vijawada
-
వరద బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
విజయవాడ, సాక్షి: మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇవాళ (మంగళవారం) శ్రీకారం చుట్టింది. విజయవాడ వరద బాధిత కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తోంది. నిత్యావసర సరుకుల వాహనాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 50 వేల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున నిత్యావసర సరుకుల పంపిణీ చేయనుంది. 33 డివిజన్లల్లో సరుకుల పంపిణీ జరగనుంది. వరద బాధితుల సహాయార్థం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే రెండు దశల్లో వరద నీటిలో అవస్థలు పడ్డ బాధితులకు పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంచగా.. ఇప్పుడు మూడో విడతలో నిత్యావసరాలు ఇస్తున్నారు.ఇదీ చదవండి: మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప పని చేయరా? -
Updates: ‘అధికారులెవరూ రాలేదండీ’
AP And Telangana Floods News Latest Updates In Teluguశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద జలాశయం 2 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో : 1,38,833 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 96,081 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 884.60 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు .. ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిజయవాడ 12 రోజులైనా ముంపు ప్రాంత ప్రజలకు తప్పని తిప్పలు ఇంకా మోకాళ్ల లోతు నీటిలోనే నానుతున్న అంబాపురంలోని కాలనీలు వరదలో ఉండలేక ఇళ్లను వదిలి వెళ్లిపోయిన ప్రజలు దొంగల భయంతో మళ్లీ ఇళ్లకు చేరుకుంటున్న కొందరు ప్రభుత్వం నుంచి ఈరోజు వరకూ తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆగ్రహం మంచినీరు కూడా సప్లై చేయడం లేదంటున్న అంబాపురం ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇళ్ల నుంచి బయటికి వస్తున్న వరద బాధితులు ఎన్యుమరేషన్ దాదాపు పూర్తైందంటున్న అధికారులు.. తమ వద్దకు ఏ ఒక్కరూ రాలేదంటున్న వరద బాధితులువాలంటీర్ వ్యవస్థ ఉంటే తమకు ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదంటున్న అంబాపురం వాసులునల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలభద్రాచలంతగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహంఈరోజు ఉదయం 11 గంటలకు 42.7అడుగుల గోదావరి నీటిమట్టంమొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులుసూర్యాపేటఅనంతగిరి, కోదాడ మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందంఅనంతగిరి మండలం గోండ్రియాల, కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడిలో ధ్వంసం అయిన ఇళ్లలు, నష్టపోయిన పంట, కోతకు గురైన రహదారులను పరిశీలించిన కేంద్ర బృందం క్లిక్ చేయండి: దేవుడా ఈ నరకం ఇంకెన్నాళ్లూ! ప్రకాశం బ్యారేజీ వద్ద కేంద్ర బృందంప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందంబోటు ప్రమాదంలో దెబ్బ తిన్న బ్యారేజీని పరిశీలించిన సభ్యులుఖమ్మం ఖమ్మం నగరంలోని వరదల్లో నీట మునిగిన నయా బజార్ కాలేజీ ని పరిశీలించిన ఎమ్మెల్సీ కోదండరాం అనంతరం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కొనసాగుతున్న ఆపరేషన్ బోట్ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమంనిన్నంతా కష్టపడ్డ అండర్ వాటర్ టీంఇవాళ కూడా కొనసాగనున్న పనులుబోట్లను ముక్కలు చేసి ఆపై బెలూన్లతో తొలగించే యత్నంమెదక్ఏడుపాయాల ఆలయం మళ్లీ మూసివేతసింగూరు గేట్లు ఎత్తేయడంతో భారీగా నీరుఆలయాన్ని తాకుతూ నీటి ప్రవాహంరెండ్రజుల కిందటే తెరుచుకున్న ఆలయంఈలోపే మళ్లీ మూసేసిన నిర్వాహకులుబ్యారేజీకి కేంద్ర కమిటీనేడు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కేంద్ర కమిటీ ప్రకాశం బ్యారేజీ చెంతకు కమిటీప్రస్తుత బ్యారేజీ పరిస్థితిపై ఆరా తీయనున్న సభ్యులు ఎన్టీఆర్ జిల్లా:వరద ప్రభావిత ప్రాంతాల్లో అనిల్ సుబ్రహ్మణ్యం నేతృతంలో కేంద్ర బృందం పర్యటనకలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన కేంద్ర బృందంవరద ముంపు ప్రాంతాల డ్రోన్ విజువల్స్ పరిశీలననష్టంపై కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ జి.సృజనకేంద్ర బృందాన్ని కలిసి తమకు జరిగిన నష్టంపై వినతిపత్రం అందజేసిన కృష్ణామిల్క్ యూనియన్ (విజయ డైరీ ) చలసాని ఆంజనేయులుఫోటో ఎగ్జిబిషన్ అనంతరం ప్రకాశం బ్యారేజ్, బుడమేరు గండ్లు పడిన ప్రాంతం, ఈలప్రోలు, రాయనపాడు, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం నంద్యాల:శ్రీశైలం జలాశయానికి కోనసాగుతున్న వరద నీరుజలాశయం 1 గేటు 10 అడుగులు మేరకు మరొక్కసారి ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో: 1,38,833 క్యూసెక్కులుఔట్ ఫ్లో: 96,081 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలుప్రస్తుతం: 212.9198 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి విజయవాడ:విజయవాడలో ఇంకా ముంపులోనే పలు కాలనీలు12 రోజులైనా బురదలోనే ముంపు ప్రాంతాలుశుభ్రం చేసుకునేందుకు అవస్థలుపడుతున్న కాలనీల వాసులునీళ్లలో నానుతున్న ఎల్బీఎస్ నగర్, కండ్రిక, తోటివారి వీధిముంపులోనే ప్రకాశ్ నగర్, అంబపురంలోపల కాలనీల ప్రజలకు అందని సాయం రోడ్ల మీద బురద పేరుకుపోవటంతో ప్రజలకు అవస్థలుప్రచార ఆర్భాటంగా ఎన్యుమరేషన్మ్యాపింగ్ ఉంటేనే ఎన్యుమరేషన్ అంటున్న అధికారులుఇంట్లోని సామాన్లకు మాత్రమే జరుగుతున్న ఎన్యుమరేషన్ ఖమ్మం జిల్లాఖమ్మం నగరంలో బొక్కలగడ్డ, ధంసలాపురం ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టంఈరోజు ఉదయం 9 గంటలకు 43.3 అడుగులుకు చేరిన గోదావరి నీటిమట్టంఅమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరికఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.స్పిల్ వే ఎగువన 33.750 మీటర్లుస్పిల్ వే దిగువన 25.580 మీటర్లు నీటిమట్టం నమోదు.48 రేడియల్ గేట్ల ద్వారా 12,46.342,క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల.ఏలూరు జిల్లాజంగారెడ్డిగూడెం మండలం కొంగ వారిగూడెం ఎర్రకాలవ జలాశయానికి తగ్గిన వరద నీరు.పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 81.87ఇన్ ఫ్లో 1565 క్యూసెక్కులు అవుట్ ఫ్లో గేట్లు ఎత్తి 1806 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేసిన అధికారులునల్లగొండ జిల్లానాగార్జునసాగర్ ప్రాజెక్టు కు తగ్గిన వరదక్రస్ట్ గేట్లు మూసివేతఇన్ ఫ్లో: 68235 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో : 43298 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 310.8498 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఎడమ కాలువకు నీటిని నిలిపివేసి నేటికి 12 రోజులుసూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద ఇంకా పూడ్చివేయని కాలువ గండిసూర్యాపేట జిల్లా:పులిచింతల అప్డేట్ఇన్ ఫ్లో 31,182క్యూసెక్కులుఅవుట్ ఫ్లో:16,000క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం:175 అడుగులుప్రస్తుత నీటి మట్టం:172.767 అడుగులుపూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 38.765 టీఎంసీలుపవర్ జనరేషన్ :16000 క్యూసెక్కులు.నిజామాబాద్ జిల్లాశ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుఔట్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 80 టీఎంసీలుప్రస్తుతం 1090 అడుగులు, 80 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కమిటీ పర్యటన.ఖమ్మం, సూర్యాపేటలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బృందం.వరద బాధితులను ఆదుకోవాలని నిన్న సెంట్రల్ కమిటీకి నివేదిక ఇచ్చిన సిఎస్.ఇవ్వాల్టితో ముగియనున్న రాష్ట్ర పర్యటన.జూరాల అప్డేట్మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద13 గేట్స్ ఎత్తివేతఇన్ ఫ్లో : 1 లక్ష 26 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1 లక్ష 26 వేల 243 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.270 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 318.350మీటర్లుపూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 9.316 టీఎంసీలుఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాగోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుబ్యారేజ్ వద్ద 15.3 అడుగులుగా నమోదైన గోదావరి వరద నీటిమట్టం15 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలబ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలుసఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక టేకి శెట్టిపాలెం మధ్య వరద నీరు రావడంతో పడవలపై రాకపోకలుఅప్పనపల్లి-పెదపట్నం లంక మధ్య వరద నీరు రావడంతో అవస్థలు పడుతున్న స్థానికులుఇప్పటికే నీట మునిగిన గంటి పెదపూడి, ఎదురుబిడియం, కనకాయలంక కాజ్వేలువరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు రోజులపాటు వినాయక నిమజ్జనాన్ని చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన అధికారులుకోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న వశిష్ట , గౌతమి, వైనతేయ నదులు -
Vijayawada: మరెవరికీ ఇలాంటి అన్యాయం జరగొద్దు
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్సార్సీపీ దళిత నేత శిరోముండనం చేయించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుండా గిరి చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో అధికారులను ఉపయోగించి మరీ నందెపు జగదీష్కు చెందిన భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన జగదీష్.. కూల్చేసిన భవనం ముందే శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా బోండా ఉమాకు నిరసన తెలియజేశారు. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో, అధికార బలంతో భవనాలను కుప్పకూల్చారు. దీనిపై సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తా. దళిత వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా?. బోండా ఉమాకు అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. .. నేను మాజీ కార్పొరేటర్, కో ఆప్షన్ మెంబర్ను. నాకు న్యాయం జరగకపోతే, నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తా. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు’’ అని జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అమిత్ షా-తమిళిసై మధ్య అసలేం జరిగింది!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆ పార్టీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ మధ్య జరిగిన సన్నివేశమది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే.. కేంద్ర మంత్రి అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్ అయ్యారు. తమిళిసై ఏదో చెప్పబోతుండగా.. అడ్డుకుని మరీ అమిత్ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024తమిళిసైకి, కేంద్ర మంత్రి అమిత్ షాకి మధ్య అసలు ఏం జరిగింది?. ఆమెపై కేంద్రమంత్రి అమిత్ షా ఎందుకు అంత సీరియస్ అయ్యారని షోషల్మీడియాలో చర్చ జరుగుతోంది.ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పంచాయితీలు పెట్టొద్దంటూ ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అసైన్డ్ భూముల కుంభకోణం:చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్షీట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుపై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు సోమవారం వెల్లడించింది. రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు.. అసైన్డ్ భూముల స్కాంలో ప్రధాన ముద్దాయి. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా ఛార్జ్షీట్లో సీఐడీ పేర్కొంది. 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ తెలిపింది. అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడికి పాల్పడినటట్లు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేసినట్టు సీఐడీ గుర్తించింది.రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారణ చేసింది. చంద్రబాబు, నారాయణతో పాటుమాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా సీఐడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. చదవండి: అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం -
రామోజీ మోసాలు.. మార్గదర్శి బాధితుల సంఘం ఏర్పాటు
సాక్షి, విజయవాడ: చిట్ఫండ్స్ పేరిట రామోజీరావు మోసాల నేపథ్యంలో మార్గదర్శి బాధితుల సంక్షేమ సంఘం ఏర్పాటైంది. ఈ మేరకు సంక్షేమ సంఘాన్ని బాధితులు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలో బాధితులు.. ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్, కార్యదర్శులను ఎన్నుకున్నారు. అనంతరం, మీడియా ముందు రామోజీ మోసాలను బాధితులు ఎండగట్టారు. ఆధారాలతో మార్గదర్శి మోసాలను బాధితులు బయటపెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి బాధితుల సంఘం ప్రెసిడెంట్ ముష్టి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘మార్గదర్శిలో నేను మోసపోయాక గళం విప్పడం ప్రారంభించాను. పేద, మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. షూరిటీస్ నెపంతో డబ్బు ఎగ్గొడుతున్నారు. చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నారు. మార్గదర్శి ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియట్లేదు. కర్నూలులో ఒక వ్యక్తికి మార్గదర్శి బెదిరింపుల కారణంగా పక్షవాతం వచ్చింది. మార్గదర్శిపై పోరాడుతున్న నాపైన కూడా కేసులు పెడుతున్నారు. నేను కోర్టుకు వెళ్తానంటే నువు బ్రాహ్మణుడివి ఏమీ చేయలేవు అని బెదిరించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మార్గదర్శి బాధితుల సంఘం వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు మాట్లాడుతూ..‘మార్గదర్శి అనైతికంగా వ్యవహరిస్తోంది. కస్టమర్ల ఆస్తులు కొల్లగొడుతున్నారు. 43 చిట్లలో కేవలం నాకు వచ్చింది 8వేలు మాత్రమే. ఒక్కో చిట్కి 210 రూపాయలు ఇచ్చారు. నెలకు 40 నుండి 50 లక్షల ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన పరిస్థితికి తీసుకెళ్లారు. చిట్ డిఫాల్ట్ అయితే ఆస్తులు అమ్ముకుంటారని మాకు తెలియదు. కోర్టుకు వెళ్తారనే భయంతో అప్పులు చేసి చిట్లు కట్టాము. కాల్ మనీ గుండాల్లా మా ఇంటికి వచ్చి కూర్చునే వారు. ఇంట్లోని బంగారం అమ్ముకున్నాం. డిఫాల్ట్ అయితే ఇంత దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారని మాకు తెలియదు’ అని కామెంట్స్ చేశారు. మార్గదర్శి బాధితుల సంఘం సెక్రటరీ అన్నపూర్ణ దేవి మాట్లాడుతూ..‘చిట్ కట్టలేని స్థితికి తీసుకెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళ టార్గెట్ కోసం ఎక్కువ చిట్లు కట్టేలా ఒప్పించారు. ఎంత కట్టినా డిఫాల్ట్ ఉందంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా కాపురాన్ని నాశనం చేశారు. మా ఇంటిని అటాచ్ చేశారు. ఆర్ధిక స్థోమత లేనివారిని కూడా చిట్లలో ఇరికిస్తున్నారు’ అని అన్నారు. -
కృష్ణా జలాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదు: అంబటి
సాక్షి, విజయవాడ: కృష్ణా జలాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం..పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. మంగళవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతారు. ‘నాగార్జుసాగర్ ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాలకి సగం సగంగా ఉంది. ప్రాజెక్టులు అప్పగించమని అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతవరకు ధర్మం. విభజన చట్టాన్ని అంగీకరించి.. ఒక సెక్షన్ మాత్రం అంగీకరించం అంటే ఎలా?. ఏపీ కూడా విభజన చట్టాన్ని అంగీకరించం అంటే కుదురుతుందా. విభజన సమయంలో నదీజలాల పంపిణీపై చట్టంలో పొందుపరిచారు. విభజన చట్టం అంగీకరించమని చెప్పడం మొండివాదన. తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్డు కూడా మాకు అవసరం లేదు. ...ఆంధ్రా, రాయలసీమకి కేటాయించిన నీటి జలాలపైనే మా సీఎం వైఎస్ జగన్ చట్టబద్దంగా తీసుకెళ్లడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కేఆర్ఎంబీని విభజన చట్టంలో పొందుపరిచారు. టీఆర్ఎస్కు, కాంగ్రెస్కు వివాదాలు ఉండవచ్చు. కృష్ణా జలాల పంపకాలు ఇప్పటివి కాదు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించింది. ఒకసారి అవార్డు అయిన అంశాలని వివాదం ఎలా చేస్తారు.. చట్టాన్ని గౌరవించాలి. హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వాదనలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. -
ఏపీలో రేపటి నుంచి సీఈసీ పర్యటన
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఎన్నికల అధికారుల బృందం రేపు(సోమవారం) విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం ఎల్లుండి(మంగళవారం) పార్టీలతో భేటీ అవుతారు. ఓటర్ల జాబితాలో తప్పులు, ఫిర్యాదులపై రాష్ట్ర సీఈవోతో సమీక్ష నిర్వహిస్తారు. జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష చేస్తారు. ఎన్నికల సన్నద్ధతపై ఈనెల 10న సీఈవో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎన్నికల కమిషన్.. కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతుంది. ఈనెల 10న సాయత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం జరగనుంది. మీడియా సమావేశం అనంతరం సీఈసీ, ఎన్నికల కమిషనర్ల బృందం ఢిల్లీ వెళ్లనుంది. చదవండి: ‘నా ఉద్యోగం నేను చేసుకుంటా..’ -
చంద్రబాబుకు దేవినేని అవినాష్ కౌంటర్
-
‘ప్రజల కోసం పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు’
సాక్షి, విజయవాడ: ఇందిరా గాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. పోలీసుల గౌరవవందనం అందుకున్నారు. అనంతరం, మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘పోలీసులు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. మహిళాల భద్రత కోసం సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దిశ చట్టం, మహిళా మిత్ర, సైబర్ మిత్ర, జీరో ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారు. ప్రతి సచివాలయం పరిధిలో మహిళా పోలీస్ను నియమించాము. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చర్యలు తీసుకున్నాము’ అని స్పష్టం చేశారు. ఇక, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పోలీస్ శాఖలో సమర్థత పెంచేందుకు చర్యలు తీసుకున్నాము. సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చెప్పట్టాము. లోన్ యాప్ల నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాము. నాటు సారా నుండి 80 శాతం గ్రామాలకు విముక్తి కల్పించాము. వాటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి కల్పిస్తున్నాము’ అని తెలిపారు. -
నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
సాక్షి, విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన హేయనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఘటనకు సంబంధించిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. నిందితులను ఉరి తీయడం న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారని పేర్కొన్నారు. బాధితురాలికి ఇల్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, యువతి చేస్తానంటే ఉద్యోగం కూడా ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు సూచించామని హోంమంత్రి పేర్కొన్నారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశించారని తానేటి వనిత తెలిపారు. పెస్టిసైడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించామని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారని అన్నారు. చంద్రబాబు మానసికంగా బాధపడుతున్న యువతి విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన దృష్టి మరల్చేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. చదవండి👉: బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వెళ్తే టీడీపీ దౌర్జన్యం చేసింది: వాసిరెడ్డి పద్మ -
ఉద్యోగులే నిర్మించుకున్న వైద్యాలయం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఉద్యోగుల ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ). రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో లక్ష మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యసేవలు అందేవి. విభజన అనంతరం 2016లో విజయవాడ ప్రధాన కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో పరిపాలనా కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పట్లో రాష్ట్రంలోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు వ్యయప్రయాసలకోర్చి తార్నాక హాస్పిటల్ వెళ్లి వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. దీంతో రెండు మూడు రోజుల సమయం వృథా అయ్యేది. ఈ కారణంగా సిబ్బంది తిరిగి విధులకు హాజరు కావడానికి కొంత సమయం పట్టేది. తద్వారా ప్రయాణికుల సేవలకు బస్సులను సకాలంలో నడపటంలో సమస్యలు తలెత్తేవి. 18 డిస్పెన్సరీలు విద్యాధరపురంలోని సెంట్రల్ హాస్పిటల్కు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 18 డిస్పెన్సరీలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఇటీవల కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రిని నిర్మించి అక్కడ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్న విశ్రాంత ఉద్యోగులు విజయవాడ వరకు రావాల్సిన పని లేకుండా గత ఏడాది డిసెంబర్ 18న హైదరాబాద్ తార్నాక రోడ్డు నంబర్–1లో 19వ వైద్యశాలను నెలకొల్పారు. వార్డులు.. అత్యవసర విభాగాలెన్నో.. ఈ ఆస్పత్రిలో అత్యవసర పేషెంట్ల కోసం ఐసీయూ, క్యాజువాలిటీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు ఏర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, గైనిక్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, చెవి, ముక్కు, గొంతు, పీడియాట్రిక్స్, రేడియాలజీ, పాథాలజీ, డెంటల్, అనస్థీషియా విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా కార్డియాలజీ, ఆంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగాల కన్సల్టెంట్ వైద్యులు నెలలో రెండుసార్లు ఇక్కడకు వచ్చి సేవలు అందించే ఏర్పాటు చేశారు. డిజిటల్ ఎక్సరే, ఈసీజీ, స్కానింగ్, లాప్రోస్కోపీ, ఫ్యాకో (కేటరాక్ట్ ఆపరేషన్ కోసం) కలర్ డాప్లర్, ఆటో అనలైజర్, సీ–ఆర్మ్ వంటివే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యానికి పనికొచ్చేలా 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచారు. అత్యాధునిక ఫిజయోథెరఫీ విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్కు మెరుగైన వైద్యం కోసం రిఫరల్ హాస్పిటల్స్కు తరలించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ను కూడా సమకూర్చారు. వైద్యపరంగా ఏ విధమైన సమాచారం కావాలన్నా 24 గంటలపాటు పనిచేసే హెల్ప్లైన్ నంబర్లను (9494248897, 0866– 2415206) అందుబాటులోకి తెచ్చారు. వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, యంత్ర సామగ్రిని కూడా ఈ ఆస్పత్రి సొంతంగా సమకూర్చుకుంది. తార్నాక హాస్పిటల్కు దీటుగా.. ఉద్యోగుల ఇబ్బందులను అధిగమించే క్రమంలో తార్నాక హాస్పిటల్కు దీటుగా విజయవాడలోని విద్యాధరపురంలో ఉద్యోగుల భాగస్వామ్యంతో 2.50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్ నిర్మించింది. ఇందులో 2017 జూలై నెల 4వ తేదీ నుంచి వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. 50 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రి సుమారు 52 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు కలిపి మొత్తం సుమారు 2.25 లక్షల మంది వైద్య అవసరాలను తీరుస్తోంది. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ప్రతి ఉద్యోగి తమ జీతం నుంచి నెలకు రూ.100 చొప్పున రెండేళ్ల పాటు స్వచ్ఛందంగా విరాళంగా అందజేయటం విశేషం. ఇలా సుమారు రూ.13 కోట్లను సంస్థ సిబ్బంది సమకూర్చుకోగా.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చించింది. భవనాల నిర్మాణానికయ్యే ఖర్చులో ఎక్కువ మొత్తం సిబ్బంది నుంచే అందగా.. మిగిలిన మొత్తంతోపాటు ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన, పరికరాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకయ్యే నిధులను ప్రభుత్వమే సమకూర్చింది. ఈ విధంగా సకల సదుపాయాలు, సంపూర్ణ సౌకర్యాలతో ఉద్యోగులే కట్టుకున్న వైద్యాలయంగా ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్ విరాజిల్లుతోంది. వైద్య సేవలకు ప్రాధాన్యత ఆర్టీసీ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయి. సిబ్బంది ఆరోగ్యాన్ని సంరక్షించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకెళుతోంది. సంస్థ ప్రభుత్వంలో విలీనమైన తరువాత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులు మంజూరైనా సంస్థాపరమైన వైద్య సేవలను ఎప్పటిలానే అందిస్తున్నాం. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు అందుబాటులో లేని ఉచిత కన్సల్టేషన్, మందులు అందించే సౌకర్యాన్ని ఆర్టీసీ సంస్థ మాత్రమే తన ఉద్యోగులకు కల్పించింది. – సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఎండీ, ఏపీఎస్ ఆర్టీసీ 4 లక్షల పరిమితి వరకు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అవసరమైన ఆధునిక మెషినరీ, పరికరాలు సమకూర్చుకుంటున్నాం. రోజుకు దాదాపు 200 మంది సిబ్బంది ఈ విద్యాధరపురం హాస్పిటల్కు వస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్లలో రోజుకు 1700 నుంచి 2 వేల మంది వైద్య సేవలు పొందుతున్నారు. రిటైరైన ఉద్యోగి, అతని జీవిత భాగస్వామికి కలిపి రూ.4 లక్షల పరిమితి వరకు వైద్య సేవలు అందిస్తున్నాం. – డీవీఎస్ అప్పారావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, సెంట్రల్ హాస్పిటల్ -
విజయవాడ సీపీ కాంతి రాణా టాటా: రాధా భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు
-
ముగ్గురి యువకుల ప్రాణం తీసిన త్రిబుల్ రైడింగ్
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో.. పైగా ముగ్గురు బైక్పై వెళ్తున్న యువకులు ప్రమాదం బారిన పడి మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కండ్రిక పాతపాడులో చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వారు విజయవాడలోని వాంబే కాలనీవాసులుగా పోలీసులు గుర్తించారు. అతి వేగంగా వెళ్తున్న ఆ యువకులు రోడ్డు మళ్లింపు ఉందనే విషయాన్ని గమనించకుండా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
10 మెగా ప్రాజెక్టులతో 55 వేల మందికి ఉపాధి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు. స్టాల్స్ను పరిశీలించిన సీఎం జగన్ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. 2020-2021లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని సీఎం తెలిపారు. రెండేళ్లలో రూ. 20, 390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదారాబాద్- బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్షరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3గ్రీన్ఫీల్డ్ పోర్టులు, 13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023-2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 3 వేల మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ. 500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గెయిల్తో కలిసి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం అభివృద్ధికి 25 ప్రపంచస్థాయి కళాళాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్రం 10 శాతం వాటి సాధించడమే లక్ష్యమని అన్నారు. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, రూ. 2,500 కోట్ల పెట్టుబడితో 80 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రెట్టింపు చేయడమే లక్క్ష్యమని అన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. ఫార్మా ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్ ఎగుమతులకు భారీ అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంత్రి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ వారంలోనే ఎక్స్పోర్టు కాన్క్లేవ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎక్స్పోర్టు కాన్క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తామని తెలిపారు. వాణిజ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంతోనైనా పోటీ పడే సత్తా ఏపీకి ఉందని పేర్కొన్నారు. వాణిజ్యం పెంపుకు, మౌలిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని తెలిపారు. కోవిడ్ కష్టాలున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. -
ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు
సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం నమోదు చేసింది. అన్ని జడ్పీ చైర్మన్ల స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుని, 100 శాతం జడ్పీ ఛైర్మన్లను దక్కించుకున్న పార్టీగా రికార్డు సాధించింది. ఆదివారం విడుదలై షరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్ను మించి జైత్రయాత్ర ఇప్పటివరకు 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్సీసీ 5998 స్థానాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. -
రాహుల్ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ
-
‘అగ్రిగోల్డ్ ఆస్తులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు యత్నించారు’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు, టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో నీచ రాజకీయాలు చేశారని మండిపడ్డారు. మధురనగర్లో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాటు కార్పొరేటర్ జానరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని ప్రయత్నాలు చేశాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగిందని తెలిపారు. 2014 నుంచి 2019లో టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. చదవండి: Andhra Pradesh: రూ.వెయ్యి కోట్లతో ప్లైవుడ్ యూనిట్ టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నెరవేర్చారని, గ్రామ సచివాలయం ద్వారా సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించారని తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్ పేదరికం నిర్మూలన చేస్తున్నారని తెలిపారు. నాడు-నేడు ద్వారా విజయవాడ నగర అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి.. అత్తింటివారే చంపారని ఆరోపణలు
సాక్షి, విజయవాడ: సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉష అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కుమార్తె ఉషను అత్తింటివారే చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఉష తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉష సోదరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా కేసు విచారణ చేస్తామని చెప్పారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: అరకు మత్తులో.. యువత చిత్తు..! -
సబ్సిడీపై రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ: కన్నబాబు
సాక్షి, విజయవాడ : సబ్సిడీపై రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తామని, ఈనెల 10 నుంచి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈనెల 17 నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం అదేశాలకు అనుగుణంగా విత్తనాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేశాం. రైతుల నుండే విత్తనాలు తీసుకుని ప్రాసెసింగ్ చేసి మళ్లీ రైతులకు అందిస్తున్నాం. సీఎం జగన్ ఆదేశాలతో ఈ పద్ధతిని అమలు చేస్తున్నాం. గత ఏడాది విత్తనాల పంపిణీని గ్రామ స్థాయి నుండి ప్రారంభించాం. ఈ ఏడాది మరింత సమర్థవంతంగా విత్తనాలు పంపిణీ చేస్తాం. విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కి గంటల తరబడి ఎండలో నిలబడే పరిస్థితి గతంలో ఉండేది. సీఎం జగన్ ఆలోచనలతో రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే పంపిణీ చేస్తున్నా’’మన్నారు. -
‘మేం చచ్చిపోతున్నాం.. మా పార్ట్స్ నా భార్యకు ఇవ్వండి’
విజయవాడ: ‘మేం ఆత్మహత్య చేసుకుంటున్నాం.. మా అవయవాలు మావిడకు ఇవ్వండి’ అంటూ లేఖ రాసి ఓ వ్యక్తి తన కూతురును హత్య చేసి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పట్టణంలో చోటుచేసుకుంది. మృతుడు రాసిన లేఖ చూస్తే అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. భార్య అనారోగ్యం చెందడంతో తమ అవయవాలతోనైనా ఆమె కోలుకుంటుందనే ఉద్దేశంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే తన కూతురును కూడా ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని శ్రీనగర్ కాలనీకి చెందిన జగానీ రవి (40), భరణి భార్యాభర్తలు. వారికి ఒక కుమార్తె (10). రవి గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తుండేవాడు. వీరు రామకృష్ణపురంలో నివసిస్తున్నారు. రవి భార్య భరణి కొంతకాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యం పాలయ్యింది. ఆమె అనారోగ్యం చెందడంతో రవి, కుమార్తె మనస్తాపానికి గురయ్యారు. దీంతో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆత్మహత్య లేఖ రాసి కూతురుతో కలిసి రవి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చనిపోయిన తర్వాత తమ అవయవాలను భార్యకు దానం చేయాలని లేఖలో రవి పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి సత్యనారాయణ పురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘నేను చాలదా.. ఇంకొకడు కావాల్న’ అంటూ సజీవదహనం చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
పల్లెకు పోదాం.. చలోచలో
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్/కేతేపల్లి: సంక్రాంతి ప్రయాణాలతో మంగళవారం కూడా రహదారులపై రద్దీ నెలకొంది. నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు తరలి వెళ్లారు. విజయవాడ, విశాఖ, కాకినాడ, ఏలూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో భారీగా రద్దీ కనిపించింది. మరోవైపు తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జూబ్లీ బస్స్టేషన్, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలు పోటెత్తాయి. వివిధ మార్గాల్లో బస్సులు కిక్కిరిసి బయలుదేరాయి. ఇక రైళ్లలో జనరల్ బోగీల్లో అప్పటికప్పుడు టికెట్ తీసుకొనే సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు టికెట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. గోదావరి, విశాఖ, ఇంటర్సిటీ, నర్సాపూర్, మచిలీపట్నం తదితర ఎక్స్ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు 350 దాటిపోయింది. చాలా రైళ్లలో ‘నోరూమ్’దర్శనమివ్వడంతో చివరి నిమిషంవరకు ఎదురు చూసిన వాళ్లు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించవల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో సాధారణ చార్జీలపైన 50 శాతం అదనంగా, ప్రైవేట్ ట్రావెల్స్ల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేశాయి. కొన్ని సంస్థలు రెండు రెట్లు పెంచాయి. భోగి వేడుకలకు మిగిలింది ఒక్కరోజే కావడంతో చార్జీలు భారమైనా చాలా మంది సొంతూళ్లకు బయలుదేరారు. మరోవైపు సొంత వాహనాల్లో సైతం భారీ ఎత్తున తరలి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారు ఎక్కువ శాతం సొంత కార్లు, క్యాబ్లను ఆశ్రయించారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సుమారు 15 లక్షల మంది నగర వాసులు సొంతూళ్లకు తరలి వెళ్లినట్లు అంచనా. జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ.. పండుగకు సొంతూళ్లకు వేళ్లే వారితో హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్ప్లాజాల వద్ద మంగళవారం రాత్రి రద్దీ నెలకొంది. పంతంగి వద్ద 16 గేట్లకు గాను విజయవాడ మార్గంలో పది గేట్లు తెరిచారు. సాయంత్రం వరకు టోల్ప్లాజా వద్ద సాధారణంగా ఉన్న రద్దీ రాత్రి ఒక్కసారిగా పెరిగింది. సాధారణ రోజుల కంటే పండుగ సమయాల్లో 10 నుంచి 15 వేలకు పైగా వాహనాలు అదనంగా వెళ్తాయని టోల్ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. -
పోలవరంపై వస్తున్న వాదనలన్నీ ఊహాగానాలే...
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మరోసారి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టెక్నాలజీ పేరుతో పోలవరం అంచనాలు పెంచారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ అంచనాల పెంపుపై విచారణ జరగాలని ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. ‘2013లో ఎంత రీహాబిలిటేషన్ అవుతుందని చెప్పారో.. 2015కల్లా దాని అంచనా పెరిగిపోయింది. దానిపై విచారణ జరగాలి. గతంలోనే నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేశాం’ అని అన్నారు. ‘పోలవరం ప్రాజెక్ట్ డీపీఆర్ 1,2 లకు సంబంధించి ఎంత అంచనాలు ఇస్తారో అవి వందకు వంద శాతం చేస్తామని గతంలో ఉమా భారతి, నితిన్ గడ్కరీ, నేటి జల వనరుల శాఖ మంత్రి వరకు హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రం భరిస్తుంది. పోలవరంపై వస్తున్న వాదనలన్ని ఊహాగానాలే. కేంద్రం పూర్తి వంద శాతం నిధులతో పోలవరాన్ని పూర్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై గత ప్రభుత్వ అంశాలపై కూడా శ్వేత పత్రం విడుదల చేయాలి. పారదర్శకంగా పోలవరం పనులు జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని ఎమ్మెల్సీ మాధవ్ కోరారు. -
కరోనాపై కృష్ణాజిల్లా కలెక్టర్ పేరడి పాట
సాక్షి, విజయవాడ: కరోనాపై ప్రజలు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండి వైరస్ను నియంత్రించాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. కోవిడ్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినిమా పాటకు కలెక్టర్ ఇంతియాజ్ పేరడి పాటను రాయగా ఆ పాటను చంద్రిక పాడారు. ఈ పాటను శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 36 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వైరస్పై ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా నిర్లక్ష్యంగా ఉంటే దాని బారిన పడతారన్నారు. కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. ఈనెల 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ కోవిడ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చదవండి: ఎమ్మెల్యే వంశీకి పాజిటివ్ విజయదశమి శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి అని, ఈ పండుగ ప్రజలందరికి విజయాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. -
ప్రమాద కారకులపై కఠిన చర్యలు..
సాక్షి, కృష్ణా: కరోనా పేషెంట్ల కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ‘ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో అగ్ని ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటన కారకులపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఆయన ట్వీట్ చేశారు. -
విశ్వ సుందరిగా బెజవాడ యువతి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడకు చెందిన బి. నాగదుర్గా కుసుమసాయికి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కింది. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా), ఇతర తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలో భాగంగా మిస్ తెలుగు యూనివర్సల్ పోటీల్లో కుసుమసాయికి ఈ అరుదైన గౌరవం దక్కింది. విశ్వసుందరి పోటీలకు 600 పైగా ఎంట్రీలు రాగా ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు కుసుమసాయిని ఎంపిక చేశారని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు చెప్పారు. కుసుమసాయి బీకాం చదువుతోందని, ఆమెకు నాట్యం, నాటక రంగాల్లోనూ ప్రవేశం ఉందని తెలిపారు. -
‘టీడీపీ పాలనలో ఇళ్లు ఇస్తామని మోసం’
సాక్షి, విజయవాడ: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర పాలక సంస్థ కమీషన్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారమే ప్రజలకు మౌలిక సదుపాయాలు, రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాల పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. నగరంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంజాద్ బాషా పేర్కొన్నారు. 52వ డివిజన్లో రూ.13.5 కోట్లతో శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా సీఎం వైఎస్ జగన్ పాలన అందిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమనికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని అంజాద్ బాషా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 14వ ఆర్థిక కమీషన్ నుంచి రూ.140 కోట్లు, బడ్జెట్ నుంచి రూ. 25 కోట్లు, సీఎం వైఎస్ జగన్ డివిజన్ల అభివృద్ధికి కేటాయించిన రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రూ. 250 నుంచి రూ. 300 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ పాలనలో సెంట్రల్ నియోజకవర్గం నిర్లక్ష్యనికి గురైందని విమర్శించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సిప్ అనే సంస్థ పేరుతో శిలాఫలకాలు, కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేశారని మల్లాది విష్ణు అన్నారు. అన్ని డివిజన్లలోని త్రాగు నీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు 80శాతం ప్రజలకు చేరువ చేశామని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో నియోజకవర్గంలో ఇళ్ళు ఇస్తామని 15 వేల మందిని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. వేల మందికి కేవలం 600 ఇళ్లు చూపి.. ప్రజలను మోసం చేసారని ఆయన విమర్శించారు. వాటిలో రివర్స్ టెండరింగ్తో రూ. 25 కోట్లు ఆదాచేశామని ఆయన అన్నారు. టీడీపీ కార్పొరేటర్లు ఇళ్ల అప్లికేషన్లకు రూ. 25, రూ. 50 వేలకు అమ్ముకున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేశారని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థతో ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు మతి భ్రమించడంతో మొన్నటి వరకు ఈవీఎంలు అని.. ఇప్పుడు ఓటర్లు డబ్బులకు అమ్ముడు పోయారంటున్నారని దుయ్యబట్టారు. రాష్టంలోని అన్ని మున్సిపాలిటీలను గెలిచి ప్రజలకు జవాబుదారితనంగా తాము పాలన అందిస్తున్నట్లు నిరూపిస్తామన్నారు. అర కేజీ టమాటా, ఒక కేజీ బియ్యం ఇచ్చి ‘జై తెలుగుదేశం’అనిపించే దుస్థితికి టీడీపీ నాయకులు దిగజారారని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో మీరు అందించిన పాలన, ఎనిమిది నెలల్లో తాము అందించిన పాలనపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో 34,500 మందికి అమ్మఒడి ఇచ్చామని తెలిపారు. ఐదేళ్లలో ఇలాంటి కార్యక్రమం జరిగిందా అని ప్రశ్నించారు. 24 గంటలు అమరావతి పేరుతో అధికారులను ఫైల్స్ పట్టుకుని సచివాలయం చుట్టు తిరిగేలా చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్ ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేలా పాలన అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. సీఎం జగన్ సాచురేషన్ పద్ధతిలో అర్హులందిరికీ ఫలాలు అందేలా చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో 35 వేలమంది ఇల్లు లేనివారిని గుర్తించామని తెలిపారు. అధికారం అడ్డం పెట్టుకుని ఐదేళ్లలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విష్ణు విమర్శించారు. తన కోటరికే మేలు జరిగేలా పాలన అందించారని మండిపడ్డారు. ఐటీ దాడులే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. అమరావతి ఎక్కడికి తరలిపోదని.. శాసనసభ అమరావతిలోనే ఉంటుందన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుష్పచారం చేస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. -
‘చంద్రబాబు ఆంధ్ర ప్రజల ద్రోహి’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం చేసి.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధివిభాగం అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారిపాలన వికేంద్రీకరణతోనే 13 జిల్లాల అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ ముందడుగు వేశారని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు అడ్డుకోవడంతో చంద్రబాబు ఆంధ్ర ప్రజల ద్రోహిగా మిగిలిపోతారని అంజిరెడ్డి మండ్డిపడ్డారు. వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చంద్రబాబు విధానాలకు నిరసనగా ఈ నెల 30 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తే.. పెయిడ్ ఆర్టిస్టులు అన్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రాహ్మం చౌదరి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేస్తే.. అప్పుడు నువ్వు గాడిదలు కాసావా అని అంజిరెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని బ్రాహ్మం విద్యార్థులను మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నిరుద్యోగులకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రెండు లక్షల ఉద్యోగ ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయని చేతకాని ప్రభుత్వం టీడీపీ అని అంజిరెడ్డి ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే రాష్ట్రం నుంచి బ్రాహ్మం చౌదరిని అతని విద్యార్ధి సంఘాన్ని వెళ్లగొడతామని అంజీరెడ్డి హెచ్చరించారు. -
బెజవాడలో మళ్లీ నకిలీ కరెన్సీ కలకలం
సాక్షి, విజయవాడ : బెజవాడలో మరోసారి నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. చిరు వ్యాపారులనే టార్గెట్గా చేసుకొని నకిలీ కరెన్సీ ముఠా దొంగనోట్లను ప్రజల్లోకి చలామణి చేస్తోంది. రెండు రోజుల క్రితం ఈ ముఠాలోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని మూడు లక్షల రూపాయల విలువ చేసే దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. దొంగనోట్ల ముఠా కృష్ణా జిల్లా మచిలీపట్నం చిన్నాపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల వ్యవధిలోనే దొంగనోట్ల ముఠాలోని మరో ఇద్దరిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.13 లక్షల ఇరవై ఎనిమిది వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వంద, ఐదు వందల, రెండు వేల రూపాయల నకిలీ నోట్లు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో నలుగురు ముఠా సభ్యులు ఉన్నారు. అయితే అసలు ముఠా సూత్రధారుల కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. నకిలీ నోట్ల వ్యవహారంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని.. ఎవరిపైన అయినా అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ సూచించారు. దొంగనోట్ల చలామణీని పూర్తిస్థాయిలో అరికడతామని.. నకిలీ నోట్ల ముఠా కోసం నగరంలో ప్రత్యేక టీంలు తిరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి కేసులో పురోగతి
-
విజయవాడ రైల్వేస్టేషన్కు గోల్డెన్ రేటింగ్
సాక్షి, రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలకు గానూ ఇండియన్ గ్రీన్ కౌన్సిల్ సంస్థ రైల్వేస్టేషన్కు గోల్డెన్ రేటింగ్ ఆదివారం ప్రకటించింది. 100కి 71 పాయింట్లను స్టేషన్ దక్కించుకుంది. గతేడాది నవంబరు 14న విజయవాడ రైల్వేస్టేషన్ను సందర్శించిన ప్రతినిధులు స్టేషన్లోని వసతులను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ స్టేషన్కు గోల్డెన్ రేటింగ్ ఇచ్చింది. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు.. స్టేషన్లో ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులకు సెంట్రల్ ఏసీతో కూడిన విశ్రాంతి మందిరాలు, అత్యాధునిక ఫుడ్కోర్టు, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాళ్లు, అత్యాధునిక ఎగ్జిక్యూటివ్ లాంజ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు చికెన్ వంటకాలు అందించేందుకు ప్రపంచ ప్రసిద్ధగాంచిన కేఎఫ్సీ రెస్టారెంట్ స్టేషన్లోని 1వ నంబరు ప్లాట్ఫాంపై ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సత్వర టికెట్లు అందించేందుకు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్( ఏ.టి.వి.ఎం)లు 16 ఇప్పటికే స్టేషన్లోని తూర్పు ముఖద్వారం1, 2, తారాపేట టెర్మినల్లలో అందుబాటులో ఉన్నాయి. దివ్వాంగులు, వమోవృద్ధులను రైలు ఎక్కించేందుకు అత్యాధునిక వీల్చైర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఐదు దశల్లో శుద్ధి చేసిన జలాన్ని అతి తక్కువ ధరకు అందించే ఆర్వో ప్లాంట్లను ఉన్నాయి. త్వరలో ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించి ప్లాటినం ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని స్టేషన్ అధికారులు తెలిపారు. -
యువకుడు ఆత్మహత్య
సాక్షి, అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్) : ‘నాకు బతుకు మీద ఆశలేదు.. నేను చనిపోతాను..’ అంటూ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు చెప్పినంత పని చేశాడు. నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్ ప్రాంతానికి చెందిన అమర్లపూడి సుశీలకుమారికి కూతురు, కొడుకు సంతానం ఉన్నారు. కొడుకు అవినాష్ (22) డిగ్రీ వరకూ చదువుకున్నాడు. కొంతకాలం నుంచి ఆయనకు మతి స్థిమితం సరిగా ఉండడం లేదు. దీంతో శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అవినాష్ తన అక్కకు ఫోన్ చేసి తనకు బతకాలని లేదని, తాను చనిపోతానంటూ ఫోన్ చేశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన అతని తల్లి, అక్క చుట్టుపక్కల ప్రాంతాలు, నగరంలో పలు చోట్ల వెతికి నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కృష్ణా నదిలో ఆదివారం ఓ యువకుడి శవం లభ్యమైనట్లుగా సమాచారం అందింది. విషయాన్ని అవినాష్ కుటుంబ సభ్యులకు తెలుపగా వారు వెళ్లి చూసి చనిపోయిన ఆ వ్యక్తి అవినాషేనని తేల్చారు. పోలీసులు మిస్సింగ్ కేసును అనుమానాస్పద మృతిగా మార్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. తమ కుమారుడు మృత్యువాతపడ్డాడని తెలుసుకున్న ఆ తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అవినాష్ (ఫైల్) -
‘జలీల్ఖాన్ నాపై ఫత్వా జారీ చేయించారు’
సాక్షి, విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జలీల్ఖాన్ కుమార్తె షభానా ఖాతూన్ను ఖరారు చేయడంపై మాజీ మేయర్ మల్లికా బేగం అభ్యంతరం తెలిపారు. తాను 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధం కాగా, తనకు ఓటేయరాదని జలీల్ ఖాన్ మతపెద్దల చేత ఫత్వా జారీ చేయించారని మల్లికాబేగం మండిపడ్డారు. ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె వియవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్ధం అవుతోందనీ, కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీచేయాలని డిమాండ్ చేశారు. తనను రాజకీయాల్లో ఉండకూడదని 2009లో ఫత్వా జారీ చేసిన కుల పెద్ద మఫ్తి మౌలానా అబ్ధుల్ ఖదీర్కు వినతి పత్రం సమర్పించేందుకు ఆమె ఇందాద్ ఘర్కు వెళ్లారు. మత పెద్ద అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటి ముందే బైఠాయించి నిరసన తెలిపారు. మహిళలు రాజకీయాలలో ఉండకూడదని ఫత్వా జారీ చేసిన కుల పెద్దలు.. జలీల్ఖాన్ విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు. -
ఎవ్వరీని మోసం చెయ్యని వ్యక్తి రైతు మాత్రమే: నాగిరెడ్డి
సాక్షి, విజయవాడ: భారతదేశ రైతు బాంధవుడిగా పేరుగాంచిన మాజీ ప్రధాని చరణ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా (ఆదివారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షడు ఎంవీఎస్ నాగిరెడ్డి దేశ, రాష్ట్ర ప్రజలకు అడ్వాన్స్గా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రజానీకానికి చరణ్ సింగ్ చేసిన విశిష్ట సేవలను గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ... చరణ్ సింగ్ రైతు కుటుంబంలో జన్మించి స్వతహాగా రైతు అయి ఉండి రాజకీయాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని అన్నారు. ఎవ్వరీని మోసం చెయ్యని, మోసం చేసే ఆలోచన కూడా లేని వ్యక్తి ఒక్క రైతు మాత్రమేన్నారు. మన రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో సకాలంలో వర్షాలు, వాయువేగాలు, ఉష్ట్రోగతలు అనుకూలంగా ఉండి రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి గణనీయంగా పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి విధ్వంసకుడుగా చంద్రబాబు మారారు. చంద్రబాబు పాలనలో ప్రకృతి వికృత రూపం దాల్చి వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా తగ్గిందని అన్నారు. రాబోయే వ్యవసాయ సీజన్ మొదలయ్యే నాటికి జూన్1 నాటికి రాష్ట్రంలో ప్రకృతి ప్రేమికుల ఉండే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. మళ్లీ 2019 డిసెంబర్ 23 తేదీన జాతీయ రైతు దినోత్సవం సంతోషంగా జరుపుకునేలా దీవించాలని ప్రకృతి పంచశక్తులను, భగవంతుడిని వేడుకున్నట్లు ఆయన చెప్పారు. -
‘అందుకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉన్నారు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుద్ధి చెప్పటానికి నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు అన్నారు. సోమవారం బాబు ఏది జాబు అంటూ భారతీయ జనతా యువ మోర్చా నేతలు, కార్యకర్తలు విజయవాడలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రంగంలోని ఖాళీలను భర్తీ చేయాలంటూ, నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలకు పెంచాలంటూ ఏపీపీఎస్ ఛైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ధర్నాచౌక్నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, యువ మోర్చా నేతలకు మధ్య వాగ్వివాదం.. తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఏలూరు రోడ్డులో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు వస్తుంది అంటూ నిరుద్యోగ యువతని చంద్రబాబు మోసం చేశారని, ఆయన వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కొడుకుకు తప్పితే రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. -
విజయవాడ హత్యాయత్నం వెనుక..
సాక్షి, విజయవాడ : ఫైనాన్స్ వ్యాపారి గగారిన్ హత్యాహత్నం కేసులో నమ్మలేని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే గగారిన్పై హత్యాయత్నం జరిగిందని తెలుస్తోంది. ఆస్తి కొనుగోలు చేయడమే గగారిన్ ప్రాణాలకు ముప్పు తెచ్చిందని ఆయన కుటుంబీకులు వాపోతున్నారు. గగారిన్ కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం..మద్దాలి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి గగారిన్ ఆస్తి కొనుగోలు చేశారు. అయితే ఆ ఆస్తి విక్రయంలో ప్రసాద్, ఆయన తనయుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గగారిన్ కొనుగోలు చేసిన ఆస్తిని ప్రసాద్ కుమారులు సురేష్, సుధాకర్లు ఆక్రమించారు. (విజయవాడలో దారుణం.. పెట్రోల్ పోసి నిప్పంటించారు) సదరు ఆస్తిని దక్కించుకునేందుకు గతంలో గగారిన్పై దాడి చేశారు. దీంతో గగారిన్ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని చేతులు దులుపుకున్నారు. పోలీసుల వల్ల న్యాయం జరగకపోవడంతో గగారిన్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి గగారిన్కు అనుకూల తీర్పు వస్తుందనే ఉద్దేశంలో దుండగులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం విజయవాడలోని గవర్నర్ పేట సమీపంలో గగారిన్పై ఇద్దరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో దాడి కేసును పోలీసులు సీరియస్గా తీసుకోలేదని గగారిన్ కుటుంబీకులు ఆరోపించారు. పోలీసులు చిత్తశుద్దితో వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కుటుంబీకులు వాపోతున్నారు. -
పోలవరం ప్రాజెక్టును టీడీపీ గాలికొదిలేసింది
-
బీజేపీ-టీడీపీకి ఉన్న అనుబంధం ఏంటి?
సాక్షి, విజయవాడ : ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును టీడీపీ గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ నేత పార్ధసారథి విమర్శించారు. అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టును కేవలం ఆర్భాటానికి, ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరం ప్రాజెక్టు లోపాలకు కేంద్ర బృందం ఎత్తిచూపింది. రోజుకు 10 కోట్ల నుంచి 20 కోట్ల పనులు జరుగుతున్నాయి. అయినా సరే ప్రభుత్వం నాణ్యతను పట్టించుకోవడంలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్వేలో గ్యాపులు ఉన్నాయి. కంకర తప్ప మరేమి కనబడడంలేదు. ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముడుపులు ఇచ్చేవారికే సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నారు. నిర్మాణంలో నాసిరకం సిమెంట్ ఉపయోగిస్తున్నారు. పర్మింట్ క్వాలిటి డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలి. 112.45 కోట్లు ఏలాంటి పనులు జరగకుండా దొచ్చుకున్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఉత్తర్వులు ఇస్తున్నారు. టీడీపీ-బీజేపీకి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే బీజేపీ కళ్లు మూసుకుని ఉంది. వారిమధ్య ఉన్న అనుబంధం ఏంటి?. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పోలవరం అవకతవకలపై విచారణ జరిపించాలి’’ అని పేర్కొన్నారు. -
అత్త సొమ్ము అల్లుడు దానంలా ఉంది
సాక్షి, విజయవాడ : మున్సిపల్ నిధులు ఎమ్మెల్యేలు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని విజయవాడ నగర పాలక సంస్థ వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ పుణ్యశీల ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో నగరపాలక సంస్థ లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. నగర పాలక సంస్థ వ్యవహారం అత్త సొమ్ము అల్లుడు దానంలా ఉందని ఎద్దేవా చేశారు. డిస్నిల్యాండ్ ఇంకా కొలిక్కిరాలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే చివరికి సెంట్ భూమి లేకుండా చేస్తారన్నట్లుగా ఉందన్నారు. అన్ని అంశాలను సోమవారం జరిగే మున్సిపల్ సమావేశంలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. -
రోగితో డాక్టర్ అసభ్య ప్రవర్తన..చితకబాదిన స్థానికులు
-
ఇంద్రకీలాద్రిపై భక్తుల ఆందోళన
-
ఇంద్రకీలాద్రిపై భక్తుల ఆందోళన
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చిన భక్తులకు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఎంతకూ అమ్మవారి దర్శనం లభించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ అధికారులు వీఐపీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, దుర్గమ్మ దర్శనానికి తమను అనుమతించడం లేదని భక్తులు మండిపడుతున్నారు. రూ. 3వేలు పెట్టి టికెట్ కొనుకున్నా.. దర్శనం కోసం బారులు తీరడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంకుమపూజ కోసం భక్తులు మండుటెండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా అందుబాటులోకి లేకపోవడంతో ఆలయ ఈవోను నిలదీశారు. దీంతో భక్తులకు సమాధానం చెప్పకుండానే ఈవో సూర్యకుమారి వెళ్లిపోయారు. శరన్నవరాత్రి వేడుకలు ఇంద్రకిలాద్రిపై వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మవారు ఆదివారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దుర్గమ్మ దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. -
డీఎస్సీ అభ్యర్థులను ఈడ్చేశారు
-
డీఎస్సీ అభ్యర్థులను ఈడ్చేశారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ ఎదుట 2014 డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు ఫోస్టింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అభ్యర్థులను బలవంతంగా ఈడ్చుకెళుతూ వ్యానుల్లో పడేశారు. అక్రమ అరెస్టులు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 2014లో ఏపీ సర్కారు డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు ప్రకంటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నియామకాల ప్రక్రియ ప్రారంభించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీవైఎఫ్ఐ, 2014 డీఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వందలాదిగా అభ్యర్థులు పాల్గొన్నారు. -
శాకంబరిని దర్శించుకున్నచంద్రబాబు
విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలలో మూడో రోజైన శుక్రవారం దుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. పండితులు ఆయనకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ కూడా అమ్మ వారిని దర్శించుకున్నారు. కాగా వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మూడు రోజుల పాటు వైభవంగా జరిగిన ఉత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. భవానీ దీక్ష మండపంలో నిర్వహించే మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి.