ్కి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బరాజ్ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్ చేయనున్నారు? సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలను తెలంగాణ అందించింది.ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని గతంలో ఎన్డబ్ల్యూడీఏ తెలియజేసింది. మరోవైపు ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి తెలంగాణ అంగీకారం లభించే పరిస్థితి లేకపోవడంతో సమక్కసాగర్ నుంచే నీటిని తరలించే అంశాన్ని ఎన్డబ్ల్యూడీఏ సోమవారం నిర్వహించే సమావేశంలో పరిశీలించే అవకాశం ఉంది. సిమ్యులేషన్ స్టడీకి కేంద్రం ఓకే గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించడానికి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ అనుమతినిచి్చంది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు.అయినా ఛత్తీస్గఢ్లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బరాజ్ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బరాజ్ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరదల తీవ్రతపై సిమ్యులేషన్ స్టడీ చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించడంతో సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగయ్యాయి. -
పెరుగుతున్న గోదా‘వడి’
సాక్షి, అమరావతి/ ధవళేశ్వరం: నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది. ఆదివారం ధవళేశ్వరం బ్యారేజ్లోకి 88,409 క్యూసెక్కులు చేరుతుండగా బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.30 అడుగులకు చేరింది. 10,200 క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల చేస్తూ మిగిలిన 78,209 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీలో మొత్తం 175 క్రస్ట్గేట్లకుగాను 129 గేట్లను పైకిలేపి జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాకు విడుదల చేసిన నీటిలో తూర్పు డెల్టాకు 3 వేలు, మధ్య డెల్టాకు 1,200, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కులు వదిలారు. ఆల్మట్టిలోకి 23,678 క్యూసెక్కులుపశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం వల్ల కృష్ణా, ఉపనదుల్లో వరద తగ్గింది. ఆల్మట్టి డ్యామ్లోకి 23,678 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పిత్తి చేస్తూ 3,980 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్లో 90.33 టీఎంసీల నీరుంది. ఆల్మట్టి నిండాలంటే 39 టీఎంసీలు అవసరం. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్ర నదిలోను వరద ప్రవాహం తగ్గింది. తుంగభద్ర డ్యామ్లోకి 12,194 క్యూసెక్కులు వస్తుండటంతో నీటినిల్వ 31.7 టీఎంసీలకు చేరింది. ఇక తెలుగురాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలంలోకి 1,060 క్యూసెక్కులు చేరుతుండగా.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో నీటినిల్వ 36.24 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్లోకి వరద ప్రవాహం చేరడం లేదు. -
కాంగ్రెస్ తీరు దారుణం.. గోదారిని చూస్తే బాధేస్తోంది: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తోంది అంటూ కామెంట్స్ చేశారు.కాగా, హరీష్ రావు శనివారం రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించామో అదే స్ఫూర్తితో తెలంగాణలో పని చేశాం. కష్టల్లో నుంచి పాటలు వచ్చాయి. రైతుల వ్యతల్లో నుంచి పాటలు వచ్చాయి. నీళ్ల కోసం కూడా పాటలు వచ్చాయి. సదాశివుడు రాసిన పాట కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందింది. తలాపున పారుతుంది గోదారి.. చేను చెలక ఏడారి పాట తెలంగాణ నీళ్ల గోసను చూపెట్టింది.తెలంగాణ వచ్చాక ఎర్రటి ఎండలో కూడా మత్తల్లు దూకిన చెరువులు కనిపించాయి. అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాం. కొంచెం బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పుడు గోదావరి ఎండిపోయింది. పది పదిహేను రోజుల నుంచి గోదావరి నీళ్ళు వస్తున్నా ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయటం లేదు. కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వంపై నిందలు వేయటం కాదు, రైతుల కన్నీళ్ళు తుడవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.మళ్లీ రాష్ట్రంలో కవులకు, కళాకారుల పెన్నులకు పదును పెట్టాల్సిన అవసరం వచ్చిందేమో. రోజు పేపర్లు చూడగానే రైతులు ఆత్మహత్యలు కనబడుతున్నాయి. కరెంట్ కోతలు మొదలయ్యాయి. అనేక సమస్యలు జనాన్ని వెంటాడుతున్నాయి. కళాకారులకు మూడు నెలల నుంచి జీతాలు రావటం లేదని నాకు చెప్తున్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున మేము పోరాడుతాం. సామాజిక బాధ్యతగా కళాకారులు పోరాడాలి. మళ్లీ మీ పెన్నులకు పదును పెట్టాలి’ అని చెప్పుకొచ్చారు. -
కావేరికి గోదావరి.. ఇచ్ఛంపల్లి నుంచి లేనట్లే!
సాక్షి, అమరావతి : గోదావరి ట్రిబ్యునల్ అవార్డు.. ఛత్తీస్గఢ్ అభ్యంతరాల నేపథ్యంలో ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలన్న ప్రతిపాదనను జాతీయ జలవనరుల అభివృద్ధి (ఎన్డబ్ల్యూడీఏ) సంస్థ పునఃసమీక్షిస్తోంది. ఇచ్ఛంపల్లికి దిగువన సమ్మక్క బ్యారేజ్, కంతనపల్లి, పోలవరం ప్రాజెక్టుల నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడంపై తాజాగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇచ్ఛంపల్లి నుంచి 141.3 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా రెండున్నరేళ్ల క్రితం ప్రతిపాదించిన ఎన్డబ్ల్యూడీఏ.. పరీవాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. కానీ, ఇచ్ఛంపల్లి నుంచి 85 టీఎంసీలను మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదని 1975, డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో.. ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని న్యాయనిపుణులు స్పష్టంచేస్తున్నారు.ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు..ఇచ్ఛంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ అభ్యంతరాలతో ఇచ్ఛంపల్లి బ్యారేజ్ ఎత్తును 108 మీటర్లకు 1986–88లో తగ్గించారు. నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్ఛంపల్లి బ్యారేజ్ ఎత్తును 87 మీటర్లకు ఎన్డబ్ల్యూడీఏ తగ్గించింది. బ్యారేజ్ ఎత్తును 87 మీటర్లకు తగ్గించినా ఛత్తీస్గఢ్లో నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీనిపై ఛత్తీస్గఢ్ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి బేసిన్లో ఇంద్రావతి సబ్ బేసిన్లోని తమ కోటాలో వాడుకోని జలాలను కావేరికి ఎలా తరలిస్తారని ఎన్డబ్ల్యూడీఏని నిలదీసింది. కాదూ కూడదని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పింది.దిగువన కట్టాలని తెలంగాణ ప్రతిపాదన..ఇక ఇచ్ఛంపల్లికి 24 కిమీల దిగువన తెలంగాణ సర్కార్ ఇప్పటికే గోదావరిపై సమ్మక్క బ్యారేజ్ను నిర్మించింది. గోదావరిపై ఇచ్ఛంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే.. గరిష్ఠంగా వరద వచ్చినప్పుడు ఆకస్మికంగా దిగువకు విడుదల చేస్తే సమ్మక్క బ్యారేజ్కు ప్రమాదం వాటిల్లే అవకాశముందని తెలంగాణ సర్కార్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇచ్ఛంపల్లి నుంచి కాకుండా సమ్మక్క బ్యారేజ్ లేదా కంతనపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ సర్కార్ పోలవరం నుంచి అనుసంధానం చేపట్టాలని సూచించింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ సర్కార్ల అభ్యంతరాలతో ఇచ్ఛంపల్లి నుంచి కావేరికి గోదావరి తరలింపుపై ఎన్డబ్ల్యూడీఏ పునరాలోచనలో పడింది. -
‘సమ్మక్క’ నుంచే అనుసంధానం?
సాక్షి, హైదరాబాద్: గోదావరి –కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు నష్టం కలుగుతుందని తెలంగాణ చేసిన అభ్యంతరాలతో నేషనల్వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎన్డబ్ల్యూడీఏ) పునరాలోచనలో పడింది. తమ రాష్ట్రం నిర్మించిన సమ్మక్క బ్యారేజీ నుంచే నీటిని తరలించాలని తెలంగాణ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్ చేయనున్నారు? సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలు అందించాలని ఎన్డబ్ల్యూడీఏ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణ అభ్యంతరం నాలుగు నెలల క్రితం గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్ను అందించిన ఎన్డబ్ల్యూడీఏ..దీనిపై తెలంగాణ అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అలాగే దిగువన ఉన్న సమక్క సాగర్ బ్యారేజీకి బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ సమస్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 1980లోనే ఇచ్చంపల్లి ప్రతిపాదనలు గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించడానికి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ అనుమతిని చ్చింది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88 లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు. అయినా ఛత్తీస్గఢ్లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బ్యారేజీ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బ్యారేజీ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా వరదల తీవ్రతపై సిమ్యులేషన్ స్టడీ చేయాలనే తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకారం తెలుపడంతో సమ్మక్క బ్యారేజీ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగైనట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
ఉప్పొంగిన ‘గోదారోళ్ల’ అభిమానం.. మేమంతా సిద్ధం
సాక్షి, పశ్చిమగోదావరి: గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్ర కోసం అభిమానులు బారులుతీరారు. సీఎం జగన్ కోసం మేము సిద్ధం అంటూ నీరాజనం పలుకుతున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన వైఎస్సార్సీపీ అభిమానులు, ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. నిడమర్రులో కొట్టుకుపోయిన కట్టుకథలు గోదావరి పోటెత్తింది. అవును అభిమాన సంద్రం ఉరకలేసింది. మేమంతా సిద్ధం పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తోన్న బస్సు యాత్ర నిడమర్రు, గణపవరం మీదుగా వస్తున్నప్పుడు జనసంద్రం కనిపించింది. నిడమర్రులో ముఖ్యమంత్రి వైయస్.జగన్ను చూసేందుకు చుట్టున్నపల్లెలన్నీ కదిలివచ్చాయి. బస్సుయాత్రకు సాంతం.. అడుగడుగునా అక్కచెల్లెమ్మల నీరాజనాలు పట్టారు. మేమంతా సిద్ధమంటూ వెంట నడిచారు. తన కోసం వేచి చూస్తున్న అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను బస్సుదిగి స్వయంగా పలకరించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. ఈ బస్సు యాత్ర ప్రతిపక్షాల కట్టుకథలను ఒక ధాటిన కొట్టేసినట్టయింది. ఇన్నాళ్లు గోదావరిలో మా గాలి వీసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చిన మాటలన్నీ భ్రమలేనని బయటపడ్డాయి. గోదావరి ప్రేమ.. చల్లగా ఫ్యాన్ గాలిలా వీస్తోందని పక్కాగా తెలిసిపోయింది. మేం గోదారోళ్లమండి బాబూ! ఇంటి అల్లుడే కాదు..ఊరికొచ్చిన చుట్టమూ...మాకు దేవుడితో సమానం! వెటకారం పాలెక్కువని కొంతమంది అంటూంటారు! కాసింత నిజమున్నా దానికి పదింతలు మమకారం పంచుకుంటాం మేం! అలాంటి మా ప్రాంతానికి... సంక్షేమ రథసారథి.. ఆంధ్రరాష్ట్రంలోని పేదలందరి పెన్నిధి.. సాక్షాత్ వై.ఎస్. జగన్మోహన రెడ్డి విచ్చేస్తే ఊరుకుంటామా! అభిమానం అంబరాన్ని అంటదూ? వంద సంక్రాంతుల సంబరం మొదలవదూ? అన్నయ్యను చూసుకునేందుకు చెల్లెమ్మలు.. మనవడిని చూసి మురిసిపోయేందుకు అవ్వాతాతలు.. ఆగమాగమైపోరు! అందుకే గణపవరం ఇలా కిక్కిరిసిపోయింది! జనసంద్రమంది.. వీరందరి కళ్లనిండా.. మనసు నిండా... జగన్మోహనుడే! గణపవరంలో జనజాతర సీఎం వైయస్.జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా గణపవరంలో ప్రజాసమూహం పోటెత్తింది. రోడ్డుకిరువైపులా బారులు తీరిన జనం సీఎం జగన్ను కలిసేందుకు పోటీ పడ్డారు. మండుటెండలు, పెరిగిన ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా.. తన కోసం వచ్చిన ప్రజల కోసం బస్సుపైకి ఎక్కి అభివాదం చేశారు సీఎం జగన్. దద్దరిల్లేందుకు భీమవరం సిద్ధం బస్సు యాత్ర ఉండి చేరగానే కొద్దిసేపు ఆగి భోజన విరామం తీసుకుంటారు ముఖ్యమంత్రి జగన్. మధ్యాహ్నం 3.30గంటల సమయంలో సీఎం జగన్ బస్సు యాత్ర భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ ప్రాంతానికి చేరే అవకాశముంది. సాయంత్రం 3.30 గంటలకు ఇక్కడ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు వచ్చే జనమే గోదావరి ప్రేమకు నిదర్శనమంటున్నారు వైఎస్సార్సిపి నాయకులు. ఇక, ఉండి నియోజకవర్గంలోని ఆరేడు గ్రామంలో సీఎం జగన్ కోసం ప్రజలు బారులు తీరారు. ఆరేడు గ్రామం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. నిన్న గుడివాడలో జరిగిన బస్సుయాత్రకు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. ఎండను సైతం లెక్కచేయకుండా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభను అభిమానులు విజయవంతం చేశారు. -
గోదావరి– కావేరి అనుసంధానంపై వచ్చేనెలలో సీఎంల భేటీ
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై వచ్చేనెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ మేరకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డట్లూ్యడీఏ) రాష్ట్రాలకు ప్రాథమికంగా సమాచారం పంపించింది. ఈ రెండు నదుల అనుసంధానానికి సంబంధించి సవివర ప్రణాళిక నివేదిక(డీపీఆర్) త్వరలోనే రాష్ట్రాలకు పంపించి అ«ద్యయనం చేయడానికి గడువు ఇచ్చిన తర్వాత ఈనెలాఖరులో ఆయా ప్రభావిత రాష్ట్రాల నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్ను ఎన్డబ్లు్యడీఏ హైదరాబాద్ విభాగం కేంద్రానికి పంపించింది. దీనికి ఎన్డబ్లు్యడీఏ ఆమోదముద్ర వేసిన వెంటనే సంబంధిత రాష్ట్రాలకు ఆ నివేదిక పంపిస్తారు. రెండు నదుల అనుసంధానికి రూ.74,329 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు చేపట్టిన ఐదేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా అందులో పేర్కొన్నారు. ఈ పాజెక్టు పూర్తయితే ప్రతీ సంవత్సరం రూ.9824.49 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని లెక్కకట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడతారు. దీనికి రూ.3381 కోట్లు అవుతుందని అంచనా. ఇక ఛత్తీస్గఢ్ వినియోగించుకోని149 టీఎంసీల నీటిని గోదావరి–కావేరి అనుసంధానం కింద తరలించాలని కేంద్రం భావిస్తున్న సంగతి విదితమే. ఒకవేళ ఛత్తీస్గఢ్ ఈ 140 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పక్షంలో.. మహానది–గోదావరి మధ్య 230 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. వాటిని కావేరికి తరలిస్తామని వెల్లడించింది. ఇప్పటికే పలు సమావేశాల్లో గోదావరి–కావేరి నదుల అనుసంధానికి సంబంధించి సమ్మతి లభించింది. త్వరలోనే గోదావరి బోర్డు సమావేశం కూడా... గోదావరినది యాజమాన్య బోర్డు సమావేశం త్వరలోనే జరగనున్నట్టు సమాచారం. తదుపరి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల సమాచారం అందులో చేర్చాలని ఏపీ ప్రభుత్వం గతంలో కోరింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి లేఖ కూడా రాశారు. ఎల్లంపల్లి బ్యారేజీ పరిసర ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాలతోపాటు కుప్తి, ఎస్సారెస్పీ రెండో దశ వినియోగం, ఇందిరమ్మ వరద నీటి కాలువ, కాళేశ్వరం అదనపు టీఎంసీల వినియోగంపై చర్చించాలని కోరింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని గోదావరి యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలకు 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం కోటాను సాగర్కు మళ్లించింది. ఉమ్మడి జలాశయాల నుంచి ఇరు రాష్ట్రాలకు 80 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే. శ్రీశైలంలో కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోయామని, అందువల్ల నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి ఐదు టీఎంసీల నీటి విడుదల చేయాలని ఏపీ కోరిక మేరకు బోర్డు అనుమతినిచి్చంది. బోర్డు ఆర్థిక పరిస్థితిపై ఈనెల 12వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
‘నీటి’ మీద లెక్కలు
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో నీటి లభ్యతపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) లెక్కను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కొట్టిపారేస్తోంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, గోదావరి–కావేరి అనుసంధానంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు మధ్య ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వినియోగించుకున్న నికర జలాల్లో 177 టీఎంసీలు మిగులు ఉందని ఎన్డబ్ల్యూడీఏ లెక్క కట్టింది. సీడబ్ల్యూసీ దీనికి విరుద్ధంగా చెబుతోంది. గోదావరిలో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. దాంతో గోదావరిలో నీటి లభ్యతపై సంయుక్తంగా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలను కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించింది. మహానది–గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా 760 టీఎంసీల జలాలను కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు తరలించాలని ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆ లెక్కకు ప్రాతిపదిక ఏమిటో? శ్రీరాం సాగర్ ప్రాజెక్టు – ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకోగా.. ఇచ్చంపల్లి వద్ద నికర జలాల్లో 177 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని ఎన్డబ్ల్యూడీఏ లెక్కకట్టింది. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 105 టీఎంసీలు, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు నీటి ఆవిరి కింద కేటాయించిన 52 టీఎంసీలకు మిగులు జలాలు 177 టీఎంసీలు జత చేసి 334 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించడానికి ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. దీన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడంలేదు. శ్రీరాం సాగర్ – ఇచ్చంపల్లి మధ్య 177 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు ఏ ప్రాతిపదికన లెక్కగట్టారని ఎన్డబ్ల్యూడీఏను ప్రశ్నించింది. గోదావరి బేసిన్లో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని పేర్కొంది. కోటా నీటిని ఛత్తీస్గఢ్ వాడుకుంటే గోదావరి–కావేరి అనుసంధానం ప్రశ్నార్థకమవుతుందంది. శ్రీరాం సాగర్– ఇచ్చంపల్లి మధ్య వరద జలాల్లో మిగులు అనుమానమేనని సీడబ్ల్యూసీ పేర్కొంది. 50 శాతం లభ్యత.., గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఇచ్చంపల్లి వద్ద 247 టీఎంసీల లభ్యత ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. -
గోదావరి–కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచైతే కష్టమే!
సాక్షి, అమరావతి: ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యంకాదని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య 1975, డిసెంబర్ 19న కుదిరిన ఒప్పందం ప్రకారం ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలకు మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదు. ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంచేసింది. గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో ఇచ్చంపల్లి నుంచి 141.3 టీఎంసీలు తరలించేలా ఎన్డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనను అమలుచేస్తే మూడు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం, గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించినట్లవుతుందని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పాటైన ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుండడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మేరకు పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. తక్కువ వ్యయంతో పనులు పూర్తిచేయవచ్చునని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదన ఇదీ.. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్గఢ్ (అప్పటి మధ్యప్రదేశ్)కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల వరద జలాలను జతచేసి.. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) వరకూ నీటిని తరలించడం ద్వారా గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని ఎన్డబ్ల్యూడీఏ తొలుత ప్రతిపాదించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అభ్యంతరం చెప్పాయి. గోదావరి నికర జలాల్లో మిగులులేదని.. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే అనుసంధానం చేపట్టాలని డిమాండ్ చేశాయి. దీంతో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి తరలించేలా ఎన్డబ్ల్యూడీఏ మళ్లీ ప్రతిపాదించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మా కోటాలో నీటిని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పింది. గోదావరి, ఉప నదులలోని నికర జలాల్లో ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నీరు, వరద జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ట్రిబ్యునల్ ఇచ్చింది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఎన్డబ్ల్యూడీఏకు పలుమార్లు కోరింది. పోలవరం నుంచైతేనే కావేరికి గోదావరి.. గోదావరి బేసిన్లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే ఆంధ్రప్రదేశ్తోపాటు ఏ రాష్ట్రం హక్కులకు విఘాతం కలగదు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రస్తావిస్తూ.. పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని సూచించారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కు చేరిన గోదావరి జలాలను కృష్ణా నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలంలోకి ఎత్తిపోసి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిలకు అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. దీనివల్ల భూసేకరణ, నిర్వాసితుల సమస్య తప్పుతుందని.. తక్కువ వ్యయంతో గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టవచ్చునన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను న్యాయ, సాగునీటిరంగ నిపుణులు బలపరుస్తున్నారు. మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఇదీ.. గోదావరిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం 1975, డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలను మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు. రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీలు మధ్యప్రదేశ్, 4 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోతల ద్వారా వినియోగించుకోవచ్చు. మిగతా నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించాలి. ఉత్పత్తయ్యే విద్యుత్లో మధ్యప్రదేశ్ 38 శాతం, మహారాష్ట్ర 35 శాతం, ఆంధ్రప్రదేశ్ 27 శాతం వాడుకోవాలి. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 78.10 శాతం ఆంధ్రప్రదేశ్, 10.50 శాతం మహారాష్ట్ర, 11.40 శాతం మధ్యప్రదేశ్ భరించాలి. ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహించాలి. -
రక్షణ గోడలు ఎందుకు విఫలమయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం మరోసారి పలు వివరాలు కోరింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల సందర్భంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు పక్కన ఉన్న వరద రక్షణ గోడలు పంప్హౌస్లు, తదితరాలను రక్షించడంలో ఎందుకు విఫలమయ్యాయి? రక్షణ గోడలు నిబంధనల అనుగుణంగా ఎత్తును కలిగి ఉన్నాయా? బ్యారేజీలకు సంబంధించిన గట్టులు (సేఫ్టీ ఎంబ్యాక్మెంట్) పరిసర గ్రామాలకు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమయ్యాయి?.. తదితర వివరాలను సమర్పించాలని పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీకి లేఖ రాసింది. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టుకు సమానంగా వరద ముప్పును కలిగి ఉన్న ఇతర ప్రాజెక్టులున్నాయా? ఆ ప్రాజెక్టులు ఎందుకు వరదను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాయి? కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు ఎందుకు విఫలమయ్యాయి? అనే సమాచారాన్ని సైతం అందించాలని కోరింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం బ్యారేజీకి బుంగలు పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనల నేపథ్యంలోనే జలశక్తి శాఖ ఈ సమాచారం కోరినట్టు తెలుస్తోంది. అవగాహన ఉన్న అధికారిని పంపండి పంప్హౌసుల్లోని పంపింగ్ యూనిట్ల డిజైన్లు, ప్లేస్మెంట్ల (లొకేషన్)లో లోపాలు వంటి సమాచారాన్ని కూడా జలశక్తి శాఖ కోరింది. వరదల సమ యంలో పంప్హౌసుల్లో చేరిన నీళ్లను బయటకి తోడడంలో డీవాటరింగ్ పంప్లు ఎందుకు విఫలమయ్యాయి? వీటికి సంబంధించిన ఇన్లెట్ గేట్లు/వాల్్వలు ఎందుకు మొరాయించాయి ? అనే వివరాలను సమర్పించాలని ఆదేశించింది. సవరించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను ఇవ్వాలని సూచించింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర స మాచారాన్ని అందజేసేందుకు వీలుగా ఈ విషయంలో పూర్తి అవగాహన కలిగిన ఓ అధికారిని జలశక్తి శాఖకు డిప్యుటేషన్పై పంపాలని ఆదేశించింది. -
మా హక్కులను పరిరక్షించాకే అనుసంధానం చేపట్టాలి
సాక్షి, అమరావతి: గోదావరి నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. తమ రాష్ట్ర హక్కులను పరిరక్షించాకే కావేరికి గోదావరి నీటిని తరలించాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద నదుల అనుసంధానం చేపట్టనున్న తరహాలోనే రాష్ట్రంలోనూ నదుల అనుసంధానాన్ని చేపట్టాలని కోరింది. ఈ అంశంపై చర్చించడానికి విజయవాడలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ చేసిన సూచనకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఎన్డబ్ల్యూడీఏ 72వ పాలకమండలి సమావేశం వర్చువల్ విధానంలో బుధవారం జరిగింది. ఇందులో ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్సింగ్ వోరాతోపాటు అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాస్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో సాగు, తాగునీటి కొరతను అధిగమించే లక్ష్యంతో చేపట్టటనున్న గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరిస్తూ అవగాహన ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు సూచించారు. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ తేల్చిన నేపథ్యంలో అనుసంధానం ఎలా చేపడతారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని డిమాండ్ చేశాయి. నికర జలాల్లో మిగిలిన జలాలు, వరద జలాలపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు గోదావరి ట్రిబ్యునల్ పూర్తి హక్కులు ఇచ్చిందని.. వాటిని పరిరక్షిస్తూ అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అనుసంధానంపై బేసిన్లోని రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని ఎన్డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ముందుకొస్తేనే గోదావరి–కావేరి చేపడతామని స్పష్టం చేశారు. -
నేడు కార్తీక మాసంలో తొలి సోమవారం
-
రాజమండ్రి గోదావరిలో కార్తీక మాస స్నానాలు
-
గోదావరి–కావేరిపై సమ్మతి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చిన్న ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి సమ్మతి తెలుపుతూ పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేసేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో నదుల అనుసంధానంపై సంప్రదింపులు, టాస్్కఫోర్స్ సమావేశాలను నిర్వహించింది. టాస్క్ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీల్లో ఎన్డబ్ల్యూడీఏ డీజీ భోపాల్సింగ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ప్రాజెక్టు డీపీఆర్ను సిద్ధం చేసి రాష్ట్రాలకు అందజేస్తామని, అప్పటి నుంచి 15 రోజుల్లోగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఎంఓయూపై సంతకాలు చేయాలని వెదిరె శ్రీరామ్ సూచించారు. ఈ భేటీల నిర్ణయాలను ఈనెల 22న ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో ఆమోదిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి(గోదావరి)–మూసీ–నాగార్జునసాగర్–సోమశిల– గ్రాండ్ ఆనికట్ (కావేరి)లను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ వద్దు: తెలంగాణ గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు రక్షణ కల్పిస్తే అనుసంధానం ప్రాజెక్టుకు సమ్మతి తెలుపుతామని సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టంచేశారు. ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50శాతం కేటాయించాలని కోరారు. గోదావరి జలాల్లో రాష్ట్రాల వారీగా వాటాలను నిర్థారించి, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరగకుండా ఫ్రీజ్ చేయాలన్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కాకుండా కొంత ఎగువన బ్యారేజీ నిర్మించి నీటిని తరలించాలని.. లేకుంటే దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ నిర్వహణలో సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇచ్చంపల్లి వద్దే నిర్మిస్తాం: వెదిరె శ్రీరాం తెలంగాణ సహా ఏ రాష్ట్ర వాటా నీటికీ నష్టం కలిగించమని వెదిరే శ్రీరామ్ సమాధానమిచ్చారు. భౌగోళికంగా ఉన్న ప్రతికూలతల దృష్ట్యా ఛత్తీస్గఢ్, ఇతర ఎగువ రాష్ట్రాలు వాడుకోలేకపోతున్న గోదావరి జలాలనే తరలిస్తామని స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని నిర్థారించిన నేపథ్యంలో వాటిని సైతం వినియోగించబోమని హామీ ఇచ్చారు. తెలంగాణకు 50శాతం వాటా కేటాయింపును పరిశీలిస్తామన్నారు. తొలి విడత ప్రాజెక్టుకు కేవలం 400 హెక్టార్ల భూసేకరణ మాత్రమే అవసరమని చెప్పారు. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మాస్తామని, సమ్మక్క బ్యారేజీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా వాటా పూర్తిగా వాడుకుంటాం: ఛత్తీస్గఢ్ గోదావరిలో తమ రాష్ట్ర వాటాను పూర్తిగా వాడుకుంటామని సమావేశంలో ఛత్తీస్గఢ్ చీఫ్ ఇంజనీర్ కుబేర్సింగ్ గురోవర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వేలు పూర్తిచేసి, సీడబ్ల్యూసీ నుంచి ప్రాథమిక స్థాయి అనుమతులు పొందామని చెప్పారు. దీంతో ఛత్తీస్గఢ్ తన వాటా జలాలను వాడుకోవడం ప్రారంభించిన వెంటనే గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపును నిలుపుదల చేస్తామని వెదిరె శ్రీరామ్ హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో 10 ఏళ్లకు పైగా పట్టవచ్చని, ఆలోగా మహానది–గోదావరి అనుసంధానం పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం నుంచే అనుసంధానం జరపాలి: ఏపీ గోదావరి–కావేరి అనుసంధానాన్ని పోలవరం ప్రాజెక్టు నుంచి చేపట్టాలని ఏపీ తరఫున శశిభూషణ్కుమార్ కోరారు. గోదావరిలో ఛత్తీస్గఢ్ వాడుకోని జలాలను సాంకేతికంగా నిర్ధారించాలని కోరారు. గోదావరిలో 75శాతం లభ్యత ఆధారంగా నికర జలాల లభ్యత లేదని తేల్చుతూ సీడబ్ల్యూసీ ఇ చ్చిన నివేదికలో తారతమ్యాలు ఉన్నాయని, మరింత స్పష్టత కల్పిoచాలని సూచించారు. బెడ్తి–వార్ధా నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని హెచ్ఎల్సీ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించాలన్నారు. ఎగువ రాష్ట్రాల వినియోగంతో గోదావరిలో దిగువ చివరి రాష్ట్రం ఏపీ వాటాకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం ఏపీతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎన్డబ్ల్యూడీఏను కోరారు. దీనిపై స్పందించిన వెదిరె శ్రీరామ్.. తొలివిడతలో ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేపడతామని, తదుపరి దశల్లో ఇతర ప్రాంతాల నుంచి సైతం గోదావరి జలాల తరలింపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ వాటాలకు రక్షణ కల్పించే విషయంలో రాజీపడబోమని భరోసా ఇచ్చారు. నాగార్జునసాగర్, సోమశిల జలాశయాల కింద ఇప్పటికే ఉన్న ఆయకట్టుతోపాటు నదుల అనుసంధానం ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు సైతం సాగునీటిని సరఫరా చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
స్తబ్దుగా గోదావరి
సాక్షి, అమలాపురం: గలగలా గోదావరి... స్తబ్దుగా ఉంది. ‘నైరుతి’ ముఖం చాటేయడంతో ఈ ఏడాది గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో పెద్దగా వర్షాలు పడలేదు. ఆ ప్రభావం ఇన్ఫ్లోపై పడింది. నైరుతి ముగియడం, వరదల సీజన్ కూడా అయిపోవడంతో జలాల రాక క్రమేణా తగ్గిపోయి ఇన్ఫ్లో తక్కువ స్థాయిలో నమోదవుతోంది. గడచిన రెండురోజులుగా బ్యారేజ్ నుంచి దిగువునకు నీటి విడుదల ఆగిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభావం వచ్చే రబీపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆశాజనకం గతేడాది జూలైలో చరిత్రలో రెండో అతి పెద్ద వరద రాగా, ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా అది కొనసాగింది. అక్టోబరు ఇదే సమయానికి బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 6,231 టీఎంసీలు నమోదవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు విస్తృతంగా పడే ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా వరద జాడ లేదు. గతంలో అంటే... 2016లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ఏడాది బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 2,750.944 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. రబీ మొత్తం ఆయకట్టుకు అనుమతి ఇచ్చినా తరువాత కొంత అనధికారికంగా కోత విధించాల్సి వచ్చింది. తగ్గిన ఇన్ఫ్లో ధవళేళ్వరం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో గణనీయంగా పడిపోవడంతో రెండు రోజులుగా గేట్లు మూసివేసి సముద్రంలోకి నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుత ఇన్ఫ్లో 14,700 క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీనిలో సీలేరు పవర్ జనరేషన్ నుంచి వచ్చింది 3,765 క్యూసెక్కులు. అంటే సహజ జలాలు కేవలం 10,935 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. ఈ నీటిని తూర్పు డెల్టాకు 4,900, మధ్యడెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7,200 చొప్పున మొత్తం 14,700 క్యూసెక్కులు వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. -
గోదావరి–కావేరి అనుసంధానంపై మళ్లీ కదలిక
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 3న హైదరాబాద్లో ఇందుకు సంబంధించిన రెండు కీలక సమావేశాలను నిర్వహించతలపెట్టింది. ఉదయం 11.30 గంటలకు నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ(ఎన్డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ఆధ్వర్యంలో గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై వేసిన స్టాండింగ్ కమిటీ ఐదో సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం కూడా చైర్మన్ వెదిరే శ్రీరామ్ అధ్యక్షతన జరగనుంది. ఉదయం జరిగే సమావేశంలో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ)ముసాయిదాను ఆయా రాష్ట్రాలకు అందజేయనున్నారు. చివరిసారిగా జరిగిన 4వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో గోదావరిపై ఎక్కడ బ్యారేజీ నిర్మించి నీళ్లను తరలించాలనే అంశంపై ఎన్డబ్ల్యూడీఏ ఆధ్వర్యంలో అధ్యయనం జరపా లని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి వద్దే గోదావరిపై బ్యారేజీ నిర్మించాలని తాజాగా ఎన్డబ్ల్యూడీఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై నవంబర్ 3న జరగనున్న స్టాండింగ్ కమిటీ, టాస్క్ఫోర్స్ సమావేశాల్లో విస్తృతంగా చర్చించి అన్ని రాష్ట్రాల సమ్మతి పొందాలని ఎన్డబ్ల్యూడీఏ భావిస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం వినియోగించుకోని 141 టీఎంసీల గోదావరి జలా లను గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా తరలించాలని గతంలో నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆ పరిమాణాన్ని 151 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కర్ణాటక కోటాను 19 టీఎంసీలకు పెంచనున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాడుకోని 151 టీఎంసీల నీళ్లను తరలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం జారీ చేస్తేనే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లాలని ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కోరాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 3న జరగనున్న సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనన్నది ఆసక్తికరంగా మారింది. -
అనుసంధానం అడుగు పడేదెలా?
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఒక నదిలో మిగులు జలాలను లభ్యత తక్కువగా ఉన్న మరో నదికి మళ్లించడానికి.. ఆ నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన ఉన్న రాష్ట్రాలు అదనంగా నీటిని కేటాయించాలంటూ పట్టుబడుతున్నాయి. ఇందుకు గోదావరి, మహానది ట్రిబ్యునళ్ల అవార్డులను అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.దీంతో నదుల అనుసంధానం సాధ్యం కావడంలేదు. ఇది సాకారం కావాలంటే న్యాయపరంగా అడ్డంకులను తొలగించుకోవడంతోపాటు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. ఇదే పెద్ద సవాల్. గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోదావరి ట్రిబ్యునల్.. ఇందుకు బదులుగా కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకొనే వెసులుబాటు కల్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే కృష్ణా బేసిన్లో అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. ఈ నీటి వాడకానికి మహారాష్ట్ర, కర్ణాటక తొమ్మిదేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను విభజనానంతరం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం అప్పగించింది. గోదావరి – కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ప్రాధాన్యతగా చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కృష్ణా నది మీదుగా ఈ అనుసంధానం చేపడుతున్నందున, కృష్ణా జలాల్లో తమకు అదనంగా కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబడుతున్నాయి. కావేరి బేసిన్కు గోదావరి జలాలను మళ్లిస్తున్న నేపథ్యంలో కావేరి జలాల్లో అదనపు కోటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ పట్టుబడుతున్నాయి. దీన్ని కృష్ణా, కావేరి బేసిన్లో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో గోదావరి– కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయ సాధన సవాల్గా మారింది. ఇదొక్కటే కాదు.. ద్వీపకల్ప భారతదేశంలో ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన 15 అనుసంధానాలపై ఏకాభిప్రాయ సాధన సాధ్యమయ్యే అవకాశమే లేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
పాపికొండల విహార యాత్రకు గ్రీన్ సిగ్నల్
దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరిలో పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు. బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారి పేరంటపల్లికి వెళ్లనున్నారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే -
అపర భగీరథుడు
సాక్షి, అమరావతి: దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల 1995 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ఎదురైన ఇలాంటి ఘట్టాలు వైఎస్ రాజశేఖరరెడ్డిని కదిలించాయి. అధికారంలోకి వస్తే గోదావరి, కృష్ణా జలాలను ప్రతి ఎకరాకు అందించి, కరవు రక్కసిని తరిమికొడతానని ఆయన బాస చేశారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే.. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టుతోసహా అనేక ప్రాజెక్టులను జలయజ్ఞం కింద కార్యరూపంలోకి తెచ్చారు. 2004–05లో రాష్ట్ర బడ్జెట్ అంచనా వ్యయం రూ.51,142.92 కోట్లు. కానీ రూ.1,33,730 కోట్ల వ్యయంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు అనుమతిచ్చారు. కొత్తగా 97.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు 23.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రణాళిక రూపొందించారు. 2014 మే 14 నుంచి 2009 సెప్టెంబరు 2 వరకు అంటే ఐదేళ్ల మూడు నెలల్లోనే రూ.53,205.29 కోట్ల వ్యయంతో 16 ప్రాజెక్టులు పూర్తిగా, మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 19.53 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించారు. 3.96 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు. సాగునీటి రంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టం: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తన తండ్రి వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టుల పనులకు వైఎస్సార్ హయాంలో అడ్డుతగిలిన తరహాలోనే ఇప్పుడూ చంద్రబాబు సైంధవుడిలా అడ్డుతగులుతున్నారు. అయినా సీఎం జగన్ వాటిని అధిగమిస్తూ పనులు కొనసాగిస్తున్నారు. నెల్లూరు, సంగం బ్యారేజ్లను పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్, హంద్రీ–నీవా ద్వారా కర్నూలు పశ్చిమ మండలాల్లో 68 చెరువులను నింపే పథకం, వెలిగొండ తొలి దశ, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తి కావొస్తున్నాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరు, అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మట్టికట్ట లీకేజీలకు డయాఫ్రమ్ వాల్తో అడ్డుకట్ట వేశారు. బ్రహ్మంసాగర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ 2019, 2020, 2021, 2022లలో ఏటా సగటున కోటి ఎకరాలకు నీళ్లందించి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఇక రాష్ట్రానికి పోలవరం జీవనాడి. వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. అటవీ, పర్యావరణ, ప్రణాళికా సంఘం సహా అవసరమైన అన్ని అనుమతులను సాధించారు. భారీ వ్యయమయ్యే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి.. కేంద్రం ఇచ్చే 90 శాతం వాటా నిధులతో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ సఫలమై ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చే సమయంలోనే వైఎస్సార్ హఠాన్మరణం చెందారు. విభజన నేపథ్యంలో పోలవరానికి జాతీయ హోదా కల్పించిన కేంద్రం.. వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ.. అప్పటి సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. చంద్రబాబు పాపం ఫలితంగా గోదావరికి వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నారు. -
వలలెన్ని వేసినా.. పులస జాడ లేదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరిలో సీజనల్గా దొరికే పులసలు ఈ ఏడాది జాడ లేకుండా పోయాయి. గోదావరికి వరదలు రావడంతోనే వలస వచ్చే పులసల సీజన్ ప్రారంభమవుతుంది. ఏటా గోదావరికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు వరద ప్రవాహం వస్తుంది. సాధారణంగా ఆగస్టు నెలలో వరదలు ఎక్కువ వస్తాయి. ఈ ఏడాది జూలైలోనే వరదలు వచ్చి వెళ్లిపోయాయి. వరదల సమయంలో సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదుతూ పునరుత్పత్తి కోసం గుంపులు గుంపులుగా పులసలు వస్తుంటాయి. కానీ.. ఈ సీజన్లో పులసలు మొహం చాటేశాయి. గోదావరి తీరంలో అక్కడక్కడా ఒకటి, రెండు పులసలు వలలో పడ్డా వేలకు వేలు పెట్టి పులస ప్రియులు ఎగరేసుకుపోతున్నారు. ‘క్వీన్ ఆఫ్ ఫిష్’గా పేరు గోదావరిలో లభించే పులస ‘క్వీన్ ఆఫ్ ఫిష్’ గా ప్రపంచంలోనే పేరుంది. 2015 గణాంకాల ప్రకారం ప్రపంచంలో హిల్షా ఉత్పత్తిలో 50–60 శాతంతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. మయన్మార్ 20–25 శాతంతో రెండో స్థానంలోను, 15–20 శాతంతో మన దేశం మూడో స్థానంలో ఉన్నాయి. గోదావరిలో పుట్టిన పులస పిల్లలే సముద్రంలోకి వెళ్లి ఇలసలుగా వృద్ధి చెందుతాయి. సముద్రంలో ఉండే ఇలస రుచిగా ఉండకపోవడానికి అవి కొవ్వుతో ఉండటమే కారణం. ఏటా వరదల సమయంలో సముద్రంలోని ఇలసలు పునరుత్పత్తి కోసం సముద్రంలో 11వేల నాటికల్స్ ప్రయాణించి గోదావరిలోకి ఎదురీదుతాయి. ఇలా ఎదురీత ప్రయాణం వల్ల పులసలో ఉండే కొవ్వు కరిగిపోయి ఎరుపు, గోధుమ రంగులోకి మారి పోషకాలు కలిగిన కొత్త శక్తితో స్మార్ట్గా మారుతుంది. కొన్ని రోజులు గోదావరిలోనే ఉండి గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంటుంది. ఇలా గోదావరిలోకి వచ్చిన పులసల్ని ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు. అర కేజీ దొరకడమే గగనం పులస గతంలో కేజీ నుంచి మూడు కేజీలు వరకు లభించేవి. మూడు కేజీల బరువున్న పులసలు నాలుగైదు చిక్కాయంటే వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండినట్టే. మూడు కేజీల తూకం ఉండే పులస రూ.20 వేల నుంచి రూ.25 వేలు పలికేది. ప్రస్తుత సీజన్లో అరకిలో పులస దొరకడమే గగనమైపోతోంది. ఆ అరకిలో పులసే ఐదారువేలు పలుకుతోంది. గోదావరి జిల్లాల్లో యా నాం, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావు లపాలెం, సిద్ధాంతం, నరసాపురం తదితర తీర ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా దొరికే పులసలు అరకొరగానే పడుతున్నాయి. సముద్ర ముఖద్వారాల వద్ద ఇసుక తిప్పలు పెరగడం, గోదావరిలోకి సల్ఫర్, అమ్మోనియా, లెడ్ తదితర కర్బనాలు కలిసిపోతుండటం, విచక్షణా రహితంగా సాగే వేట ఈ జాతి రాక తగ్గడానికి కారణంగా పేర్కొంటున్నారు. పులసలు సంతానోత్పత్తి జరిగే సమయంలో వేట సాగడం తగ్గిపోవడానికి మరో కారణం. పులసల మనుగడకు ‘సిఫ్రీ’ కృషి పులస చేప జాతిని పరిరక్షించే దిశగా కోల్కతాలోని సిఫ్రీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిస్ట్యూట్) కృషి చేస్తోంది. పులస సీడ్ను వృద్ధి చేసి బంగాళాఖాతంలో విడిచిపెడుతోంది. ఈ ప్రయత్నం వల్లే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పులసలు లభిస్తున్నాయంటున్నారు. కానీ.. గోదావరిలో లభించే పులసలకున్నంత రుచి ఆ ప్రాంతంలో పులసలకు ఉండదు. – చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్య శాస్త్రవేత్త పులసల రాక తగ్గిపోతోంది పులసలు రాక క్రమంగా తగ్గిపోతోంది. గతంలో జూలై, ఆగస్టు నెలల్లో మాకు పండగలా ఉండేది. వందలాది పులసలు మా వలల్లో చిక్కేవి. అటువంటిది ఈ సీజన్లో పులసలు జాడ కనిపించడం లేదు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. – ముదే హరిచంద్ర, మత్స్యకారుడు, యానాం -
ఆపద వేళ.. ఆపన్న హస్తం
వేలేరుపాడు: ‘ఉన్నట్టుండి గోదావరికి వరద పోటు చేరింది. పెద్దవాగులోకి నీళ్లు ఎగదన్నాయి. దారులన్నీ మూసుకుపోయి రుద్రమకోట ఓ ద్వీపంలా మారిపోయింది. అటు కుక్కునూరు వెళ్లలేని పరిస్థితి. ఇటు వేలేరుపాడు రాలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం క్షణాల్లో అధికారులను పంపించింది. వారిచ్చిన సూచనల మేరకు మేమంతా సమీపంలోని ఓడగుట్టపైకి వెళ్లిపోయి తలదాచుకున్నాం. వరదలో మునిగిన పశువుల్ని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బోట్ల సాయంతో ఓడగుట్టపైకి చేర్చారు. తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి.. జనరేటర్ల సాయంతో వెలుగులు నింపారు. వరద తగ్గే వరకు ఇక్కడే ఆశ్రయం కల్పించారు. ఆహారం సమకూర్చా’రంటూ రుద్రమకోట గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు. వరదల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పట్ల ఎంతో ఔదార్యం చూపారని.. ఆపద వేళ ఆపన్న హస్తం అందించి ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట వరద బాధితుల కోసం ఓడగుట్టపై ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో గ్రామానికి చెందిన 440 కుటుంబాల వారు ఆశ్రయం పొందుతున్నారు. ఏ లోటూ లేకుండా చూస్తున్నారు వరదల వల్ల తాము గ్రామం వదిలిపోవాల్సి వచ్చిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధికారులు తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని నిర్వాసితులు చెప్పారు. తమ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారని తెలిపారు. గోదావరి గట్టుపైనే తమ గ్రామం ఉన్నందున చిన్నపాటి వరదొచ్చినా వరద తాకిడికి గురవుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చినప్పుడల్లా ఓడగుట్ట పైకి చేరి నానా అగచాట్లు పడేవారమని, తమను పట్టించుకునే నాథుడు ఉండేవారు కాదని చెప్పారు. ముఖ్యమంత్రి ముందస్తు ఆదేశాల మేరకు ఇక్కడ జనరేటర్లు ఏర్పాటు చేశారని, గ్రామానికి రెండు బోట్లు కేటాయించారని గ్రామస్తులు వివరించారు. గ్రామాన్ని వరద చుట్టుముట్టిన వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామస్తులందరినీ బోట్లలో ఓడగుట్టకు తరలించారని, పశువులను కూడా బోట్లలో ఓడగుట్టకే తరలించారు. అక్కడే తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసి.. నిత్యావసర వస్తువులన్నీ సమకూర్చారని తెలిపారు. అప్పట్లో రెండు కేజీల బియ్యం ముఖాన కొట్టేవారు తెలుగుదేశం హయాంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తాము పడిన బాధలను గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. టీడీపీ హయాంలో వరదలు వచ్చినప్పుడు రెండు కిలోల బియ్యం, లీటర్ కిరోసిన్ చొప్పున తమ ముఖాన కొట్టి చేతులు దులుపుకునేవారని చెప్పారు. అవి అయిపోతే తమను పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయ వల్ల తాము అన్ని సౌకర్యాలు పొందగలిగామని, ఏ లోటూ లేకపోవడంతో ఓడగుట్టపై ధైర్యంగా గడపగలుగుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ తమ గ్రామానికి ఎంతో సాయపడిందన్నారు. సచివాలయంలో పనిచేసే వీఆర్వో, వలంటీర్, పోలీస్, ఏఎన్ఎం, పశు వైద్యశాఖ ఏహెచ్ఏ తమను కంటికి రెప్పలా చూసుకున్నారన్నారు. నిత్యావసర వస్తువులతోపాటు తాగునీరు, పాలు, ఐదు రోజులకు సరిపడా కూరగాయలు, బ్రెడ్, చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇచ్చారని వివరించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సందర్శించి వరద బాధితులకు కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఎప్పుడూ ఇంత సాయం అందలేదు ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత సాయం అందలేదు. మేం గుట్టకు వెళ్లిన వెంటనే మంచినీటి ప్యాకెట్లు అందించారు. కూరగాయలు ఇచ్చారు. ఏ లోటూ రాకుండా చూశారు. – కణితిరెడ్డి లక్ష్మీనర్సయ్య, వరద బాధితుడు పశువుల్ని కూడా కాపాడారు గోదావరి నీటిలో మునిగిన పశువులను కూడా కాపాడారు. గ్రామంలో ఉన్న వందలాది పశువులను బోట్లలో ఓడగుట్టకు తరలించారు. పశు నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. సీఎం జగన్కు ధన్యవాదాలు – షేక్ షఫీ, వరద బాధితుడు అప్పట్లో బియ్యంతో సరిపెట్టారు టీడీపీ హయాంలో కేవలం రెండు కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 25 కేజీల బియ్యంతోపాటు కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, తక్షణ సాయంగా 2వేల నగదు అందజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు అన్నీ సమకూర్చారు. విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్న గ్రామస్తులకు జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఇలా ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. – జి.భాస్కర్, రుద్రమకోట గ్రామస్తుడు -
‘వారధి’క్యం
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి దాటి అవతలి వైపునకు వెళ్లాలంటే పడవో, పంటో ఎక్కాల్సిందే. మరో దారి లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతూ కొవ్వూరు వెళ్లేవారు. కొవ్వూరు నుంచి తిరిగి రావాలన్నా మళ్లీ అదే మార్గం..అదే కష్టం..1976 నుంచి ఈ ఇబ్బందులు తప్పాయి. ఉభయ గోదావరి జిల్లాలను (విభజనకు ముందు) కలుపుతూ అఖండ గోదావరిపై రోడ్డు కం రైలు వంతెన ప్రారంభమైంది. కింది మార్గంలో రైలు వెళ్లేందుకు పట్టాలు.. దానిపైన రోడ్డు నిర్మించారు. అపురూపమైన ఈ రవాణా సౌకర్యం అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. గోదారమ్మ సాక్షిగా బస్సులోనో.. రైలులోనో గమ్మం చేరే మధురాభూతుల ప్రయాణానికి మార్గం ఏర్పడింది. మనదేశంలో రెండో అతిపెద్ద రోడ్డు కం రైలు ప్రయాణ వారధి ఇదే. 49 ఏళ్ల ఈ చారిత్రాత్మక వంతెన నాణ్యత పరిరక్షణ ఇప్పుడు సవాలుగా నిలిచింది. వయో భారం పెరగడంతో ఎక్కువ వాహనాలను ఈ వంతెనపై అనుమతించాలాంటే సందేహించాల్సి వస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా భారీ వాహనాలను అనుమతించకూడదని అధికారులు తాజాగా నిర్ణయించారు. నిర్మాణం ఇలా: గోదారమ్మ వడ్డాణం ధరించిందా అన్నట్టుటుంది రైలు కం రోడ్డు వంతెన. ఈ వంతెనపై ప్రయాణమంటే ఇష్టం లేని వారే ఉండరు. ఇప్పటికీ బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రాజమహేంద్రవరం వస్తుందనగానే అందరి కళ్లూ ఉరకలేసే గోదారిని చూడాలని ఆరాటపడతాయి. ఆనందానుభూతులను మనసులో నింపుకొంటారు. చెన్నై–హౌరా మధ్య రైల్వే లైన్ను డబ్లింగ్ చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ వారధి నిర్మాణం తెరపైకి వచ్చింది. 1964లో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఒక దశాబ్దం పట్టింది. జపాన్లో కన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 1994లో 3.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన స్కైగేట్ బ్రిడ్జి తర్వాత పెద్ద వంతెన ఇదే కావడం విశేషం. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి మూడు జాతీయ సంస్థలు ఈ వంతెన నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. 1974 నవంబర్ 20 అప్పటి రాష్ట్రపతి ప్రకృద్ధీన్ ఆలీ అహ్మద్ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరవై ఐదేళ్లు కనిష్టం, ఎనభై ఏళ్లు గరిష్టంగా మనగలిగేలా వారధిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ వారధి ఉభయ గోదావరి సమైక్య వాహినిగా ఖ్యాతినార్జించింది. ఇప్పుడేమైంది: నిర్మాణ సమయంలో అనుకున్న అంచనాలకు మించి తర్వాత ఈ వారధిపై రాకపోకలు జరుగుతున్నాయి. రోజుకు 25 వేల నుంచి 30 వేల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని అంచనా. రవాణా అవసరాలు పెరిగిపోవడంతో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సరకు రవాణాకూ ఈ మార్గాన్నే అనుసరించేవి. ఫలితంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. వారధికి భారంగా పరిణమించింది. దీంతో 49 ఏళ్లకే వంతెన మార్గం ప్రమాదంలో పడింది. 2007, 2011లలో దీనిని నిపుణులు పరిశీలించారు. మూడు ఆక్సిల్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వాహనాలు, లేదా 10.20 టన్నుల బరువుకు మించిన వాహనాలు ఈ మార్గంలో వెళ్లడం సరికాదని సూచించారు. దీంతో అధికారులు వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. నిర్లక్ష్యానికి మూల్యం క్షేత్ర స్థాయిలో వంతెనపై భారీ వాహనాకు సంబంధించిన రూపొందించిన నిషేధాజ్ఞలు సక్రమంగా అమలు కాలేదు. 2010లో రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసుల ఉదాశీన వైఖరిని ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించారు. ఎస్సైతో పాటు దిగువ స్థాయిలోని పదిమంది సిబ్బందిని అప్పట్లో సస్పెండ్ చేశారు. తర్వాత నిబంధనల అమలుకు వంతెన మార్గానికి అటు ఇటు పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. తర్వాత సిబ్బంది కొరత కారణంగా ఎత్తివేశారు. దీంతో భారీ వాహనాల నియంత్రణపై పర్యవేక్షణ కొరవడింది. అధికారులు ఇటీవల వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఇరువైపులా నిషేధాజ్జలు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 23 నుంచి భారీ వాçహనాల నియంత్రణపై కలెక్టర్ మాధవీలత గట్టి ఆంక్షలు విధించారు. రెండు వైపులా పోలీసు పికెట్లను పునరుద్ధరించారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వంటివి మాత్రమే అనుమతిస్తున్నారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా పల్లెవెలుగు బస్సులను అనుమతిస్తున్నారు. రూ.36 కోట్లతో మరమ్మతులు ఈ వంతెనపై 1996 నుంచి ఇప్పటివరకూ అడపాదడపా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కానీ అవి నిలవడం లేదు. ఇటీవల ఆర్అండ్బీ అధికారులు ఈ వంతెన మార్గానికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రూ.36 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. రూ.24 కోట్ల వ్యయంతో గడ్డర్ల మార్పిడి, పుట్ఫాత్ నిర్మాణం, శ్లాబులు వేయడం, హ్యాండ్ రైలింగ్ వంటి పనులు ఇందులో చేపడతారు. ఈ మొత్తంలో రూ.3 కోట్లు మాత్రమే రైల్వే శాఖ వాటాగా భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తంతో జాయింట్ల మరమ్మతులు, రోడ్డు నిర్మాణం, సెకండరీ జాయింట్ మరమ్మతులు, లైటింగ్ ఏర్పాటు, క్రోకడయిల్ జాయింట్ మరమ్మతులు చేపట్టాలని సంకల్పించారు. అత్యవసరంగా రూ.2.10 కోట్ల వ్యయంతో వారధికి ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అప్రోచ్ రోడ్లను కూడా పునరుద్ధరించనున్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచారు. -
ఏపీలో ముమ్మరంగా సాగుతున్న వరద సహాయక చర్యలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Andhra Pradesh: వరద ప్రాంతాల్లో వేగంగా సాయం
సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముంపు బారిన పడిన జిల్లాల్లోని 211 గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. 46,170 మంది బాధితులను అక్కడికి యుద్ధ ప్రాతిపదికన తరలించింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి 43,587 మందికి తాత్కాలికంగా పునరావాసం కల్పించారు. ఏలూరు జిల్లాలో 4 కేంద్రాల్లోకి 1,528 మందిని, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 18 కేంద్రాలకు 758, తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి 306 మందిని తరలించారు. ఆయా ప్రాంతాల్లో తక్షణ వైద్య సౌకర్యం కల్పించేందుకు 68 వైద్య శిబిరాలు నెలకొల్పారు. మొత్తం 178 బోట్లు, 10 లాంచీలను సహాయక చర్యల కోసం ఏర్పాటు చేశారు. ఐదు జిల్లాలకు ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం రూ.12 కోట్లు విడుదల చేయడంతో పునరావాసకేంద్రాల ఏర్పాటు, బాధితుల తరలింపు, వారికి అవసరమైన ఆహారం, తాగు నీరు ఇతర సౌకర్యాల కల్పన వేగంగా జరిగింది. ఐదు జిల్లాల్లో మొత్తం 26 మండలాల్లోని 211 గ్రామాలపై గోదావరి వరద ముంపు ప్రభావం పడినట్లు నిర్ధారించి, ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 96 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో 10 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరులో రెండు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ పోలవరంలో ఒక్కొక్కటి చొప్పున ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరం, చింతూరు, పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో ఒక్కొక్కటి చొప్పున ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఆ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పర్యవేక్షణ ♦ వరద తాకిడికి గురైన చింతూరు, వీఆర్పురం, కూనవరం ఎటపాక మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు సంబంధించి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు తాగునీటితో పాటు వాడుక నీటి సౌకర్యం కల్పించారు. విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాల్లో జనరేటర్ సౌకర్యం కల్పించారు. బాధితులకు నిత్యావసరాలతో పాటు కూరగాయలు, పాలు అందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా కేంద్రాల పరిసరాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లను అందుబాటులో వుంచారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ♦ చింతూరు మండలంలో బాధితులకు కూరగాయలు, పాలతో పాటు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. కిరోసిన్ పంపిణీకి కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారికి 10 వేల టార్పాలిన్లను సిద్ధం చేస్తున్నారు. కూనవరం మండలంలో 12, వీఆర్పురం మండలంలో 10, చింతూరు మండలంలో 8 మర పడవలను సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ♦ వరద ముంపు ప్రాంతాలకు లాంచీలు, పడవల ద్వారా కూరగాయలను పంపించారు. చింతూరు జీసీసీ గోడౌను నుంచి వీఆర్పురం, కూనవరం మండలాలకు మూడు టన్నుల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, రెండు టన్నుల చొప్పున వంకాయలు, దొండకాయలు పంపించారు. నడి గోదావరిలో ఆరుగురు గర్భిణుల తరలింపు నడి గోదావరిలో శనివారం రాత్రి 10.30 గంటలకు బోట్పై ఆరుగురు గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రానికి తరలించాయి. డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ రాజీవ్ వేలేరుపాడు మండలంలో అత్యంత మారుమూల గ్రామాలైన టేకుపల్లి, టేకూరు గ్రామాల్లో ఆరుగురు గర్భిణులను గుర్తించారు. వీరిని వెంటనే పునరావాస కేంద్రానికి తరలించేందుకు బోట్పై ప్రయత్నించగా, తిర్లాపురం గ్రామానికి వచ్చేసరికి చీకటి పడి అక్కడే బోట్ ఆగిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మోహన్యాదవ్, మిగిలిన బృంద సభ్యులు.. ఆరుగురు గర్భిణులను వేలేరుపాడుకు తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వారిని తీసుకెళ్లారు. నిత్యావసర వస్తువుల పంపిణీ ♦ పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో అయోధ్య లంక, మర్రిమూల, పెదమల్లం గ్రామాల్లో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించి, బాధితులకు భరోసా ఇచ్చారు. యలమంచిలి మండలంలోని లంక గ్రామాలైన దొడ్డిపట్ల, కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, ఏనుగువాని లంక, బాడవ గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి లంక గ్రామాల్లో పర్యటించారు. ♦ ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం రాత్రి ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంలో ఐదు గ్రామాలు నీటమునిగాయి. పాత నార్లవరం, ఎడవల్లి, టేకూరు, రుద్రమకోట, వేలేరుపాడు సంతబజారుల్లో 30 ఇళ్ల వరకు నీటమునగడంతో జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వీరందరికీ భోజన వసతి కల్పించారు. వేలేరుపాడులో పది దేశీయ బోట్లు, రెండు పెద్ద బోట్లు, మరో రెండు ఫైర్ బోట్లు వినియోగిస్తున్నారు. వరద బారిన పడిన కుటుంబాలన్నిటికీ ఆదివారం 3900 లీటర్ల వంట నూనె, 4 వేల కేజీల కందిపప్పు, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేయనున్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్‡్ష రాజేంద్రన్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీ దగ్గరుండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ♦ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య వరద చేరింది. స్థానికులు పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో పునరావస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. వారి కోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణు గోపాలరావు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్ శనివారం కూనవరం, వీఆర్పురం మండలంలో వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని 30 పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం పెంపు సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు గ్రామాలకు చెందిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సొమ్మును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఆర్ధికసాయంపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ జిల్లాల్లో ముంపునకు గురైన కుటుంబాలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, కేజీ కందపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ సరుకులను సమకూర్చాల్సిందిగా మార్కెటింగ్కు ఆదేశాలిచ్చారు. దెబ్బతిన్న, పాడైన ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
తగ్గుతున్న వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్: పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆగిపోవడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువ గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. తెలంగాణలోని గోదావరి నదిపై ఉన్నశ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను మూసేశారు. గోదావరి వరద ప్రవాహం ఎల్లంపల్లి, కాళేశ్వరం వద్ద తగ్గింది. ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో.. ఆదివారం రాత్రి నుంచి భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్ల వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు 15,69,011 క్యూసెక్కులు వస్తుండటంతో అక్కడ నీటి మట్టం 55.6 అడుగులకు చేరుకుంది. దాంతో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. భద్రాచలం నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 14,80,862 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 7,100 క్యూసెక్కులను వదులుతూ మిగులు జలాలను 175 గేట్ల ద్వారా అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్లో నీటి మట్టం 15 అడుగుల వద్ద స్థిరంగా ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.51 లక్షల క్యూసెక్కులు పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా, తుంగభద్రలలో వరద తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వరద ప్రవాహం తగ్గింది. ఇక తుంగభద్ర డ్యామ్లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా నీటి నిల్వ 69.23 టీఎంసీలకు చేరుకుంది. మరో 36 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోకి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 1,48,875, సుంకేశుల నుంచి 2,181 వెరసి 1,51,056 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో నీటి నిల్వ 837.9 అడుగుల్లో 58.81 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 157 టీఎంసీలు అవసరం. తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద ప్రవాహం తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరో 15 టీఎంసీలు చేరితే పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. మున్నేరు, కట్టలేరు, బుడమేరులలో వరద తగ్గుతుండటంతో ప్రకాశం బ్యారేజ్లోకి చేరుతున్న ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్లోకి 1,06,370 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో వరదను 60 గేట్లు రెండు అడుగులు, పది గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. సంగమేశ్వరుడిని చుట్టేస్తున్న కృష్ణమ్మ కొత్తపల్లి (నంద్యాల): శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమేశ్వరాలయాన్ని కృష్ణాజలాలు చుట్టేస్తున్నాయి. ఆలయం జలాధివాసానికి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ దంపతులు శనివారం ఆలయంలోని వేపదారు శివలింగానికి కుంకుమార్చన, పుష్పార్చన, నదిజలాలతో అభిషేకం, మంగళహారతి వంటి విశేషపూజలు చేశారు. గంటగంటకు నీరు పెరుగుతుండటంతో శనివారం రాత్రి 9 గంటల సమయానికి గర్భాలయంలోకి నీరుచేరుతుందని పురోహితులు తెలిపారు. -
భద్రాచలం వద్ద మహోగ్రం.. కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా వానలు తెరిపించినా.. ఇప్పటికే చేరిన నీటితో ఉప నదు లు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదా వరి మహోగ్ర రూపం కొనసాగుతోంది. శనివారం రాత్రి 10గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 16 లక్షల క్యూసెక్కులకు, నీటి మట్టం 56 అడుగులకు పెరిగింది. భారీగా వరద వస్తుండటంతో నీటి మ ట్టం మెల్లగా పెరుగుతూనే ఉంది. దీనితో అధికారు లు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నా రు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాల్లోనే ఉంచారు. మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత తదితరులు సహాయక చర్యలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. శనివారం మధ్యా హ్నం 2 గంటల వరకు కూడా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు భోజనం పెట్టకపోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్డీఓ మాధవి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు 3 గంటలకు భోజనం అందించారు. ఎగువ నుంచి తగ్గుతూ.. ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో వర్షాలు ఆగిపోవడంతో.. ఎగువన గోదావరిలో వరద తగ్గు తోంది. శ్రీరాంసాగర్లోకి ప్రవాహం 60వేల క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 2.95 లక్షలు, పార్వతి బ్యారేజీ వద్ద 3.01 లక్షలు, సరస్వతి బ్యారేజీ వద్ద 1.98 లక్షలు, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 10.80 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి శాంతించనుంది. భద్రాచలం నుంచి వెళ్తున్న భారీ వరద పోలవరం, ధవళేశ్వరం మీదుగా కడలిలోకి వెళ్లిపోతోంది. శ్రీశైలంలోకి 1.51 లక్షల క్యూసెక్కులు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్రలలోనూ వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కృష్ణాలో ఆల్మట్టిలోకి 1.30 లక్షల క్యూసెక్కులు, నారాయణ్పూర్లోకి 88,228 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ ప్రాజెక్టుల్లో కాస్త నీటిని నిల్వ చేస్తూ, మిగతా దిగువకు వదులుతున్నారు. జూరాలకు శనివారం ఉద యం నుంచి సాయంత్రందాకా 2.20 లక్షల క్యూసె క్కుల వరదరాగా.. సాయంత్రానికి 1,35,900 క్యూసెక్కులకు తగ్గింది. ఇక్కడ గేట్లు, విద్యుత్ సరఫరా ద్వారా కలిపి 1,48,875 క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. దీనికి సుంకేశుల నుంచి 2,181 క్యూసెక్కులు కలిపి.. మొత్తం 1,51,056 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 61.79 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే మరో 157 టీఎంసీలు కావాలి. ఇక తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 69.23 టీఎంసీలకు పెరిగింది. -
భద్రాచలం వద్ద మహోగ్రంగానే..
సాక్షి, హైదరాబాద్/ భద్రాచలం/ గద్వాల రూరల్/ ధరూర్/ దోమలపెంట: రాష్ట్రవ్యాప్తంగా వానలు తెరిపినిచ్చినా.. ఇప్పటికే చేరిన నీటితో ఉప నదు లు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదా వరి మహోగ్ర రూపం కొనసాగుతోంది. శనివారం రాత్రి 10గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 16 లక్షల క్యూసెక్కులకు, నీటి మట్టం 56 అడుగులకు పెరిగింది. భారీగా వరద వస్తుండటంతో నీటి మ ట్టం మెల్లగా పెరుగుతూనే ఉంది. దీనితో అధికారు లు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నా రు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాల్లోనే ఉంచారు. మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత తదితరులు సహాయక చర్యలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. శనివారం మధ్యా హ్నం 2 గంటల వరకు కూడా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు భోజనం పెట్టకపోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్డీఓ మాధవి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు 3 గంటలకు భోజనం అందించారు. ఎగువ నుంచి తగ్గుతూ.. ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో వర్షాలు ఆగిపోవడంతో.. ఎగువన గోదావరిలో వరద తగ్గు తోంది. శ్రీరాంసాగర్లోకి ప్రవాహం 60వేల క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 2.95 లక్షలు, పార్వతి బ్యారేజీ వద్ద 3.01 లక్షలు, సరస్వతి బ్యారేజీ వద్ద 1.98 లక్షలు, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 10.80 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి శాంతించనుంది. భద్రాచలం నుంచి వెళ్తున్న భారీ వరద పోలవరం, ధవళేశ్వరం మీదుగా కడలిలోకి వెళ్లిపోతోంది. శ్రీశైలంలోకి 1.51 లక్షల క్యూసెక్కులు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్రలలోనూ వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కృష్ణాలో ఆల్మట్టిలోకి 1.30 లక్షల క్యూసెక్కులు, నారాయణ్పూర్లోకి 88,228 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ ప్రాజెక్టుల్లో కాస్త నీటిని నిల్వ చేస్తూ, మిగతా దిగువకు వదులుతున్నారు. జూరాలకు శనివారం ఉద యం నుంచి సాయంత్రందాకా 2.20 లక్షల క్యూసె క్కుల వరదరాగా.. సాయంత్రానికి 1,35,900 క్యూసెక్కులకు తగ్గింది. ఇక్కడ గేట్లు, విద్యుత్ సరఫరా ద్వారా కలిపి 1,48,875 క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. దీనికి సుంకేశుల నుంచి 2,181 క్యూసెక్కులు కలిపి.. మొత్తం 1,51,056 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 61.79 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే మరో 157 టీఎంసీలు కావాలి. ఇక తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 69.23 టీఎంసీలకు పెరిగింది. -
గోదావరి డేంజర్ లెవల్.. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్, హెలికాప్టర్
సాక్షి, భద్రాచలం: దక్షిణ గంగ అయిన గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణలోని సీతమ్మసాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో వరద ఉధృతి పెరుగుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శనివారం తెల్లవారుజామున గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దిగువకు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. కాగా, ఈ ఏడాది తొలిసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాలు, కాలనీల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. చర్ల మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు అధికారులు. భద్రాచలం పట్టణంలోని మూడు కాలనీలకు చెందిన వారిని కూడా పునరావస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ రెస్య్కూ కంట్రోల్ వాట్సాప్ నెంబర్ 8712682128ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెంబర్కు ఫొటోలు, లోకేషన్ పంపించి పోలీసుల సహయం పోందవచ్చని జిల్లా ఏస్పీ వినిత్ వెల్లడించారు. ఇక, పడవలు, బోట్లు , గజ ఈతగాళ్ళు, లైఫ్ జాకెట్లను అధికారులు సిద్దం చేశారు. ఇదిలా ఉండగా.. గోదావరీ ఉధృతి, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ ప్రియాంక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 58 నుంచి 60 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది. జిల్లా అధికార యంత్రాంగం సహాయ చర్యలు అందించడానికి సిద్ధంగా ఉంది. జిల్లావ్యాప్తంగా 40 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఇప్పటివరకు 4,900 మందిని సురక్షిత కేంద్రాలకు తరలించాము. అత్యవసర పరిస్థితుల్లో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్ అందుబాటులో ఉంచాం. గోదావరి 60 అడుగులు వచ్చినా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రంగా సిద్ధంగా ఉంది. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలు పునరావస కేంద్రాలకు తరలిరావాలి అని సూచించారు. ఇది కూడా చదవండి: 19 ప్రాణాలు.. 10 లక్షల ఎకరాలు.. వరదలతో రాష్ట్రం అతలాకుతలం -
యానాం - ఎదుర్లంక వారధి వద్ద ఉద్ధృతంగా గౌతమీ నది
-
ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Updates.. ► ప్రకాశం బ్యారేజ్కు వరద పెరుగుతోంది. మున్నేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 71వేల క్యూసెక్యులుగా ఉంది. 40 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ► ధవళేశ్వరం వద్ద గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం వద్ద 12.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► శ్రీకాకుళం జిల్లా తామాడలో అత్యధికంగా 21.8 సెం.మీ వర్షపాతం కురిసింది. దీంతో, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 👉: ఏపీలో భారీ వర్షాలు.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం. ► పల్నాడు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్. ► అల్లూరి, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ► కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్. ► ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్టీఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, అనకాపల్లి, విశాఖ జిల్లాలో వర్షం కురుస్తోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురు సురక్షితం
Updates.. ►భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి. ► గురువారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక ►ప్రస్తుతం 48 అడుగుల మేర ప్రవహిస్తున్న గోదావరి. ►దిగువకు 11లక్షల 50వేల క్యుసెక్కుల వరద నీరు గోదావరిలోకి విడుదల. ►ఏ సమయంలోనైన గోదావరి మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు. ప్రమాదకరంగా మున్నేరు నది ఖమ్మం నగరంలో మున్నేరు నది 30 అడుగుల ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇల్లోకి వరదనీరు చేరింది. మున్నేరు వద్దకు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. NDRFతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పద్మావతి నగర్ వరద లో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మీడియాతో మంత్రి పువ్వాడ ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులు కాపాడినట్లు మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇక్కడికి పిలిపించామని.. వరదల్లో చిక్కుకున్న ఏ ఒక్కరి ప్రాణం పోకూడదనే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ఖమ్మం మున్నేరు వరద ఉధృతితో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేపించి పునరావస కేంద్రలను ఏర్పాటు చేశామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని.. ఇంకా అనేక ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నారని ఫోన్లు వస్తున్నాయన్నారు. వరదల్లో చిక్కుకున్న అందరిని కాపాడే బాధ్యత తమదేన్నారు. పెద్దపల్లి జిల్లా. ►పార్వతి బ్యారేజ్లోకి కొనసాగుతున్న భారీ వరద నీరు. ►మొత్తం 74 గేట్లు కాగా అందులో 70 గేట్లు ఎత్తిన అధికారులు. ►ఇన్ ఫ్లో 5,90,256 క్యూసెక్కుల ►ఔట్ ప్లో 5,90,256 క్యూసెక్కుల ►బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు. ►ప్రస్తుత నీటి సామర్థ్యం : నిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ►గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులోకి వరద నీరు ►ఇన్ ఫ్లో 29781 క్యూసెక్కులు. ►ఔట్ ప్లో 29781 క్యూసెక్కులు. ►ప్రాజెక్ట్ సామర్థ్యం 2.20 టీఎంసీలు. ►ప్రస్తుత నీటి సామర్థ్యం 2.20 టీఎంసీలు. తెలంగాణలో అసాధారణ వర్షపాతం ►తెలంగాణలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. మోరంచపల్లి గ్రామస్తులు సేఫ్ ►వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్జోన్కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ►భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రతమతంగా ఉందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు మొరాయించాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. డ్యామ్ ఎత్తు 700 అడుగులు అయితే.. 702 అడుగుల మేర నీటి ప్రవాహం ఉందని తెలిపారు. నీట మునిగిన వరంగల్ ►భారీ వర్షాలతో నీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్ ► పూర్తిగా తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ ►శివనగర్ బస్తీల్లో పారుతున్న వరద నీరు ► వరంగల్లో పూర్తిగా నీట మునిగిన హంటర్ రోడ్డు, నయూం నగర్, శివనగర్ ► బిల్డింగ్లపై తలదాచుకున్న వరద బాధితులు ►హంటర్ రోడ్డుకు చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ►సాయం చేయాలని బాధితుల ఆర్తనాదాలు ►వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు పట్టాలపై వరద.. పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ►పెద్దపల్లి రైల్వే స్టేషన్లో మూడు గంటలకుపైగా గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. పట్టాలపై భారీగా వరదనీరు చేరడంతో సికింద్రాబాద్కు రావాల్సిన రైలును పెద్దపల్లిలో అధికారులు నిలిపేశారు. కాజీపేట వడ్డేపల్లి చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో పెద్దపల్లి రైల్వే స్టేషన్లో గోరఖ్ పూర్ ఎక్స్ప్రెస్ను నిలిపవేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రయాణికులు వాహనాల్లో తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లా ► భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు వరదల్లో ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నగరంలోని పద్మావతి నగర్లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురుని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. అయితే వరద ఉదృతితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. సహాయక చర్యలను మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ ప్రియాంక పర్యవేక్షిస్తున్నారు. ►మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉధృతి , సహాయ చర్యల పై మంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఏడుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ►సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి పువ్వాడ భద్రాచలం నుంచి ఖమ్మం బయలుదేరారు. విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రత్యేక డ్రోన్ పంపించి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితిని ఖమ్మం అధికారులు ఆరాతీస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగుప్రమాద స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. .ఖమ్మం కాల్వ ఒడ్డు వద్ద గరిష్టంగా 28 అడుగులు ప్రవహిస్తున్న మున్నేరు వరద ఉధృతిని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పరిశీలించారు. వరద ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన ►రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ సమీక్ష.. ► తెలంగాణలో ఎడతెరిపిలేని భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఎప్పటికప్పుడు తెలంగాణలో పరిస్థితిని కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను తరలించాలని కేసీఆర్ ఆదేశించారు. వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియామించాలని ఆదేశాలు జారీ చేశారు. ► తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8మిమీ వర్షం కురిసింది. అంతకుముందు.. ములుగు జిల్లా వాజేడులో 2013లో జూలై 19న 24 గంటల్లో 517.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. ► ఇక, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లపైన వర్షపాతం నమోదైంది. 200 కేంద్రాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. ► హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరో 24 గంటలు వర్షం ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ► ఇక, భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంపీ హై అలర్ట్. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ► కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 11 సెం.మీల వర్షపాతం నమోదైంది. ► బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ► తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఇక, హైదరాబాద్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ► భద్రాచలం వద్ద 51 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. MLA Rekha Naik & other officials run away from #Kadem project after they realize that it is dangerous today morning. While project capacity is 700 ft, it is filled to 699.5 ft. Officials tried to open all 18 gates but 4 didn’t work! #NirmalDist #TelanganaRains #StaySafe pic.twitter.com/27AQxZJ6FH — Revathi (@revathitweets) July 27, 2023 ► హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన జంక్షన్లలో రోడ్లు జలమయమయ్యాయి. మరో మూడు గంటలపాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ హెల్ప్లైన్ నెంబర్: 040-2111 1111, ఆర్డీఎఫ్ నెంబర్: 90001 13667. #Kadem Project@balaji25_t pic.twitter.com/hfvoSl8uGc — Shravan Pintoo (@ShravanPintoo) July 27, 2023 #Telangana A woman was washed away while crossing a water stream in Kothagudem. And the BRS govt has the audacity to implement this Telangana model across the country... And also KCR wanted to become the PM. pic.twitter.com/Uj3k2KSGJu — Gems Of KCR (@GemsOfKCR) July 27, 2023 ► భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. భద్రాచలం నుంచి దిగువకు 12.65 లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. నీటమునిగిన అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్. చర్లలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు. భద్రాచలం పట్టణంలోని 3 కాలనీల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు. అత్యవసరమైతే ఫొటోలు, లోకేషన్లు పంపాలని జిల్లా ఎస్పీ సూచన. పోలీసు రెస్య్కూ కంట్రోల్ వాట్సాప్ నెంబర్ 87126 82128. In total 80 tourists who were stuck at #Muthyaladara waterfalls, #Mulugu, #Telangana were rescued by the DDRF & NDRF teams deployed. All are safe & sound. One minor boy was bitten by a scorpion, he was shifted to hospital for treatment. #Rains https://t.co/0ey898lYpK pic.twitter.com/RmhWS4v4UE — Sowmith Yakkati (@sowmith7) July 27, 2023 Due to heavy rains across Telangana State, citizens are advised to come out only for extremely important work at night times. Present situation is currently under control. #TelanganaPolice, from home guard officers to the DG level, are well-prepared, and every hour from each PS… pic.twitter.com/CWcLiypmB7 — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 26, 2023 ► మూసీ ప్రాజెక్ట్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ ఇన్ఫ్లో 19వేలు, ఔట్ఫ్లో 17వేలు క్యూసెక్కులు. Water falling from 700 feet at #Mutyamdhara #waterfalls in Veerabhadravaram located in #Mulugu district’s #Vebkatapuram mandal.@telanganatouris @tstdcofficial @VSrinivasGoud @newstapTweets pic.twitter.com/TsGrw0mvbF — Saye Sekhar Angara (@sayesekhar) July 26, 2023 ► నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో ఉంది. సామర్ధ్యానికి మించి వరద ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్ట్ సామర్థ్యం 3.50లక్షల క్యూసెక్కులే. కాగా, 6.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్ట్ గేట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. 14 గేట్ల ద్వారా దిగువకు 2.18 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రంగంలోకి దిగిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిర్మల్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. Despite heavy #rains, a funeral procession had no option but to risk crossing a seasonal stream to perform the final rites of an elderly person. The incident happened couple of days ago in Cherial of #Siddipet district, #Telangana. pic.twitter.com/rD1utRTTvT — Krishnamurthy (@krishna0302) July 26, 2023 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. కుండపోత కారణంగా మోరంచ వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో కొందరు గ్రామస్తులు వర్షంలోనే బిల్డింగ్లపైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. ► వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు. మోరంచపల్లి గ్రామంలో 300 మంది.. వెయ్యి జనాభా దాకా ఉంది. వానాకాలం వచ్చినప్పుడల్లా మోరంచవాగు ప్రవాహంతో గ్రామం చుట్టూ నీరు చేరుతుంటుంది. అయితే ఈ దఫా గ్రామాన్ని వాగు పూర్తిగా ముంచెత్తడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, వాతావరణ శాఖ రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వర్షాలకు తోడు పలుచోట్ల గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది. -
మళ్లీ పెరిగిన గోదావరి వరద
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/చింతూరు/ధవళేశ్వరం: రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోదావరి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఉపనదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసాని వంటి ఉపనదుల నుంచి భారీగా వస్తున్న నీటితో గోదావరిలో గంట గంటకూ వరద ఉద్ధృతి పెరుగుతోంది. తెలంగాణలోని కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 5,11,080 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్ నుంచి 7,54,470 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్ నుంచి 10,49,351 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 9.28 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. వరద ఉద్ధృతి పెరగటంతో పట్టిసం శివక్షేత్రం చుట్టూ వరద నీరు చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి బుధవారం రాత్రి 8 గంటలకు 8,37,850 క్యూసెక్కులు చేరుతుండగా.. నాలుగువేల క్యూసెక్కులను గోదావరి డెల్టాకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 8,33,850 క్యూసెక్కులను 175 గేట్లను పూర్తిగా ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ నీటిమట్టం 10.70 అడుగులకు చేరింది. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్రూమ్ నుంచి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గురువారం ఉదయం 10 లేదా 11 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్లోకి వస్తున్న ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. మరో రెండ్రోజులు బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో గోదావరి వరద మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విలీన మండలాల్లో నిలిచిన రాకపోకలు.. గోదావరి వరదతో విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాకల్లో పలు గ్రామాలు జలదిగ్బంధ మయ్యాయి. భద్రాచలం, కూనవరం ప్రధాన రహదారిపై వరదనీరు చేరింది. కూనవరం, వీఆర్పురం మండలాల్లో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శబరినది పొంగి రహదారులపైకి వరద నీరు చేరడంతో చింతూరు మండలంలోని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం అల్పపీడనం కేంద్రీకృతమైన బంగాళాఖాతం నుంచి కోస్తా జిల్లాల వైపు నిరంతరాయంగా మేఘాలు వస్తూనే ఉండడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మీదుగా వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. కాగా, బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాత ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని ఏపీఎస్డీపీఎస్ అధికారులు చెబుతున్నారు. -
భద్రాచలం వద్ద గోదావరికి పెరిగిన నీటి మట్టం
-
గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 7,59,015 క్యూసెక్కులకు పెరిగింది. దాంతో నీటి మట్టం 38.9 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం నుంచి 7,62,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్లోకి 6,86,660 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి మట్టం 9.40 అడుగులకు చేరింది. గోదావరి డెల్టాకు 9,900 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 6,76,760 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన వరద పెరిగిన నేపథ్యంలో బుధవారం ధవళేశ్వరం బ్యారేజ్కి చేరే ప్రవాహం పెరగనుంది. గోదావరిలో ఎగువన తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్లోకి 5,79,730 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్లోకి 7.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం వల్ల బుధవారం, గురువారం బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. -
యాండే.. పులసొచ్చిందండీ.. ఓ చూపు చూడండే! (ఫొటోలు)
-
భారీ వర్షాలు, వరదలతో పోటెత్తుతున్న గోదావరి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కొనసాగుతున్న గోదావరి వరద
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/చింతూరు/ సాక్షిప్రతినిధి,ఏలూరు: గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం ఎగువున తెలంగాణలో వరద కొనసాగగా, దిగువున ఏపీలో తగ్గింది. పోలవరం ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 6,33,474 క్యూసెక్కులు చేరుతుండగా.. 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. నీటి మట్టం ప్రాజెక్టు స్పిల్ వేకు ఎగువన 32, దిగువన 23.5, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 32.7, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 23.07 మీటర్లుగా నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజ్ లోకి 8,68,285 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 8,56,185 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువున తెలంగాణ లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,57,496 క్యూసె క్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 56.94 టీఎంసీలకు చేరుకుంది. మరో 34 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండిపోతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,92,529 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 20 గేట్లు ఎత్తేసి 2,55,320 క్యూసెక్కులను దిగువకు వదులుతు న్నారు. కాళేళ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడి గడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ నుంచి 6,10,250 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్ నుంచి 8,79,450 క్యూసె క్కులు దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు భద్రాచలం, పోలవరం మీదుగా ధవళేశ్వరం బ్యారే జ్ నుంచి కడలిలో కలవనున్నాయి. కాగా, శని వారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.80 అడుగులకు తగ్గింది. ఇక్కడ ఆది వారం వరద స్వల్పంగా పెరుగుతుంది. భద్రాచలం వద్ద తగ్గుతూ.. పెరుగుతూ.. భద్రాచలం వద్ద శుక్రవారం నాటికి 44.30 అడుగు లకు చేరిన నీటిమట్టం, శనివారం ఉదయానికి 39.4 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మళ్లీ పెరగడం ప్రారంభమై శనివారం సాయంత్రానికి 40 అడుగులకు చేరుకుంది. విలీన మండలాలైన కూనవరం, వీఆర్పురంలో ప్రస్తుతం వరద ప్రభావం తగ్గుతున్నా తిరిగి పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ముంపు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద గోదావరి వరదనీరు రెండు అడుగుల మేర తగ్గింది. పశ్చిమగోదావరిలోని యలమంచిలి మండలం కనకాయలంకలో వరద పరిస్థితిని కలెక్టర్ పి.ప్రశాంతి పడవలో వెళ్లి పరిశీలించారు. అలాగే ఏలూరు జిల్లాలోని ముంపు మండలాల్లో వరద పరిస్థితిని నూజివీడు అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భరత్ పరిశీలించారు. -
పెన్గంగ ఉగ్రరూపం
సాక్షి, ఆదిలాబాద్: గోదావరి ఉప నది పెన్గంగ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తింది. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న కోరాట–చనాఖా బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టం 213 మీటర్లుకాగా.. దాన్ని మించి 215.7 మీటర్ల ఎత్తున ప్రవాహం వస్తోంది. దీనితో బ్యారేజీ సమీపంలో నిర్మించిన పంపుహౌస్ ప్రమాదం అంచున నిలిచింది. మరో రెండు మీటర్ల ప్రవాహం పెరిగితే పంపుహౌజ్లోకి వరద పోటెత్తే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్గంగ ఉధృతికి భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 10 జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. డొల్లార సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జిని తాకుతూ పెన్గంగ ప్రవహిస్తుండటంతో.. శనివారం రాత్రి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. -
పోలవరం వద్ద పెరుగుతున్న వరద.. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
సాక్షి, ఏలూరు జిల్లా : ఎగువను కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద 32.390 మీటర్ల నీటిమట్టం పెరిగింది. వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్ వే గేట్ల నుంచి 7 లక్షల 43 వేల 352 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే దిగువన 24 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరి వరదల నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 1800 233 1077 జంగారడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 9553220254 కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 7013128597,9848590546 వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 6309254781 తూ.గో. జిల్లా: ధవళేశ్వరంలో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద 10.8 అడుగులకు నీటి మట్టం చేరింది. 8.48 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాల్వలకు 11వేల క్యూసెక్కులు విడుదల చేశారు అధికారులు. చదవండి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ వదలని వాన.. వరదలా.. -
వదలని వాన.. వరదలా..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని నాలుగో రోజూ వానలు ముంచెత్తాయి. రాజధాని హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో పొద్దుమాపు ముసురుపట్టింది. పలుచోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటం, గ్రామాలు జలదిగ్బంధం కావడం, రహదారులపై నీరు చేరడం, ముసురుతో ఇంట్లోంచి బయట అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో జనజీవనం దాదాపు స్తంభించిపోయింది. ఇదే సమయంలో భారీ వర్షాలతో సాగునీటికి కష్టాలు తీరుతాయంటూ రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వారంతా వ్యవసాయ పనులు ముమ్మరం చేయడంలో నిమగ్నమవుతున్నారు. ఇక మరో రెండు రోజుల పాటు వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఒక్కరోజే సగటున 3.45 సెం.మీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా వర్షపాతం నమోదైంది. ఒక్కరోజే సగటున 3.45 సెంటీమీటర్ల వాన పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా మెదక్ జిల్లాలో సగటున 9.46 సెంటీమీటర్లు, జనగామ జిల్లాలో 9.04 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 8.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలే కురిశాయి. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. స్తంభించిన జనజీవనం.. నాలుగు రోజులుగా ముసురుపట్టే ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న రోడ్లు జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాజేడు మండలం టేకులగుడెం వద్ద జాతీయ రహదారి మునిగిపోవడంతో తెలంగాణ–ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముసురు ప్రభావంతో ఓపెన్కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తినిలిచిపోయింది. హైదరాబాద్లో రోజంతా వాన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గురువారం రోజంతా వాన కురిసింది. చాలా కాలనీలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి రోడ్లపై నీళ్లు నిలిచాయి. దీనితో కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ తీగలు తెగడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పదుల సంఖ్యలో పాత ఇళ్లు కూలిపోయాయి. హైదరాబాద్లో అత్యధికంగా మల్కాజిగిరిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం నగరవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏడెనిమిది సెంటీమీటర్లకుపైగానే వాన కురిసింది. ఉప్పొంగిన వాగులు.. రాకపోకలు బంద్ ♦ సంగారెడ్డి జిల్లాలోని ఫతేపూర్– పిట్ల రోడ్డులోని తాత్కాలిక వంతెన తెగిపోయింది. మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నల్లవాగు పొంగి ప్రవహిస్తోంది. ♦ మెదక్ జిల్లా వెల్దుర్తిలో డబుల్ బెడ్రూం ఇళ్లు జలమయం అయ్యాయి. రామాయంపేట– సిద్దిపేట రహదారిపై కోనాపూర్ వద్ద వరద చేరడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఘనపురం వాగు ఉప్పొంగడంతో ఏడుపాయల వనదుర్గ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ♦ సిద్దిపేట జిల్లాలో మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడంతో హన్మకొండ– సిద్దిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ♦ కుమురంభీం జిల్లాలో దహెగాంలో పెద్దవాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. పాటగూడ వాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెన కోతకు గురైంది. ♦ ఉమ్మడి ఖమ్మం జిల్లా టేకులగూడెం సమీపంలో 163 నంబర్ జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట మండలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అధికారులు బారికేడ్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ♦ వరంగల్ నగరంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోటు నుంచి అధిక వర్షపాతానికి.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి నెల రోజులు దాటిపోయినా వానలు సరిగా కురవలేదు. ఇటీవలి వరకు 30శాతానికిపైగా లోటు వర్షపాతం కొనసాగింది. కానీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మారింది. లోటు పూడిపోవడమేగాక 6 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. వానాకాలం సీజన్లో జూలై 20 నాటికి 26.46 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. గురువారం నాటికి 27.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అధికంగా, 21 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదవగా.. మిగతా 5 జిల్లాల్లో మాత్రం కాస్త లోటు ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. మరో రెండు రోజులూ వానలు వాయవ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనమూ ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని.. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు.. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, గోదావరి నది ఉగ్రరూపం దాల్చడం నేపత్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ, తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. భద్రా చలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించు కోవాలని చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం, కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎస్, డీజీపీ సమీక్ష సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్తో కలసి గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, గోదావరి వరద నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని శాంతికుమారి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, సరిపడా మందులు, విద్యుత్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఏవిధమైన సహాయ, సహకారాలైనా రాజధాని నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసు అధికారులతో ఇప్పటికే సమీక్షించామని.. సహాయ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేశామని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెంటనే వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించామని వెల్లడించారు. ‘అవసరమైతే హెలికాప్టర్ సేవలు’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, గోదావరి ఉగ్రరూపం దాల్చడం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. భద్రాచలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. గతంలో వరదల సందర్భంగా సమర్థంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్ను సీఎం ఆదేశించారు. ‘వారం రోజులు నిరసనలు వాయిదా’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు నిరసనలను వారం రోజులు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను భారీ వర్షాల నేపథ్యంలో వారంపాటు వాయిదా వేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అండగా ఉండాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కేటీఆర్ కోరారు. -
వరద గోదారి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, దాని ఉప నదులు జలకళ సంతరించుకున్నాయి. ఎగు వన గోదావరిలోకి ప్రవాహాలు పెరుగుతుండగా.. కాళేశ్వరం దిగువన ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదులు, వాగుల నీటి చేరికతో నది ఉగ్రరూపం దాల్చుతోంది. మేడిగడ్డ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. దీనితో అధికారులు గురువారం మధ్యాహ్నమే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక్క గురువారం రాత్రి 8 గంటల సమయానికి 9,79,347 క్యూసెక్కుల ప్రవాహంతో వరద నీరు 44.1 అడుగులకు చేరింది. శుక్రవారం తెల్లవారు జాము సమయానికి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక అయిన 48 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రా లకు తరలిస్తున్నారు. ఇక ఎగువ గోదావరిలోనూ వరద పెరిగింది. మహారాష్ట్రలో, రాష్ట్రంలోని పరీ వాహక ప్రాంతంలో వానలతో శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి 59,165 క్యూసెక్కుల వరద చేరుతోంది. వచ్చిన వరద వచ్చినట్టుగానే.. ప్రాణహితలో వరద ఉధృతి పెరుగుతోంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోకి చేరుతున్న 5,37,140 క్యూసెక్కులను వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు దిగువన ఇంద్రావతి జలాలు తోడై సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీలోకి 8,76,940 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ మొత్తాన్నీ విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, కిన్నెరసాని సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు దాదాపు గరిష్ట మట్టానికి చేరగా.. తాలిపేరు 24 గేట్లు ఎత్తి 1,02,399 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వీటితోపాటు శబరి జలాలు కూడా కలసి గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. దీనితో కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం సబ్ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం భద్రాచలం రానున్నారు. వరద మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. పోలవరానికి పెరిగిన వరద భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి గోదా వరి ప్రవాహం పెరిగింది. గురువారం రాత్రి ఏడు గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 5,99,490 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 48 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నీటి మట్టం స్పిల్వే ఎగువన 31.88 మీటర్లు, దిగువన 23.3 మీటర్లుగా.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 32.55 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 22.73 మీటర్లుగా నమోదైంది. పోలవరం నుంచి నీరంతా ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ, మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత గోదావరి, దాని ఉప నదుల పరీవాహక ప్రాంతంలో గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గోదావరితోపాటు ఉప నదులు, వాగుల ప్రవాహాలతో ప్రభావం పడేచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా ఉప నదులకూజలకళ మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణా నది ఉప నదుల్లోనూ వరద ప్రారంభమైంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి 32,146 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి నిల్వ 32.24 టీఎంసీలకు చేరింది. ఆ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 97 టీఎంసీలు అవసరం. దీని దిగువన ఉన్న నారాయణ పూర్ డ్యామ్లోకి ఇంకా వరద మొదలవలేదు. ఇక కృష్ణా ఉపనది మలప్రభ నుంచి మలప్రభ ప్రాజెక్టులోకి 10,437 క్యూసెక్కులు, ఘటప్రభ ఉప నది నుంచి ఘటప్రభ ప్రాజెక్టులోకి 20,813 క్యూసెక్కులు వరద వస్తోంది. భద్ర నది నుంచి భద్ర రిజర్వాయర్లోకి 4,227 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి తుంగభద్ర డ్యామ్లోకి 9,536 క్యూసెక్కులు ప్రవాహాలు ఉన్నాయి. బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులోకి 12,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండితే ప్రధాన కృష్ణా నదిలోకి వరద మొదలుకానుంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. నెలాఖరు నాటికి ప్రధాన నదిలో ప్రవాహాలు పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు. కాగా, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో వానలతో కృష్ణా ఉప నది అయిన మూసీలో వరద ఉధృతి పెరిగింది. మూసీ ప్రాజెక్టులోకి 2,125 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి 1,800 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. -
ప్రమాద స్థాయిలో.. భద్రాద్రి గోదావరి!
భద్రాచలం: తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నమే నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ ఎ.ప్రియాంక వరద తీవ్రత, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పొంగి పొర్లుతున్న ఉపనదులు.. ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి బుధవారం 5.20 లక్షల క్యూసెక్కులు, గురువారం మధ్యాహ్నం 6.20 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరదను దిగువకు వదిలారు. దీనికి ఇంద్రావతి నుంచి వస్తున్న సుమారు నాలుగు లక్షల క్యూసెక్కుల జల ప్రవాహం జతవుతోంది. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజాము వరకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 48 అడుగులకు చేరుకోవచ్చని అధికారుల అంచనా. ప్రవాహం ఇలాగే కొనసాగితే నేటి సాయంత్రానికి 53 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉంటేనే నష్ట నివారణ గోదావరి నీటిమట్టం గతేడాది అత్యధికంగా 71.3 అడుగులకు చేరి బీభత్సం సృష్టించడంతో.. అధికారులు ఈ ఏడాది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జూలై ప్రారంభంలోనే జిల్లా, డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి మండల, డివిజన్ స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక దాటితే ఏజెన్సీలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి. భద్రాచలం నుంచి ఇతర మండలాలకు రాకపోకలు స్తంభిస్తాయి. ప్రధానంగా దుమ్ముగూడెం మండలం తూరుబాక, రేగుపల్లి, నడికుడి, గంగోలు, బైరాగులపాడు గ్రామాల వద్ద, చర్ల మండలం కుదునూరు, సుబ్బంపేట గ్రామాల వద్ద ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, నెల్లిపాక, కూనవరం మండలాలకు సైతం పూర్తిగా రవాణా స్తంభిస్తుంది. పునరావాస శిబిరాలు సిద్ధం వరద తీవ్రత పెరిగితే బాధితులను తరలించేందుకు ముందుగానే పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. మండలానికో ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా బఫర్ స్టాక్ ఉంచారు. ప్రజలను తరలించేందుకు ట్రాక్టర్లు, జేసీబీలు, లైఫ్ జాకెట్లు, పడవలను సిద్ధంగా ఉంచారు. నేడు మంత్రి పువ్వాడ రాక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. శుక్రవారం ఆ స్థాయికి వరద వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలంలో మకాం వేయనున్నారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఆయన ఇక్కడే ఉంటారు. మంత్రితో పాటు ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ అనుదీప్ సైతం ప్రత్యేక సేవలు అందించేందుకు ఇక్కడికి వస్తున్నారు. గతేడాది 71 అడుగుల స్థాయికి వరద వచ్చినా, ప్రాణ నష్టం జరగకుండా వీరిద్దరూ పక్కా ప్రణాళికతో పని చేశారు. దీంతో ఈసారి వరద సహాయ కార్యక్రమాల కోసం మరోసారి భద్రాచలం వస్తున్నారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద
సాక్షి, రాజమహేంద్రవరం: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉపనదులైన ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరులో వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరిలోకి వరద పెరుగుతోంది.పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31.050 మీటర్లకు నీటిమట్టం పెరిగింది.వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్వే గేట్ల నుంచి 3 లక్షల15 వేల791 క్యూసెక్కుల వరద నీటినిదిగువకు విడుదల చేశారు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం సాక్షి, విశాఖపట్నం: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. గురువారం నాటికి ఇది వాయవ్య బంగాళాఖా తం, దాని సరిహద్దులో ఉన్న పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. ఈ ఫలితంగా గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి వర్షాల ఉద్ధృతి పెరగనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని తెలిపింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వాన లోటు తీరినట్టే!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: : రాష్ట్రమంతటా మూడు రోజులుగా వాన ముసురుకుంది. మరో రెండు రోజులూ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెలరోజులైనా వానలుపడక నెలకొన్న లోటు అంతా తీరిపోతోంది. నాలుగైదు రోజుల కిందటి వరకు ఏకంగా 20 శాతం వరకు లోటు వర్షపాతం ఉండగా.. బుధవారానికి ఇది ఐదు శాతానికి తగ్గింది. నైరుతి సీజన్లో ఏటా ఈ సమయం వరకు 25.7 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 24.48 సెంటీమీటర్లకు చేరింది. మరో రెండ్రోజులు వానలు కొనసాగే అవకాశం ఉండటంతో లోటు పూర్తిగా భర్తీ అవుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. 3 జిల్లాల్లో అధికంగా, 23 జిల్లాల్లో సాధారణ, 7 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ♦ అధిక వర్షపాతం నమోదైన జిల్లాలు: సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ ♦ సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు: ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ములుగు, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి ♦ లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు: మహబూబాబాద్, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాలు, ఉత్తర ఏపీ తీరం, దక్షిణ ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని వల్ల వచ్చే 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని తెలిపింది. గోదావరిలో పెరిగిన వరద మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణలోని పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో.. గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు పరవళ్లు తొక్కుతున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలోకి ప్రాణహిత నుంచి 5,41,430 క్యూసెక్కుల వరద వస్తుండగా.. గేట్లు ఎత్తి 5,25,250 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దీనికి ఇంద్రావతి వరద తోడై సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీలోకి 6,53,170 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత శబరి, ఇతర వాగుల ప్రవాహాలు కలిసి గోదావరి వరద పోలవరం వైపు పరుగుపెడుతోంది. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 11 గంటలకు గోదావరి వరద 35.07 అడుగులకు చేరింది. వానలు కొనసాగుతుండటంతో ప్రవాహం భారీగా పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఎగువ గోదావరిలోనూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 33,760 క్యూసెక్కుల వరద వస్తోంది. నీటి నిల్వ 33.34 టీఎంసీలకు చేరింది. వానతో ఏజెన్సీ ప్రజల తిప్పలు ఎడతెరిపి లేని ముసురు, వానలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహించి, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు నెలలు నిండిన గర్భిణులను సమీపంలోని సామాజిక ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు. వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగపేట మండలంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. వెంకటాపురం(కె) మండలంలో నిర్మించిన పాలెం ప్రాజెక్టు ప్రధానకాల్వకు ఒంటిమామిడి గ్రామ సమీపంలో గండి పడింది. గ్రావిటీ కాల్వకు మరమ్మతులేవి! కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గ్రావిటీ కాల్వ వర్షాలతో కోతకు గురై కూలుతున్నా.. మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత ఏడాది జూలై 14న భారీవర్షాలతో కాల్వ పొడవునా అక్కడక్కడా సిమెంట్ లైనింగ్ కోతకు గురైంది. ప్రస్తుతం రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ నుంచి వరదనీరు వచ్చి మరింత మట్టి కొట్టుకువస్తోంది. కొట్టుకు వచ్చిన మట్టితో పాటు వరద నీరు మొత్తం గ్రావిటీ కాల్వలోకి చేరుతోంది. ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో కాల్వ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. -
కరుణించిన వరుణుడు
సాక్షి నెట్వర్క్: గత కొన్ని రోజులుగా రాష్ట్రానికి ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. ఆందోళనలో ఉన్న అన్నదాతను ఆనందంలో ముంచెత్తుతూ ఎండుతున్న చేలకు ఊపిరి పోశాడు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి రాత్రి దాకా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఇన్ని రోజులు బోసిపోయిన చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. వాగులు, వంకలు వరదతో ఉరకలెత్తుతున్నాయి. పలుచోట్ల వాగులు అలుగుపారుతున్నాయి. వివిధ ప్రాజెక్టుల్లోకి క్రమంగా ప్రవాహాలు చేరుతున్నాయి. వాగుల్లో వరద ఉధృతి: ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి–చెల్పాక గ్రామానికి మధ్యలో ప్రవహిస్తున్న దయ్యాలవాగు (జంపన్నవాగు)తోపాటు వెంకటాపురం (కే) మండలంలోని కంకలవాగు, రాచపల్లి వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కన్నాయిగూడెం మండలంలోని దొంగలగుట్ట వాగు రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోంది. అదేవిధంగా ఏడాగుల కలయికతో హనుమంతుని వాగు పొంగి పొర్లుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆవతలి వైపున ఉన్న వివిధ గూడేల్లోని గర్భిణులను ముందస్తుగా ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణహిత పరవళ్లు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న ప్రాణహిత నది గోదావరితో కలిసి పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం సాయంత్రం కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్ను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. తడిసి ముద్దయిన ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు 8.2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. కుమురం భీం (ఆడ) ప్రాజెక్టులో ఒక గేటును 0.10 మీటర్ల మేర పైకెత్తి 208 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.629 టీఎంసీల నీరుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, భీమ్గల్, సిరికొండ, నవీపేట్, తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కమ్మర్పల్లి మండలంలో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి పట్టణం నుంచి రాజంపేట మండలం మీదుగా మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డుపై కొండాపూర్ శివారులో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా తాత్కాలికంగా వేసిన రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద కొడప్గల్ మండలంలో పోచారం గ్రామానికి వెళ్లే రోడ్డుపై ఉన్న కాజ్వేపై భారీగా వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడండి: సీఎస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. -
గోదావరిలో 3,396.9 టీఎంసీల లభ్యత
సాక్షి, హైదరాబాద్: గోదావరి జల వివాదాల (బచావత్) ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే నాటికి గోదావరిలో మొత్తం 4,535.1 టీఎంసీల లభ్యత ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా అంచనా వేసింది. ఇక 75 శాతం లభ్యత ఆధారంగా గోదావరిలో 3,396.9 టీఎంసీల లభ్యత ఉందని తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీల లభ్యత ఉందని 2004లో వ్యాప్కోస్ తేల్చగా.. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా 1,435 టీఎంసీల లభ్యత ఉందని తేల్చింది. వ్యాప్కోస్ అంచనా వేసిన దానికంటే ఐదు టీఎంసీలు అధికంగా ఉన్నట్లు తేల్చింది. నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో 1941–42 నుంచి 1979–80 వరకూ వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా గోదావరిలో నీటి లభ్యతపై తాజాగా సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. గోదావరిలో ఉప నదీ పరీవాహక ప్రాంతాల(సబ్ బేసిన్) వారీగా నీటి లభ్యత, బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను తేల్చింది. ఈ అధ్యయనం ప్రకారం ఉమ్మడి మధ్యప్రదేశ్కు 679.6, మహారాష్ట్రకు 951, కర్ణాటకకు 37.8, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1,435, ఒడిశాకు 293.6 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినట్లు అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ)కు సీడబ్ల్యూసీ ఇటీవల సమర్పించింది. ఈ నివేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలను జీఆర్ఎంబీ కోరింది. తాజా అధ్యయన నేపథ్యం ఇదీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలోని గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీల (70 టీఎంసీల పునరుత్పత్తి జలాలు) 2004లో వ్యాప్కోస్ తేల్చింది. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు 1,238.46 టీఎంసీలు (902.46 నికర, 336 మిగులు) అవసరమని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం అనేక సందర్భా లలో స్పష్టం చేసింది. ఇక తెలంగాణ సర్కార్ కూడా ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రా జెక్టులకు 1,767 టీఎంసీలు (967 నికర, 800 మిగులు) అవసరమని తెలిపింది. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటే 3,005.46 టీఎంసీలు అవసరం. ఈ నేపథ్యంలో.. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి, 2 రాష్ట్రాలకు కేటాయింపులు చేశాకే.. కొత్త ప్రాజెక్టులకు అనుమతివ్వాలని జనవరి 3న జరిగిన సర్వసభ్య సమావేశంలో గోదావరి బోర్డును రెండు రాష్ట్రాలు కోరాయి. గోదావరిలో సబ్ బేసిన్ల వారీగా నీటి లభ్యతను తేల్చకుండానే.. అప్పట్లో రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ జలాలను పంపిణీ చేసింది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చా లని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అటు కేంద్ర జల్ శక్తి శాఖను.. ఇటు గోదావరి బోర్డును కోరుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే నాటికి గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. నివేది క ఇవ్వాలని గత జనవరి 19న సీడబ్ల్యూసీకి గోదావరి బోర్డు లేఖ రాసింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా.. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద పురుడుపోసుకునే గోదావరి 1,465 కిలోమీటర్ల పొడవున ప్రవహించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో 3,12,150 చ.కి. మీ. పరిధిలో ఈ నదీ పరీవాహక ప్రాంతం ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం. గోదావరి జలాలను బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ 1980, జూ లై 7న బచావత్ ట్రిబ్యునల్ కేంద్రానికి నివేదిక ఇచ్చి ంది. అదే ఏడాది ఆ అవార్డును కేంద్రం అమల్లోకి తెచ్చి ంది. ఈ నేపథ్యంలో 1941–42 నుంచి 1979–80 వరకూ అంటే 40 ఏళ్లు గోదావరి బేసిన్లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తాజాగా అధ్యయనం చేసింది. -
ఏకాభిప్రాయం లేకున్నా ముందుకే!
సాక్షి, అమరావతి: గోదావరి – కావేరి నదుల అను సంధానంపై వాటి పరివాహక ప్రాంతాల (బేసిన్) పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలకు విరుద్ధంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. అనుసంధానం ప్రతిపాదనపై రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, వచ్చే నెల 11న నిర్వహించనున్న 71వ పాలక మండలి సమావేశం అజెండాలో గోదావరి – కావేరి అనుసంధానం ఒప్పందాన్ని ఎన్డబ్ల్యూడీఏ చేర్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంద్రావతి సబ్ బేసిన్లో బచావత్ ట్రిబ్యునల్ తమకు చేసిన కేటాయింపుల్లో వాడుకోని నీటిలో 141.3 టీఎంసీలను కావేరికి ఎలా తరలిస్తారని ఎన్డబ్ల్యూడీఏను ఛత్తీస్గఢ్ సర్కార్ ఇప్పటికే నిలదీసింది. తమను సంప్రదించకుండా తమ కోటా నీటిపై ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోకుంటే న్యాయస్థానంలో సవాల్ చేస్తామని స్పష్టం చేసింది. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి లభ్యతలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా నీటి లభ్యతను తేల్చాకే అనుసంధానాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఒప్పందాన్ని ఎన్డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశం అజెండాలో చేర్చడంపై నీటి పారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యత తేల్చకుండానే గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించాలని కేంద్రం నిర్ణయించింది. అకినేపల్లి (వరంగల్ జిల్లా) నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2019 ఫిబ్రవరిలో ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు 80 టీఎంసీల చొప్పున కేటాయించి ఆవిరి, ప్రవాహ నష్టాలుపోను మిగిలిన నీటిని కర్ణాటకకు ఇవ్వాలని ప్రతిపాదించింది. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరికి గోదావరి జలాలను తరలించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సూచించడంతో ఎన్డబ్ల్యూడీఏ 2021లో మరో ప్రతిపాదన చేసింది. కావేరికి గోదావరి జలాలను తరలించే ప్రాంతాన్ని అకినేపల్లి (వరంగల్ జిల్లా) నుంచి ఇచ్చంపల్లి (జయశంకర్ భూపాల్పల్లి జిల్లా)కి మార్చింది. ఇచ్చంపల్లి వద్ద ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు అదనంగా 106 టీఎంసీల వరద జలాలను జతచేసి.. నాగార్జున సాగర్, సోమశిల మీదుగా కావేరికి తరలించేలా ప్రతిపాదించింది. దీనిపై తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. నికర జలాలు, వరద జలాలను ఎలా వర్గీకరిస్తారని ప్రశి్నంచాయి. తమ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని అభ్యంతరం చెప్పడంతో ఎన్డబ్ల్యూడీఏ మళ్లీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. కనీసం ఛత్తీస్గఢ్ను సంప్రదించకుండానే ఛత్తీస్గఢ్కు ఇంద్రావతి బేసిన్లో కేటాయించిన నీటిలో వాడుకోని 141.3 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్లోకి ఎత్తిపోసి సాగర్ కుడి కాలువకు సమాంతరంగా తవ్వే కాలువ ద్వారా సోమశిల, కండలేరుకు తరలించి అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తీసుకెళ్లేలా తాజాగా ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోను ఆంధ్రప్రదేశ్కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది. ఈ క్రమంలో నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్్కఫోర్స్ కమిటీ ఛత్తీస్గఢ్ సర్కార్ను సంప్రదించకుండానే బేసిన్లోని మిగతా రాష్ట్రాలతో మార్చి 6న హైదరాబాద్లో సమావేశాన్ని నిర్వహించింది. ఛత్తీస్గఢ్ను సంప్రదించకపోవడంపై అన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ లేదా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఛత్తీస్గఢ్ సర్కారుతో ఈ అంశంపై చర్చిస్తారని టాస్్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరాం ఆ సమావేశంలో పేర్కొన్నారు. కానీ.. ఇప్పటివరకూ ఛత్తీస్గఢ్ను కేంద్రం సంప్రదించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఏకంగా అనుసంధానంపై ఒప్పందాన్ని అజెండాగా చేర్చుతూ ఎన్డబ్ల్యూడీఏ సమావేశం ఏర్పాటు చేసింది. -
ముందుంది ముప్పు.. కావాలి కనువిప్పు..!
ఆక్రమణలతోనే రాజీవ్ రహదారిపై వరద జిల్లాలోని తుర్కలమద్దికుంట, చందపల్లి గ్రామాల కుంటలు, ఎల్లమ్మచెరువు, భోజన్న చెరువు, లింగరాయకుండ, దొబ్బరివాగు, పట్టణంలోని మురుగు వరద అంతా రంగంపల్లి ఒర్రె ద్వారా ప్రవహించి చీకురాయి చెరువు మీదుగా హుస్సేన్మియా వాగులో కలుస్తుంది. అయితే జిల్లాకేంద్రం కావటంతో ఆక్రమణలు చోటుచేసుకోవటంతో ఒర్రె ప్రవాహించే ప్రాంతం కుచించుకుపోయి, వరద పోటెత్తి రాజీవ్రహదారిపైకి చేరింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. తాత్కాలిక చర్యలతోనే సరిపెట్టడంతో వర్షాకాలంలో మరోసారి వరద రోడ్డెక్కెందుకు అవకాశం ఉందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ జిల్లావాసులకు.. ముఖ్యంగా గోదావరిఖని, మంథని పట్టణ వాసులకు కొత్తసమస్య తెచ్చిపెట్టింది. గతేడాది భారీగా కురిసిన వర్షాలతో వరదలు వచ్చి రామగుండం, మంథనిలో పలు కాలనీలు పూర్తిగా నీటమునిగిపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అదే సమస్య మళ్లీ పునరావృతం అయ్యే అవకాశాలున్నాయి. ఏటా వరద ముంచెత్తుతున్నా.. పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గుణపాఠం నేర్చి.. ముంపు నుంచి రక్షించే చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంతో రామగుండం ప్రాంతానికి ముప్పు ఉందని ల్యాడర్ సర్వేలో తేలటంతో గోదావరి ఒడ్డున సుమారు 8 కిలోమీటర్ల మేర సుందిళ్ల గ్రామం వరకు కరకట్ట నిర్మించి వదిలేశారు. రామగుండం వరకు మరో 5కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించేందుకు రూ.110 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. నిధుల మంజూరు కోసం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో అ వి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. గతేడాది వరదలలో మల్కాపూర్, సప్తగిరికాలనీ, ప్రశాంత్నగర్, రెడ్డికాలనీ, రఘుపతిరావ్నగర్ ముంపునకు గురయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఎలంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఈ ఏడాది కూడా భారీ వర్షాలు కురిస్తే భారీ నష్టం తప్పదని స్థానికులు అంటున్నారు.భారీ వర్షాలతో వచ్చిన వరద బొక్కలవాగు ద్వారా గోదావరిలో చేరాల్సి ఉంది. అయితే అప్పటికే గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో బొక్కలవాగు నీరు వెనక్కివెళ్లి నాలాల ద్వారా పట్టణాన్ని ముంచెత్తింది. దీంతో బొక్కలవాగు, మర్రివాడ, వాగు గడ్డ, బోయినిపేట, లైన్గడ్డ, దొంతులవాడ, భగత్నగర్, చాకలివాడ, మంగలివాడ, దుబ్బగూడెం, ఎస్సీకాలనీ, అంబేద్కర్నగర్ తదితర పట్టణప్రాంతాలు నీటమునిగాయి. అకస్మాత్తుగా వచ్చిన వరద వల్లే పట్టణం మునిగిందని, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందని, ఏటా భారీ వరదలు వచ్చే అవకాశం ఉండదని యంత్రాంగం భావిస్తోంది. కానీ.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరకట్ట లేక నీటమునిగి ప్రవాహం తాళలేక వెనక్కి గతేడాది భారీగా కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. దీంతో జిల్లాలోని పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటితోపాటు ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన భారీ వర్షాలకు ఎల్లంపల్లికి వరద రికార్డుస్థాయిలో వచ్చింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదలడంతో సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఆ బ్యాక్వాటర్తో గోదావరి పరీవాహక ప్రాంతంలోని గోదావరిఖని, మంథని పట్టణం పూర్తిగా నీటమునిగాయి. -
మంచిర్యాల జిల్లాలో అక్రమ ఇసుక రవాణా
జిల్లా కేంద్రంలోనూ... జిల్లా కేంద్రంలో గోదావరి రోడ్డు, పాత మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచి తెల్ల వారు జామున, రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గోదావరి రోడ్డు కాలనీ వాసులు కొందరు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తెల్లవారు జామున కూలీలతో ఇసుకను ట్రాక్టర్లలో నింపుతూ పట్టణంలో నిర్మాణాలు జరిగే ప్రాంతానికి చేరవేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిపై పోలీసులు, గనుల శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అయినా జరిమానాలు కట్టి అక్రమ రవాణా సాగిస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు గోదావరి పుష్కరఘాట్ నుంచి నేరుగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. చెన్నూరు పట్టణం, హాజీపూర్, వేంపల్లి, గుడిపేట గోదావరి తీరాల నుంచి గ్రామాల్లోనూ ఇసుక రవాణా జరుగుతోంది. దండేపల్లి మండలం కాసిపేట గోదావరి తీరంలో బ్యాక్ వాటర్ తగ్గినప్పుడల్లా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు గోదావరి తీరం వెంట నిఘా ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గోదావరిలో ఇసుక ఖాళీ అవుతోంది. నగదుగా మారి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. జిల్లాలోని నదీ తీర గ్రామాల్లో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భారీ యంత్రాలను నదిలో దించి ఇసుకను తోడుకుపోతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతేడాది అధిక వర్షాలతో దొరకని ఇసుక.. గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి వరకు మండు వేసవిలోనూ నది నిండుగా ఉంది. దీంతో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. స్థానిక అవసరాల కోసం హాజీపూర్ మండలం వేంపల్లిలో అధికారులు ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు. అయితే వర్షాలు కురిసి నీరు రావడంతో అక్కడ ఇసుక తీయడం లేదు. జిల్లాలో గోదావరి పొడవునా ఇసుక లభించని పరిస్థితి నెలకొంది. అవసరం మేరకు అనుమతి.. ఈ క్రమంలో టీఎస్ఎండీసీ(తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) అవసరం మేరకు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తోంది. కాళేశ్వరం ముంపు ప్రాంతంగా ఉన్న నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుక మేటలు తోడేందుకు గతేడాది మార్చిలో టెండర్లు పిలిచి కొత్త అగ్రిమెంట్లు చేశారు. ఇందులో కొన్ని పట్టాభూముల్లో ఉన్నాయి. ఇక కోటపల్లి మండలం కొల్లూరులో మాత్రమే ప్రస్తుతం ఒక ఇసుక రీచ్ నడుస్తోంది. దూర భారంతో రీచ్కు రాని లారీలు.. అయితే కొల్లూరు రీచ్ దూరంగా ఉండడంతో హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల వారికి ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లడానికి లారీలు రావడం లేదు. ఎండ తీవ్రత కూడా రవాణాకు ఆటంకంగా మారుతోంది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు మాత్రం ఇక్కడి నుంచే ఇసుక రవాణా జరుగుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం పగటిపూటనే ఇసుక రవాణా చేయాలి. ‘అదనపు’ బకెట్ దందా... ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇచ్చిన కొల్లూరు క్వారీలో యథేచ్చగా అదనపు బకెట్ దందా కొనసాగుతూనే ఉంది. వినియోగదారులు టీఎస్ఎండీసీ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్న క్యూబిక్ మీటర్ల మేరకు లారీల్లో ఇసుక నింపాలి. అయితే కాంట్రాక్టర్లు, జేసీబీ ఆపరేటర్లు, అక్కడి సిబ్బందిని మేనేజ్ చేస్తూ లారీల్లో జేసీబీ అదనపు బకెట్ ఇసుక నింపుతున్నారు. అదనంగా పోసిన ఇసుకకు డబ్బులు అక్కడే వసూలు చేస్తున్నారు. చలానా రూపంలో కట్టినవి మాత్రం టీఎస్ఎండీసీకి జమ అవుతున్నాయి. అదనపు బకెట్ ఇసుకతో వాహన పరిమితి మించి ఓవర్లోడ్తో ఇసుక లారీలు వెళ్తున్నాయి. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో కట్టిన చలానా ప్రకారమే వేబ్రిడ్జిలో ఇసుక తూకం వేయాలి. అయితే ఈ నిబంధనలేమి అమలు కావడం లేదు. రీచ్ వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అదనపు బకెట్ దందా ఆగడం లేదు. రోజూ పరిమితి మించి గోదావరి నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఓవర్లోడ్తో వెళ్తున్న లారీలతో చెన్నూరు, జైపూర్, ఇందారం వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ‘సాక్షి’లో కథనం రావడంతో టీఎస్ఎండీసీ అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేశారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో మళ్లీ అదనపు బకెట్ దందా ఊపందుకుంది. -
గోదావరికి జనాహారతి ఇచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి
-
ఆగిన ‘సీతమ్మ సాగర్’ పనులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరిపై చేపట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. సీతమ్మ సాగర్ నిర్మాణ పనులకు సంబంధించి అభ్యంతరాలను లేవనెత్తుతూ కొందరు వేసిన పిటిషన్పై గ్రీన్ ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏమైనా పనులు జరుగుతున్నాయా? లేదా ? అనే అంశాలను ద్విసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. దీంతో బ్యారేజీ నిర్మాణ పనులు నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పని ప్రదేశం నుంచి కొంత మిషనరీ, కార్మికులను వెనక్కి రప్పించింది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు నిలిపివేయనుంది. బాధితుల ఫిర్యాదుతో.. గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సీడబ్ల్యూసీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి పొందేందుకు తుది డీపీఆర్ను సిద్ధం చేశారు. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమైన వేసవికాలం వృధా కాకూడదనే ఉద్దేశంతో బ్యారేజీ అనుబం«ధ పనులు కొనసాగిస్తూ వచ్చారు. దీంతో బాధితులు మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. పనులకు సంబంధించి కొన్ని ఫొటోలను సైతం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్), గోదావరి బోర్డులో ఎస్ఈ ర్యాంక్కు తక్కువ కాని వారు సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. సభ్యుల ఎంపిక పూర్తయిన తర్వాత కమిటీ జూన్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది. జూలై 12లోగా ఈ కమిటీ తమ నివేదికను అందించాల్సి ఉంటుంది. ఆ ముద్ర పడకూడదని.. తెలంగాణాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తోందనే ఆరోపణలు మొదట్నుంచీ ఉన్నాయి. ముఖ్యంగా ‘సీతారామ’డిజైన్ల విషయంలో కోర్రీల మీద కొర్రీలు వేస్తూ వస్తోంది. ఈ సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే ముద్ర పడటం మంచిది కాదనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే బ్యారేజీ, కరకట్టల దగ్గర జరుగుతున్న పనులు ఆపేయాలంటూ నిర్మాణ సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వివరణ కోసం సీతారామ ఇంజనీర్లను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఏప్రిల్లో స్టే.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది. అయితే బ్యారేజీ నిర్మాణం కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయనే ఆందోళన నెలకొంది. మరోవైపు నష్టపరిహారం సైతం తగు మొత్తం చెల్లించడం లేదంటూ రైతులు నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు బాధితుల్లో కొందరు సరైన అనుమతులు తీసుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు చేస్తున్నారంటూ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 26న గ్రీన్ ట్రిబ్యునల్ పనులపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
బాసర నుంచి భద్రాచలానికి లాంచీ!
మంథని: గోదావరి పరీవాహక తీర ప్రాంత కేంద్రాలను పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం (ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా)లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నిత్యం నిండుకుండలా ఉంటోంది. అంతేకాకుండా తీరం వెంట పచ్చని అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలు కొలువై ఉన్నాయి. ఇవి యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వరకు గోదావరి నదిపై పర్యాటకం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా లాంచీలు నడిపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బాసర నుంచి భద్రాచలం వరకు.. గోదావరి తీరం వెంట నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్లలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు, మంథని తీరంలో గౌతమేశ్వర, రామాలయం, మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, భద్రాద్రి రామాలయంతోపాటు అనేక శివాలయాలు, ఇతర దేవతల పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. జలమార్గంలో ప్రయాణిస్తూ వీటన్నిటినీ దర్శించుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారని అధికారులు అంటున్నారు. తీరం వెంట అడవి అందాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల బ్యారేజీలు చేపట్టారు. ఈ బ్యారేజీలు, పంపుహౌస్ల సందర్శనకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి బ్యారేజీల వద్ద పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. అలాగే గోదావరి తీరం వెంట ఉన్న అడవులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇవి యాత్రికులను ఆకట్టుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి ఆదాయం గోదావరి తీరం వెంట పర్యాటకం అభివృద్ధి చేయడం ద్వారా పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శన పెరగనుంది. యాత్రికుల రాకవల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కాళేశ్వరం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెనతోపాటు బ్యారేజీ, ఇతర వంతెనలు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా రాకపోకలు సైతం పెరిగి.. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గోదావరిలో స్టీమర్లు, లాంచీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని కూడగట్టవచ్చని భావిస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న మంథని వాసులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఆహ్లాదం పంచాలనే ఆలోచనతో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంథని వద్ద గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే ఆయన ప్రకటన కూడా చేశారు. దీనికోసం ఆయన సీఎం కేసీఆర్తోపాటు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రిని త్వరలో కలసి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంను కలుస్తాం.. గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని త్వరలోనే సీఎం కేసీఆర్తోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలుస్తాం. యాత్రికుల సందర్శనతో ఈ ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. - కొండేల మారుతి విద్యార్థి యువత వ్యవస్థాపకుడు, మంథని ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు గోదావరి నది తీరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు, సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర దేశాల్లో నివాసం ఉండే మంథని వాసులు ఇక్కడికి వస్తే.. సేదతీరేందుకోసం కోనసీమను తలపించేలా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. చిన్న పిల్లల కోసం పార్కులు, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. - పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ -
గోదావరిలో పడవ బోల్తా ..ఇద్దరు గల్లంతు
సాక్షి, ఆచంట: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం బీమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. పడవ బొల్తా పడటంతో ఇద్దరు గల్లంతయ్యారు. అధిక కొబ్బరి లోడుతో పడవ వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతయిన బాధితులు వల్లురూ గ్రామనికి చెందిన కుడిపుడి పెద్దిరాజు(58), దొడ్డిపట్ల గ్రామానికి చెందిన సిరగం వెంకటన రమణ(35)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేపట్టారు. సామార్థ్యానికి మించి కొబ్బరి కాయల లోడు ఎక్కించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పడవలో మొత్తం ఐదుగురు ఉన్నారని అందులో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. (చదవండి: సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధత) -
ఇద్దరిని బలిగొన్న సెల్ఫీ సరదా
బాల్కొండ: నీటి అంచున సెల్ఫీ దిగాలన్న ఓ యువకుడి సరదా అతనితో పాటు మరొకరిని బలిగొన్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాణి పేట్కు చెందిన అబ్దుల్ ఫహీం (50) తన మరదలు కుమారుడు అబ్దుల్ బార్ (23), తన కుమారుడు అబ్దుల్ సాద్తో కలిసి బుధవారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. ప్రాజెక్ట్ దిగువన ఎస్కే ప్ గేట్ల వద్ద గోదావరిలోకి దిగారు. అక్కడ నీటి అంచున అబ్దుల్ బార్ సెల్ఫీ తీసుకోడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ఇది గమనించిన అబ్దుల్ ఫహీం.. అతన్ని రక్షించేందుకు నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయా రు. ఒడ్డుపై నుంచి వీరిని చూస్తున్న అబ్దుల్ సాద్ గట్టిగా కేకలు వేశాడు. స మీపంలో ఉన్న మత్స్యకారులు వచ్చేలోపు ఇద్ద రూ నీటిలో పూర్తిగా ము నిగి పోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా నీట మునిగిన చోటనే సాయంత్రానికి ఇద్దరి మృత దేహాలూ లభ్యమయ్యాయి. -
కావేరికి ‘గోదారే’!
సాక్షి, అమరావతి : గోదావరి–కావేరి అనుసంధానానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఛత్తీస్గఢ్ సర్కార్ అంగీకరించకున్నా.. ఆ రాష్ట్ర వాటాలో వాడుకోని 141.3 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించడాన్ని వారు తప్పుపడుతున్నారు. మా నీళ్లను కావేరికి ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్గఢ్ సర్కార్ అభ్యంతరం తెలపడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ 141.3 టీఎంసీలపై ఛత్తీస్గఢ్ సర్కార్ హక్కులను వదులుకోవడానికి అంగీకరించినా ఆ జలాలను కావేరికి తరలించడానికి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని స్పష్టంచేస్తున్నారు. ఛత్తీస్గఢ్ వదులుకున్న 141.3 టీఎంసీలను పునఃపంపిణీ చేయాలని గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలు ట్రిబ్యునల్ను ఆశ్రయించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ మొహిలే చెబుతున్నారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల మిగులు జలాలను జతచేసి.. 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2018లో ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదన రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు తలా 80 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించారు. ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం.. గోదావరి–కావేరి అనుసంధానానికి ఎన్డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనపై ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 106 టీఎంసీలను ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో గోదావరి–కావేరి అనుసంధానంలో ఎన్డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా డీపీఆర్ను రూపొందించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు అందిస్తామని పేర్కొంది. దీనిపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో గత మార్చి 6న టాస్క్ఫోర్స్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ఛత్తీస్గఢ్ అభ్యంతరం చెబుతున్నా.. టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్వహించిన ఈ సమావేశానికి ఛత్తీస్గఢ్ సర్కార్ను ఆహ్వానించలేదు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తావిస్తూ.. ఛత్తీస్గఢ్ సర్కార్ను ఆహ్వానించకుండా, ఆ రాష్ట్ర కోటా నీటి తరలింపుపై ఎలా చర్చిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రశ్నించాయి. ఛత్తీస్గఢ్ సర్కార్తో ఉన్నతస్థాయిలో చర్చించి.. ఆ రాష్ట్ర కోటా నీటిని తరలించడానికి అంగీకరింపజేస్తామని కమిటీ చెప్పుకొచ్చింది. కానీ, ఇది ఆచరణ సాధ్యంకాదని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ మొహిలే స్పష్టంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ కేటాయించని జలాలపై పూర్తి హక్కు తమకుందని.. తమ నీటిని ఎలా తరలిస్తారని ఛత్తీస్గఢ్ సర్కార్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్డబ్ల్యూడీఏ ఎలా ముందడుగు వేస్తుందన్నది వేచిచూడాల్సిందే. -
పేదింటి పెళ్లికి.. ఊరంతా ఒక్కటై..
భైంసా టౌన్: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా ఒక్కటయ్యారు. తలా కొంత కలేసి జమచేసిన డబ్బును కుటుంబానికి అందించి మానవత్వం చాటుకున్నారు నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (బి) వాసులు. వివరాల్లోకి వెళితే.. కిర్గుల్(బి)కు చెందిన కరాండె గోదావరి, గంగన్న దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. గంగన్న గ్రామంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గోదా వరి కూలీ పనులకు వెళ్తుంది. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఇటీవల పెద్ద కూతురు వివాహం కుదిరింది. మే 7న వివాహ ము హూర్తం నిశ్చయించారు. ఉన్నంతలో ఘనంగా వివాహం చేద్దామనుకున్నారు. తెలిసిన వారి వద్ద అప్పుచేసి బంగారం, పెళ్లి సామ గ్రి కొని ఇంట్లో సిద్ధంగా పెట్టుకున్నారు. రోజులాగానే బుధవారం రాత్రి భోజనం చేసి, ఓ గదిలో అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు వారు పడుకున్న గదికి గడియపెట్టి మరో గది లోని బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇల్లు గుల్లయింది. పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా నగదు, సొమ్ము దొంగలు ఎత్తుకెళ్లడంతో గంగన్న, గోదావరి దంపతులు బోరున విలపిస్తున్నా రు. వీరి దీనస్థితి అర్థం చేసుకున్న గ్రామస్తు లు తామున్నామని అండగా నిలిచారు. యువకులు ఇంటింటికీ తిరిగి రూ.1,01,000 సేకరించి బాధిత కుటుంబానికి అందించారు. వీడీసీ ఆధ్వర్యంలో చైర్మన్ పోతారెడ్డి రూ.20 వేలు, సర్పంచ్ సుధాకర్రెడ్డి రూ.20 వేలు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. దీంతో గంగన్న, గోదావరి దంపతులు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. -
డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట సమాంతరంగా మరో వాల్
సాక్షి, అమరావతి: గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్) వద్ద ఏర్పడిన నాలుగు భారీ అగాధాలు పూడ్చి వయబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తేవడం, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించి పటిష్టం చేసే పనులకు రూ.2022.05 కోట్లతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పనులను సక్రమంగా చేపట్టకపోవడం వల్ల 2019లో వచ్చిన వరదలకు ప్రాజెక్టు పలు చోట్ల తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన డ్యామ్తో పాటు దిగువ కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ల వద్ద పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో పాటు అదనపు వ్యయమూ అవుతోంది. గోదావరి వరద ఉధృతికి ప్రధాన డ్యామ్ వద్ద ఏర్పడిన భారీ అగాధాల పూడ్చివేత, డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడానికి అయ్యే అదనపు వ్యయాన్ని భరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ గత ఏడాది హామీ ఇచ్చారు. డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం దిగువ కాఫర్ డ్యామ్లో దెబ్బ తిన్న ప్రాంతాలను ఇసుకతో నింపిన జియోమెంబ్రేన్ బ్యాగులతో పూడ్చి వయబ్రో కాంపాక్షన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం య«థాస్థితికి తీసుకువచ్చింది. ఆ తరువాత దిగువ కాఫర్ డ్యామ్ను 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసింది. నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించిప్రధాన డ్యామ్ అగాధాల పూడ్చివేత, డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చడానికి దేశంలో అత్యున్నత సంస్థ్ధలైన సీడబ్ల్యూసీ, ఎన్హెచ్పీసీ, ఐఐటీ నిపుణులతో 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మేధోమథనం చేయించింది. ఈ బృందం పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. అగాధాలను ఇసుకతో పూడ్చి వయబ్రో కాంపాక్షన్ చేయాలని సూచించింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో నాలుగు చోట్ల 30 శాతం మేర దెబ్బతిందని తేల్చింది. ఆ నాలుగు ప్రాంతాల్లో ‘యు’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించి పాత దానికి అనుసంధానం చేయాలని ఆదేశించింది. ఈ పనులకు రూ.2022.05 కోట్లు వ్యయం అవుతుందని తేల్చింది. ఆ మేరకు పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. బాబు సర్కారు నిర్వాకమిదీ.. పోలవరంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకాల వల్లే ఈ అదనపు భారం పడుతోందని అధికారవర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు సర్కారే చేపట్టింది. అసలు చేపట్టాల్సిన పనులు చేపట్టలేదు. సులభంగా చేయగలిగే, అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ పునాది, డయాఫ్రమ్ వాల్ను 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. స్పిల్ వేను పునాది స్థాయిలోనే వదిలేశారు. స్పిల్ ఛానల్లో మాస్ కాంక్రీట్ పనులు చేశారు. అప్రోచ్ ఛానల్, ఫైలెట్ ఛానల్లో తట్టెడు మట్టి ఎత్తకుండానే 2018లో ఎగువ, దిగువ కాఫ్ర్ డ్యామ్ల పనులను ప్రారంభించారు. నిర్వాసితులకు పునరావాసంపై మాత్రం దృష్టి పెట్టలేదు. భారీ నష్టం గోదావరి నదికి 2019లో భారీ వరదలు వచ్చాయి. పోలవరం వద్ద 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరికి అంత జాగా లేకపోయింది. దిగువ కాఫర్ డ్యామ్లో ఖాళీ ప్రదేశం 800 మీటర్లకు కుంచించుకుపోయింది. దీంతో వరద ఉధృత్తి మరింత తీవ్రమై ప్రధాన డ్యామ్ వద్ద గరిష్టంగా 35 మీటర్లు, కనిష్టంగా 22 మీటర్లు లోతుతో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్లో 0 నుంచి 600 మీటర్ల వరకు కోతకు గురై 36.5 మీటర్ల లోతుతో భారీ అగాధం ఏర్పడింది. ఇలా చంద్రబాబు నిర్వాకం వల్ల జరిగిన విధ్యంసంతో పోలవరం పనుల్లో జాప్యమే కాకుండా, అదనపు వ్యయాన్నీ భరించాల్సి వస్తోంది. టెండర్లకు రంగం సిద్ధం గోదావరికి వరదలు వచ్చేలోగా ప్రధాన డ్యామ్ వద్ద ఏర్పడిన భారీ అగాధాలను పూడ్చివేత, డయాఫ్రమ్ వాల్ను పటిష్టవంతం చేసే పనులను పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఆదేశించిన నేపథ్యంలో తక్షణమే ఆ పనులు చేపట్టడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు.నిబంధనల మేరకు లంసం ఓపెన్ విధానంలో టెండర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన టెండర్లను ఖరారు చేసి రివర్స్ టెండరింగ్లో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. పునరావాసంపై బాబు చేతులెత్తేసి.. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మిస్తే తామంతా ముంపునకు గురవుతామని, పునరావాసం కల్పించాలని 103 గ్రామాల ప్రజలు సీడబ్ల్యూసీని ఆశ్రయించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సీడబ్ల్యూసీ ఆదేశించింది. కమీషన్ల కోసం నిర్మాణాన్ని నెత్తికెత్తుకున్న చంద్రబాబు సర్కారు.. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక చేతులెత్తేసింది. ఎగువ కాఫర్ డ్యామ్కు కుడి, ఎడమ వైపు 400 మీటర్ల చొప్పున, దిగువ కాఫర్ డ్యామ్ కుడి వైపున 600 మీటర్లు ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. దీంతో గోదావరి ప్రవాహానికి అడ్డంకులేర్పడ్డాయి. -
మహానది– గోదావరి అనుసంధానానికి చిక్కులు
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి అనుసంధానానికి ప్రతిపాదన దశలోనే న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య మహానది జలాల వినియోగంలో వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇప్పటిదాకా తుది నివేదిక ఇవ్వలేదు. మహానది జలాల వినియోగం వివాదంపై ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే మహానది–గోదావరి అనుసంధానంపై ముందుకెళ్లాలని సోమవారం నిర్వహించిన 17వ సమావేశంలో టాస్క్ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ఇదీ ప్రతిపాదన ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, వాటిని గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. తెగని మహానది జలాల వివాదం ఒడిశా, ఛత్తీస్గఢ్ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి మూడేళ్ల గడువిచ్చింది. గడువులోగా విచారణ పూర్తి చేయలేదు. దాంతో 2021 మార్చి 11న గడువును మరో రెండేళ్లు పెంచింది. ఈ గడువు కూడా శుక్రవారంతో ముగిసింది. ఇప్పటికీ ట్రిబ్యునల్ కేంద్రానికి తుది నివేదిక ఇవ్వలేదు. మహానది టు కావేరి వయా గోదావరి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్డబ్ల్యూడీఏ 2021 ఏప్రిల్లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేసింది. గోదావరి నికర జలాల్లో మిగులే లేదని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మిగులు తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ, తెలంగాణ ఆదిలోనే స్పష్టం చేశాయి. దాంతో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించేలా డీపీఆర్ను ఎన్డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇటీవల జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో దీనిపై చర్చించారు. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని గోదావరి జలాలకు.. 230 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది – గోదావరి – కావేరిలను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులను అధిగమించవచ్చునని ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. -
కోతకు గురైన ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్
సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉద్ధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో ఇరువైపులా కోతకు గురైన ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ సూచించింది. కోతకు గురికాని ప్రాంతంలో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడంపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జలవనరుల శాఖ అధికారులతో భేటీ గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో ఏర్పడిన భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ (బోరు బావి తవ్వి వైబ్రో కాంపాక్షన్ యంత్రంతో అధిక ఒత్తిడితో భూగర్భాన్ని మెలి తిప్పడం ద్వారా పటిష్టం చేయడం) ద్వారా యథాస్థితికి తేవచ్చంటూ ఏడు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు డీడీఆర్పీ తాజాగా ఆమోదం తెలిపింది. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సమస్యలకు డీడీఆర్పీ పరిష్కార మార్గాలు చూపడంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. పోలవరం పనులను ఏబీ పాండ్య నేతృత్వంలోని డీడీఆర్పీ బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ క్రమంలో ఆదివారం రాజమహేంద్రవరంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఎస్కే సిబాల్, పీపీఏ సీఈవో శివ్నందన్కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు నిర్వహించిన ఎన్హెచ్పీసీ బృందం సమర్పించిన నివేదికను తాజా సమావేశంలో డీడీఆర్పీ ప్రవేశపెట్టింది. సరిదిద్దే మార్గం ఇలా.. ♦ కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ గ్యాప్–2లో ఎడమ వైపున 175 నుంచి 363 మీటర్ల పొడవున అంటే 188 మీటర్ల పొడవు.. కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల పొడవున అంటే 200 మీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిందని ఎన్హెచ్పీసీ తెలిపింది. ఈ ప్రాంతంలో ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించాలని డీడీఆర్పీ ఆదేశించింది. ♦డయాఫ్రమ్ వాల్లో 480 – 510 మీటర్ల మధ్య 30 మీటర్ల పొడవున ఒక చోట, 950 – 1,020 మీటర్ల మధ్య 70 మీటర్ల పొడవున మరోచోట 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు ఎన్హెచ్పీసీ తేల్చింది. ఈ రెండు ప్రాంతాల్లో డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడంపై మరింత అధ్యయనం చేసి సీడబ్ల్యూసీ సూచనల మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డీడీఆర్పీ సూచించింది. ♦మిగతా ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్కు రెండు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి (కోర్) నింపి దానిపై ప్రధాన డ్యామ్ను నిర్మించేలా సీడబ్ల్యూసీ గతంలో డిజైన్ను ఆమోదించింది. అయితే డయాఫ్రమ్ వాల్కు ఐదు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి నింపి దానిపై ప్రధాన డ్యామ్ను నిర్మించాలని డీడీఆర్పీ సూచించింది. దీనివల్ల ఊట నీటిని డయాఫ్రమ్ వాల్ సమర్థంగా అడ్డుకుంటుందని తేల్చింది. రూ.రెండు వేల కోట్లకు పైగా వ్యయం.. గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడం, కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు సుమారు రూ.రెండు వేల కోట్లు వ్యయం అవుతుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకే 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో అదనంగా వ్యయమయ్యే రూ.రెండు వేల కోట్లను మంజూరు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ చేసిన విజ్ఞప్తిపై డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అధికారుల ప్రతిపాదనకే మొగ్గు.. గోదావరి వరద ఉద్ధృతి ప్రభావం వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం కోతకు గురైంది. గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో 35 మీటర్ల లోతుతో, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. కోతకు గురైన ప్రాంతంతోపాటు భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఏడు నెలల క్రితమే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించగా అప్పట్లో డీడీఆర్పీ తోసిపుచ్చింది. దీంతో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపడుతూనే అగాధాలను పూడ్చేందుకు డీడీఆర్పీ సూచించిన మేరకు 11 రకాల పరీక్షలను నిర్వహించారు. ఆ ఫలితాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటితో సంతృప్తి చెందిన డీడీఆర్పీ ఏడు నెలల క్రితం రాష్ట్ర అధికారులు ప్రతిపాదించిన విధానం ప్రకారమే అగాధాలను పూడ్చి యథాస్థితికి తేవాలని ఆదేశించింది. ఈ పనులను గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాలని సూచించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. -
గోదావరి–కావేరి అనుసంధానానికి రూ. 39,275 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి (జీ–సీ) నదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.39,274.92 కోట్ల వ్యయం కానుందని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) అంచనా వేసింది. ఈ మేరకు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)ను రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరితో కృష్ణాను, కృష్ణాతో పెన్నాను, పెన్నాతో కావేరి నదులను అనుసంధానిస్తామ ని ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ప్రాజెక్టు మొత్తం పొడవు 1,211 కి.మీగా ఉండనుందని పేర్కొంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ మార్చి 6న హైదరాబాద్లోని జలసౌధలో సమావేశమై గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా నోట్లో ఈ విషయాలను ఎన్డబ్ల్యూడీఏ వెల్లడించింది. భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాల మేరకు డీపీఆర్లకు తుదిరూపు ఇచ్చామని, ఇక ఈ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొంది. ఏ బేసిన్కు ఎంత వాటా?: గోదావరి బేసిన్లో మిగులు జలాల లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే తేల్చిచెప్పింది. గోదావరిలో ఛత్తీస్గఢ్ వాటాగా ఉన్న 283 టీఎంసీల నుంచి ప్రస్తుతం ఆ రాష్ట్రం వాడుకోని 141 టీఎంసీలనే తరలిస్తామని ఎన్డబ్ల్యూడీఏ పేర్కొంటోంది. 141 టీఎంసీల్లో 45.1 టీఎంసీలను కృష్ణా బేసిన్లో, 35.3 టీఎంసీలను పెన్నా బేసిన్లో, 38.7 టీఎంసీలను కావేరి బేసిన్లో, 9.8 టీఎంసీలను మలప్రభ సబ్బేసిన్లో వాడుకోనుండగా 10.1 టీఎంసీలను చెన్నై నగరానికి, 2.2 టీఎంసీలను పుదుచ్చేరికి తరలిస్తామని ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణకు 42.6 టీఎంసీలు, ఏపీకి 41.8 టీఎంసీలు, తమిళనాడుకి 38.6 టీఎంసీలు, కర్ణాటకకు 9.8 టీఎంసీ లు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలను కేటాయించనున్నారు. రాష్ట్రంలో 2.38 లక్షల హెక్టార్ల ఆయకట్టు గోదావరి–కావేరి అనుసంధానంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మొత్తం 3,98,490 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించడంతోపాటు 1,75,407 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. మొత్తం 5,73,897 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో 9.46 టీఎంసీలతో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు 24.96 టీఎంసీలతో 1,58,236 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరపనున్నట్టు ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి మొత్తం 34.43 టీఎంసీలతో 2,38,236 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. మరో 3 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5.19 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం రాష్ట్రానికి కేటాయించనున్నారు. ఏపీలో 2.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏపీలో 31.39 టీఎంసీలతో 2,19,271 హెక్టార్ల కొత్త ఆయకట్టుతోపాటు 0.6 టీఎంసీలతో 2727 హెక్టార్ల స్థిరీకరణను ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. మొత్తం 31.99 టీఎంసీలతో 2,21,998 హెక్టార్లకు ఏపీలో లబ్ధి కలగనుంది. తాగునీటి అవసరాలకు 4.2, పారిశ్రామిక అవసరాలకు 5.65 టీఎంసీలను ఆ రాష్ట్రానికి కేటాయించింది. తమిళనాడులో 13.13 టీఎంసీలతో 99,219 హెక్టార్ల కొత్త ఆయకట్టు, 3.67 టీఎంసీలతో 14,444 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణను ప్రతిపాదించింది. 9.35 టీఎంసీలను ఆ రాష్ట్ర తాగునీటి, 12.46 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు కేటాయించింది. రూ.2817.62 కోట్లతో బెడ్తి–వార్ధా అనుసంధానం కర్ణాటకలోని బెడ్తి–వార్ధా అనుసంధానం ప్రాజెక్టుకు రూ.2,817.62 కోట్ల అంచనాలతో డీపీఆర్ను సిద్ధం చేసినట్లు ఎన్డబ్ల్యూడీఏ పేర్కొంది. గోదావరి–కావేరి, బెడ్తి–వార్ధా అనుసంధానికి మొత్తం రూ.42,092.54 కోట్లు కానుందని ఎజెండా నోట్లో పేర్కొంది. 52 కి.మీల బెడ్తి–వార్ధా అనుసంధానంతో 18.5 టీఎంసీలను తరలించి 1.05 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు పేర్కొంది. -
గంగమ్మకే పెద్దమ్మ.. మన కృష్ణమ్మ!.. దేశంలోనే అగ్రగామిగా..
సాక్షి, అమరావతి: దేశంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యధికంగా ఉన్న జలాశయాలతో కృష్ణా నది అగ్రగామిగా అవతరించింది. అతి పెద్ద నది అయిన గంగా, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ‘కృష్ణా నది చేరింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతో పాటు అన్ని నదీ పరివాహక ప్రాంతాల(బేసిన్)లో నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణా నది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యంలో 19.65 శాతమన్నమాట. అత్యంత దిగువన బ్రహ్మపుత్ర హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగా నది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగా, గోదావరి కంటే కృష్ణా నదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో గంగా, గోదావరి రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదా నది నాలుగో స్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నా బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలే కావడం గమనార్హం. -
గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం!
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నీటి లభ్యతపై స్పష్టత లేనందున కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)తో అధ్యయనం జరిపించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నిర్ణయించింది. ఇందుకు సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపించనుంది. గోదావరి బోర్డు చైర్మన్ ముఖేష్కుమార్ సిన్హా అధ్యక్షతన మంగళవారం జలసౌధలో జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్రాల తరఫున వాదనలు వినిపించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్(హైడ్రాలజీ) నిత్యానంద రాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మళ్లీ అధ్యయనం అనవసరం: సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో 2020–21 నాటి వరకు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం జరిపించగా, గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 1430–1480 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేలిందని నిత్యానంద రాయ్ వెల్లడించారు. ఐదేళ్ల మూవింగ్ యావరేజీ ప్రకారం1,430–1,600 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధ్యయనం జరపాల్సిన అవసరం లేదని హైడ్రాలజీ డైరెక్టర్గా తన అభిప్రాయమని స్పష్టం చేశారు. ఏపీ అధికారులు ఢిల్లీకి వస్తే అధ్యయన నివేదికలు చూపిస్తామన్నారు. మళ్లీ అధ్యయనం జరపాలని ప్రతిపాదనలు పంపితే సీడబ్ల్యూసీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పోలవరంతో సహా ఏపీ ప్రాజెక్టులకు 484.5 టీఎంసీల జలాలు అవసరమని, ఈ మేరకు ఏపీలోని అన్ని ప్రాజెక్టుల అవసరాలను పరిరక్షిస్తూనే తెలంగాణలోని ఒక్కో ప్రాజెక్టు క్లియరెన్స్ విషయంలో సీడబ్ల్యూసీ ముందుకు వెళ్తుందన్నారు. ఈ విషయంలో ఏపీకి ఆందోళన అవసరం లేదన్నారు. ఏపీ ప్రాజెక్టులకు ఢోకా లేదన్నారు. 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా గోదావరిలో మిగులు జలాలు లేవని తేలిందన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం జరిపించే అధికారం, పరిధి గోదావరి బోర్డుకు లేదని, సీడబ్ల్యూసీతో అధ్యయనం జరిపిస్తే తమకు అభ్యంతరం ఉండదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటి లభ్యతపై మాత్రమే కాకుండా గోదావరి పరీవాహకంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యతపై సైతం అధ్యయనం చేస్తేనే సరైన ఫలితం ఉంటుందని ఆయన సూచించారు. అయితే కేవలం తెలంగాణ, ఏపీకి లభ్యతపైనే అధ్యయనం జరపాలని ఏపీ ఈఎన్సీ కోరారు. అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ఏపీ ఈఎన్సీ ‘ఏ విషయాల్లో మా అభిప్రాయాలు అడగడం లేదు. అడిగినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మేము లేవనెత్తిన అంశాలను తేల్చకుండానే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్లు ఇస్తున్నారు. సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఎంసీ) ఇటీవల సమావేశమై తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ సమావేశానికి ఏపీని అహ్వానించలేదు. ఇకపై టీఏసీ సమావేశాలకు ఏపీని పిలవాలి. మేము లేవనెత్తిన ప్రతి అంశాన్ని తేల్చిన తర్వాతే ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలి’అని ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ లేవనెత్తిన అంశాలపై సాంకేతికంగా గోదావ రి బోర్డు చైర్మన్ అధ్యయనం జరపాలని, ఆ తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్ విషయంలో ముందుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేయగా, గోదావరి బోర్డు చైర్మన్ అంగీకరించలేదు. ప్రాజెక్టుల డీపీఆర్లను మదింపు చేయడం వరకే తన బాధ్యత అని ఆయన బదులిచ్చారు. ఏపీవి అన్నీ అపోహలేనన్న తెలంగాణ ఈఎన్సీ ఏపీ లేవనెత్తిన అన్ని అంశాలనూ సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుందని, ప్రతి అంశాన్ని తేల్చిందని, ఏపీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం లేకుండా చూసుకున్న తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్లు ఇచ్చిందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ బదులిచ్చారు. ఏపీవి అన్నీ అపోహలే అని కొట్టిపారేశారు. ప్రాజెక్టుల డీపీఆర్లకు క్లియరెన్స్ల జారీలో జాప్యం కారణంగా ఆయా ప్రాజెక్టుల అంచనా వ్యయం 20–25 శాతం పెరిగిందని రజత్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు జీ–5 సబ్ బేసిన్తో ఏపీకి సంబంధం లేదు.. రాష్ట్రంలోని కడెం–గూడెం, మొడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్లపై ఏపీ, తెలంగాణ అభిప్రాయాలతో సీడబ్ల్యూసీలోని టీఏసీ క్లియరెన్స్ కోసం పంపించాలని ఈ సమావేశంలో గోదావరి బోర్డు నిర్ణయం తీసుకుంది. కడెం ప్రాజెక్టుకు 14.75 టీఎంసీలు అవసరం కాగా 15 టీఎంసీల లభ్యత ఉన్నందున గూడెం ఎత్తిపోతల అవసరం లేదని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అంతకు ముందు జరిగిన చర్చలో అభ్యంతరం తెలిపారు. గోదావరిలోని జీ–5 సబ్ బేసిన్ పరిధిలో కడెం ప్రాజె క్టు వస్తుందని, ఏపీలోని ప్రాజెక్టులకు జీ–5 సబ్ బేసిన్ నుంచి నీళ్లు వెళ్లవని, తెలంగాణ అవసరాలకే సరిపోతాయని .. కడెం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతుల్లో సీడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ బదులిచ్చారు. జీ–1 నుంచి జీ–6 సబ్ బేసిన్ల నీళ్లు ఏపీకి పోవని, జీ–7 నుంచి జీ–12 సబ్ బేసిన్ల నీళ్లను ఆధారంగా చేసుకుని పోలవరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ అభ్యంతరాలకు విలువ లేదని కొట్టిపారేశారు. అయినా, కడెం–గూడెం ఎత్తిపోతలకు అంగీకరించమని ఏపీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో 5 టెలిమెట్రీ స్టేషన్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు తక్షణ మరమ్మతులు చేపట్టడానికి రెండు రాష్ట్రాలు ఈ సమావేశంలో అంగీకరించాయి. గోదావరిపై 23 చోట్ల టెలిమెట్రీ స్టేషన్లు పెట్టాలని ప్రతిపాదనలు రాగా, తొలుత ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని పెద్దవాగు, పెద్దవాగు ఎడమ కాల్వ, పెద్దవాగు కుడి కాల్వ, కిన్నెరసానితో పాటు మరో వాగుపై మాత్రమే ఏర్పాటు చేయాలని తెలంగాణ సూచన మేరకు ఈ సమావేశంలో నిర్ణయించారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో పెట్టాలని ఏపీ కోరింది. టెలిమెట్రీ స్టేషన్ల ద్వారా రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను నమోదు చేస్తారు. -
ఫోటో షూట్ కోసం వెళ్లి.. గోదావరిలో ఇద్దరు టీచర్లు గల్లంతు..
సాక్షి, మంచిర్యాల: వారు ముగ్గురూ ఉపాధ్యాయులు. వృతి నిమిత్తం కేరళ నుంచి వచ్చారు. చెన్నూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో ఫోటోషూట్, సరదాగా గడిపేందుకు ముగ్గురూ గోదావరి నది వద్దకు వెళ్లారు. ముగ్గురూ కలిసి నదీ తీరంలో ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు గల్లంతు కాగా ఒకరు బయటకు వచ్చారు. ఈ విషాద ఘటన కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో జరిగింది. ఎస్సై చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కేరళకు చెందిన టోనీ, బిజూ, ఆంటోనీ సరదా కోసం ఆదివారం గోదావరి తీరానికి వెళ్లారు,. ఫోటో షూట్ అనంతరం నదిలో ఈతకొడుతుండగా బిజూ, టోనీ గల్లంతయ్యారు. ఆంటోనీ ఒడ్డుకు చేరారు. వెంటనే బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లను రప్పించి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం వెతుకున్నారు. -
గోదావరి–కావేరి అనుసంధానం డౌటే
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనల దశలోనే ప్రశ్నార్థకంగా మారింది. ఛత్తీస్గఢ్ సర్కార్తో కనీసం సంప్రదింపులు జరగకుండా ఆ రాష్ట్ర కోటా 141 టీఎంసీలకు.. బచావత్ ట్రిబ్యునల్ పరిధిలోని దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు హక్కుగా కల్పించిన మిగులు జలాల్లో 106 టీఎంసీలను జతచేసి 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి అనుసంధానంలో తరలించేలా ఎన్డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) తొలుత ప్రతిపాదనలు రూపొందించింది. చదవండి: రైతుభరోసాపై ‘ఈనాడు’ విష ప్రచారం దీనిపై పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. ఛత్తీస్గఢ్ కోటాలోని 141 టీఎంసీలను అనుసంధానంలో తరలించేలా ప్రతిపాదనను మార్చింది. బచావత్ ట్రిబ్యునల్ తమకు కేటాయించిన నీటిని ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో గోదావరి–కావేరి అనుసంధానంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సంప్రదింపులకు అర్థమేదీ? ♦ఇచ్చంపల్లి లేదా అకినేపల్లి (గోదావరి) నుంచి జూన్–అక్టోబర్ మధ్య 143 రోజుల్లో 247 టీఎంసీలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్టకు తరలించడం ద్వారా గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేయాలని 2018లో ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమళనాడులకు 80 టీఎంసీల చొప్పున అందిస్తామని పేర్కొంది. ఇచ్చంపల్లి నుంచి తరలించే నీటిలో 141 టీంఎసీలు ఛత్తీస్గఢ్ కోటాలోనివి కాగా.. మిగతా 106 టీఎంసీలు మిగులు జలాలు. ♦దీనిపై 2020 జూలై 28న ఒకసారి.. డిసెంబర్ 10న మరోసారి పరీవాహక ప్రాంతాల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్డబ్ల్యూడీఏ సంప్రదింపులు జరిపింది. తమ కోటాలో నీటిని తరలించడానికి తాము అంగీకరించే ప్రశ్నే లేదని ఛత్తీస్గఢ్ తెగేసి చెప్పగా.. తమకు హక్కుగా కల్పించిన నీటిని ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ♦సంప్రదింపుల్లో రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసంధానం ప్రతిపాదనలో ఎన్డబ్ల్యూడీఏ అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలి. కానీ.. అందుకు విరుద్ధంగా ఛత్తీస్గఢ్ కోటాలో 141 టీఎంసీలను మాత్రమే.. అదీ ఇచ్చంపల్లి నుంచి కాకుండా తుపాకులగూడెం నుంచి నాగార్జునసాగర్, సోమశిల మీదుగా కావేరికి తరలించేలా మళ్లీ ప్రతిపాదన రూపొందించింది. దీనిపై ఈ నెల 18న రాష్ట్రాలతో మళ్లీ సంప్రదింపులు జరిపింది. తమ కోటా నీటిని వాడుకోవడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తాము ఇప్పటికే స్పష్టం చేశామని.. మళ్లీ తమ నీటిని వాడుకునేలా ప్రతిపాదన రూపొందించడాన్ని బట్టి చూస్తే సంప్రదింపులకు అర్థమేముందని ఛత్తీస్గఢ్ అసహనం వ్యక్తం చేసింది. నీటి లభ్యత శాస్త్రీయంగా తేల్చాకే.. గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదన రూపొందించాలంటే.. తొలుత గోదావరిలో నీటి లభ్యతను తేల్చడానికి శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలుపోగా నికర జలాల్లో మిగులు ఉంటే.. వాటిని అనుసంధానంలో భాగంగా తరలించడానికి రాష్ట్రాలతో ఎన్డబ్ల్యూడీఏ సంప్రదింపులు జరపాలని సూచిస్తున్నారు. రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని.. అనుసంధానం ప్రతిపాదన రూపొందిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానంపై అడుగులు ముందుకు పడే అవకాశం ఉంటుందని తేల్చి చెబుతున్నారు. అలాకాకుండా ఏకపక్షంగా ప్రతిపాదనలు రూపొందించి.. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడం వృథా ప్రయాసేనని స్పష్టం చేస్తున్నారు. -
పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంపై.. మళ్లీ అధ్యయనం కుదరదు
సాక్షి, అమరావతి: గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–హైదరాబాద్, 58 లక్షల క్కూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–రూర్కీ అధ్యయనంలో వెల్లడైందని.. వాటిని పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈఎన్సీలు చేసిన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా తోసిపుచ్చారు. గరిష్ట వరదలవల్ల బ్యాక్వాటర్ ప్రభావంతో ముంపు ఉంటుందన్న మూడు రాష్ట్రాల వాదనను కొట్టిపారేశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే డిజైన్ను ఆమోదించామని.. ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహం (పీఎంఎఫ్), ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసే గరిష్ట వరద ప్రవాహం (స్టాండర్డ్ ప్రాజెక్ట్ ఫ్లండ్–ఎస్పీఎఫ్)లను పరిగణలోకి తీసుకుని బ్యాక్వాటర్ ప్రభావంపై ఆదిలోనే అధ్యయనం చేశామని గుర్తుచేశారు. తాము నిర్వహించిన అధ్యయనాల్లో బ్యాక్వాటర్ ప్రభావం ఉంటే ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని సూచించామని.. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి సిద్ధమైందని వివరించారు. పోలవరం ప్రాజెక్టువల్ల ఆంధ్రప్రదేశ్తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని.. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు. ముంపు ప్రాంతాలను గుర్తించడానికి ఏపీతో కలిసి సంయుక్త సర్వేకు సిద్ధమవ్వాలని ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈఎన్సీలను ఆదేశించారు. శబరి, సీలేరు నదులౖపై కరకట్టలు నిర్మించడానికి వీలుగా.. ఆ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ముంపు, బ్యాక్వాటర్ ప్రభావంపై అనుమానాలను నివృత్తి చేయడానికి గత నెల 29న కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తాలు నాలుగు రాష్ట్రాల సీఎస్లతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించి.. ముంపు, బ్యాక్వాటర్పై అనుమానాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేయడానికి నాలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశాన్ని నిర్వహించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తాను కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఆ సమావేశంలో ఆదేశించారు. దీంతో శుక్రవారం ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని సాంకేతిక బృందాలు, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని సాంకేతిక నిపుణులతో ఆర్కే గుప్తా సమావేశమయ్యారు. రాజకీయ నాయకుల్లా మాట్లాడితే ఎలా? పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలిన అంశాలకూ.. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలవల్ల జరిగిన ముంపునకూ క్షేత్రస్థాయిలో పొంతన కుదరడంలేదని.. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాక్వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈఎన్సీలు ఆర్కే గుప్తాను కోరారు. గోదావరికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరదే వస్తుందన్న అంచనాతో తాము ఏకీభవిస్తున్నామని.. కానీ, దాన్ని పరిగణలోకి తీసుకుని పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలిన అంశాలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సరిపోవడంలేదని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. జూలైలో వచ్చిన వరదలవల్ల భద్రాచలం సహా ఏడు మండలాల పరిధిలోని 103 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని.. 11 వేల మందిపై ప్రభావం పడిందని.. 150 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల భూమి ముంపునకు గురైందని ఫొటోలు చూపుతూ వివరించారు. దీనిపై గుప్తా స్పందిస్తూ.. ఇంజనీర్లైన మీరు రాజకీయ నాయకుల్లా మాట్లాడటం తగదని చురకలంటించారు. దేశవ్యాప్తంగా ఇతర ప్రాజెక్టులకు చేసిన తరహాలోనే పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంపై అధ్యయనం చేశామని.. ఎక్కడా తమ అధ్యయనంపై ఎవరూ అభ్యంతరం తెలిపిన దాఖలాల్లేవన్నారు. బ్యాక్వాటర్ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. గోదావరికి వరద వచ్చినప్పుడు.. ఏ ప్రాంతంలో నీటి మట్టం ఎంత పెరిగిందన్న వివరాలను ఈనెల 19లోగా రాతపూర్వకంగా అందిస్తే.. వాటిని విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పుడు రెండన్నారు.. ఇప్పుడు 35? ఇక పోలవరం ప్రాజెక్టు వెనుక భాగంలో గోదావరిలో కిన్నెరసాని, ముర్రేడువాగు సహా 35 వాగులు కలుస్తాయని.. బ్యాక్వాటర్ ఈ వాగుల్లోకి ఎగదన్నడంతో ముంపునకు దారితీస్తోందని.. దీనిపై అధ్యయనం చేయాలని.. ముంపు ముప్పు తప్పించడానికి కరకట్టలు నిర్మించాలంటూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ వివరిస్తుండగా.. ఆర్కే గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆదిలో కేవలం కిన్నెరసాని, ముర్రేడువాగుల ద్వారా బ్యాక్వాటర్ ప్రభావంపై అధ్యయనం చేస్తే చాలని కోరారని.. ఇప్పుడేమో 35 వాగులపై అధ్యయనం చేయాలని కోరుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి జోక్యంచేసుకుని.. కిన్నెరసాని, ముర్రేడువాగులపై అధ్యయనం చేశామని.. చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదని తేలిందని.. ఆ అంశాలను తెలంగాణకు అందజేశామన్నారు. సంయుక్త సర్వే, ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా నో మరోవైపు.. ముంపు ప్రభావం ఉండే ప్రాంతాలను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించాలని, కరకట్టల నిర్మించడానికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ గుప్తా ఆదేశాలను అమలుచేస్తామని ఛత్తీస్గఢ్ ఈఎన్సీ అంగీకరించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి ఇప్పటికే 150 అడుగుల కాంటూర్ పరిధిలోని ముంపు ప్రాంతాలను గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహించామని.. 175 అడుగుల కాంటూర్ పరిధిలో కూడా గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహించాలని కోరారు. కానీ.. ఒడిశా ఈఎన్సీ ఇందుకు సహకరించబోమన్నారు. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు లోబడే ప్రాజెక్టును నిర్మిస్తున్నామనే అంశాన్ని గుర్తించాలని.. ఆ అవార్డు ప్రకారమే తమ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని స్పష్టంచేశారు. -
పోలవరంతో భద్రాద్రి భద్రమే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ఎలాంటి ముంపు ముప్పు ఉండదని ఐఐటీ–హైదరాబాద్ తేల్చి చెప్పింది. పోలవరాన్ని కట్టాక భద్రాచలం వద్ద పెరిగే గోదావరి నీటి మట్టం కేవలం గోరంతేనని (2 సెంటీమీటర్లు) స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాను స్వయంగా చేయించిన ఈ అధ్యయనంలోనే పోలవరం ద్వారా భద్రాచలానికి ఏ మాత్రం ముప్పు లేదని స్పష్టం కావడం గమనార్హం. వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేలా పోలవరం గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్ వాటర్ ప్రభావం భద్రాచలం సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలపై ఏమాత్రం ఉండదని తెలిపింది. పోలవరం వద్ద గోదావరి గరిష్ట వరద, బ్యాక్ వాటర్ ప్రభావంపై తెలంగాణ నీటిపారుదల శాఖ 2017లో ఐఐటీ–హైదరాబాద్తో అధ్యయనం నిర్వహించింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో సీడబ్ల్యూసీ, తెలంగాణ జలవనరుల విభాగం లెక్కల ప్రకారం వరద ప్రవాహాలు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నమోదు చేసిన వరద ప్రవాహాలను అధ్యయనం చేసేందుకు ఐఐటీ–హైదరాబాద్కు తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. ముంపు ముప్పు ఉత్తదే.. ధవళేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన రికార్డులు కచ్చితంగా ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకుని పోలవరం వద్ద వెయ్యేళ్లకు, పది వేల ఏళ్లకు ఒకసారి గరిష్టంగా వచ్చే వరదను లెక్కట్టిన ఐఐటీ–హైదరాబాద్ బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్రంగా అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలివీ.. ► పోలవరంలో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తే 637 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ముంపునకు గురవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 601, ఒడిశాలో 12, చత్తీస్గఢ్లో 24 చ.కి.మీ. భూభాగం ఉంది. ఆంధ్రప్రదేశ్ 222 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతుండగా చత్తీస్గఢ్లో పది, ఒడిశాలో ఏడు రెవెన్యూ గ్రామాలపై ముంపు ప్రభావం ఉంటుంది. ► గోదావరిలో గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 57 మీటర్లు ఉంటే.. కట్టాక 57.02 మీటర్లు మాత్రమే ఉంటుంది. ► గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్లోకి గరిష్టంగా 35,06,338 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ► గోదావరి గరిష్ట వరద ప్రవాహాలను పరిగణలోకి తీసుకుంటే వెయ్యేళ్లకు ఒకసారి గరిష్టంగా 39.72 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 57.7 మీటర్లు ఉంటే.. నిర్మాణ పూర్తయ్యాక 57.77 మీటర్లు ఉంటుంది. ► పది వేల సంవత్సరాలకు ఒకసారి గోదావరికి గరిష్టంగా 44.61 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 61.41 మీటర్లు ఉంటే.. నిర్మాణ పూర్తయ్యాక 61.43 మీటర్లు ఉంటుంది. ► కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా విడుదల చేసేలా పోలవరంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వే నిర్మిస్తున్నారు. పోలవరం డిజైన్ మేరకు అంటే గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద గోదావరికి వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రాజెక్టు కట్టక ముందు 61.77 మీటర్లు ఉంటే కట్టాక 61.79 మీటర్లు ఉంటుంది. గేట్ల నిర్వహణే కీలకం పోలవరం ప్రాజెక్టు గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్ వాటర్ ప్రభావం కనిష్ట స్థాయిలో ఉంటుందని ఐఐటీ–హైదరాబాద్ తేల్చింది. బ్యాక్ వాటర్ ప్రభావం లేకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ► పోలవరంలో నీటి నిల్వలు.. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరదను దిగువకు విడుదల చేసేలా సమర్థంగా గేట్లను నిర్వహించాలి. ► పోలవరం జలవిస్తరణ ప్రాంతంలో నదీ గర్భంలో ఎప్పటికప్పుడు ఇసుక మేటలను తొలగించాలి. దీనివల్ల నీటి మట్టం పెరగదు. ► ముంపును నివారించాలంటే ఎగువన కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి ప్రాంతాల్లో బ్యారేజ్లు నిర్మించాలి. ► పోలవరం డ్యామ్ నిర్మించడం వల్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భూఉపరితల మట్టం కంటే నీటి ఉపరితల మట్టం రెండు సెంటీమీటర్ల మేర పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రాధాన్యత క్రమంలో పది దశల్లో గోదావరికి ఇరువైపులా 124.55 కి.మీ. పొడవున కరకట్టలు నిర్మించాలి. ఇందుకు రూ.996.4 కోట్ల వ్యయం అవుతుంది. -
బ్యాక్ వాటర్ ముప్పు ఒట్టిదే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ (వెనుక జలాలు) ప్రభావం వల్ల ముంపు ముప్పు ఉంటుదన్నది ఒట్టి అపోహేనని ఆదిలోనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. సీడబ్ల్యూసీ రిటైర్డు సభ్యులు ఎం.గోపాలకృష్ణన్ అధ్యక్షతన సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఐఐటీతో తెలంగాణ ప్రభుత్వం.. రూర్కీ ఐఐటీతో ఒడిశా సర్కార్ చేయించిన అధ్యయనాలలోనూ ఇదే అంశం స్పష్టమైంది. గోదావరిపై పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు.. కట్టాక, ప్రాజెక్టులోకి గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా వెనుక భాగంలో వరద నీటి మట్టం పది సెంటీమీటర్లు అంటే 1/3 అడుగు మేర మాత్రమే పెరుగుతుందని హైదరాబాద్ ఐఐటీ, రూర్కీ ఐఐటీ అధ్యయనాలలో వెల్లడైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1988లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ల్యాబొరేటరీస్(ఏపీఈఆర్ఎల్), 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీకో సంస్థ చేసిన అధ్యయనాలలోనూ పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం పరిగణించదగ్గ స్థాయిలో ఉండదని స్పష్టమైంది. ఇదే అంశాన్ని ఈనెల 29న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తాల అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో నిర్వహించే సమావేశంలో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం ఇసుమంత కూడా ఉండదనే అంశాన్ని ఈ సమావేశంలో మరో మారు స్పష్టం చేయాలని సీడబ్ల్యూసీ కూడా నిర్ణయించింది. పెద్దగా తేడా ఉండదు.. ► గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తోందని.. దీని వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒడిశా, ఛత్తీస్గడ్ సర్కార్లు వేర్వేరుగా ఎస్సెల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్)లు దాఖలు చేశాయి. ► వీటిపై విచారించిన సుప్రీంకోర్టు 2011 ఏప్రిల్ 11న సీడబ్ల్యూసీ రిటైర్డు సభ్యులు ఎం.గోపాలకృష్ణన్ నేతృత్వంలో సీడబ్ల్యూసీ అధికారులు, నిపుణులతో ముంపు ప్రభావాన్ని తేల్చడానికి కమిటీ వేసింది. ఈ కమిటీ 2011 మే 23, 24న పోలవరంలో పర్యటించి.. సమగ్రంగా అధ్యయనం చేసి, 2011 జూన్ 14న సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోందని.. ఈ ప్రాజెక్టు కట్టినా, కట్టకపోయినా వెనుక జలాల్లో పెద్దగా ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. ► పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్వహణే అత్యంత కీలకమని.. సమర్థవంతంగా నిర్వహిస్తే ఎలాంటి ముప్పు ఉండదని ఐఐటీ–హైదరాబాద్ నిపుణులు తెగేసి చెప్పారు. ప్రపంచంలో అత్యాధునిక హైడ్రాలిక్ హాయిస్ట్ విధానంలో గేట్ల నిర్వహణను చేపట్టిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ముప్పు ఉండదని అభిప్రాయపడ్డారు. ► గోదావరికి 50 లక్షలు, 40 లక్షలు, 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు కుంట, శబరి లాస్ట్ క్రాస్ వద్ద ఏ స్థాయిలో నీటి మట్టం ఉంటుందో.. ప్రాజెక్టు కట్టాక కూడా అదే స్థాయిలో నీటి మట్టం ఉంటుందని ఐఐటీ–రూర్కీ తేల్చింది. ► పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 150 అడుగుల గరిష్ట స్థాయిలో నీటి నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్త సర్వే చేయాలి. ఇందుకు ఏపీ పలుమార్లు లేఖ రాసినా ఒడిశా స్పందించడం లేదు. ► శబరి, సీలేరులకు కరకట్టలు కట్టినా కట్టకున్నా పెద్దగా మార్పు ఏమీ ఉండదని సీకో అధ్యయనం తేల్చిచెప్పింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు లోబడే.. ► గోదావరిపై పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 150 అడుగుల (45.72 మీటర్లు) సామర్థ్యంతో నిర్మించుకోవడానికి ఆమోదం తెలుపుతూ 1978 ఆగస్టు 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దాంతో పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ► ప్రాజెక్టులో 140 అడుగుల్లో (42.672 మీటర్లు) నీటి మట్టం ఉన్నప్పుడు గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వేను నిర్మించాలని పేర్కొంది. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. పోలవరం ప్రాజెక్టు వెనుక భాగాన ఎలాంటి ముంపు ప్రభావం ఉండకూడదనే లక్ష్యంతో ఆ మేరకు నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో స్పిల్ వేను నిర్మించేలా సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) డిజైన్లు ఆమోదించింది. ఆ మేరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోంది. తద్వారా ఎగువ నుంచి భారీ వరద వచ్చినా బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాలపై ఏమాత్రం పడదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమావేశం ► పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యపై ప్రభావిత రాష్ట్రాలు అన్నింటితో నెలాఖరులోగా చర్చించి, నివేదిక ఇవ్వాలని ఈనెల 6న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దాంతో ఈనెల 29న కేంద్రం నాలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. ► విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులతోపాటు ఏవైనా రాష్ట్రాలతో సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ నేపథ్యంలో ఈనెల 29న నిర్వహించే సమావేశంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై వేర్వేరు అధ్యయనాలలో వెల్లడైన అంశాలను వివరించి ఆ రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేసేందుకు పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. -
ఉగ్రగోదారి.. భద్రాచలానికి మళ్లీ ముంపు భయం!
సాక్షి, హైదరాబాద్: ఎగువన కురుస్తున్న వర్షాలతో మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర 9 లక్షల క్యూసెక్కులు దాటింది వరద. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పరిస్థితిని సమీకక్షించారు. గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తక్షణమే సచివాలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. ఇంతకు ముందు వరదలతో భద్రాచలం తీవ్రంగా నష్టపోయింది. దీంతో ప్రస్తుత వరదలతో మళ్లీ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో.. ప్రమాద హెచ్చరికల జారీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: పచ్చని చెట్టు పొట్టనబెట్టుకుంది -
అమ్మ బాబోయ్ పులస.. అంత రేటా?
శ్రీకాకుళం: కేంద్రపాలిత ప్రాంతం యానంలో గౌతమీగోదావరిలో మంగళవారం మధ్యాహ్నం పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దీనిని స్ధానిక రాజీవ్ రివర్ బీచ్ వద్ద వేలం పాట వేశారు. వేలం పాటలో పులస రూ. 19,000 రేటు పలికింది. -
భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల (రెంటచింతల)/విజయపురిసౌత్: గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 47.7 అడుగులు, ధవళేశ్వరం వద్ద 15 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా విడుదల చేస్తున్న జలాల్లో ధవళేశ్వరం బ్యారేజ్లోకి 15,05,850 క్యూసెక్కులు వస్తుండగా.. గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 14,94,850 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో శుక్రవారం వర్షాలు తెరిపి ఇచ్చాయి. దాంతో ఎగువన గోదావరిలో వరద తగ్గింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్లోకి వరద 7.40 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన ఉన్న తుపాకులగూడెం బ్యారేజ్లోకి 8.84 లక్షలు, సీతమ్మసాగర్లోకి 11.47 లక్షల క్యూసెక్కులకు ప్రవాహం తగ్గింది. ఆ నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టనుంది. స్థిరంగా వంశ‘ధార’ వర్షాల ప్రభావం వల్ల వంశధారలో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్లోకి 22,809 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ఆయకట్టుకు 2,215 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 20,594 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళిలోనూ వరద కొనసాగుతోంది. తోటపల్లి బ్యారేజ్లోకి 6,358 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,838 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్ట మీదుగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. నిలకడగా కృష్ణమ్మ బేసిన్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణాలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 2,89,909 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్కేంద్రాల ద్వారా 62,665 క్యూసెక్కులు, స్పిల్ వే 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,23,864 క్యూసెక్కులు.. మొత్తం 3,06,217 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.8 అడుగుల్లో 214.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జున సాగర్లోకి 1,74,167 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,831, ఎడమ కాలువకు 8,193, ఏఎమ్మార్పీకి 600, వరద కాలువకు 400, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 32,927, స్పిల్ వే 16 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,23,216 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రస్తుతం సాగర్లో 586.2 అడుగుల్లో 301.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 1,36,582 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్కేంద్రం ద్వారా 8 వేలు, స్పిల్ వే 5 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 1,30,616 క్యూసెక్కులు.. మొత్తం 1,38,616 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్లోకి 1,35,847 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 12,797 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,23,050 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. -
క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. గోదావరి యాసతో కట్టిపడేస్తున్న చిన్నారి
వచ్చిరాని మాటలు, తెలిసి తెలియని చేతలతో చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి భలే నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ చిచ్చరపిడుగు.. గోదావరి యాస, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో నెటిజన్ల కంటపడ్డాడు. బుడ్డోడి మాటలకు, హావభావాలకు వీక్షకులు ఫిదా అవుతున్నాయి. ‘బల్లు బల్లు మని బాదెసడమ్మి.. తూస్తే ఏడుపొచ్చేత్తమ్మి’ అంటూ ముద్దుగా ముద్దుగా మాట్లాడిన చిన్నారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. టీచర్ అనవసరంగా తనను కొట్టాడంటూ గోదావరి యాసలో చెబుతూ చిన్నారి చూపించిన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. ‘గట్టిగా కొట్టేశాడు ఎదవ. సార్దే తప్పు.. చిన్నపిల్లోడ్ని ఎందుకు కొట్టాడు’ అంటూ బుడ్డోడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అతడు మాట్లాడిన మాటలు చాలా మందికి అర్థంకాకపోయినా హావభావాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: వైరల్ వీడియో.. హృదయానికి హత్తుకుంటోంది!) పెద్ద మనిషిలా మాట్లాడుతున్న ఈ చిన్నారి మంచి మాటకారి అవుతాడు. గోదావరి యాసను బతికిస్తున్నాడు. మంచి రెబల్ అవుతాడు. లవ్ యు రా బుజ్జి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ బాలుడు ఏ ఊరివాడు, ఈ వీడియో ఎప్పటిదనే వివరాలు వెల్లడికాలేదు. -
గోదావరిపై కొత్త వంతెనలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు జాతీయ రహదారులపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతకుముందు రెండు వరుస సంవత్సరాలు భారీవర్షాలు, పోటెత్తిన వరదలను తట్టుకున్నా, తాజా వరదల తాకిడికి మాత్రం తాళలేకపోయాయి. ఇప్పటికిప్పుడు వాటి పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.38 కోట్లు కావాలంటూ జాతీయ రహదారుల విభాగం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల విభాగానికి ప్రతిపాదించింది. అవి వచ్చే వరకు అధికారులు మట్టికట్టతో రోడ్లను పునరుద్ధరించారు. పెండింగ్లో ఉన్న కొత్త వంతెనల నిర్మాణం, పాత వంతెనల స్థాయి పెంపు ప్రతిపాదనలకు ఈసారైనా మోక్షం లభించవచ్చని భావిస్తున్నారు. ఇక్కడే కొత్త వంతెనకు ప్రతిపాదన..: రోడ్డును గోదావరి అడ్డంగా చీల్చి ముందుకు పోటెత్తిన నేపథ్యంలో ఇక్కడ వంద మీటర్ల పొడవుతో కొత్త వంతెనను జాతీయ రహదారుల విభాగం తాజాగా ప్రతిపాదించింది. ఇక్కడ దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన తాజా వరదకు తట్టుకోలేకపోయింది. వంతెనకు ఓ వైపు మట్టి కొట్టుకుపోయి ఇలా రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. దీంతో ఇప్పుడు పాత వంతెన కంటే కనీసం మూడు, నాలుగు మీటర్ల ఎత్తు, 100 మీటర్ల పొడవుతో కొత్త వంతెనను దాని పక్కనే నిర్మించాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. ఇదే రోడ్డు మీద తుపాకులగూడెం సమీపంలోని టేకులగూడెం వద్ద 125 మీటర్ల నుంచి 150 మీటర్ల పొడవుతో మరో వంతెనను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ కూడా గోదావరి ఎగిసి రోడ్డు మీదుగా వరద ప్రవహించటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక్కడ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోనప్పటికీ, పక్కల భారీగా కోసుకుపోయింది. ఇక్కడ కూడా వెంటనే మట్టికట్ట వేసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రసుతం ఆ తాత్కాలిక రోడ్డు మీదుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. పస్రా– తాడ్వాయి ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మెటల్, మట్టి, ఇసుక బస్తాలతో ఇదిగో ఇలా తాత్కాలికంగా పునరుద్ధరించారు. ఆ తర్వాత భారీవర్షం, వరద వచ్చినా ఇది నిలబడింది. ఇంకోసారి వరద వస్తే మాత్రం ఇది తట్టుకునే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఈలోపు దీన్ని మరింత పటిష్టంగా పునరుద్ధరించాల్సి ఉంది. ఇది నిర్మల్–ఖానాపూర్ మధ్య ఉన్న దిమ్మతుర్తి గ్రామం వద్ద జాతీయ రహదారి. ఇక్కడ అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం వల్ల రోడ్డు విస్తరణ పనుల్లో దాదాపు రెండేళ్ల ఆలస్యం జరిగింది. అందు వల్లే ఇక్కడ ఆరు చిన్న వంతెనల నిర్మాణమూ జాప్యమైంది. అలా పూర్తికాని దిమ్మతుర్తి సమీపంలోని వంతెన వద్ద రోడ్డు ఇలా కొట్టుకుపోయి ట్రాఫిక్కు తీవ్ర విఘాతం ఏర్పడింది. దీంతో తాత్కాలికంగా ఆ మళ్లింపు రోడ్డును పునరుద్ధరించి వాహనాలు నడిపారు. -
PULASA FISH: రేటు ఎంతైనా.. రుచి చూడాల్సిందే!
పెనుగొండ: ప్రతి ఏటా జూలై నెల వస్తే గోదావరి పరివాహక ప్రాంతంలో పులసలు సందడి చేస్తుంటాయి. ఆస్ట్రేలియా తీర ప్రాంతం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించే పులసలంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్.. పుస్తెలు అమ్మైనా పులస తినాలనే నానుడిని నిజం చేస్తూ ధరలోనూ అధరహో అనిపిస్తాయి. ఏడాదికి రెండు మూడు నెలలు మాత్రమే లభించే పులసలను వేలు ఖర్చు చేసి కొంటారు చేపల ప్రియులు. గోదావరికి వరద నీరు వచ్చినప్పటి నుంచి ఇంచుమించుగా జూలై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకూ పులసలు దొరుకుతుంటాయి. సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి నదిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో అధికంగా జాలర్లకు పులసలు చిక్కుతుంటాయి. సాధారణంగా బ్రతికి ఉన్న పులసలు దొరకడం కష్టం. వలకు చిక్కగానే పులసలు చనిపోతుంటాయి. గోదావరి తీరం జాతీయ రహదారిలో ఉండడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా అమ్మకాలు సాగిస్తుంటారు. వారం రోజులుగా అందుబాటులోకి.. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో పులసలు దొరకడం ప్రారంభమయ్యాయి. అరకొరగా దొరుకుతున్న పులసల ధరలు అధికంగానే ఉన్నాయి. సామాన్య కుటుంబాలు పులస కొనాలంటే కష్టమే. కేజీ పులసలు రూ.2000 నుంచి రూ.6000 వరకూ అమ్ముతున్నారు. సాధారణంగా పులస దొరకాలంటే కష్టమైనే పనే. దీంతో ఇలసల్ని అమ్మేస్తుంటారు. తెలియని వారు వీటినే పులసలుగా భావించి కొంటుంటారు. గోదావరికి వరద నీరు ముందుగానే రావడంతో ఈ ఏడాది పులసలు ఎక్కువ కాలం దొరికే అవకాశం ఉందని జాలర్లు అంటున్నారు. ఇలసలనే పులసలుగా అమ్మకం ఒడిశా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరకు తీసుకొచ్చి పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడాను గుర్తించడం కష్టసాధ్యం. నిజమైన పులస ఎర్రనీటి ప్రయాణం చేయడంతో.. శరీరంపై ఎర్రటి చాయలు వెండి రంగు ధగధగలు ఉంటాయి. ఇలసలు తెలుపుగా కనిపిస్తాయి. సంతానోత్పత్తి కోసం వచ్చి... ఆ్రస్టేలియా, థాయ్లాండ్ సముద్ర ప్రాంతాల్లో హిల్షా ఇలీషాగా పిలిచే ఈ చేప సంతానోత్పత్తి కోసం సుదూర ప్రాంతాల నుంచి ఈదుకొని బంగాళాఖాతం చేరుకుంటుంది. గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకొని ఎర్రనీటిలో ప్రయాణిస్తూ గుడ్లను పెడుతుంది. గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించినప్పుడు పులసగా పిలుస్తారు. పులసలను ఉన్నతాధికారులకు, బాస్లకు గిఫ్ట్లుగా పంపుతారు. గోదావరి పరిసర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని పంపుతుంటారు. వండడం కూడా ప్రత్యేకమే పులస పులుసు తయారీ కూడా ప్రత్యేకమే. ఇతర చేపల్లాగా వండకూడదు. మట్టి కుండలో పులసను వండాలి. ముళ్లు అధికంగా ఉండడంతో ప్రత్యేకంగా వీటిని వండుతుంటారు. ముందుగా చేపముక్కలకు వెన్న, ఆముదం పూసి కొంత సమయం పాటు ఉంచి వీటిని పిడకలు, లేదా కట్టెల పొయ్యి పై తక్కువ మంటపై ఎక్కువ సమయం వండాలి. ఆవకాయ ఊట, వంకాయ, బెండకాయ వంటి వాటిని వేసి వండుతారు. మర్నాడు తింటే దీని రుచి అమోఘంగా ఉంటుందని చేప ప్రియుల చెబుతుంటారు. -
గట్లు తెగకపోవడానికి ఆయనే కారణం
గోదావరి నది చరిత్రలోనే మూడవ అతి పెద్ద వరదను చూశాం. సాధారణంగా ఆగస్టు నెలలో గోదావరికి పెద్ద వరదలు వస్తాయి. అటువంటిది చరిత్రలో మొదటిసారి జూలై నెలలో అతి పెద్ద వరదను చూడాల్సి వచ్చింది. అయినా వరదను ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొంది. కొన్నిచోట్ల గట్లు దాటి ప్రవహించినా గండ్లు పడకపోవడానికి ఏకైక కారణం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు చూపు... దార్శనికతలు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. 1847– 55 మధ్య ధవళేశ్వరం వద్ద గోదావరిపై సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ఆనకట్ట నిర్మాణం చేశారు. 1851 నుంచి పి.గన్నవరం వద్ద అక్విడెక్టు నిర్మాణం కూడా చేపట్టారు. ఆ సమయంలో గోదావరి వరద నియంత్రణ పనులు కూడా ఆరంభించారు. దీనిలో భాగంగా బ్యారేజ్ ఎగువ అఖండ గోదావరి, దిగువన గోదావరి నదీ పాయల చుట్టూ ఏటిగట్ల నిర్మాణాలు ఆరంభించారు. నాటి నుంచి నేటి వరకు పలు సందర్భాలలో వరద ఉధృతిని బట్టి ఏటిగట్ల ఎత్తును పెంచుకుంటూ వస్తున్నాం. గోదావరికి 2006లో రెండవ అతిపెద్ద వరద వచ్చింది. ఈ వరద వల్ల ఇప్పటి కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం శానపల్లి లంక, పి. గన్నవరం మండలం మొండెపు లంకల వద్ద ఏటిగట్లకు గండ్లు పడ్డాయి. పెద్దగా ప్రాణ నష్టం లేకున్నా అంతులేని ఆస్తి నష్టం సంభవించింది. నాడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్సార్ ఏటిగట్లను పటిష్ఠం చేసే పనులు చేపట్టమని ఆదేశించారు. 2008 నుంచి డెల్టాలో ఏటిగట్లను పటిష్ఠం చేసే పనులు ఆరంభమయ్యాయి. గోదావరి ఏటిగట్ల విస్తీర్ణం సుమారు 530 కి.మీ.లు. పటిష్ఠం చేసే పనులకు వైఎస్సార్ రూ. 650 కోట్లు కేటాయించారు. 1986 వరదను ప్రామాణికంగా తీసుకున్నాం. నాడు వచ్చిన మాగ్జిమమ్ ఫ్లడ్ లెవెల్ (ఎంఎఫ్ఎల్)కు రెండు మీటర్లు (6.56 అడుగులు) ఎత్తు చేయడం, గట్టు ఎగువ భాగంలో (టాప్ విడ్త్) 6.5 మీటర్లు (21.32 అడుగులు) వెడల్పున పటిష్ఠం చేశాం. వైఎస్సార్ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయి. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు జరగకున్నా అటు గోదావరి, ఇటు గోదావరి పాయల చుట్టూ మహాకుడ్యం ఏర్పడింది. ప్రస్తుతం వచ్చిన వరద వల్ల బ్యారేజ్ నుంచి దిగువకు 25 లక్షల 63 వేల 833 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అయినా గట్లకు నష్టం వాటిల్ల లేదు. నాడు ఏటిగట్లను పటిష్ఠం చేయకుంటే ఇప్పుడు కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తీవ్ర విపత్తును చవిచూడాల్సి వచ్చేది. వైఎస్సార్ దార్శనికతే గోదావరి తీర ప్రాంత జనాన్ని కాపాడింది. ఈ మహాయజ్ఞంలో ఇరిగేషన్ అధికారిగా (హెడ్వర్క్స్ డీఈఈ, ఈఈ) నేనూ భాగస్వామిని కావడం గర్వంగా అనిపిస్తోంది. (క్లిక్: ‘బురద జల్లుదాం ఛలో ఛలో’) - విప్పర్తి వేణుగోపాలరావు తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్; రిటైర్డ్ ఎస్ఈ, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ -
గోదావరి తీరంలో నక్సల్స్!
సాక్షిప్రతినిధి, వరంగల్: గోదావరి తీరంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఉన్నాయా? అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో నక్సల్స్ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందా?.. అంటే నిజమే అంటున్నాయి పోలీసువర్గాలు. ఏటా జరిగే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నక్సల్స్ వివిధ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు చెబుతున్నారు. దీనికి తోడు ఏటూరునాగారం, వెంకటాపూర్ ప్రాంతాల్లో బుధవారం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట కరపత్రాలు, వాల్పోస్టర్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి తీరంలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం సరిహద్దు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు.. మావోయిస్టు పార్టీ ప్రతి ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఉద్యమంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,700 మందికి పైగా తమ సభ్యులు మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇటీవల సంవత్సరాల్లో కరోనా, కోవర్టుల కారణంగా ఆ పార్టీ పలువురు ఉద్యమకారులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు కరపత్రాల్లో ప్రకటించింది. దీంతో పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దులో నిఘా పెంచారు. అగ్రనేతల మరణం.. కోలుకోలేని నష్టం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా నక్సల్స్పై ప్రభుత్వాల వైఖరి మారలేదు. 2020–22 సంవత్సరాల్లో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అగ్ర నాయకులతోపాటు మొత్తం 173 మంది నక్సల్స్ మరణించారు. ఓ వైపు పోలీసు ఎన్కౌంటర్లు, మరోవైపు కరోనా.. మావోయిస్టు పార్టీ కీలక నేతలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు తప్పకుండా నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించిన తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల ఉన్నతాధికారులు.. అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. -
తగ్గుతున్న గోదా‘వడి’
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/సాక్షి, ప్రతినిధి, ఏలూరు/ధవళేశ్వరం/చింతూరు: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాలు తెరిపి ఇవ్వడం, ఉపనదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో గోదా‘వడి’ కూడా క్రమేణ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి వచ్చే వరద సోమవారం రాత్రి 10 గంటలకు 20,79,187 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం కూడా 18.70 అడుగులకు తగ్గింది. 17.75 అడుగుల కంటే దిగువకు నీటిమట్టం చేరుకోకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 5,900 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 20,73,287 క్యూసెక్కులను (179.17 టీఎంసీలను) సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో మంగళవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్లోకి వచ్చే వరద మరింత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎగువన గోదావరి, ఉపనదుల్లో వరద తగ్గింది. మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్లోకి వస్తున్న వరద 6.06 లక్షలకు తగ్గితే.. దాని దిగువనున్న తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్లోకి చేరుతున్న వరద 10.95 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆ బ్యారేజ్కు దిగువన ఉన్న సీతమ్మసాగర్లోకి వస్తున్న వరద 15.48 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ బ్యారేజ్లలోకి చేరుతున్న వరదను వచ్చింది వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం తగ్గుతోంది. సోమవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్దకు 16.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో వరద మట్టం 56.20 అడుగులకు తగ్గింది. మంగళవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద మట్టం 48 అడుగులు లేదా అంతకంటే దిగువకు చేరుకునే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరంలోకి వచ్చే వరద సైతం క్రమేణా తగ్గుతోంది. సోమవారం రాత్రి 10 గంటలకు 17,76,590 క్యూసెక్కులు చేరుతుండటంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 35.44 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 27.18 మీటర్లుగా నమోదైంది. పోలవరం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్న అధికారులు వరదను సమర్థంగా నియంత్రిస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. కోనసీమ లంకలను వీడని ముంపు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. లంకల్లో ఇళ్లను చుట్టుముట్టిన నీరు నెమ్మదిగా దిగువకు లాగుతోంది. కాగా పి.గన్నవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం, కొత్తపేట, కె.గంగవరం, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం మండలాల్లోని లంక గ్రామాల్లో ముంపు కొనసాగుతోంది. ముంపు బాధితులకు పునరావాస, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అల్లవరం మండలం రెబ్బనపల్లి, అమలాపురం రూరల్ బండార్లంక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు పాలు, భోజనం ప్యాకెట్లు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. బాధితులకు అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. గోదావరి, శబరి నదుల వరద నెమ్మదిగా తగ్గుముఖం పట్టినా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వందలాది గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా విలీన మండలాలైన కూనవరం, ఎటపాక, వీఆర్ పురం, చింతూరు మండలాల్లోని వందలాది గ్రామాల్లో ఇంకా వరద నీరు ఉంది. కొన్ని ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు. మరో రెండురోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఏలూరు జిల్లాలో పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మండలాల్లోని ముంపు గ్రామాలకు సోమవారం నేవీ హెలికాప్టర్ ద్వారా నాలుగువేల ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు సరఫరా చేశారు. ముంపు మండలాల్లో ముఖ్యమంత్రి ఆదేశాలతో రేషన్ సహా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ముంపునకు గురయ్యే వీలున్న 15 ప్రాంతాల్లో కరకట్టలను పటిష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, యలమంచిలి, ఆచంట మండలాల్లో 31 గ్రామాల్లో వరద ప్రభావం ఉంది. గో‘దారి’ క్లియర్ సముద్రంలో సంభవించే ఆటు పోటులు వరదపై ప్రభావం చూపుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో 4 రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. గోదావరి నుంచి కొత్త నీటిని రాకుండా అడ్డుకున్నట్టుగా మారటంతో వరద నీరు వెనక్కి పొంగి గ్రామాలను ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం నుంచి ఈ పరిస్థితి మారింది. సముద్రం పోటు తగ్గి.. ఆటు వచ్చి వెనక్కి వెళ్లిపోడవంతో వరద నీరు సముద్రంలో ఆటంకం లేకుండా సునాయాసంగా కలుస్తోంది. ఇప్పటివరకు పోటెత్తిన వరద ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. -
KCR Aerial Survey: సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే.. బాధితులను కలిసి..
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆది, సోమవారాలు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాలను ఆయన హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. వరదలతో ప్రజలకు జరిగిన కష్టనష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి సాంత్వన కలిగించడానికి పునరావాస, ఇతర ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సీఎంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం ఏరియల్ సర్వేలో పాల్గొననున్నారు. సీఎం ఆదేశాలతో ఏరియల్ సర్వేకు సంబంధించిన రూట్మ్యాప్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. భద్రాచలంలో సీఎం సమీక్ష.. సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో వరంగల్కు చేరుకొని అక్కడ వరద పరిస్థితులపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదివారం ఉదయం ఆయన వరంగల్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి భద్రాచలం వరకు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన పలుచోట్ల హెలికాప్టర్ నుంచి కిందికి దిగి వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ముఖ్యంగా భద్రాచలంలో పర్యటించి అక్కడ జరిగిన నష్టం, చేపడుతున్న సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయనున్నారు. అక్కడి నుంచి ఏటూరునాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి అక్కడ కూడా వరద సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. సోమవారం ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం తదితర ముంపు ప్రాంతాల మీదుగా ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ముంపు గ్రామాల్లో వైద్య శిబిరాలు.. గోదావరి పరీవాహకంలోని వరద ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముంపు ప్రాంత ఆస్పత్రుల వైద్యులు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సమీక్షించారు. నేటి పర్యటనకు సంబంధించిన కార్యాచరణపై సమీక్షలో చర్చించారు. ముంపు గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని హరీశ్రావు ఆదేశించారు. వైద్యులంతా తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో వైద్య పరీక్షల సదుపాయంతోపాటు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. కొత్తగూడెం కేంద్రంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మంచిర్యాల కేంద్రంగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్రెడ్డి వైద్య శిబిరాలతోపాటు ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. వరదలపై శాశ్వత ప్రణాళిక: సీఎం సాక్షి ప్రతినిధి, వరంగల్: ఏటా గోదావరి భారీ వరదల నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను శాశ్వతంగా రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు, వరదలు రావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైరైన ఇంజనీర్ల సలహాలు తీసుకుంటామన్నారు. గోదావరి వరద పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంలో భాగంగా శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగంతో కలిసి రోడ్డు మార్గంలో హనుమకొండకు చేరుకున్నారు. మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి, ఇతర ఉపనదుల వరద ప్రవాహం, కాంటూర్ లెవల్స్, కరకట్టల నాణ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అత్యవసర సహాయం కోసం కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నిర్మల్, జిల్లాల కలెక్టర్లకు రూ. కోటి చొప్పున వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావును ఆదేశించారు. మందులు, ఆహారం అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, జోగినిపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతించిన గోదారి!.. వందేళ్లలో రెండో అతిపెద్ద వరద
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారీ వర్షాలతో వారం పాటు మహోగ్ర రూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ఎగువన శ్రీరాంసాగర్లోకి వరద బాగా తగ్గిపోగా.. దిగువన భద్రాచలం వద్ద గడగడా వణికించి మెల్లగా వెనక్కి తగ్గుతోంది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి శ్రీరాంసాగర్కు వరద 16 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఎల్లంపల్లికి 1,08,940 క్యూసెక్కులు వస్తోంది. అయితే ప్రాణహిత, కడెం, ఇంద్రావతి ఉపనదులు, ఏజెన్సీ వాగుల్లో ప్రవాహాలు ఇంకా ఉండటంతో.. లక్ష్మిబ్యారేజీ వద్ద 10,94,150 క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీ వద్ద 13,16,500 క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 20,60,131 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీల వద్ద వచ్చింది వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. తగ్గినా.. గణనీయంగానే.. భారీగా పోటెత్తిన వరదతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు 71 అడుగుల మట్టంతో 24,29,246 లక్షల క్యూసెక్కుల వరదరాగా.. శని వారం తెల్లవారుజామున 4 గంటల సమయానికి 24,43,684 క్యూసెక్కులతో 71.3 అడుగుల గరిష్ట స్థాయి వరద నమోదైంది. ఆ తర్వాత క్రమంగా ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడిన ప్రజలు క్రమంగా తేరుకుంటున్నారు. అయితే లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. భారీగా ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయామంటూ భద్రాచలంలోని లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు. నాటు పడవలో వెళ్తూ తమ షాపులను చూసుకుంటున్న స్థానికులు 53 అడుగులకు తగ్గితేనే.. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులకన్నా తగ్గితేనే మూడో ప్రమాద హెచ్చరికకు ఉపసంహరిస్తారు. అప్పటివరకు లోతట్టు ప్రాంతాలు వరద ముప్పులో ఉన్నట్టే లెక్క. చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో మూడు రోజులుగా విద్యుత్ నిలిచిపోగా.. గోదావరి వరద తగ్గేవరకు పునరుద్ధరించే పరిస్థితి కనిపించడం లేదు. అశ్వాపురం మండలం కమ్మరిగూడెంలోని మిషన్ భగీరథ ఇన్టేక్ వెల్ వరద మునిగే ఉండటంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 1,730 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల పంచాయతీ నుంచి ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం తగ్గే వరకు ప్రజలకు మంచినీటి కష్టాలు కొనసాగనున్నాయి. పారిశుధ్యంపై దృష్టిపెట్టిన అధికారులు గోదావరి నీరు వెనక్కి మళ్లిన తర్వాత ముంపు ప్రాంతాల్లో భారీగా బురద, చెత్తా చెదారం నిండిపోయి ఉంటుంది. దీంతో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్, వరద సహాయ కార్యక్రమాల ప్రత్యేక అధికారి హనుమంతరావు అధికారులను ఆదేశించారు. అంతకంటే ముందు ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయ కార్యక్రమాలపై మంత్రి పువ్వాడ సమీక్ష నిర్వహించారు. నీటిలో చిక్కుకున్న గ్రామాలు, కాలనీలు బయటపడితే గానీ ఆస్తి నష్టం ఏ స్థాయిలో జరిగిందనేది తెలియదని అధికారులు అంటున్నారు. సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సిబ్బంది పాల్గొంటున్నారు. వందేళ్లలో రెండో అతిపెద్ద వరద గత వందేళ్లలో గోదావరికి వచ్చిన అతిపెద్ద వరదల్లో తాజా ప్రవాహం రెండో అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. 1986 ఆగస్టు 15న భద్రాచలం వద్ద 75.6 అడుగుల వరకు వచ్చిన ప్రవాహం అతిపెద్ద వరదగా రికార్డుల్లో నమోదైంది. కాగా భద్రాచలం వద్ద శనివారం రాత్రి 9 గంటల సమయానికి వరద 22,41,144 క్యూసెక్కులకు, నీటిమట్టం 67.7 అడుగులకు తగ్గింది. గోదారమ్మా శాంతించు.. ‘గోదారమ్మా.. శాంతించు.. ప్రజలను చల్లంగా చూడు’అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శనివారం భద్రాచలంలో పూజలు చేశారు. సీతారామ చంద్రస్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గోదావరికి పసుపు, కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. సస్యశ్యామల మాతగా పేరొందిన గోదావరి ఒడ్డున అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా కరుణించాలని కోరుకున్నట్టు మంత్రి తెలిపారు. – భద్రాచలం -
Godavari Floods 2022: ఇళ్లన్నీ నీళ్లలోనే..
ఏటూరునాగారం/మంగపేట/ఎస్ఎస్ తాడ్వాయి/మహాముత్తారం/కాళేశ్వరం: గోదావరి క్రమంగా శాంతిస్తున్నా పరీవాహక ప్రాంతంలోని పలు గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండలాల్లోని పలు గ్రామాల్లో వరద ఉండిపోగా.. కొన్ని గ్రామాల్లో తగ్గుముఖం పట్టింది. ఏటూరునాగారం మండల కేంద్రంలోని పలు కాలనీలు, రామన్నగూడెం, రాంనగర్, లంబాడీతండా, రొయ్యూరు గ్రామాలు ఇంకా ముంపులో ఉన్నాయి. మిగతా గ్రామాల్లో వరద తగ్గడంతో జనం పునరావాస శిబిరాల నుంచి ఇంటిముఖం పడుతున్నారు. తడిసిన వస్తువులు, మంచాలు, వంట సామగ్రిని శుభ్రం చేసుకుంటున్నారు. భారీ వర్షాలు, వరదతో ఏటూరునాగారం మండలంలో 48 ఇళ్లు కూలిపోయాయి. నీట మునిగిన గ్రామాల్లో ఇళ్లు, వీధులు, రోడ్లన్నీ బురదతో నిండిపోయాయి. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జంపన్నవాగు రెండు బ్రిడ్జీలపై నుంచి వచ్చిన వరద వ్యాపారుల దుకాణాలను ముంచెత్తింది. మినరల్ వాటర్ ప్లాంట్ మోటార్లు. వంట సామగ్రి పాడైపోయాయి. కొన్ని సామాన్లు వరదలో కొట్టుకుపోయాయని వ్యాపారులు తెలిపారు. మంగపేట మండలంలోని కమలాపురం, మంగపేట, తిమ్మంపేట, మల్లూరు, చుంచుపల్లి, కత్తిగూడెం, రాజుపేట, అకినేపల్లి మల్లారంలో గోదావరి తీరం వెంట లోతట్టు ప్రాంతాలను వరద వీడలేదు. మంగపేటలోని వడ్డెర కాలనీలో ఇళ్లు బయటపడ్డాయి. భారీగా రోడ్లు ధ్వంసం జంపన్నవాగు వరదకు కొత్తూరు నుంచి రెడ్డిగూడెంకు వచ్చే దారిలో కల్వర్టు, సీసీ రోడ్డు కోతకు గుర య్యాయి. తూములవాగు వరద తాకిడికి ఊరట్టం సీసీ రోడ్డు కింది భాగం కోతకు గురై పెద్ద గొయ్యి ఏర్పడింది. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కేశవాపూర్ సమీపంలోని మేడారం వెళ్లే డబుల్ రోడ్డు వందమీటర్ల పొడవు నా తెగిపోయింది. కొంచెం దూరంలో డబుల్ రోడ్డు ఓవైపు యాభై మీటర్ల పొడవున కోతకు గురైంది. ఈ మండలంలోని 24 గ్రామపంచాయతీల పరిధిలో 80 శాతం రహదారులు తెగిపోవడంతో.. గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాళేశ్వరం పరిధిలోని అన్నారం కెనాల్ కట్టపై వరదకు బీటీ రోడ్ కనిపించకుండా ఇసుక మేటలు వేసింది. కాళేశ్వరం నుంచి సిరొంచ వెళ్లే జాతీయ రహదారి పెద్ద మొత్తంలో కొట్టుకుపోయింది. -
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద బీభత్పం ( ఫొటోలు)
-
భద్రాచలంకు మూడు వైపులా చుట్టుముట్టిన వరద
-
CM YS Jagan: అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: గోదావరి ముంపు గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రధానంగా లంక గ్రామాలతో పాటు వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని, గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లోతట్టు ప్రాంతాల వారందరినీ సహాయ శిబిరాలకు తరలించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఇది చాలా ప్రధాన అంశమని, వచ్చే 24 గంటలు చాలా కీలకమని (క్రిటికల్), హై అలర్ట్ (అత్యంత అప్రమత్తం)గా ఉండాలని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లా, యానాం ప్రాంతాల్లో పరిస్థితులను హెలికాప్టర్ ద్వారా సుమారు గంటన్నర పాటు ప్రత్యక్షంగా పరిశీలించారు. ముంపునకు గురైన పొలాలు, ఇళ్లు, రహదారులను పరిశీలించి పరిస్థితిపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయం నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించినట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, సహాయ చర్యలపై ఆరా తీశారు. ముంపు గ్రామాలు, ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, వైద్యం.. మందులు సహా అత్యవసర సేవలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులకు సైతం తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అందుబాటులో సీఎంవో కార్యదర్శులు ►వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించాం. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోరినా.. సీఎస్ సహా వీరంతా యుద్ధ ప్రాతిపదికన వారికి ఆ సాయం అందించేలా చూడాలి. సీఎంవో కార్యదర్శులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శనివారం కూడా గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ►గట్లు బలహీనంగా ఉన్న చోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన పక్షంలో గండ్లకు ఆస్కారం ఉన్న చోట తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా వీలైనన్ని ఇసుక బస్తాలు తదితర సామగ్రిని సిద్ధం చేయాలి. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాజమండ్రిలో రెండు హెలికాప్టర్లు సిద్ధం ►రాజమండ్రిలో రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు వీటిని వినియోగించుకోవాలి. గ్రామాల్లో పారిశుధ్య సమస్య రాకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలి. పాము కాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలి. ►వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలి. బాధితులను ఆదుకోవడంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం లేకుండా చూసుకోవాలి. సెల్ టవర్లకు డీజిల్ సరఫరా చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలి. ►వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలి. 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలి. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు ఇవ్వాలి. ►సమీక్షలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేడ్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గోదావరి ఉధృతి.. పాత రికార్డులన్నీ బద్దలు..?!
భద్రాచలం: భద్రాచలం వద్ద ఈసారి గోదావరి ఉధృతి పాత రికార్డులన్నీ బద్దలుగొట్టే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న 75.6 అడుగుల వరద రావడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఆ తర్వాత 1990 ఆగస్టు 24న 70.8 అడుగుల వరద రెండో స్థానంలో నిలిచింది. ఈసారి వరద రెండో రికార్డును శుక్రవారం రాత్రి 8గంటలకు దాటేసింది. ఇప్పటివరకు జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదల్లో ఇదే అత్యధికం. ప్రవాహం మరింతగా పెరుగుతుందన్న అంచనాల మేరకు.. 1986 నాటి రికార్డును కూడా తాజా వరద అధిగమిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జూలై నెలలోనే కాకుండా.. గోదావరి వరదల్లోనే ఇదే అతి పెద్దదిగా నమోదు కానుంది. -
36 ఏళ్ల తర్వాత భద్రాచలంలో 70 అడుగులు దాటిన గోదావరి
-
ఇలాంటి వరదలు రావడం ఇదే మొదటిసారి
-
వరద పెరుగుతుండటంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
-
ప్రళయ గోదావరి
-
గోదారమ్మా శాంతించు.. ఇలా అయితే బ్రతికేదెలా.. 36 ఏళ్ల రికార్డు బ్రేక్
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 36 ఏళ్ల తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. ఇదిలా ఉండగా.. గత 50 ఏళ్లలో మూడు సార్లు మాత్రమే గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. ఇక, ప్రస్తుతం గోదావరిలోకి 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, అధికారులు భద్రాచలం గోదావరి కరకట్టను డేంజర్ జోన్గా ప్రకటించారు. ఇప్పటికే భద్రాచలంలో పలు కాలనీలు నీటమునిగాయి. రామాలయం ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 2వేల కుటంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. Godavari water level has touched a high of 70 ft at 2.30 pm. #Bhadrachalam #TelanganaFloods pic.twitter.com/8MqZ30vpAO — Inspired Ashu. (@Apniduniyama) July 15, 2022 ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా గోదావరి వరదతో విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్లను గోదావరి వరద ముంచెత్తింది. లక్ష్మీ బ్యారేజ్ వద్దకు 28.30 లక్షల క్యూసెక్కులు చేరడంతో కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 16.72 అడుగులకు చేరుకుంది. గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35,06,338 క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోవడం గమనార్హం. ఇక ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. ఇది కూడా చదవండి: ఉగ్ర గోదారి 'హై అలర్ట్' -
భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం
-
గోదావరి తీర ప్రాంతంలో వరదలతో అల్లకల్లోలం
-
తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఐదు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని తెలిపింది. మరో మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉండడంతో.. మిగతా చోట్ల సైతం సాధారణం నుంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం వద్ద.. అరుదుగా వరదలొచ్చే నదులు పొంగిపొర్లడంతో మూకుమ్మడిగా గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ప్రాణహిత, పెన్గంగా, వార్ధా నదులు వరదలతో ఉగ్రంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్, కడెం నుంచి దిగువకు భారీగా వరద నీరు విడుదల అవుతోంది. భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. పలిమెల పోలీస్ స్టేషన్ నీట మునిగింది. మేడిగడ్డ కంట్రోల్ రూంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు కొందరు జలదిగ్భందంలో చిక్కుకున్నట్లు సమాచారం. అలాగే భద్రాద్రికి రాకపోకలు బంద్ అయ్యాయి. మిగిలిన ఏకైక మార్గం కూడా మూసివేశారు అధికారులు. అత్యవసరమైతేనే భద్రాద్రిలోకి అనుమతిస్తున్నారు. భద్రాచలం బ్రిడ్జిపై 48 గంటల పాటు రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలంలో 144 సెక్షన్ విధించారు. 48 గంటలపాటు ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం 62 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం.. రాత్రికి లేదంటే రేపు ఉదయానికి గోదావరి మట్టం 70 అడుగులకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాలు డేంజర్ జోన్లో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. సీఎస్ సోమేశ్కుమార్ అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏపీలోనూ.. రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉదృతంగా ఉంది. నీటిమట్టం 16 అడుగులు దాటింది. 17.75 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. అదే జరిగితే ఆరు జిల్లాలపై ప్రభావం పడనుంది. 42 మండలాల్లోని 524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపులోకి మరికొన్ని ప్రాంతాలు. ఆచంట, యలంచిలి మండలాల్లో లంకగ్రామాలు నీట మునగ్గా.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద సహాయక చర్యల్లో ఏడు ఎన్డీఆర్ఎఫ్, ఐదు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఏపీ విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
60 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
-
భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
-
ఎడతెరపి లేని వర్షాలతో ఉప్పొంగుతున్న గోదావరి
-
ఉప్పొంగుతున్న గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/రాజమహేంద్రవరం/ధవళేశ్వరం/చింతూరు/సాక్షి, అమలాపురం/అయినవిల్లి: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లోని.. నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) నుంచి రాష్ట్రంలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. వందేళ్ల చరిత్రలో జూలైలో గోదావరికి ఇంత భారీ వరద రావడం ఇదే ప్రథమం. బేసిన్లో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షాలు కురువడంతో గోదావరితోపాటు కడెంవాగు, ప్రాణహిత తదితర ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. దాంతో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి వరద ఉధృతికి పార్వతి, లక్ష్మి, సరస్వతి బ్యారేజీల గేట్లను తెలంగాణ అధికారులు పూర్తిగా ఎత్తేశారు. దాంతో తుపాకులగూడెం లోకి 9.31 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. అంతేస్థాయిలో వరదను తుపాకులగూడెం నుంచి దిగువకు వదిలేస్తున్నారు. ఈ బ్యారేజీకి దిగువన బేసిన్లో కురిసిన వర్షాలకు వరద తోడవడంతో సీతమ్మసాగర్లోకి 13,42,030 క్యూసెక్కులు చేరుతోంది. సీతమ్మసాగర్ గేట్లు ఎత్తేసి.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. వాటికి ఉప నదుల వరద తోవడంతో మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో 13,49,465 క్యూసెక్కులు ప్రవహిస్తోంది. ఏలూరు జిల్లా రేపాకగొమ్ము గ్రామస్తులను బోట్పై తరలిస్తున్న దృశ్యం పోలవరం ప్రాజెక్టులోకి 12.5 లక్షల క్యూసెక్కులు పోలవరం ప్రాజెక్టులోకి గోదావరి వరద కొనసాగుతోంది. వరద పరిస్థితిపై సీఈ సుధాకర్బాబు, ఎస్ఈ నరసింహమూర్తిలు సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్టులోకి మంగళవారం రాత్రి 9 గంటలకు 12.5 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. స్పిల్ వే వద్ద వరద నీటి మట్టం 34.2 మీటర్లకు చేరింది. స్పిల్ వే 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి.. 12.5 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వే దిగువన దిగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటి మట్టం 25.4 మీటర్లకు చేరుకుంది. ఎగువ నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి మంగళవారం రాత్రి 9 గంటలకు 14.66 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 14.75 అడుగులకు చేరుకుంది. దాంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. డెల్టాకు నీటిని విడుదల చేసి మిగులుగా ఉన్న 14.65 లక్షల క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 17.11 మీటర్లు ఉంది. మరోవైపు.. వరద తీవ్రత పెరగడంతో పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 24 గ్రామాల్లో 7 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. 9 గ్రామాల్లో 2,900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కూనవరం, వీఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో వరద పెరుగుతూనే ఉంది. కూనవరం, వీఆర్పురం మండలాల నడుమ శబరి నదిపై ఉన్న వంతెన పైకి వరదచేరడంతో రాకపోకలు నిలిపివేశారు. ధవళేశ్వరం బ్యారేజి నుంచి వరద (ఏరియల్ వ్యూ) కోనసీమ లంకల్లో కలవరం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉధృతి పెరుగుతుండటంతో జిల్లాలో 18 మండలాల పరిధిలో 51 గ్రామాలపై వరద ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా. 13 మండలాల పరిధిలోని 43 గ్రామాల చుట్టూ మంగళవారం రాత్రికి వరద నీరుచేరింది. ఈ జిల్లాలో పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, మామిడికుదురు మండలాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. పి.గన్నవరం మండలంలో జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక, ఉడుమూడిలంక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాల్లేవు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కనకాయలంక జలదిగ్బంధంలో చిక్కుకుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను, పశువులను లంక గ్రామాల నుంచి ఏటిగట్ల మీదకు తరలిస్తున్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేశారు. లంకవాసుల రక్షణకు 400 బోట్లు, 925 మంది గజఈతగాళ్లను సిద్ధంచేశారు. అయినవిల్లి మండలంలోని పొట్టిలంకకి చెందిన పదిహేను మంది రైతులు పెద్ద ముప్పు తప్పింది. వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో వీరు పడవలపై పశువులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా పడవ ఇంజిన్ పేలింది. దీంతో పడవలో ఏడు కిలోమీటర్లు మేర ముమ్మిడివరం మండలంలోని శేరులంక వరకు వెళ్లి అక్కడ నుంచి గమ్యానికి చేరుకుని ఊపిరిపీల్చుకున్నారు. మరో 3 రోజులు వరద ఉధృతి గోదావరి పరివాహక ప్రాంతంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో.. ఎగువ నుంచి భారీ వరద వస్తుందంటూ బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను సీడబ్ల్యూసీ అప్రమత్తం చేసింది. గరిష్టంగా 16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
‘తగ్గేదేలే..’ అంటున్న ఏజెన్సీవాసులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే!’ అంటూ ఫారెస్టు అధికారుల కళ్లు కప్పి ఎర్ర చందనం దుంగలను నీటి ప్రవాహంలో విడిచి, డ్యామ్ దగ్గర సేకరించే సినిమా సీన్కు ప్రేక్షకులు సీటీలు కొట్టారు. అయితే స్మగ్లింగ్తో సంబంధం లేకుండా గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ వాసులు కూడా ‘తగ్గేదేలే..’ అంటూ సాహసాలు చేస్తుంటారు. వర్షానికి నేల కూలిన భారీ చెట్లు, అడవుల్లో ఎప్పుడో పడిపోయి ఎండిపోయిన చెట్లదుంగలు వరదనీటిలో కొట్టుకొస్తుంటాయి. స్మగ్లర్లు దాచిపెట్టిన కలప దుంగలు కూడా అప్పుడప్పుడు ప్రవాహంలో కలుస్తుంటాయి. ఇచ్చంపల్లి దగ్గర ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత ఇలాంటి దుంగలు కొట్టుకొస్తాయి. ఆ కలపకోసం ఏజెన్సీవాసులు ప్రాణాలకు తెగించి మరబోట్లపై వెళ్తున్నారు. కొట్టుకొచ్చే దుంగలను పట్టుకుని బోటులో వేయడమో లేదా తాడుకు కట్టో ఒడ్డుకు చేరుస్తారు. వరద సమయంలో చర్ల మొదలు రాజమహేంద్రవరం వరకు ఈ తరహా దృశ్యాలు కనిపిస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో మంగళవారం కలప కోసం, సుమారు 52 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్న గోదావరిలో కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ కనిపించారు. టేకు దుంగలు అరుదుగా కొట్టుకొస్తాయని చెబుతున్నారు. -
‘మూసీ’లా మారే ప్రమాదం
గంగానదితో సహా మనదేశంలో అనేక ముఖ్యనదులు, వాటి ఉపనదులు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా నదుల్లో కూడా కాలుష్యం బాగా పెరిగిపోయింది. గోదావరి నది వెంబడి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పారిశ్రామిక వ్యర్థాలను; వివిధ పట్టణ, నగరాల ‘సీవరేజ్’ను శుద్ధిచేయకుండా వదిలివేస్తుండటంతో దానిలో కాలుష్య స్థాయి ప్రమాద ఘంటికలను మ్రోగిస్తోంది. భద్రాచలం ఎగువన ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధిచేయకుండా నదిలోకి వదిలేస్తున్నాయి. భద్రాచలం పట్టణం నుండి వచ్చే మురుగు... ‘ఫిల్టరేషన్’ లేకుండానే గోదావరిలో కలుస్తోంది. ఐటీసీ పేపర్ బోర్డు పరిశ్రమ నుండి వచ్చే మురుగునీరు నేరుగా గోదావరిలో కలిసిపోతోంది. అలాగే ఇతర పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వల్ల కూడా గోదావరి కాలుష్యం బారిన పడుతోంది. మూడు దశాబ్దాలకు ముందు 1991లో రూ. 34.19 కోట్లతో ‘గోదావరి నదీ కాలుష్య నివారణ పథకం’ ప్రయత్నం మొదలైనా... అలసత్వం వల్ల అది అమలుకు నోచుకోలేదు. కృష్ణానదిలో కాలుష్యం మరింత దారుణంగా ఉంది. గత దశాబ్ద కాలంలో కృష్ణానదిలో వివిధ రకాల కాలుష్యం రెట్టింపైనట్లు నిపుణులు చెపుతున్నారు. కృష్ణానదిలో ‘బయొలాజికల్ ఆక్సిజన్ డిమాండ్’ (బీఓడీ), ‘అల్కల్నిటీ’ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. దీని కారణంగా ‘ఆహార ప్రక్రియ పరిణామ క్రమం’లో తీవ్రమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదుల ప్రక్షాళనకు తగిన చర్యలు తీసుకోకపోతే మూసీ నదిలా మురుగు కాల్వల్లా ఇవీ మారిపోయే ప్రమాదం ఉందని గ్రహించి సత్వరమే కార్యాచరణకు పూనుకోవాలి. – డా. కొత్తపల్లిశ్రీనివాసవర్మ, జర్నలిస్టు మార్చి 14న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ -
Andhra Pradesh: వడివడిగా వరదాయని
సాక్షి, అమరావతి: ఉత్తుంగ గోదావరిపై ఎనిమిది దశాబ్దాల స్వప్నం శరవేగంగా ఆవిష్కృతమవుతోంది. స్పిల్ వేను పూర్తి చేసి గోదావరి ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యామ్తో అడ్డుకట్ట వేయడంతో పోలవరం జలాశయం ఇప్పటికే సుందర రూపం సంతరించుకుంది. జలాశయం, అనుసంధానాల పనులు 80.6 శాతం, కుడి కాలువ పనులు 92.57 శాతం, ఎడమ కాలువ పనులు 71.11 శాతం పూర్త య్యాయి. నిర్వాసితులకు పునరావాస కల్పన పను లు 20.19 శాతం పూర్తయ్యాయి. పునరావాసం, భూసేకరణ, జలాశయం, కుడి, ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు మొత్తంగా చూస్తే 42.68 శాతం పనులు పూర్తయ్యాయి. గోదావరి సహజ ప్రవాహాలు, సీలేరు నుంచి వచ్చే జలాలకు తోడు పోలవరం లో నిల్వ చేసిన నీటితో రబీలో గోదావరి డెల్టాకు సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతోంది. గత సర్కారు అవగాహన రాహిత్యం, ప్రణాళిక లోపం, చిత్త శుద్ధి లేమితో చేపట్టిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) డయాఫ్రమ్ వాల్, దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ 2019, 2020లో గోదావరి వరద ఉధృతికి కొంత భాగం దెబ్బతింది. కోతకు గురైన డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్లను డ్యా మ్ డిజైన్ రివ్యూ ప్యానల్, సీడబ్ల్యూసీ మార్గదర్శ కా ల మేరకు బాగుచేసి జలాశయాన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీడ బ్ల్యూసీ, ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) ఆమోదించిన మేరకు 2017–18 ధరల ప్రకారం పోలవరానికి కేంద్రం నిధులిస్తే ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. జీవనాడికి జవసత్వాలు.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 2019 జూన్ 20న పోల వరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలు త వరద మళ్లించే స్పిల్ వేను పూర్తి చేసి తర్వాత కాఫర్ డ్యామ్లు, సమాంతరంగా పునరావాస పను లు, కాఫర్ డ్యామ్ల మధ్య ఈసీఆర్ఎఫ్ను చేపట్టి వరద సమయంలోనూ పనులు కొనసాగించడం ద్వారా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు. టీడీపీ సర్కార్ నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన ప నులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచారార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షించారు. తాజాగా శుక్రవారం రోజు ఐదోసారి పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం పనుల పరిశీలనకు తొలిసారిగా రానుండటం గమనార్హం. ప్రణాళికాయుతంగా పనులు.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను ప్రభుత్వం పరుగులు తీయించింది. స్పిల్వేలో మిగతా ఆరు గేట్ల బిగింపు పనులకు శ్రీకారం చుట్టింది. గతేడాదే ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసింది. గతేడాది జూన్ 11న గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ చానల్, స్పిల్వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా 6.6 కి.మీ. పొడవున మళ్లించింది. జలవిద్యుత్కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించడమే ఆలస్యం.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ను పూర్తి చేసి సమాంతరంగా జలవిద్యుత్కేంద్రం పనుల పూర్తి దిశగా అడుగులు వేస్తోంది. పునరావాసంపై ప్రత్యేక దృష్టి.. పోలవరంలో పునరావాసం, భూసేకరణకు రూ.35,669.08 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం లెక్కించగా.. అది రూ.33,163.28 కోట్లుగా సీడబ్ల్యూసీ తేల్చింది. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో అతి కష్టమ్మీద 1,846 ఇళ్ల నిర్మాణం చేపట్టి కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా 4,505 కుటుంబాలకు పునరావాసం కల్పించి రూ.6,654.39 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం పూర్తయితే 38.41 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది. తక్కువ ధరకే 960 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులోకి వస్తుంది. విశాఖ పారిశ్రామిక అవసరాలను తీర్చడంతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ, ఉత్తరాంధ్ర తాగునీటి కష్టాలు తీర్చవచ్చు. -
గోదావరి గట్టెక్కింది
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/ధవళేశ్వరం: సాగు నీటి ఎద్దడి లేకుండా రబీ రైతు గట్టెక్కేసినట్టే. ప్రభుత్వ సంకల్పానికి గోదారమ్మ తోడైంది. సహజ జలాలు తక్కువగా ఉండటంతో పూర్తి ఆయకట్టుకు సాగునీరందదని ఆందోళన చెందినా ప్రభుత్వ పట్టుదలకు పరిస్థితులు సానుకూలంగా కలిసొచ్చాయి. దీంతో రైతులు గుండె నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 10న కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 5.50 అడుగుల కనిష్టానికి నమోదైంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిని డెల్టాల సాగు కోసం విడిచిపెట్టారు. అరకొరగా సాగునీరు అందుతోందని అందోళన చెందుతోన్న సమయంలో అఖండ గోదావరి ఎగువన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలతో తెలంగాణాలోని లక్ష్మీ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జనవరి 14 నాటికి బ్యారేజ్ వద్ద నీటి సామర్థ్యం పూర్తి స్థాయికి చేరుకుంది. అప్పటివరకూ ఆందోళన చెందిన రైతులు ఉపసమనం చెందారు. జనవరి నెలాఖరుకు సాగు వసరాలకు నిల్వలు సరిపోవడంతో ఈ సారి అనూహ్యంగా మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గడచిన పదేళ్లలో జనవరిలో మిగులు జలాలను విడుదల చేయడం తొలిసారిగా బ్యారేజీ రికార్డులకు ఎక్కింది. ఫలితంగా నెలంతా సాఫీగానే సాగునీరు సరఫరా సాగింది. ఫిబ్రవరిలోనే ఏర్పడిన ధీమా ఫిబ్రవరి 13 నుంచి నీటి మట్టం తగ్గడంతో మరోసారి రబీ రైతులు టెన్షను పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిశాయి. ఆ వర్షాలతో గోదావరి జలాలు కాటన్ బ్యారేజ్కి చేరాయి. ఫలితంగా ఫిబ్రవరి నెలంతా సాగునీటికి ఇబ్బంది లేకుండా నీరు విడుదలైంది. ప్రభుత్వ భరోసాతో రైతులు ధైర్యంగా చేపట్టిన పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రబీకి సాగునీటి కొరత లేదనే విషయం దాదాపు ఖాయమైంది. సాగు, తాగు నీటికి మొత్తం 94టీఎంసీలు అవసరమని ప్రాథమికంగానే నీటిపారుదలశాఖాధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 62.82 టీఎంసీలు ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రబీ సీజన్ ముగిసే నాటికి మరో 32 టీఎంసీల నీరు విడుదలచేస్తే సరిపోతుంది. అవసరమైతే రెడీగా సీలేరు నీరు విశాఖ జిల్లా సీలేరు నుంచి మన డెల్టాలకు 38 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు 9.09 టీఎంసీలు మాత్రమే వినియోగించుకున్నాం. భవిష్యత్ అవసరాల కోసం సీలేరులో 29 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రభుత్వం రబీ సాగు ప్రణాళిక ప్రకటన రోజు ఏమని చెప్పిందో దానిని నిజం చేసి చూపించిందని చెప్పవచ్చు. ఇందుకు ప్రకృతి కూడా తోడ్పాటునందించడంతో ఎలాంటిì ప్రతిబంధకాలు లేకుండా రబీ గట్టెక్కినట్టేనని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ రబీలో 8,96,533 లక్షల ఎకరాలకు 87టీఎంసీల సాగు నీరు అవసరమని ఇరిగేషన్ అధికారులు తొలుత అంచనా వేశారు. సాగు, తాగు నీటికి మరో 7 టీఎంసీలతో కలిపి మొత్తం 94 టీఎంసీలు అవసరమని లెక్కతేల్చారు. సోమవారం నాటికి మూడు డెల్టాలకు కలిపి బ్యారేజ్ నుంచి 62.82 టీఎంసీలు విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 18.37టీఎంసీలు, మధ్య డెల్టాకు 12.01టీఎంసీలు, పశ్చిమ డెల్టా 32.44టీఎంసీలు విడుదలయ్యాయి. రబీకి పుష్కలంగా సాగునీరు రబీలో ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ప్రతి ఎకరాకు సాగు నీరందించగలగుతున్నాం. అవసర సమయంలో ఎగువన వర్షాలు కురవడం, పోలవరం ప్రాజెక్టులో నీరు కూడా ఈ సీజన్లో కలిసి వచ్చింది. వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఇది సాధ్యమైంది. మార్చి నెలలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరందిస్తాం. – పి.రాంబాబు, సూపరింటెండెంట్ ఇంజినీర్, నీటి పారుదల శాఖ, ధవళేశ్వరం -
అధ్యయనం తర్వాతే అనుసంధానం
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: గోదావరిలో నీటి లభ్యత తేల్చాకే గోదావరి – కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ)లతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి కావేరికి జలాలను తరలించాలని ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనం చేయిస్తామని తెలిపింది. గోదావరి– కావేరి అనుసంధానంపై శుక్రవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్కుమార్, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి అధికారులు పాల్గొన్నారు. మిగులు జలాలపై పూర్తి హక్కు ఏపీదే ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల నీరు ఉందని, అందులో 247 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా మళ్లిస్తామన్న కేంద్రం ప్రతిపాదనపై ఏపీ, తెలంగాణ అభ్యంతరం తెలిపాయి. గోదావరిలో మిగులు జలాలు అంత లేవని ఏపీ స్పష్టంచేసింది. మిగులు జలాలపై పూర్తి హక్కును ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని గుర్తు చేసింది. తమ అవసరాలను కేంద్రం తక్కువగా అంచనా వేయడంపై అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి వద్ద ఉన్న జలాలన్నీ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న ప్రాజెక్టులకే సరిపోతాయని తెలంగాణ తెలిపింది. ఉభయ రాష్ట్రాల అవసరాలు పోను మిగిలి ఉన్న జలాలను మాత్రమే తరలించాలని తెలుగు రాష్ట్రాలు కోరాయి. గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సూచించాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలతో సంయుక్తంగా అధ్యయనం చేస్తామని తెలిపింది. చదవండి: (ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం) ఛత్తీస్గఢ్ నుంచి 147 టీఎంసీలు గోదావరి నుంచి మళ్లిస్తామన్న 247 టీఎంసీలలో 147 టీఎంసీలు చత్తీస్గఢ్ నుంచి, మరో 100 టీఎంసీలు తెలంగాణ నుంచి తీసుకోవాలన్న కేంద్రం ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలంగాణ పరిధిలో మిగులు జలాలు లేవని స్పష్టం చేసింది. దాంతో.. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 147 టీఎంసీలను తొలి దశలో మళ్లిద్దామని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ఛత్తీస్గఢ్ను ఒప్పించాలని సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలకు పంకజ్కుమార్ చెప్పారు. ఛత్తీస్గఢ్ నీటిలో ఏ రాష్ట్రాలు ఎంత వాడుకోవాలన్నది చర్చించి నిర్ణయిద్దామని జల్ శక్తి శాఖ సూచించింది. మళ్లించే జలాల్లో రాష్ట్రాలకు కేటాయించిన నీటిపై కర్ణాటక అభ్యంతరాలు తెలిపింది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే మళ్లింపు జలాల్లో కర్ణాటకకు వాటా ఉంటుందని చెప్పింది. కృష్ణా నుంచి కావేరికి నీటిని తరలించే 84 టీఎంసీల్లోనూ కర్ణాటకకు వాటా ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. కావేరికి మళ్లించే గోదావరి జలాల్లో కేటాయింపులు పెంచాలని తమిళనాడు కోరింది. కెన్–బెత్వా తరహాలోనే నిధులు గోదావరి–కావేరి అనుసంధానం ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించాలన్న కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనపై అన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. కెన్–బెత్వా అనుసంధానానికి ఇస్తున్న తరహాలోనే 90 శాతం నిధులను కేంద్రం ఇవ్వాలని, మిగతా పది శాతం తాము భరిస్తామని అన్ని రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. పోలవరం నుంచే కావేరికి గోదావరి మిగులు జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా) – సోమశిల (పెన్నా) – కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కి తరలించడంపై ఏపీ అభ్యంతరం చెప్పింది. నాగార్జున సాగర్, సోమశిల రిజర్వాయర్లలోని జలాలు వాటి కింద ఆయకట్టుకే సరిపోవడంలేదని చెప్పింది. ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా కావేరికి గోదావరిని తరలించడం సాధ్యం కాదని స్పష్టంచేసింది. చెన్నైకి తాగు నీటి కోసం ఎగువ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నీటిని వరద సమయంలో ఇచ్చేశామని ఆ రాష్ట్రాలు చెబుతున్నాయని, దాంతో శ్రీశైలంలో ఉన్న తమ రాష్ట్రం కోటా నీటినే చెన్నైకి ఇవ్వాల్సి వస్తోందని కేంద్రానికి ఏపీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి జలాలను బొల్లాపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్కు, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించి.. చెన్నైకి సరఫరా చేస్తున్న మార్గంలోనే కావేరికి తరలించాలని ప్రతిపాదించింది. పోలవరం దిగువ నుంచి వెళ్లే నీరంతా వృధాగా సముద్రంలోకి కలుస్తుంది కాబట్టి ఆ నీటిని మళ్లిస్తే అధిక ప్రయోజనం ఉంటుందని వివరించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, ఈ అలైన్మెంట్పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామంది. -
Budget 2022: నదులతో ‘ఓట్ల’ అనుసంధానం!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం తన బడ్జెట్లో రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ బుందేల్ఖండ్ ప్రాంత తాగు, సాగునీటి వసతిని కల్పించే కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియకు అత్యం త ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్లో కేంద్ర ఆమోదం లభించిన ఈ నదుల అనుసంధానానికి 2002–23 వార్షిక బడ్జెట్లో రూ.1,400 కోట్ల కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం లోక్సభలో తన బడ్జెట్ ప్రసంగంలో నదుల అనుసంధాన ప్రక్రియను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘రూ.44,605 కోట్ల అంచనా వ్యయంతో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్ట్ను చేపట్టనున్నాం. దీని ద్వారా 9.05 లక్షల హెక్టార్ల రైతుల భూములకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 103 మెగావాట్ల హైడ్రో, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. దీనికై 2022–23లో రూ.1,400 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించాం’అని పేర్కొన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి నీటి కొరత ఎదుర్కొంటున్న బుందేల్ఖండ్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరనుంది. గోదావరి – కావేరి అనుసంధాన డీపీఆర్లు ఖరారు మరో ఐదు నదుల అనుసంధాన ప్రక్రియపై కేంద్ర ఆర్ధికమంత్రి కీలక ప్రకటన చేశారు. దామనగంగ–పింజల్, పర్ తాపీ– నర్మద, గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి అనుసంధానం ముసాయిదా డీపీఆర్లు ఇప్పటికే ఖరారయ్యాయని వెల్లడించారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కేంద్రం తోడ్పాటును అందిస్తుందని ప్రకటించారు. ఇందులో గోదావరి మొదలు కావేరి వరకు జరిగే అనుసంధాన ప్రక్రియ అంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేవి. ఇచ్చంపల్లి మీదుగా 247 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్లకు తరలించి అటు నుంచి సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్కి తరలించే ప్రణాళికను కేంద్రం రూ.85,962 కోట్లతో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ద్వారా 9.35 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉందని తెలిపింది. గోదావరి–కావేరి అనుసంధానంపై పరీవాహక రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించే కార్యాచరణను ఇప్పటికే జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ చేపట్టింది. నదీ జలాల లభ్యత, నీటి కేటాయింపులు, మళ్లింపు అంశాలపై అన్ని రాష్ట్రాలను ఒప్పించి త్వరగా అనుసంధాన ప్రతిపాదనను పట్టాలెక్కించే లక్ష్యంతో సంప్రదింపులు చేస్తోంది. రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు సాగుతామని ఇదివరకే స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇదే సమయంలో ‘హర్ ఘర్ నల్ సే జల్’కార్యక్రమం కింద 8.7 కోట్ల ఇళ్లకు నల్లా కనెక్షన్ల ప్రక్రియ పూర్తయిందని, ఈ ఆర్థిక ఏడాదిలో మరో 3.8 కోట్ల ఇళ్లకు నీటిని అందించే లక్ష్యంతో రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. -
ఆర్ఎంపీ డాక్టర్ పాడుపని.. తల్లిదండ్రులు లేని సమయంలో..
West Godavari: మండలంలోని పందలపర్రు గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆర్ఎంపీ తిక్కా దుర్గారావును అరెస్ట్ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై షేక్ సుభాని సోమవారం తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాలికతో దుర్గారావు అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆర్ఎంపీపై అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: ఉద్యోగం ఒకరిది.. జీతం మరొకరికి! -
నదుల అనుసంధానమే అజెండా
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానమే అజెండాగా ఈ నెల 19న జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశమవుతోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ ఆర్కే సిన్హాతోపాటూ అన్ని రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రం తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజరవుతారు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టి.. లభ్యత ఎక్కువగా ఉన్న నది నుంచి తక్కువ లభ్యత ఉన్న నదికి మళ్లించడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నదుల అనుసంధానాన్ని చేపట్టడం కోసం ఎన్డబ్ల్యూడీఏను కేంద్రం ఏర్పాటు చేసింది. హిమాలయ నదులను అనుసంధానం చేయడానికి 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రణాళికలను ఎన్డబ్ల్యూడీఏ ఇప్పటికే సిద్ధం చేసింది. వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత కెన్–బెట్వా, గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్గంగ–పింజాల్, పార్–తాపి–నర్మద నదులను అనసంధానించేందుకు నడుం బిగించింది. కెన్–బెట్వా అనుసంధాన పనులు చేపట్టడానికి రూ.44,605 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ పనులు చేపట్టడానికి వీలుగా కెన్–బెట్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ (కేబీఎల్పీఏ) పేరుతో ఎస్పీవీని ఎన్డబ్ల్యూడీఏ ఏర్పాటు చేసింది. ఈ పనులకు నిధుల సమీకరణ, టెండర్లపై సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు 216 టీఎంసీలను తరలించే అనుసంధానం పనులపై ఇప్పటికే ఆ బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్డబ్ల్యూడీఏ చర్చించింది. అనుసంధానాన్ని ఎలా చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
పాపికొండల సోయగాలు.. నదీ విహారం
సాక్షి, అమరావతి: గోదావరిలో పాపికొండల సోయగాలు.. గోదావరి ఇసుక తిన్నెల్లో వెన్నెల రాత్రులు.. పోచవరం నుంచి భద్రాచలానికి హాయిహాయిగా ప్రయాణం.. కృష్ణా నదిలో భవానీ ద్వీపంలో ఆట పాటలు.. నాగార్జున సాగర్లో చల్ల గాలుల మధ్య విహారం.. ఇలా ఎన్నో ప్రకృతి అందాల మధ్య ప్రపంచాన్ని మరిచి ప్రయాణం చేస్తారా.. అందుకు మీరు సిద్ధమేనా అంటోంది రాష్ట్ర పర్యాటక శాఖ. రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆధునిక బోట్లను అందుబాటులోకి తెస్తోంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటుండంతో డిమాండ్కు అనుగుణంగా ఆధునిక బోట్ల సంఖ్యను పెంచుతోంది. నిలిచిపోయిన బోట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతోంది. ప్రస్తుతం పాపికొండలకు వారాంతంలో 45 మంది ప్రయాణికుల సామర్థ్యంతో పర్యాటక శాఖ బోటు నడుపుతుండగా 95 మంది సామర్థ్యంతో మరో హరిత బోటును అందుబాటులోకి తేనుంది. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటును తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సాగర్–శ్రీశైలం ప్రయాణానికి సంతశ్రీ బోటును రూ.35 లక్షలతో మరమ్మతులు చేపట్టి సంక్రాంతి నాటికి తీసుకురానుంది. చాలా కాలం తర్వాత విజయవాడలోని భవానీ ద్వీపంలో బోధిశ్రీ బోటు సేవలకు సిద్ధమైంది. రాబడి పెంచుకునేందుకు యత్నాలు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పాపికొండలకు నిత్యం రెండు బోట్లు (ప్రైవేటు) తిరుగుతున్నాయి. వారాంతాల్లో పర్యాటక శాఖ బోట్లతో కలిపి ఐదు సేవలందిస్తున్నాయి. సగటున రోజుకు 300 మంది ప్రయాణిస్తున్నారు. భవానీ ద్వీపంలో బోటింగ్ ద్వారా రోజుకు సగటున రూ.40 వేలు, వారాంతాల్లో రూ.2.50 లక్షల ఆదాయం వస్తుండటం విశేషం. ఇక్కడ వారాంతంలో సుమారు 1,500 మంది బోట్లలో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా 12 ప్రదేశాల్లో పర్యాటక శాఖకు చెందిన 48 బోట్లు, వందకు పైగా ప్రైవేటు బోట్లు సేవలందిస్తున్నాయి. గతంలో కేవలం బోటింగ్ ద్వారా రూ.7 కోట్లకు పైగా ఆదాయం రాగా ప్రస్తుతం అది రూ.కోటికి పడిపోయింది. డిసెంబర్ నుంచి మార్చి వరకు సమయం ఉండటంతో రాబడి పెంచుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాపికొండల నైట్ ప్యాకేజీలు ఇలా.. పర్యాటక శాఖ పాపికొండలకు రెండు రోజుల (నైట్) ప్యాకేజీలను అందిస్తోంది. గండిపోచమ్మ – పేరంటాళ్లపల్లి ప్రయాణానికి చార్జి సాధారణ రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) పెద్దలకు రూ.3,200, పిల్లలకు 2,300, వారాంతాల్లో (శుక్రవారం నుంచి ఆదివారం) పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,500గా నిర్ణయించారు. రాజమండ్రి–గండిపోచమ్మ– పేరంటాళ్లపల్లి ప్యాకేజీలో సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.3,000, వారాంతాల్లో పెద్దలకు రూ.4,300, పిల్లలకు రూ.3,300 టికెట్ ధర ఖరారు చేశారు. ఇందులో రాజమండ్రి నుంచి పర్యాటక శాఖ బస్సులో ప్రయాణికులను బోటింగ్ పాయింట్కు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రయాణం మొదలై మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు ముగుస్తుంది. పేరంటాళ్లపల్లి నుంచి తిరుగు ప్రయాణంలో కొల్లూరు, కొరుటూరులోని గిరిజన సంప్రదాయ తరహా బ్యాంబూ హట్స్లో (వెదురుతో చేసిన గుడిసెలు) రాత్రి బసను ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు ఆటవిడుపుగా వాలీబాల్, కబడ్డీ, ట్రెక్కింగ్, జంగిల్ వాక్ సౌకర్యాలను మెరుగుపరిచారు. బోట్ల సంఖ్యను పెంచుతున్నాం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక కారణాలతో బోట్లు చాలా కాలంపాటు నిలిచిపోయాయి. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని వాడుకలోకి తెచ్చేందుకు మరమ్మతులు చేయిస్తున్నాం. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటు తిప్పేందుకు ఆలోచిస్తున్నాం. పోలవరానికి ప్రత్యేక నైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టూరిజం కార్పొరేషన్ రాబడి పెంపుపై దృష్టి రాష్ట్రంలో జల పర్యాటకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పర్యాటకుల డిమాండ్కు అనుగుణంగా బోట్ల సంఖ్యను పెంచి రాబడి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బోట్లకు మరమ్మతులు చేపడుతున్నాం. త్వరలోనే పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని వాటిని నీటిలోకి ప్రవేశపెడతాం. – ఆరిమండ వరప్రసాద్రెడ్డి, చైర్మన్, ఏపీ టూరిజం కార్పొరేషన్ -
అక్కా.. బా.. అంటూ.. గోదారోళ్ల కితకితలు.. మామూలుగా లేదుగా మరి..
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జీపీఆర్ కొండపై ఆదివారం గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ మిత్రుల ఐదవ ఆత్మీయ సమ్మేళనంలో నవ్వులు విరబూశాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని అక్కా..బా.. అంటూ గోదావరి యాసతో పలకరించుకున్నారు. గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ క్రియేటర్ ఈవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. చదవండి: కామాంధుడి పైశాచికం.. చితక్కొట్టిన మహిళలు చిన్నారులు ఆడుకునేందుకు వివిధ రకాల ఆటవస్తువులతో పాటు, ఫేస్బుక్ మిత్రులు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పూలతో వివిధ రకాల ఆకృతులను అందంగా అలంకరించారు. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్ర స్నాక్స్ వరకు సుమారు 40రకాల తెలుగు వంటకాలను ఫేస్బుక్ మిత్రులకు రుచి చూపించారు. చిన్నారులు, పెద్దలు వేసిన స్టెప్పులు అలరించాయి. డూప్ నాగార్జున, ఇతర డాన్సర్లు చేసిన డ్యాన్స్లకు ప్రాంగణం కేరింతలతో హోరెత్తింది. రేడియో జాకీ శీను మామ వ్యాఖ్యానం..చిన్నచిన్న పొడుపు కథలు..ఆటపాటలతో ఉత్సాహంగా సాగింది. గ్రూప్ క్రియేటర్ ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గోదారోళ్ల సంప్రదాయాలు ఎప్పటికీ కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ఫేస్బుక్ మిత్రుల గ్రూపు ప్రారంభించామని అన్నారు. వివిధ లక్కీడిప్లు నిర్వహించి బహుమతులను అందించారు. అడ్మిన్ పేపకాయల లలిత, మోడరేటర్లు సరిత ఎం.బొల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి, బండారు ఆదివిష్ణు, చిలుకూరి విజయ్, కోపల్లె శేషగిరిరావు, నిభనుపూడి వాసుప్రసాద్, కేఎస్ఎన్ మూర్తి పర్యవేక్షించారు. సుమారు నాలుగువేల మంది గ్రూపు సభ్యులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. -
గోదారి గట్టున సినిమా తీస్తే హిట్టే: ఆ చెట్టు కింద 300 సినిమాల షూటింగ్..
సాక్షి, పోలవరం రూరల్/ బుట్టాయగూడెం: గోదారి గట్టున సినిమా తీస్తే హిట్ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్లకు ప్రసిద్ధి పొందింది. ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండేది. ఈ ప్రాంత అందాలు కూడా సినీ వీక్షకులకు కొత్త అనుభూతి పంచేవి. గత కొన్నేళ్లుగా అవుట్డోర్ షూటింగ్లు తగ్గడం, విదేశాల్లోని లొకేషన్లకు క్రేజ్ పెరగడంతో గోదావరి తీర ప్రాంతంలో సినీ సందడి తగ్గింది. అయితే ఇటీవల మళ్లీ గోదావరి తీరంలో షూటింగ్ల సందడి మొదలైంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోవడంతో ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చింది. జిల్లాలోని ఫలానా లొకేషన్లో సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని గతంలో పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు నమ్మేవారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, లెజెండరీ డైరెక్టర్ బాపు, కె.విశ్వనాథ్, కృష్ణవంశీ, సుకుమార్ వంటి అగ్ర దర్శకులు అనేక సినిమాలు జిల్లాలోని పలు లోకేషన్లలో తీసి సూపర్హిట్ కొట్టారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, సూపర్స్టార్ కృష్ట, రజనీకాంత్, మహేష్ బాబు, బాలకృష్ట, రవితేజ తదితర అగ్ర హీరోలు ఈ ప్రాంతంలో షూటింగ్లంటే ఇష్టపడేవారు. గోదావరి తీరంలో కొవ్వూరు నుంచి కుమారదేవం, పట్టిసీమ, పోలవరం, పాపికొండలు ఇలా అనేక ప్రదేశాలు సినిమా షూటింగ్లకు ప్రసిద్ధి చెందాయి. గోదావరి తీరంలో రూపొందిన రంగస్థలం షూటింగ్ తనివితీరని పట్టిసీమ అందాలు ఒకపక్క ఆధ్యాత్మిక సొబగులు, మరోవైపు ప్రకృతి సోయగాలు పట్టిసీమ ప్రత్యేకం. కనుచూపు మేర కనువిందు చేసే ఎత్తైన కొండలు కట్టిపడేస్తాయి. ఈ ప్రాంత సౌందర్యానికి ముగ్ధులైన పలువురు సినీ ప్రముఖులు ప్రకృతి రమణీయ దృశ్యాల్ని తమ కెమెరాల్లో బంధించేందుకు ఇష్టపడేవారు. వందల సంఖ్యలో ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్లు జరిగాయి. ‘గోదారి గట్టుంది... గట్టు మీద చెట్టుంది.. చెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది’ అంటూ మూగమనసుల్లోని పాట ఇక్కడ చిత్రీకరించిందే. 1964లో వచ్చిన ఈ సినిమా దాదాపు గోదావరి చుట్టు పక్కల ప్రాంతంలో చిత్రీకరించారు. 1975లో బాపు దర్శకత్వంలో భక్తకన్నప్ప షూటింగ్ కూడా ఇక్కడే తీశారు. ‘శివ శివ శంకర.. భక్తవ శంకర.. శంభో హరహర నమో నమో’ పాటను పట్టిసం వీరభద్రస్వామి ఆలయంలో తీశారు. 1985లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో అనేక సన్నివేశాలు కూడా ఇక్కడ చిత్రీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో 1982లో రూపొందిన మేఘసందేశం చిత్ర షూటింగ్ ఇక్కడ జరిగింది. నిద్రగన్నేరు చెట్టు కింద ఎన్నో షూటింగ్లు కొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ కూడా పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. గోదావరి తీరాన.. ఇసుక తిన్నెలపై చిరంజీవి ఆపద్భాందవుడు, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందించిన మురారీ చిత్రంలో కొన్ని సన్నివేశాలు గోదారి తీరంలో రూపొందినవే. మురారిలోని ‘డుమ్ డుమ్ డుమ్ నటరాజు ఆడాలి... దుమ్మురేపాలిరా’ పాట గోదావరి ఇసుక తిన్నెలపై తీసిందే.. హిందీ, తమిళ సినిమాలు కూడా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలు గోదావరి తీర ప్రాంతంలో తీసినవే. రాజేశ్వరి కళ్యాణం, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, త్రిశూలం, పాడిపంటలు, మొరటోడు నా మొగుడు, ప్రెసిడెంట్గారి పెళ్లాం, జానకిరాముడు, భద్రాచలం, అధిపతి, గోదావరి, నువ్వులేక నేను లేను, చట్టంతో పోరాటం ఇలా వందల సినిమా షూటింగ్లు పట్టిసీమ, పోలవరం, కోండ్రుకోట, సింగన్నపల్లి, పాపికొండలు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నవే. హిందీ సినిమా హిమ్మత్వాలా, తమిళ సినిమా సూర్య చిత్రాల్ని గోదావరి తీరంలో చిత్రీకరించారు. పూర్తి స్థాయి గోదావరి నేపథ్యంలో సినిమాలు రూపొందడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు, సుమంత్ గోదావరి చిత్రం రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు పూర్తిగా గోదావరిపైనే చిత్రీకరించారు. -
గోదారమ్మ ఒడిలో... పౌర్ణమి వీడియో కాల్...
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే గోదావరిలో స్నానాలు చేసి ఉసిరికాయలతో దీపాలు వెలిగించి గంగమ్మకు పూజలు చేస్తారు... బియ్యంపిండితో చేసిన ప్రమిదలతో ఇంటింటా దీపాలు అలంకరించి వెలిగించడం పౌర్ణమి ప్రత్యేకత.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా తన కుటుంబీకులకు వీడియోకాల్ చేస్తూ గోదారమ్మ ఒడిలో దీపాలు వదులుతున్న మహిళ ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. -
చీరమేను: ఆహా అద్భుత రుచి.. తినండి మైమరిచి..ధరెంతో తెలుసా?
యానాం: పులస చేప సీజన్ తర్వాత వచ్చే చీరమేను రుచి చూడడం కోసం గోదావరి జిల్లాల వాసులు ఎదురుచూస్తుంటారు. శీతాకాలం ప్రారంభంలోనే దొరికే చీరమేను చేప ఎక్కువగా దసరా నుంచి నాగులచవితి వరకు లభ్యమవుతుంది. అయితే ప్రస్తుతం తూర్పుగాలులు వీస్తున్నప్పటికీ మత్స్యకారులకు చీరమేను లభ్యత గగనమై పోవడంతో ధర ఆకాశాన్ని అంటుతోంది. సాధారణంగా శేరు రూ.1,500 నుంచి రూ.2,000కి దొరకుతుంది. చదవండి: పాపికొండలకు చలోచలో సోమవారం సాయంత్రం యానాం మార్కెట్లోకి వచ్చిన చీరమేను శేరు ధర రూ.4వేలు పలికింది. చిత్రంలో కన్పించే ఒక్కొక్క స్టీలు క్యారేజీలోని చీరమేను ధర రూ.4వేలు, పసుపు రంగుప్లేటులో ఉన్న చీరమేను ధర రూ.1600 పలికింది. ప్రస్తుతం గ్లాసు, సోల, కొలతల్లో అమ్ముతున్నారని అదే బిందెల్లో అమ్మకం జరిపితే రూ.లక్ష వరకు ఉంటుందని అంటున్నారు. కార్తికమాసంలో మాంసాహారాన్ని తీసుకునేవారు తక్కువగా ఉండటంతో ఈ ధర ఉంది. అదే మామూలు రోజుల్లో అయితే ఇంకా అధిక ధర ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి చీరమేను గోదావరిలో లభ్యత తక్కువగా ఉందని, దీంతో రేటు సైతం అధికంగా ఉంటోందని వేలం పాటలో పాడుకున్న మత్స్యకార మహిళలు చెబుతున్నారు. నది ముఖ ద్వారం వద్ద లభ్యత సముద్రం, నదీ కలిసే ముఖద్వారాల (సీమౌత్) వద్ద చీరల సహాయంతో పట్టే చీరమేను ప్రస్తుతం లభ్యమవుతోంది. ఆ విధంగా యానాం, కోటిపల్లి, మసకపల్లి తదితర ప్రాంతాల నుంచి యానాం మార్కెట్కు చీరమేనును తీసుకువచ్చి మార్కెట్లోనే వేలం పాటను నిర్వహిస్తున్నారు. వాటిని మత్స్యకార మహిళలు కొనుగోలు చేసి కొంత లాభం వేసుకుని చిల్లరకు అమ్ముతున్నారు. అనేక రకాలుగా వంటలు: చీరమేనును మసాలా తో ఇగురుగానే కాకుండా గారెలు, చింత చిగురు, మామిడికాయ, గోంగూర ఇలా కూరల్లో నోరూరించేలా ఇక్కడి మహిళలు వండుతుంటారు. చమురు తవ్వకాల వల్ల దొరకడం లేదు గోదావరిలో ఇదివరలా చీరమేను దొరకడం లేదు. నదీముఖద్వారాల వద్ద చమురు తవ్వకాలు జరుపుతుండటంతో చీరమేను వేరే ప్రాంతాల వైపు మళ్లుతోంది. తక్కువగా వస్తుండటంతో మార్కెట్లో అధిక ధరలకు అమ్మాల్సి వస్తోంది. – నాటి పార్వతి, మత్స్యకార మహిళ -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదారి
లెక్కలకు పొంతనేదీ?: ఏపీ ♦గోదావరిలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), వ్యాప్కోస్, ఎన్డబ్ల్యూడీఏ లెక్కలకు పొంతన లేదు. నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. ♦75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిలో 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని వ్యాప్కోస్ లెక్క కట్టింది. ఇందులో 775 టీఎంసీలను వినియోగించుకునేలా ఏపీ, 655 టీఎంసీలను వాడుకునేలా తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టినందున కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నీటి లభ్యత లేదు. ♦జీ–1 నుంచి జీ–11 వరకూ ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నికర జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించింది. మిగులు జలాలపై స్వేచ్ఛ ఇచ్చింది. ♦అనుసంధానం చేపట్టేటప్పుడు దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులు పరిరక్షించాలి. ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో నీటిని తరలిస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ♦కొత్త రిజర్వాయర్లు నిర్మించకుండా అనుసంధానం అసాధ్యం. మహానది నుంచి 229 టీఎంసీలను పోలవరం దిగువన గోదావరిలో పోస్తే ఏం ప్రయోజనం? ధవళేశ్వరం నుంచి వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిందే. ♦లభ్యతను శాస్త్రీయంగా తేల్చి ఏపీలో దుర్భిక్ష ప్రాంతాల అవసరాలు తీర్చాకే మిగిలిన నీటిని ఇతర రాష్ట్రాలకు తరలించేలా అనుసంధానం చేపట్టాలి. మాకు గరిష్టంగా కేటాయించాలి: తెలంగాణ సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై తొమ్మిది రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. శాస్త్రీయంగా అధ్యయనం చేసి గోదావరిలో నీటి లభ్యత తేల్చాకే అనుసంధానం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్పష్టం చేయగా తమకు కేటాయించిన నీటిని తరలించేందుకు అంగీకరించే ప్రశ్నే లేదని ఛత్తీస్గఢ్ పేర్కొంది. కృష్ణా బేసిన్కు తరలించిన గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబట్టగా కావేరి నీటిలో అదనపు వాటా కావాలని కేరళ డిమాండ్ చేసింది. మహానదిలో నీటి లభ్యత లేని నేపథ్యంలో మహానది–గోదావరి అనుసంధానంపై ఒడిశా, మధ్యప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కావేరికి కనీసం 216 టీఎంసీల గోదావరి జలాలనైనా తరలించాలని తమిళనాడు, పుదుచ్చేరి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాకే నదుల అనుసంధానాన్ని చేపడతామని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయం సాధించే లక్ష్యంతో శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధ నుంచి భోపాల్సింగ్ నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీ వర్చువల్ విధానంలో తొమ్మిది రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. బేసిన్లు.. ట్రిబ్యునళ్ల అవార్డులు పక్కన పెట్టండి నీటి లభ్యత అధికంగా ఉన్న నదుల నుంచి జలాలను మళ్లించడం ద్వారా దేశంలో తాగు, సాగునీటి కష్టాలను అధిగమించేందుకు అనుసంధానం చేపట్టామని భోపాల్సింగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇచ్చంపల్లి నుంచి జూన్ – అక్టోబర్ల మధ్య 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల(పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించేలా ప్రతిపాదన రూపొందించామన్నారు. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్కు 79.94, తెలంగాణకు 65.8, తమిళనాడుకు 84.01 టీఎంసీలను ఇస్తామన్నారు. తద్వారా కోటి మందికి తాగునీరు పది లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని చెప్పారు. రూ.85 వేల కోట్లతో చేపట్టే అనుసంధానం డీపీఆర్ను బేసిన్ పరిధిలోని తొమ్మిది రాష్ట్రాలకు పంపామన్నారు. మహానది– గోదావరి అనుసంధానం ద్వారా రెండో దశలో కావేరికి 229 టీఎంసీలను తరలిస్తామన్నారు. నీటి లోటు ఎదుర్కొంటున్న కృష్ణా, కావేరిలకు జలాలను తరలించాలనే కృత నిశ్చయంతో కేంద్రం ఉందన్నారు. బేసిన్లు, ట్రిబ్యునళ్ల అవార్డులను పక్కన పెట్టి దేశ విశాల ప్రయోజనాల కోసం అనుసంధానానికి సహకరించాలని కోరారు.