AP And Telangana Floods News Latest Updates In Telugu
విజయవాడ:
- విజయవాడలో ఇంకా ముంపులోనే పలు కాలనీలు
- 12 రోజులైనా బురదలోనే ముంపు ప్రాంతాలు
- శుభ్రం చేసుకునేందుకు అవస్థలుపడుతున్న కాలనీల వాసులు
- నీళ్లలో నానుతున్న ఎల్బీఎస్ నగర్, కండ్రిక, తోటివారి వీధి
- ముంపులోనే ప్రకాశ్ నగర్, అంబపురం
- లోపల కాలనీల ప్రజలకు అందని సాయం
- రోడ్ల మీద బురద పేరుకుపోవటంతో ప్రజలకు అవస్థలు
- ప్రచార ఆర్భాటంగా ఎన్యుమరేషన్
- మ్యాపింగ్ ఉంటేనే ఎన్యుమరేషన్ అంటున్న అధికారులు
- ఇంట్లోని సామాన్లకు మాత్రమే జరుగుతున్న ఎన్యుమరేషన్
ఖమ్మం జిల్లా
- ఖమ్మం నగరంలో బొక్కలగడ్డ, ధంసలాపురం ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టం
- ఈరోజు ఉదయం 9 గంటలకు 43.3 అడుగులుకు చేరిన గోదావరి నీటిమట్టం
- అమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరిక
ఏలూరు జిల్లా
- పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.
- స్పిల్ వే ఎగువన 33.750 మీటర్లు
- స్పిల్ వే దిగువన 25.580 మీటర్లు నీటిమట్టం నమోదు.
- 48 రేడియల్ గేట్ల ద్వారా 12,46.342,క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల.
ఏలూరు జిల్లా
- జంగారెడ్డిగూడెం మండలం కొంగ వారిగూడెం ఎర్రకాలవ జలాశయానికి తగ్గిన వరద నీరు.
- పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 81.87
- ఇన్ ఫ్లో 1565 క్యూసెక్కులు అవుట్ ఫ్లో గేట్లు ఎత్తి 1806 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేసిన అధికారులు
నల్లగొండ జిల్లా
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు తగ్గిన వరద
- క్రస్ట్ గేట్లు మూసివేత
- ఇన్ ఫ్లో: 68235 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో : 43298 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
- ప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులు
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వ: 310.8498 టీఎంసీలు
- కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- ఎడమ కాలువకు నీటిని నిలిపివేసి నేటికి 12 రోజులు
- సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద ఇంకా పూడ్చివేయని కాలువ గండి
సూర్యాపేట జిల్లా:
- పులిచింతల అప్డేట్
- ఇన్ ఫ్లో 31,182క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో:16,000క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటి మట్టం:175
అడుగులు - ప్రస్తుత నీటి మట్టం:172.767 అడుగులు
- పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వ: 38.765 టీఎంసీలు
- పవర్ జనరేషన్ :16000 క్యూసెక్కులు.
నిజామాబాద్ జిల్లా
- శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
- ఇన్ ఫ్లో 35 వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 35 వేల క్యూసెక్కులు
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 80 టీఎంసీలు
- ప్రస్తుతం 1090 అడుగులు, 80 టీఎంసీలు
- తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కమిటీ పర్యటన.
- ఖమ్మం, సూర్యాపేటలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బృందం.
- వరద బాధితులను ఆదుకోవాలని నిన్న సెంట్రల్ కమిటీకి నివేదిక ఇచ్చిన సిఎస్.
- ఇవ్వాల్టితో ముగియనున్న రాష్ట్ర పర్యటన.
జూరాల అప్డేట్
- మహబూబ్ నగర్ జిల్లా:
- జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద
- 13 గేట్స్ ఎత్తివేత
- ఇన్ ఫ్లో : 1 లక్ష 26 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1 లక్ష 26 వేల 243 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.270 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 318.350మీటర్లు
- పూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 9.316 టీఎంసీలు
- ఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది.
తూర్పుగోదావరి జిల్లా
- గోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు
- బ్యారేజ్ వద్ద 15.3 అడుగులుగా నమోదైన గోదావరి వరద నీటిమట్టం
- 15 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల
- బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- కోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలు
- సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక టేకి శెట్టిపాలెం మధ్య వరద నీరు రావడంతో పడవలపై రాకపోకలు
- అప్పనపల్లి-పెదపట్నం లంక మధ్య వరద నీరు రావడంతో అవస్థలు పడుతున్న స్థానికులు
- ఇప్పటికే నీట మునిగిన గంటి పెదపూడి, ఎదురుబిడియం, కనకాయలంక కాజ్వేలు
- వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు రోజులపాటు వినాయక నిమజ్జనాన్ని చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన అధికారులు
- కోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న వశిష్ట , గౌతమి, వైనతేయ నదులు
Comments
Please login to add a commentAdd a comment