rivers
-
11 నదుల అనుంధానానికి రూ. 40 వేల కోట్లు
దేశంలో నదుల అనుసంధానం వివిధ ప్రాంతాలు తాగు,సాగునీటి అవసరాలను తీరుస్తుందనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. దీనిని రాజస్థాన్లో సాకారం చేసేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది.రాజస్థాన్లోని 11 నదులను అనుసంధానం చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజస్థాన్ను నీటి మిగులు రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్లో జరిగిన సుచి సెమికాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ, భవిష్యత్తులో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటర్ హార్వెస్టింగ్పై కృషి చేయాలని ఆయన వివిధ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.రాజస్థాన్లో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని, నరేంద్ర మోదీ ప్రారంభించనున్న 11 నదులను అనుసంధానించే ప్రాజెక్టుతో రాష్టంలో తలెత్తుతున్న నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రాజస్థాన్-మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు ద్వారా ఆయా రాష్ట్రాలలో నీటి ఎద్దడి తగ్గుతుందన్నారు. నూతనంగా చంబల్, దాని ఉపనదులైన పార్వతి, కలిసింద్, కునో, బనాస్, బంగంగా, రూపారెల్, గంభీరి, మేజ్ తదిర ప్రధాన నదులను అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఫలితంగా ఝలావర్, కోట, బుండి, టోంక్, సవాయి మాధోపూర్, గంగాపూర్, దౌసా, కరౌలి, భరత్పూర్, రాజస్థాన్లోని అల్వార్ మధ్యప్రదేశ్లోని గుణ, శివపురి, షియోపూర్, సెహోర్లతో సహా కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్కు ప్లాన్ చేసుకోవచ్చు -
నదులు ఎండిపోతున్నాయ్!
నదులు మానవాళి పాలిట జీవనాడులు. నది లేకపోతే జీవమే లేదు. అలాంటి నదులు ప్రస్తుతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నదులు విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు దొరకదని, మరోవైపు విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. ఇవీ ప్రమాదాలు...మరికొద్ది కాలంలో ప్రపంచంలోని అనేక నదుల్లో అతి స్వల్ప పరిమాణంలో నీరు అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. → అవి నెమ్మదిగా దుమ్ము, చిన్న రాళ్ళతో కూడిన అవక్షేపంగా మారిపోతాయని హెచ్చరించింది. → ఫలితంగా దీంతో తాగడానికి, పంటలకు, పశువులను పోషించడానికి మంచి నీటి కొరత ఏర్పడుతుందని అధ్యయన సారథి, హైడ్రాలజీ ప్రొఫెసర్ డోంగ్మే ఫెంగ్ తెలిపారు. → నదులు భూమికి రక్తనాళాల వంటివని, అవి ప్రవహించే తీరులో మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఫెంగ్ హెచ్చరించారు.క్షీణిస్తున్న నదులు భూమిపై నదులు లోనవుతున్న మార్పులపై సిన్సినాటీ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. శాటిలైట్ డేటా, కంప్యూటర్ మోడలింగ్ పరిజ్ఞానంతో పలువురు శాస్త్రవేత్తలు 35 ఏళ్లుగా భూమిపై ప్రతి రోజూ ప్రతి నది నీటి ప్రవాహాన్ని మ్యాపింగ్ చేశారు. ఇందులో వెల్లడైన విషయాలు వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లోని సగం నదుల్లో నీటి ప్రవాహం అతి వేగంగా తగ్గుముఖం పడుతోంది! ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా 5 శాతముంటే మరికొన్నింట్లో ఏకంగా 10 శాతం దాకా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఇది చాలా వేగవంతమైన మార్పని హెచ్చరించింది. ఆఫ్రికాలోని రెండో అతి పెద్ద నది కాంగో, చైనాలో ప్రముఖ నది యాంగ్జీ, దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే గణనీయంగా క్షీణించిపోయాయి. ముంచుకొస్తున్న వరద ముప్పు ఇక పర్వత ప్రాంతాల్లోని పలు చిన్న నదుల పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిలో ప్రవాహం 17 శాతం పెరిగింది. హిమాలయాల వంటి ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రణాళికలు ఊహించని ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయి. అవక్షేపం దిగువకు రవాణా అవుతోంది. ఇది వరదలను తీవ్రతరం చేస్తోంది. గత 35 ఏళ్ల కాలంలో ఎగువ ప్రాంతాల్లోని ఇలాంటి చిన్నాచితకా నదుల వల్ల భారీ వరదలు ఏకంగా 42 శాతం పెరిగాయని అధ్యయనంలో తేలింది. వాతావరణంలో అధిక మార్పులు, నదీ ప్రవాహాలకు మానవులు అంతరాయం కలిగించడం వంటివే ఇందుకు కారణమని సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కోలిన్ గ్లీసన్ చెప్పారు. ‘‘ఈ వాతావరణ మార్పులు ప్రధానంగా మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల వల్ల ఏర్పడ్డ వాతావరణ సంక్షోభమే. వాటివల్ల వర్షపాత పరిస్థితులు మారుతున్నాయి. మంచు కరిగి రేటు వేగవంతం అవుతోంది. స్తోందని, ఫలితంగా వరదలు ముంచెత్తుతున్నాయి’’ అని ఆయన వివరించారు. ‘‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దుర్భర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో కనీవినీ ఎరగని వరదలు పరిపాటిగా మారే రోజు దూరంలో లేదు’’ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Bihar: విషాదాన్ని మిగిల్చిన పండుగ.. నీట మునిగి 46 మంది మృతి
పాట్నా: బిహార్లో జివుతియా పండుగ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో 46 మంది నీట మునిగి మరణించారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొన్నారు.కాగా బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ‘జీవిత్పుత్రిక’ పండుగ జరుపుకున్నారు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండటంతో పాటు పిల్లలతో కలిసి నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుమారు 46 మంది గల్లంతయ్యారు.వీరిలో ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికితీసినట్లు విపత్తు నిర్వహణ విభాగం(డీఎండీ) అధికారులు తెలిపారు. తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్పూర్, సమస్తిపూర్, గోపాల్గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.ఈ విషాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని సీఎం నితీష్కుమార్ వెల్లడించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందిందని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘రివర్స్’తో నందిని నెయ్యి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. మహాపచారానికి పాల్పడ్డారని పచ్చి అబద్ధాలు వల్లిస్తూ శ్రీవారి సన్నిధిలో రివర్స్ టెండర్లు ఏమిటంటూ గద్దించిన సీఎం చంద్రబాబు తాజాగా అదే విధానంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థకు కేటాయించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.టెండర్లో ఎల్ 1గా నిలిచిన కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకుండా రివర్స్ టెండర్ పిలిచి అత్యధికంగా ఆల్ఫా మిల్క్ సంస్థకు కేటాయించడం గమనార్హం. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్కు కట్టబెట్టేందుకే లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయనే ఆరోపణలు తెరపైకి తెచ్చి రివర్స్ టెండర్ విషయాన్ని పక్కదారి పట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ 1 కాదని ఎల్ 2కి ఎలా ఇస్తారు? ‘రివర్స్’ మతలబేంటి?తిరుమలలో స్వామి వారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టాలని కూటమి పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా టీటీడీ గత నెల 7 తేదీన మూడు నెలలకు సరిపడా నెయ్యి సరఫరాకు ఈ టెండర్లు పిలిచింది. ఇందులో కర్ణాటకకు చెందిన నందిని(కర్ణాటక కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) కిలో నెయ్యి రూ.470 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది.ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ రూ.530 కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఎల్ 1గా నిలిచిన నందినికే టెండర్ దక్కాలి. అయితే నందినిని కాదని ‘ముఖ్య’ నేత ఆల్ఫా ఫుడ్స్ సంస్థకు నెయ్యి టెండర్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీటీడీ వెంటనే రివర్స్ టెండర్లు పిలిచింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈ టెండర్లు పిలిచిన తరువాత తిరిగి టెండర్లు పిలవాల్సి వస్తే మళ్లీ ఈ టెండర్నే పిలవాలి.రివర్స్ టెండర్కి అవకాశమే లేదు. అయితే టీటీడీ ఈవో ఆదేశాల మేరకు గత నెల 9న రివర్స్ టెండర్స్ నిర్వహించారు. ఈసారి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కిలో నెయ్యి రూ.450 చొప్పున కోట్ చేయగా నందిని కిలో రూ.475కి కోట్ చేసింది. ఈ టెండర్లో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్కి 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. రివర్స్ టెండర్పై వివాదాన్ని తెరపైకి తేకుండా నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు. -
నదుల అనుసంధానం.. భారీగా వ్యాపారావకాశాలు: ఐసీఆర్ఏ
గత కొన్నేళ్లుగా వాటర్ సెక్టార్ మీద కేంద్ర ప్రభుత్వ దృష్టి బాగా పెరిగింది. ఇందులో భాగంగానే నదుల అనుసంధానాలను వేగవంతం చేసింది. నదుల ప్రాజెక్టులను అనుసంధానం చేయడం వల్ల రూ. కోట్ల వ్యాపార అవకాశాలు లభిస్తాయని 'ఐసీఆర్ఏ' నివేదికలో పేర్కొంది. వచ్చే దశాబ్దంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ (EPC) సంస్థలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలు లభించవచ్చని అంచనా.నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) 16 ద్వీపకల్ప నదులను, 14 హిమాలయ నదుల అనుసంధానాలతో కూడిన మొత్తం 30 ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులను అనుసంధానించనుంది. కేంద్రం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ జల్ జీవన్ మిషన్కు భారీ నిధులను కేటాయించింది.ప్రణాళికలో నాలుగు ప్రధాన లింక్లు ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు అనుసంధానానికి అనుమతులు లభిస్తాయని ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్టార్ హెడ్ చింతన్ లఖానీ పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుల ప్రస్తుత వాటా తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..కెన్ - బెత్వా, కోసి - మెచి, పర్బతి - కలిసింద్ - చంబల్, గోదావరి - కావేరి మాత్రమే ప్రణాళికలో ఉన్న నాలుగు ప్రధాన లింక్లు. 2034 - 35 నాటికి మొత్తం రూ. 2.6 లక్షల కోట్లతో ఈ ప్రాధాన్యతా లింక్లు పూర్తవుతాయని ఐసీఆర్ఏ వెల్లడించింది. ఇందులో గోదావరి - కావేరి అనుసంధానం చాలా పెద్దది. కోసి - మెచి చాలా చిన్నది. ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు పెరుగుతాయి. -
Updates: ‘అధికారులెవరూ రాలేదండీ’
AP And Telangana Floods News Latest Updates In Teluguశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద జలాశయం 2 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో : 1,38,833 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 96,081 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 884.60 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు .. ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిజయవాడ 12 రోజులైనా ముంపు ప్రాంత ప్రజలకు తప్పని తిప్పలు ఇంకా మోకాళ్ల లోతు నీటిలోనే నానుతున్న అంబాపురంలోని కాలనీలు వరదలో ఉండలేక ఇళ్లను వదిలి వెళ్లిపోయిన ప్రజలు దొంగల భయంతో మళ్లీ ఇళ్లకు చేరుకుంటున్న కొందరు ప్రభుత్వం నుంచి ఈరోజు వరకూ తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆగ్రహం మంచినీరు కూడా సప్లై చేయడం లేదంటున్న అంబాపురం ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇళ్ల నుంచి బయటికి వస్తున్న వరద బాధితులు ఎన్యుమరేషన్ దాదాపు పూర్తైందంటున్న అధికారులు.. తమ వద్దకు ఏ ఒక్కరూ రాలేదంటున్న వరద బాధితులువాలంటీర్ వ్యవస్థ ఉంటే తమకు ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదంటున్న అంబాపురం వాసులునల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలభద్రాచలంతగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహంఈరోజు ఉదయం 11 గంటలకు 42.7అడుగుల గోదావరి నీటిమట్టంమొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులుసూర్యాపేటఅనంతగిరి, కోదాడ మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందంఅనంతగిరి మండలం గోండ్రియాల, కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడిలో ధ్వంసం అయిన ఇళ్లలు, నష్టపోయిన పంట, కోతకు గురైన రహదారులను పరిశీలించిన కేంద్ర బృందం క్లిక్ చేయండి: దేవుడా ఈ నరకం ఇంకెన్నాళ్లూ! ప్రకాశం బ్యారేజీ వద్ద కేంద్ర బృందంప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందంబోటు ప్రమాదంలో దెబ్బ తిన్న బ్యారేజీని పరిశీలించిన సభ్యులుఖమ్మం ఖమ్మం నగరంలోని వరదల్లో నీట మునిగిన నయా బజార్ కాలేజీ ని పరిశీలించిన ఎమ్మెల్సీ కోదండరాం అనంతరం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కొనసాగుతున్న ఆపరేషన్ బోట్ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమంనిన్నంతా కష్టపడ్డ అండర్ వాటర్ టీంఇవాళ కూడా కొనసాగనున్న పనులుబోట్లను ముక్కలు చేసి ఆపై బెలూన్లతో తొలగించే యత్నంమెదక్ఏడుపాయాల ఆలయం మళ్లీ మూసివేతసింగూరు గేట్లు ఎత్తేయడంతో భారీగా నీరుఆలయాన్ని తాకుతూ నీటి ప్రవాహంరెండ్రజుల కిందటే తెరుచుకున్న ఆలయంఈలోపే మళ్లీ మూసేసిన నిర్వాహకులుబ్యారేజీకి కేంద్ర కమిటీనేడు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కేంద్ర కమిటీ ప్రకాశం బ్యారేజీ చెంతకు కమిటీప్రస్తుత బ్యారేజీ పరిస్థితిపై ఆరా తీయనున్న సభ్యులు ఎన్టీఆర్ జిల్లా:వరద ప్రభావిత ప్రాంతాల్లో అనిల్ సుబ్రహ్మణ్యం నేతృతంలో కేంద్ర బృందం పర్యటనకలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన కేంద్ర బృందంవరద ముంపు ప్రాంతాల డ్రోన్ విజువల్స్ పరిశీలననష్టంపై కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ జి.సృజనకేంద్ర బృందాన్ని కలిసి తమకు జరిగిన నష్టంపై వినతిపత్రం అందజేసిన కృష్ణామిల్క్ యూనియన్ (విజయ డైరీ ) చలసాని ఆంజనేయులుఫోటో ఎగ్జిబిషన్ అనంతరం ప్రకాశం బ్యారేజ్, బుడమేరు గండ్లు పడిన ప్రాంతం, ఈలప్రోలు, రాయనపాడు, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం నంద్యాల:శ్రీశైలం జలాశయానికి కోనసాగుతున్న వరద నీరుజలాశయం 1 గేటు 10 అడుగులు మేరకు మరొక్కసారి ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో: 1,38,833 క్యూసెక్కులుఔట్ ఫ్లో: 96,081 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలుప్రస్తుతం: 212.9198 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి విజయవాడ:విజయవాడలో ఇంకా ముంపులోనే పలు కాలనీలు12 రోజులైనా బురదలోనే ముంపు ప్రాంతాలుశుభ్రం చేసుకునేందుకు అవస్థలుపడుతున్న కాలనీల వాసులునీళ్లలో నానుతున్న ఎల్బీఎస్ నగర్, కండ్రిక, తోటివారి వీధిముంపులోనే ప్రకాశ్ నగర్, అంబపురంలోపల కాలనీల ప్రజలకు అందని సాయం రోడ్ల మీద బురద పేరుకుపోవటంతో ప్రజలకు అవస్థలుప్రచార ఆర్భాటంగా ఎన్యుమరేషన్మ్యాపింగ్ ఉంటేనే ఎన్యుమరేషన్ అంటున్న అధికారులుఇంట్లోని సామాన్లకు మాత్రమే జరుగుతున్న ఎన్యుమరేషన్ ఖమ్మం జిల్లాఖమ్మం నగరంలో బొక్కలగడ్డ, ధంసలాపురం ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టంఈరోజు ఉదయం 9 గంటలకు 43.3 అడుగులుకు చేరిన గోదావరి నీటిమట్టంఅమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరికఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.స్పిల్ వే ఎగువన 33.750 మీటర్లుస్పిల్ వే దిగువన 25.580 మీటర్లు నీటిమట్టం నమోదు.48 రేడియల్ గేట్ల ద్వారా 12,46.342,క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల.ఏలూరు జిల్లాజంగారెడ్డిగూడెం మండలం కొంగ వారిగూడెం ఎర్రకాలవ జలాశయానికి తగ్గిన వరద నీరు.పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 81.87ఇన్ ఫ్లో 1565 క్యూసెక్కులు అవుట్ ఫ్లో గేట్లు ఎత్తి 1806 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేసిన అధికారులునల్లగొండ జిల్లానాగార్జునసాగర్ ప్రాజెక్టు కు తగ్గిన వరదక్రస్ట్ గేట్లు మూసివేతఇన్ ఫ్లో: 68235 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో : 43298 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 310.8498 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఎడమ కాలువకు నీటిని నిలిపివేసి నేటికి 12 రోజులుసూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద ఇంకా పూడ్చివేయని కాలువ గండిసూర్యాపేట జిల్లా:పులిచింతల అప్డేట్ఇన్ ఫ్లో 31,182క్యూసెక్కులుఅవుట్ ఫ్లో:16,000క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం:175 అడుగులుప్రస్తుత నీటి మట్టం:172.767 అడుగులుపూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 38.765 టీఎంసీలుపవర్ జనరేషన్ :16000 క్యూసెక్కులు.నిజామాబాద్ జిల్లాశ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుఔట్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 80 టీఎంసీలుప్రస్తుతం 1090 అడుగులు, 80 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కమిటీ పర్యటన.ఖమ్మం, సూర్యాపేటలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బృందం.వరద బాధితులను ఆదుకోవాలని నిన్న సెంట్రల్ కమిటీకి నివేదిక ఇచ్చిన సిఎస్.ఇవ్వాల్టితో ముగియనున్న రాష్ట్ర పర్యటన.జూరాల అప్డేట్మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద13 గేట్స్ ఎత్తివేతఇన్ ఫ్లో : 1 లక్ష 26 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1 లక్ష 26 వేల 243 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.270 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 318.350మీటర్లుపూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 9.316 టీఎంసీలుఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాగోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుబ్యారేజ్ వద్ద 15.3 అడుగులుగా నమోదైన గోదావరి వరద నీటిమట్టం15 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలబ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలుసఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక టేకి శెట్టిపాలెం మధ్య వరద నీరు రావడంతో పడవలపై రాకపోకలుఅప్పనపల్లి-పెదపట్నం లంక మధ్య వరద నీరు రావడంతో అవస్థలు పడుతున్న స్థానికులుఇప్పటికే నీట మునిగిన గంటి పెదపూడి, ఎదురుబిడియం, కనకాయలంక కాజ్వేలువరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు రోజులపాటు వినాయక నిమజ్జనాన్ని చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన అధికారులుకోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న వశిష్ట , గౌతమి, వైనతేయ నదులు -
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పర్వత ప్రాంతాలు మొదలుకొని మైదాన ప్రాంతాల వరకు అన్నిచోట్లా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాజస్థాన్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు సంభవించిన పలు ప్రమాదాలలో మరో ఎనిమిది మంది మృతి చెందారు. గడచిన రెండు రోజుల్లో 22 మంది వర్ష సంబంధిత ప్రమాదాల్లో మృతిచెందారు. కరౌలి, హిందౌన్లలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్యామ్లు, నదులు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విపత్తు సహాయక దళాలు కరౌలి, హిందౌన్లలో 100 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.హిమాచల్ ప్రదేశ్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 197 రోడ్లు మూసుకుపోయాయి. బీహార్లో గంగా నది సహా అన్ని ప్రధాన నదుల నీటిమట్టం పెరిగింది. రాజధాని పట్నాలో గంగ, పున్పున్ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గంగా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది.గంగానది నీటిమట్టం పెరగడంతో ముంగేర్, భాగల్పూర్, పట్నా తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
వాగులు దాటి వైద్యసేవలు..
వెంకటాపురం(కె): ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం సీతారాంపురంలో వైద్య సిబ్బంది శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు.ఈ గ్రామానికి వెళ్లాలంటే వాగులు దాటాలి. వర్షాలు పడుతుండడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినా వైద్యాధికా రి భవ్యశ్రీ, సిబ్బంది వాగులో నడుములోతు నీటిలో నడుచుకుంటూ గ్రామానికి వెళ్లారు. 67 మందికి పరీక్షలు జరిపి మందులు అందజేశారు. కలిపాక గ్రామంలోని ఇద్దరు గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. -
Khushboo Gandhi: బీ గుడ్.. డూ గుడ్!
మనదేశంలో ఏడాదికి 9,400 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ కాలువలు, నదుల్లోకి చేరుతోంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాకింగ్కు ఉపయోగించినదే ఉంటోంది. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. ఓ చిన్న హెయిర్ ఆయిల్ బాటిల్ని ప్యాక్ చేయడానికి దానికంటే నాలుగురెట్లు బరువున్న ప్యాకింగ్ మెటీరియల్ని ఉపయోగిస్తారు. అందులో కాగితంతో చేసిన అట్టపెట్టె ఉంటుంది. బాటిల్ పగలకుండా ప్లాస్టిక్ బబుల్ రేపర్ ఉంటుంది. కాగితం ఇట్టే మట్టిలో కలిసిపోతుంది. దాంతో ఇబ్బంది ఉండదు. మరి ప్లాస్టిక్ బబుల్ ర్యాపర్ ఎన్నేళ్లకు మట్టిలో కలుస్తుంది. ‘వస్తువులు రవాణాలో పగలకుండా ఉండాలంటే బబుల్ ర్యాపర్ ప్లాస్లిక్తోనే చేయాలా? కొబ్బరిపీచుతో బబుల్ ర్యాప్ చేసాను చూడండి’ అంటూ కుషన్ను పోలిన కాయిర్ పౌచ్ను చూపించింది ఖుష్బూ గాంధీ. అలాగే కాయిర్ బోర్డ్లో ఒక పొరలోకి గాలిని చొప్పించి బుడగలు తెప్పించింది. ముంబయిలో పుట్టి పెరిగిన ఖుష్బూ గాంధీ నిఫ్ట్లో మెటీరియల్ డెవలప్మెంట్ కోర్సు చేసింది.‘గో డూ గుడ్’ స్టార్టప్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ మెటీరియల్ని తయారు చేస్తోంది. ప్లాస్టిక్కి వ్యతిరేకంగా తనదైన శైలిలో ఉద్యమిస్తోన్న ఖుష్బూ... ‘ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి’ అని మైకులో గొంతుచించుకుంటే సరిపోదు, ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం చూపిస్తే ఆటోమేటిగ్గా ప్లాస్టిక్ని దూరం పెట్టేస్తారు’ అంటోంది. ఇంకా...‘నా ప్రయోగాలు నాకు లాభాలను తెచ్చిపెడతాయో లేదో తెలియదు, కానీ సస్టెయినబుల్ లైఫ్ స్టయిల్ వైపు సమాజాన్ని నడిపించడంలో మాత్రం విజయవంతం అవుతాను’ అంటోంది ఖుష్బూ గాంధీ. ఎకో ఫ్రెండ్లీ సిరా!‘‘ప్లాస్టిక్ బబుల్ ర్యాపరే కాదు, పేపర్ మీద ప్రింటింగ్ కోసం ఉపయోగించే ఇంక్ కూడా అంత త్వరగా నేలలో ఇంకదు. పైగా మట్టిని కలుషితం చేస్తుంది. సీ వీడ్ (సముద్ర నాచు), నాచురల్ కలర్ పిగ్మెంట్స్తో ఇంకు తయారు చేశాం. ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్కు బదులు వ్యవసాయ వ్యర్థాలతో ప్లేట్లు తయారు చేస్తున్నాం. ఇక్కడ మరో విషయం చె΄్పాలి. ఒకసారి వాడిపారేసే పేపర్ ప్లేట్లు, గ్లాసులకు ల్యామినేషన్తో కోటింగ్ వేస్తుంటారు. నేను దానికి కూడా ప్రత్యామ్నాయం కనుక్కున్నాను. ఎకో ఫ్రెండ్లీ కోటింగ్ చేస్తున్నాం. ‘గో డూ గుడ్’ ద్వారా మేము పది టన్నుల ప్లాస్టిక్ వాడకాన్ని నివారించగలిగాం. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఇంక్తో ఒకటిన్నర లక్షల ఉత్పత్తులు అక్షరాలద్దుకున్నాయి. ఏడు టన్నుల బయో డీగ్రేడబుల్ బబుల్ ర్యాపర్లను వాడుకలోకి తెచ్చాం. ఈ ప్రయత్నంలో ఐదు టన్నుల వ్యవసాయ వ్యర్థాలు వినియోగంలోకి వచ్చాయి. లధాక్లో ప్లాస్టిక్ వేస్ట్! నేను ఈ రంగలోకి అడుగు పెట్టడానికి కారణం పదేళ్ల కిందటి లధాక్ పర్యటన. మారుమూల ప్రదేశాలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి ఉన్నాయి. షాంపూ సాషే నుంచి లేస్ ర్యాపర్ వరకు అవీ ఇవీ అనే తేడా లేకుండా ప్రతి పదార్థమూ ప్లాస్టిక్లోనే ప్యాక్ అవుతోందని నాకు తెలిసిందప్పుడే. ఆ చెత్త కాలువల్లోకి చేరకుండా అంతటినీ ఒకచోట పోగు చేసి తగలబెడుతున్నారు. వాళ్లకు చేతనైన పరిష్కారం అది. ఇంతకంటే పెద్ద పరిష్కారమార్గాన్ని కనుక్కోవాలని అప్పుడు అనిపించింది. ఆ తర్వాత నేను మెటీరియల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం స్పెయిన్కెళ్లాను. కోర్సు పూర్తయ్యేలోపు నా ఆలోచనకు ఒక స్పష్టమైస రూపం వచ్చింది. బయోడీగ్రేడబుల్ వస్తువులతో ప్లాస్టిక్కి సమాధానం చెప్పవచ్చనే ధైర్యం వచ్చింది. పీజీ పూర్తయి తిరిగి ఇండియాకి రాగానే మా తమ్ముడు, మా వారితో కలిసి పూణేలో నా డ్రీమ్ ్రపాజెక్ట్ ‘గో డూ గుడ్’కు శ్రీకారం చుట్టాను. ఇది విజయవంతంగా నడుస్తోంది’’ అని వివరించిందామె. ఖుష్బూ పేరుకు తగినట్లు పరిమళభరితంగా తన విజయ ప్రస్థానాన్ని రాసుకుంటోంది. మరి... మనం మన చరిత్రను ఏ సిరాతో రాసుకుందాం... మట్టిని కలుషితం చేసే ఇంకుతోనా లేక మట్టిలో కలిసిపోయే ఇంకుతోనా. మనమే నిర్ణయించుకోవాలి. -
నీటినిల్వలో అగ్రగామి ‘కృష్ణా’
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక నీటినిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణానది అగ్రగామిగా నిలిచింది. అతి పెద్ద నది అయిన గంగ, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటినిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కృష్ణానది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతోపాటు అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో (బేసిన్లలో) నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణానది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యం 19.65 శాతం కావడం గమనార్హం. గంగా, గోదావరి కన్నా మిన్న.. హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగానది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగ, గోదావరి కంటే కృష్ణానదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో గంగ, గోదావరి రెండు, మూడుస్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదానది నాలుగోస్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నానది బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదోస్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలు మాత్రమే. -
Jivitputrika festival: 24 గంటల వ్యవధిలో.. బిహార్లో 22 మంది నీటమునక
పట్నా: బిహార్లోని వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో నదులు, చెరువుల్లో స్నానాలు చేసేందుకు వెళ్లిన 22 మంది మృత్యువాత పడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వీరిలో అత్యధికులు జీవిత్పుత్రికా పండుగ సందర్భంగా స్నానాలు చేయడానికి వెళ్లిన మహిళలేనన్నారు. ఈ పండుగ రోజు మహిళలు తమ సంతానం బాగుండాలని దేవుణ్ని కోరుకుంటూ ఉపవాస దీక్షలు, నదీ స్నానాలు ఆచరించడం సంప్రదాయం. భోజ్పూర్లో బహియారా ఘాట్ వద్ద సోనె నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లిన 15–20 మధ్య వయస్కులైన బాలికలు సెల్ఫీ తీసుకుంటూ నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు అధికారులు వివరించారు. భోజ్పూర్లో అయిదుగురు, జెహానాబాద్లో నలుగురు, పట్నా, రొహతాస్ల్లో ముగ్గురు చొప్పున, దర్భంగా, నవడాల్లో ఇద్దరేసి, కైమూర్, మాధెపురా, ఔరంగాబాద్ల్లో ఒక్కరు చొప్పున జల సమాధి అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ
ఢిల్లీ: ఉత్తరాదిలో వర్షాలు కాస్త తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పుంజుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు పలు రాష్ట్రాలను మళ్లీ వణికిస్తున్నాయి. ఇప్పటివరకు సంభవించిన వరదల భీబత్సం నుంచి తేరుకోకముందే మరోమారు ముప్పు పొంచి ఉంది. నిన్న రాత్రి ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టాయి. దీంతో ప్రయాగ్రాజ్ వద్ద గంగా, యమునా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. వర్షాలకు తోటు రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరప్రదేశ్లో గంగ, యమునా నది ప్రవాహం ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఫఫమౌ వద్ద గంగా నది ప్రవాహం 11 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయింది. నైనీ వద్ద యమునా నది 29 సెంటీమీటర్ల మేర పెరిగింది. ఉత్తరఖండ్లో చమోలీ జిల్లాలో జాతీయ రహదారి 7పై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు అసోంలోనూ వరదలు సంభవించాయి. దాదాపు 47 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 32,400 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్లో 10 మంది వరకు మరణించారు. పంజాబ్, హర్యానాల్లో వర్షాలకు దాదాపు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక వరదలతో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికే రూ.8000 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత మూడు రోజులుగా యమునా నది ప్రవాహం పెరగడంతో ఢిల్లీ వణికిపోయింది. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినా ఇంకా కొన్ని ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. త్రాగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంతరాయం కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు వర్షాల రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజ్ఘాట్ నుంచి నిజాముద్దీన్ మార్గంలో ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీ ఫ్లైఓవర్ రింగ్ రోడ్డు కాకుండా వేరే మార్గంలో రావాలని వాహనదారులకు సూచనలు చేస్తున్నారు పోలీసులు. ఇదీ చదవండి: వరద గుప్పిట ఉండగానే మళ్లీ అందుకున్న భారీ వర్షం.. ఢిల్లీలో స్తంభించిన జనజీవనం -
IMD Alert: దంచికొడుతున్న వాన.. ఇంకా ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్త!
ఢిల్లీ: వరదలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరభారతానికి ఇంకా ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పషం చేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదుల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ వేగానికి బ్రిడ్జిలు కుప్పకూలిపోతున్నాయి. పలు భవనాలు నీటమునిగాయి. నగరాలు నుంచి పల్లెలదాక కాలనీలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరో రెండు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎమ్డీ హెచ్చరికలు జారీ చేసింది. నదీ ప్రవాహాలకు దగ్గరగా వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. దేశ రాజధానిలో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం. ఇదీ చదవండి: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
గంగా తరంగం.. కాదిక నిరంతరం
పావన గంగా తరంగం.. బ్రహ్మపుత్ర గాంభీర్యం.. సింధునదీ సోయగం ఇక గతమే అంటోంది ఓ అధ్యయనం. మరో ఎనభై ఏళ్ల తరువాత ఈ జీవనదుల్లో వర్షాకాలంలోనే నీటి ప్రవాహం ఉంటుందని చెబుతోంది. భారత ఉపఖండానికి హిమాలయాలే జీవగర్ర. ఇక్కడ పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ఉపఖండంలోని మెజారిటీ భాగాన్ని సస్యశ్యామలం చేస్తూ భారత దేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా మారుస్తున్నాయి. హిమాలయాల్లో జరిగే ప్రతి మార్పూ భారత ఉపఖండంపై పెను ప్రభావం చూపుతుంది. అటువంటి హిమాలయాలు భూతాపం కారణంగా ప్రస్తుతం సంకటస్థితిని ఎదుర్కొంటున్నాయి. ధ్రువప్రాంతాలు మినహాయిస్తే భూగోళంలో అత్యధిక హిమపాతం కనిపించే హిమాలయాల్లో మరికొన్నేళ్లలో మంచు మటుమాయమైపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. సాక్షి, అమరావతి: ఉత్తరార్ధగోళంలో 1950 నుంచి 2019 వరకు ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, వర్షపాతం, హిమపాతం తదితర వాతావరణ సంబంధిత గణాంకాలపై బర్క్లీ–మిచిగాన్ యూనివర్సిటీలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. యూరోపి యన్ సెంటర్ నుంచి సేకరించిన సమాచా రాన్ని ఈ రెండు యూనివర్సిటీల ప్రొఫెసర్లు లోతుగా విశ్లేషించారు. ఆ గణాంకాలను 2024 నుంచి 2100 వరకూ వర్తింపజేసి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశా రు. ఈ అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦పర్యావరణ కాలుçష్యం కారణంగా వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగు తున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ పెరిగితే.. ఉత్తరార్ధగోళంలో హిమాల యపర్వతాల నుంచి యూరప్లో విస్తరించిన ఆల్ప్స్ పర్వతాల వరకూ వర్షపాతం 15 శాతం పెరుగుతోంది. ఆ మేరకు హిమపాతం తగ్గుతోంది. ♦ ఉత్తరార్ధగోళంలో మన దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న హిమాలయాల నుంచి యూరప్లోని ఆల్ప్స్ అమెరికాలోని రాఖీ పర్వతాల వరకూ చూస్తే.. హిమాల యాల్లోనే అధిక వర్షపాతం నమోదవు తోంది. ఆ మేరకు హిమపాతం గణనీయంగా తగ్గుతోంది. ♦ హిమాలయాల్లో పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉప నదుల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం.. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వర్షపాతం పెరగడమే. ఈ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు సారవంతమైన నేల కోతకు గురవుతోంది. ఈ ప్రభావం వల్ల హిమాలయాలకు దిగువన నివసించే కోట్లాది ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ♦హిమాలయపర్వతాల్లో ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమనీనదాలు (గ్లేసియర్స్) కరుగుదల ఇటీవలి కాలంలో 65 శాతం పెరిగినట్లు ఐసీఐఎంవోడీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్) సంస్థ తేల్చింది. 2100 నాటికి హిందూకుష్ పర్వతాల్లోని హిమనీనదాలు ప్రస్తుతం ఉన్న పరిమాణంలో 80 శాతం మాయం కావడం ఖాయమని ఆ సంస్థ పేర్కొంది. ♦ హిమపాతం తగ్గడం, హిమనీనదాలు వేగంగా కరుగుతుండటాన్ని బట్టి చూస్తే జీవనదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు, వాటి ఉప నదుల్లో 2100 తరువాత వర్షాకాలంలో మాత్రమే నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా సమయాల్లో ఆ జీవనదులు ఎండిపోవడం ఖాయం. దీనివల్ల భారతదేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చడంలో అత్యంత కీలకమైన గంగా సింధు మైదానానికి నీటి లభ్యత కష్టమే. -
భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద నదులు
-
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నదులు
-
చెరువులు, కుంటలపై మత్స్యకారులకే పూర్తి హక్కులు
సాక్షి, హైదరాబాద్: చెరువులు, కుంటలపై మత్స్యకారులకే పూర్తి హక్కులున్నాయని, దళారుల పెత్తనాన్ని సహించేది లేదని మత్య్స, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. చేపల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని సోమవారం బేగంపేట హరిత ప్లాజాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు, చేపల చెరువుల నిర్మాణానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అన్నివిధాలుగా చేయూతనిస్తుందని చెప్పారు. అన్ని వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను కోహెడ వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని చెరువుల వల్ల మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటిని మత్స్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. వివిధ మత్స్య సొసైటీలు, మత్స్యకారుల మధ్య విభేదాల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలకు మత్స్య సొసైటీలను ఏర్పాటు చేసి.. 18 ఏళ్లు నిండిన మత్స్యకారుడికి సొసైటీలో సభ్యత్వం కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం ఆరు ఉత్తమ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మెమెంటోలు, 15 నూతన సొసైటీలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా పాల్గొన్నారు. -
దయ... ధర్మం... దాయాది..
కనివిని ఎరుగని కష్టం ఎదురైనప్పుడు కన్నీటిని తుడిచే సాంత్వన కావాలి. దశాబ్ది కాలం పైగా ఎరుగని భారీ వరదలు... దేశంలోని 150 జిల్లాల్లో 110 జిల్లాలను ముంచెత్తిన కష్టం... దేశ భూభాగంలో మూడోవంతు ప్రాంతంపై, 3.3 కోట్ల మందిపై ప్రభావం... దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒక బాధితుడు... పదకొండు వందల మందికి పైగా మృతులు. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న కష్టానికి ఈ లెక్కలే సాక్ష్యం. ఇన్ని ఇక్కట్లతో ఆ దేశం ఆపన్న హస్తం కోసం చూస్తోంది. దాయాదికి సాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ వస్తున్న వార్తలపై అనుకూల, ప్రతికూల వైఖరులతో ఇప్పుడు దేశంలో చర్చ రేగుతోంది. ఐరోపా, చైనా సహా ప్రపంచంలో పలు ప్రాంతాలు అత్యధిక ఉష్ణోగ్రతలు, దుర్భిక్షంతో బాధపడుతుంటే, పాక్ వరదల్లో చిక్కుకుంది. పర్యావరణ విపరిణామాలకు ఇది నిదర్శనం. ఎండా కాలంలోని అత్యధిక ఉష్ణోగ్రతలతో హిమాలయాలు సహా వివిధ పర్వతశ్రేణుల్లో హిమానీనదాలు కరిగి, మే నాటికే పాక్లో నదులన్నీ నిండుకుండలయ్యాయి. ఆపై వానాకాలంలో ఊహకందని రీతిలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం రావడంతో పరిస్థితి చేయిదాటింది. జూలై నుంచి పెరుగుతున్న వరదలతో స్థానికులకు కన్నీళ్ళే మిగిలాయి. భూతాపోన్నతికి తక్కువ కారణమైనా, ఇంతటి పర్యావరణ విపరిణామానికి ఇస్లామాబాద్ లోనవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కర్బన ఉద్గార దేశాలకు తమ తప్పు లేని బాధిత దేశాలకు నిధులివ్వాల్సిన నైతిక బాధ్యత ఉంది. పాకిస్తాన్కు ఇది పచ్చి గడ్డుకాలం. ఈ ఏడాది మొదట్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతనమయ్యాక పీఠమెక్కిన షెహబాజ్ షరీఫ్ సర్కారు ఇంకా నిలదొక్కుకోనే లేదు. ఎన్నికలు జరపాలని ఇమ్రాన్ వీధికెక్కారు. అంతకంతకూ రాజకీయ అనిశ్చితి పెరుగుతోంది. మరోపక్క ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరింది. దిగుమతుల సామర్థ్యం అడుగంటింది. ఈ పరిస్థితుల్లో ప్రతి చిన్న సాయం విలువైనదే. అసహజ వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టిన పాకిస్తాన్కు సాయం అందించాల్సిందిగా ఐరాస సైతం అభ్యర్థించింది. అమెరికా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, టర్కీ సహా పలు దేశాలు ఇప్పటికే సహాయం అందిస్తున్నాయి. నిజానికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ దీర్ఘకాలంగా ఆర్థిక ఉద్దీపన కోసం నిరీక్షిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎట్టకేలకు 110 కోట్ల డాలర్ల ఉద్దీపనకు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ పరిస్థితుల్లో సోదర భారత్ సైతం పెద్ద మనసుతో వరద బాధితులకు సాయం చేయడమే సరైన చర్య. ఇంతవరకూ నోరు విడిచి భారత సాయం కోరని పాక్ పాలకులు సైతం ఒక అడుగు ముందుకు వేయాలి. భారత్ నుంచి కూరగాయల దిగుమతికి ఆలోచిస్తామని ఒకసారి, భారత భూ సరిహద్దు ద్వారా ఆహారం పంపడానికి అనుమతించాలన్న అంతర్జాతీయ సంస్థల అభ్యర్థనపై సంకీర్ణ భాగస్వాములతో, కీలకమైనవారితో చర్చించి నిర్ణయిస్తామని మరోసారి పాక్ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించడం అసంబద్ధం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ భౌగోళిక రాజకీయాలకే ప్రాధాన్య మిస్తే, అది అమానుషం. గతంలోనూ ఇలాగే ద్వైపాక్షిక, దౌత్య గందరగోళాలతో ఇరు దేశాల మధ్య సాయానికి గండిపడ్డ సందర్భాలున్నాయి. 2000ల తొలినాళ్ళలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. 2001లో భుజ్ భూకంపం వేళ మనకు పాక్ సాయం చేస్తే, 2005లో కశ్మీర్లో, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భూకంపం వచ్చినప్పుడు నియంత్రణ రేఖ, వాఘా సరిహద్దులు దాటి మనం సరఫరాలు అందించాం. కానీ, 2008 నాటి 26/11 ముంబయ్ దాడుల తర్వాత ప్రకృతి వైపరీత్యాల వేళ సైతం పరస్పర సాయాలు బాగా తగ్గిపోయాయి. నిరుడు కరోనా రెండో వేవ్లో తమ దేశం గుండా ఆక్సిజన్ కారిడార్కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ముందుకొచ్చినా, మన పాలకులు ఓకే చెప్పలేదు. 2010 నాటి వరదల వేళ 2.5 కోట్ల డాలర్ల మేర ఆర్థిక, వస్తు సాయం సహా గతంలో మనం అనేకసార్లు పాక్కు సాయం చేసినా, అది పాముకు పాలు పోసినట్టే అయిందని విమర్శకుల వాదన. అందులో కొంత నిజం లేకపోలేదు. అలాగే, కశ్మీర్కు వర్తించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేశాక పొరుగుదేశమే మనతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకుంది. అయితే గతాన్ని తవ్వుకొనే కన్నా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం. దేశంలో అధిక భాగం వ్యవసాయ భూములు నీట మునగడంతో పాకిస్తాన్కు ఆహార కొరత, అలాగే ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా రాజకీయాలను పక్కనపెట్టి అమాయక ప్రజల కష్టాలను ఆలోచించాలి. సామాన్య పాకిస్తానీయులకు ఆహార, ఆరోగ్య, తాత్కాలిక ఆవాసాల సాయం చేయడం వల్ల భారత్కూ లాభాలున్నాయి. సద్భావన పెరుగుతుంది. వ్యూహాత్మకంగా చూస్తే – పాక్లో చైనా చేప ట్టిన బీఆర్ఐ ప్రాజెక్టులు ఇరుకునపడ్డాయి. పాక్ సైతం అమెరికాతో సంబంధాలను మళ్ళీ మెరుగు పరుచుకోవాలని చూస్తోంది. పరిస్థితుల్ని సానుకూలంగా మలుచుకోవడానికి ఇదే సమయం. వరద సాయం ద్వారా దాయాదుల స్నేహానికి భారత్ ద్వారాలు తెరవాలి. నిరుడు ఆఫ్ఘన్కు 40 వేల మెట్రిక్ టన్నుల గోదుమలు పంపిన మనం పాక్కూ సాయం చేయాలి. పొరుగు వారు కొండంత కష్టంలో ఉన్నప్పుడు చూపాల్సిన మానవతకు మీనమేషాలు లెక్కించడం ధర్మం కాదు. అపకారికి సైతం ఉపకారం చేయాలనే సిద్ధాంతాన్ని నమ్మిన ధర్మభూమికి అసలే పాడి కాదు. దాయాదుల పోరులో దయనీయ ప్రజానీకం కష్టపడితే అది ప్రకృతి శాపం కాదు... పాలకుల పాపం! -
గురువాణి: అమ్మ ప్రేమకన్నా...
పసిపిల్లలకు లోకంలో తల్లికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. అమ్మతో మాట్లాడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మతో ఆడుకోవడం, అమ్మ పాట వినడం, అమ్మ స్పర్శ... వీటికన్నా ప్రియమైనవి లోకంలో ఉండవు. సమస్త జీవకోటినీ సష్టించే పరబ్రహ్మ స్వరూపం అమ్మే. ఈ లోకంలోకి రాగానే పాలిచ్చి, ఆహారమిచ్చి పోషించే మొట్టమొదటి విష్ణు స్వరూపం అమ్మయే. అన్ని ప్రాణులను తన వెచ్చటి స్పర్శతో నిద్రపుచ్చే ప్రేమైకమూర్తి అయిన హర స్వరూపం కూడా అమ్మయే. అందుకే అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త సమాహార స్వరూపం. అటువంటి అమ్మకన్నా ప్రియమైనది ప్రపంచంలో మరేముంటుంది? అయితే ఒకటి గమనించాలి. అమ్మకడుపులోంచి వచ్చిన వాడు మళ్లీ అమ్మ కడుపులోకి పోలేడు. కానీ ఈ దేశం మట్టిలో పుట్టి... మళ్ళీ చిట్ట చివర ఈదేశం మట్టిలో కలిసిపోతాం. అందువల్ల జన్మభూమి తల్లికన్నా గొప్పది. తల్లికన్నా ప్రియమైనది. అందునా భారత దేశం. ఇంత గొప్పదేశంలో పుట్టినవాళ్ళం...భరతమాత బిడ్డలం. ఇది సామాన్యమైన భూమినా..!!! ఇది వేదభూమి, ఇది కర్మ భూమి(వేద సంబంధమైన క్రతువులు జరుపుకోవడానికి అర్హమైన భూమి)... ఎన్ని పుణ్యనదులు ప్రవహిస్తున్నాయో ఇక్కడ ఈ భావనలతో ఉప్పొంగిన ఓ మహాకవి పరవశించిపోయి ........ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ.... ... ఇలా అల్లి ఓ పాట రాసేసాడు. ఆయనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి.. ఈ అమ్మకు పుట్టిన బిడ్డలు అనంతం. వారందరికీ అమ్మ పోలికలే వచ్చాయట... ఏమిటా పోలికలు... త్యాగం, పదిమందికీ పెట్టడం, పరోపకారం, కృతజ్ఞత, ఆతిథ్యం...ఉపకారం చేసినవాడికి ఉపకారం చేయడమే కాదు, అపకారికి కూడా ఉపకారం చేయగల విశాల హృదయం... వీటన్నింటికీ మించి ఓర్పు... ఓర్పును మించిన ధర్మం, ఓర్పును మించిన సత్యం, ఓర్పును మించిన యజ్ఞం ఉండవు... అంత గొప్ప ఓర్పు కలిగి ఉండడం, అరిషడ్వర్గాలను జయించడం, తనలో ఉన్న పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం.. అమ్మకున్న ఈ లక్షణాలన్నీ బిడ్డలకొచ్చాయి. అందుకే వారి హృదయాలలో ఆమె ఎప్పుడూ పచ్చని చీర కట్టుకుని వెలిగిపోతూ కన్పిస్తూంటుంది. పరమ పవిత్రమైన ఆమె పాదాలు.. ఈ సృష్టిలో ఆమె పాదాలను ముద్దాడడం పసిపిల్లవాడి పారవశ్యం. కవిగా దేవులపల్లి ఎంత పరవశించిపోయారంటే ‘‘అక్షరమక్షరం నా మనసు కరిగితే ఈ పాటయిందమ్మా..’’.అని చెప్పుకుని ఆమె పాదపద్మాలకు సమర్పించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ అమృతోత్సవాల సందర్భంగా ఇంత మధురమైన దేశభక్తి గేయాన్ని రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని స్మరించుకుంటే... మనం కూడా ఆయనలా చిన్నపిల్లలమై ఆమె పాదాలను ముద్దాడే అనుభూతిని పొందుదాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వామ్మో కోవిడ్ వ్యర్థాలు
కోవిడ్–19.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. దాని నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా జనం మాస్కులు, చేతికి ప్లాస్టిక్ తొడుగులు, పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, ప్లాస్టిక్ శానిటైజర్ సీసాలు విపరీతంగా ఉపయోగించారు. వీటిలో చాలావరకు ఒకసారి వాడి పారేసేవే. ఇవన్నీ చివరికి ఏమయ్యాయో తెలుసా? వ్యర్థాలుగా మారి సముద్రాల్లో కలిసిపోయాయి. ఎంతగా అంటే ఏకంగా 25,000 టన్నులకుపైగా పీపీఈ కిట్లు, ఇతర కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులు, చెరువుల్లోకి చేరుకున్నాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి. ఇవి జల వనరుల్లోని జీవజాలం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. జీవ జాతులకు ప్రత్యక్ష ముప్పు 2019 డిసెంబర్లో కరోనా మహమ్మారి జాడ తొలుత చైనాలో బయటపడింది మొదలు 2021 ఆగస్టు వరకే 193 దేశాల్లో ఏకంగా 84 లక్షల టన్నుల కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్లు అంచనా. వీటిలో ఏకంగా 70 శాతం జల వనరుల్లోకి చేరుకున్నాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడమే ప్రధాన సమస్య అంటున్నారు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రపంచమంతటా నెలకు ఏకంగా 129 బిలియన్ల మాస్కులు, 65 బిలియన్ల గ్లౌజ్లు వాడేసినట్టు అంచనా. వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇవి వ్యర్థాలుగా మారిపోయాయి. మాస్కు.. ప్లాస్టిక్ బాంబు ఒకసారి వాడి పారేసే ఫేస్ మాస్కులను ప్లాస్టిక్ బాంబుగా పరిశోధకులు అభివర్ణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మాస్క్లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్ల ముప్పు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి రాకున్నా రానున్న దశాబ్దాల్లో మాత్రం వాటి ప్రభావం దారుణంగా ఉంటుందని చెప్పారు. భూమిపై, సముద్రంలో ఉంటే జీవజాలానికి ప్రమాదం తప్పదని, వ్యర్థాల నిర్వహణపై ప్రపంచదేశాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచించారు. వేస్ట్ మేనేజ్మెంట్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని, సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు దాడి చేస్తే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని ప్రభుత్వాలకు హితవు పలికారు. వాడి పారేసిన పీపీఈ కిట్లు, మాస్క్ల కుప్పల్లో పక్షులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాల్లో అత్యధికంగా ఆసుపత్రుల నుంచి వెలువడినవే కావడం గమనార్హం. ఇవీ ప్రత్యామ్నాయాలు... ► చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్లాస్టిక్ సీసాల్లో వచ్చే శానిటైజర్ కంటే వేడినీరు, సబ్బు వాడుకోవడం ఉత్తమం. సబ్బులు ఇప్పుడు భూమిలో సులభంగా కలిసిపోయే ప్యాకేజింగ్లో వస్తున్నాయి. ప్లాస్టిక్ సీసాల్లోని హ్యాండ్ శానిటైజర్లు కాకుండా సబ్బులు వాడుకుంటే పర్యావరణానికి ఎంతోకొంత మేలు చేసినట్టే. ► సింగిల్ యూజ్ ఫేస్మాస్క్లు వాడితే ప్రతి ఏటా కోట్లాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోతాయి. వీటికంటే పునర్వినియోగ మాస్క్లు మంచివి. అంటే శుభ్రం చేసుకొని పలుమార్లు వాడుకునేవి. వీటిని వాషబుల్ మాస్క్లు అని పిలుస్తున్నారు. వీటిని పర్యావరణహిత మెటీరియల్తో తయారు చేస్తున్నారు. ► ప్లాస్టిక్ ముప్పు తెలిసినవారూ కరోనా సమయంలో వైరస్ భయంతో ప్లాస్టిక్ బ్యాగ్లు వాడారు. కానీ కాగితపు సంచులు, బట్ట సంచులు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. ► హోటళ్లలో వాడే ప్లాస్టిక్ పొర ఉన్న కాగితపు కప్పులు లక్షల టన్నుల వ్యర్థాలుగా మారుతున్నాయి. గాజు, పింగాణి గ్లాసులను వేడి నీరు, సబ్బుతో శుభ్రం చేసి వాటిని మళ్లీ ఉపయోగించుకోవడం దీనికి మంచి ప్రత్యామ్నాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
చెరువులకు అమృత్ యోగం
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో అమృత్ సరోవర్ పథకం ద్వారా కొత్త చెరువుల తవ్వకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకం ద్వారా వీటి తవ్వకం జరగనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఎకరా స్థలంలో కొత్త చెరువుల నిర్మాణం జరగనుంది. నీటి ఒరవ ఉన్న ప్రాంతంలో ఇలాంటి వాటిని తవ్వనున్నారు. కొత్త చెరువుల తవ్వకానికి స్థలం దొరకని చోట ఉన్న పాతవి ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే 50 నుంచి 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల పరిధిలోని 96 చెరువులను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ పనులకు సంబం«ధించిన ప్రతిపాదనలు సైతం జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ఇప్పటికే 86 చెరువులకు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. మిగిలిన వాటిని త్వరలోనే మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్, పూడికతీత, బౌండరీల నిర్మాణం, చెరువు సరిహద్దు వెంబడి మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ప్రభుత్వం పూడికతీతలో భాగంగా తవ్వే మట్టిని అవసరమైన రైతులు తమ సొంత ఖర్చులతో పొలాలకు తరలించుకునే వెసలుబాటు కల్పించారు. చెరువు కమిటీల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. రూ. 8.24 కోట్ల నిధులతో చెరువుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే 81 చెరువుల పరిధిలో పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట త్వరలోనే మొదలు కానున్నాయి. ఉపాధి హామీ కూలీలతోనే చెరువుల నిర్మాణ పనులు జరగనున్నాయి. కూలీల కోసం రూ. 7.47 కోట్ల నిధులు వెచ్చించనున్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ. 77.296 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే పనులు మొదలుకాగా 2022 ఆగస్టు నాటికి కొన్ని చెరువు పనులను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 2023 ఆగస్టు నాటికి మిగిలిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చెరువుల అభివృద్ధితో జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతోపాటు పెద్ద ఎత్తున భూగర్బ జలాలు పెంపొందనున్నాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చెరువుల నిర్మాణ పనులు జరగనున్నాయి. 8అటవీశాఖ పరిధిలో 126 పనులు అమృత్ సరోవర్లో భాగంగా అటవీశాఖ పరిధిలో పెద్ద ఎత్తున పనులు చేపట్టనున్నారు. ప్రధానంగా అట్లూరు, సిద్దవటం, కాశినాయన, సీకే దిన్నె, పెండ్లిమర్రి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇప్పటికే 16 ట్యాంకులను గుర్తించారు. ఇవి కాకుండా మరో 110 పర్కులేషన్, మినీ పర్కులేషన్ ట్యాంకులను సైతం గుర్తించారు. వీటికి సంబంధించి అటవీశాఖ అంచనాలను రూపొందించి జిల్లా కలెక్టర్కు పంపనుంది. అనంతరం సదరు పనులను మంజూరు చేయనున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతోనే ఈ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం సుమారు రూ. 3 కోట్లకు పైగా నిధులను వెచ్చించనున్నారు. జిల్లాలో చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, తద్వారా ఉపాధి హామి కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించే చర్యలు చేపట్టడంతో రైతులు, కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు అమృత సరోవర్ పథకం కింద ఉపాధి హామీ నిధులతో జిల్లాలో 96 చెరువులను అభివృద్ది చేస్తున్నాం. ఎకరా విస్తీర్ణంలో కొత్తవి నిర్మిస్తున్నాం. స్థలం అందుబాటులో లేని దగ్గర ఉన్న పాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాము. వీలైనంత త్వరగా చెరువుల పనులను పూర్తి చేయనున్నాం. దీనివల్ల మరింత ఆయకట్టు సాగులోకి రానుంది. – విజయరామరాజు, జిల్లా కలెక్టర్ ఉపాధిహామీ నిధులతో చెరువుల అభివృద్ధి పనులు ప్రభుత్వం అమృత్ సరోవర్ కింద కొత్త చెరువుల నిర్మాణంతోపాటు పాతవి అభివృద్ది చేస్తోంది.డ్వామా ఆధ్వర్యంలో ఉపాధి కూలీల ద్వారా ఈ పనులు చేపట్టాం. ఇందుకోసం రూ. 8.24 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. చెరువుల అభివృద్ధితో భూగర్భజలాలు పెరగనున్నాయి. – యదుభూషణరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కడప -
చెరువుల అభివృద్ధికి రూ. 4.98 కోట్లు మంజూరు
పీలేరురూరల్ : మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ని యోజకవర్గాల్లో 12 చెరువుల అభివృద్ధికి రూ. 4.98 కోట్లు నిధులు మంజూరైనట్లు మదనపల్లె ఇరిగేషన్ ఈఈ సురేంద్రరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చింతలచెరువు అభివృద్ధి పనులను ఆయన ప రిశీలించారు. ఆయన మాట్లాడుతూ పీలేరు నియో జకవర్గంలో పీలేరు మండలం చింతలచెరువుకు రూ.22 లక్షలు, కేవీపల్లె మండలం అమ్మగారిచెరువు కు రూ. 29 లక్షలు, కలకడ మండలం కదిరాయుని చెరువుకు రూ. 24 లక్షలు నిధులు మంజూరు అ య్యాయని చెప్పారు. అలాగే కలికిరి మండలంలో పెద్ద ఒడ్డు, మల్లిసముద్రం, దిగువ చెరువుకు రూ. 57.50 లక్షలు, తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం పెద్దచెరువుకు రూ. 22 లక్షలు, బి.కొత్తకోట మండలం పెద్దచెరువుకు రూ. 33 లక్ష లు, పీటీఎం మండలం పెద్దచెరువుకు రూ. 49 లక్ష లు, తంబళ్లపల్లె మండలం రాతిచెరువుకు రూ. 47 లక్షలు, పెద్దమండ్యం మండలంలో మర్రికుంట చెరువు, పొట్టివానికుంట, ముసలికుంటకు రూ. 43 లక్షలు, మదనపల్లె మండలం సీటీఎం పెద్దచెరువుకు రూ. కోటి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరిగేషన్ డీఈ ప్రసన్నకుమారి, ఏఈ ఎత్తిరాజులు పాల్గొన్నారు. -
ఈ చికిత్స సరైనదేనా?
ఆలోచన మంచిదే. కానీ, ఆచరణలో చిత్తశుద్ధి చూపితే మరీ మంచిది. దేశంలోని 13 ప్రధాన నదుల ‘పునరుజ్జీవనం’ కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన ప్రణాళిక, చేసిన ప్రకటన చూశాక నిపుణులు చేస్తున్న వ్యాఖ్య ఇది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 57.45 శాతం మేర భాగాన్ని చుట్టి వచ్చే 13 ప్రధాన నదులు, వాటి 202 ఉపనదుల జలాలకు సంబంధించిన ప్రాజెక్టు ఇది. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ చెబుతున్నట్టే అంతా జరిగితే, పెను మార్పు వస్తుంది. దేశంలో అటవీ విస్తీర్ణం 7,417 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుతుంది. కాకపోతే, నదుల క్షీణత వెనుక ఉన్న అసలు కారణాలను వదిలేసి, అటవీ పెంపకమంటూ కొత్త సీసాలో పాత సారాగా ఈ ప్రతిపాదన తెచ్చారా? కాగితాల మీది పదును సర్కారు కార్యాచరణలోనూ కనపడుతుందా? గత రెండు, మూడు దశాబ్దాలుగా వ్యవసాయంలో నీటి దుర్వినియోగం, పెచ్చుమీరిన పట్టణీ కరణతో నీటి కోసం ఒత్తిడి పెరిగింది. నదీగర్భాలు ఎండిపోతున్నాయి. సహజసిద్ధంగా సాగాల్సిన భూగర్భ జలమట్టాల పెంపునకు గండిపడుతోంది. భూసారం క్షీణిస్తోంది. వర్షపునీటితో నిండు కుండలు కావాల్సిన నదులు ఎండమావులవుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న జనాభాతో దేశంలో సగటు నీటి లభ్యత బాగా తగ్గిపోతోంది. నదుల రాష్ట్రంగా పేరున్న పంజాబ్లోని దక్షిణ ప్రాంతం సహా అనేక రాష్ట్రాలు ఎడారులయ్యే ప్రమాదంలో పడ్డాం. సారవంతమైన భూములనూ, భారీ పంట దిగుబడులనూ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి పరిష్కారంగా ప్రభుత్వం చెబుతున్న నదుల పునరుజ్జీవనం సుమారు రూ. 19,300 కోట్ల పైగా అంచనా వ్యయంతో కూడిన పంచవర్ష ప్రణాళిక. 23 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించిన నదులకు కాయకల్ప చికిత్స. హిమాలయ ప్రాంతంలోని ఝీలమ్, చీనాబ్, రావి, బియాస్, సత్లెజ్, యమున, బ్రహ్మపుత్ర, ఎండిపోయిన నదుల విభాగంలో లూనీ, దక్కన్ భూభాగంలోని కృష్ణా, గోదావరి, కావేరి, నర్మద, మహానది – ఇలా మొత్తం 13 నదులు ఈ భారీ పునరుజ్జీవన ప్రణాళికలో ఉన్నాయి. ఈ నదులకు కొత్త జవజీవాలు కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలతో వివరణాత్మకమైన ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను డెహ్రాడూన్లోని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్’ (ఐసీఎఫ్ఆర్ఈ) సిద్ధం చేసింది. ప్రాథమికంగా నదీ తీరం వెంట చెట్లను పెంచడం ద్వారా నదీజలాలకు పునరుత్తేజం తేవాలన్నది ఆలోచన. అలా పెంచే నదీ తీరస్థ అడవులన్నీ ‘సహజసిద్ధమైన బఫర్లు’గా, ‘బయోఫిల్టర్లు’గా నదుల స్వీయ శుద్ధీకరణకు తోడ్పడతాయని భావన. గతం గమనిస్తే – 2030 నాటికల్లా 50 లక్షల హెక్టార్ల మేర క్షీణించిన భూభాగాన్ని పునరుద్ధరిస్తామంటూ ‘బాన్ ఛాలెంజ్’ కింద 2015లో మన దేశం వాగ్దానం చేసింది. తాజాగా నదీజలాల పునరుజ్జీవన ప్రణాళికతో ఆ లక్ష్యానికి చేరువ కావచ్చని ప్రభుత్వ వర్గాల ఆశాభావం. అందుకు తగ్గట్లే, కొత్తగా పెంచే ఈ నదీ తీరస్థ అడవులు ‘కార్బన్ సింక్’లుగా పదేళ్ళలో, ఆపైన ఇరవై ఏళ్ళలో ఎన్ని మిలియన్ టన్నుల మేరకు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయనే లెక్క కూడా కట్టారు. కేవలం కర్బన వాయువులను పీల్చుకోవడానికే కాక, భూగర్భ నీటిమట్టం పెరగడానికీ, భూక్షయాన్ని అరికట్టడానికీ ఈ నదుల పునరుజ్జీవన ప్రాజెక్ట్ తోడ్పడుతుందని అంచనా. ఒక రకంగా 2015–16లో ప్రయోగాత్మకంగా చేపట్టిన గంగా నది పునరుజ్జీవన పథకం లాంటిదే ఈ సరికొత్త 13 నదుల ప్రణాళిక! ఆర్భాటంగా మొదలైన ఆ ప్రభుత్వ పథకం ఏ మేరకు వాస్తవంగా సఫలమైందో చూస్తూనే ఉన్నాం. ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పటికీ గంగా నదీజలాల స్వచ్ఛత మాటలకే పరిమితమైంది. ఇప్పుడు ఈ పునరుజ్జీవన పథకమూ అదే బాటలో నడిస్తే లాభం లేదు. నదుల పునరుజ్జీవన ప్రణాళికకు వాతావరణ మార్పుల లాంటి అడ్డంకులూ ఉన్నాయి. సరైన రీతిలో మొక్కల పెంపకం లాంటి వివిధ అంశాలపై ప్రాజెక్ట్ సఫలత ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, నాటే చెట్ల వయసు, పరిమాణం లాంటివి కూడా దృష్టిలో పెట్టుకొని నాణ్యమైనవాటిని నాటితేనే ఫలితం. నదీ తీరం వెంట మొక్కలు నాటడాని కన్నా ముందుగా భూసారం, నేలలోని తడిని పరి రక్షించే చర్యలు చేపట్టడం కీలకం. నదీ తీరస్థ అటవీ పెంపకం పేరిట స్థానిక పర్యావరణాన్ని దెబ్బ తీయకూడదు. ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైన చెట్టూచేమా, పొదలు, తుప్పలను కాపాడుకోవాలి. నిజానికి, నదీ జలాల సహజ ప్రవాహాలను అడ్డుకుంటూ అనేక చిన్నా పెద్ద ఆనకట్టల నిర్మాణం, పారిశ్రామిక కాలుష్యం, వాతావరణ మార్పులతో హిమానీనదాలు కరిగిపోవడం, భూగర్భజలాల దుర్వినియోగం – ఇలా నదుల క్షీణతకు అసలు కారణాలు అనేకం. వాటిని పరిష్కరించే ఆలోచన చేయకుండా, పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రంలాగా నదీతీరంలో మొక్కలు నాటితే చాలనుకోవడం ఏమిటి? పర్యావరణవేత్తలు వేస్తున్న ప్రశ్న ఇదే. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవడం మొదలు నదుల ఆయకట్టులోని అటవీ పర్యావరణ వ్యవస్థలను కాపాడడం లాంటివి నదులకు కొత్త జవజీవాలను ఇస్తాయి. అవేమీ చేయకుండా, తప్పనిసరి అటవీ పెంపక చట్టం (క్యాంపా) కింద హిమాచల్లో, సత్లెజ్ ఎగువ ఆయకట్టులో చెట్లు పెంచితే, ఆ ఆలోచన విఫలమైంది. ఆ ప్రాంత భూభాగ సహజ స్వభావాన్ని దెబ్బతీసింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే కష్టం. అన్ని సమస్యలకూ పరిష్కారం ఒకటే అనుకుంటే నష్టం. ఎక్కడో గాయానికి, మరెక్కడో మందు పూస్తే సరిపోదని గ్రహించి, పాలకులు చిత్తశుద్ధితో నదీజలాల పునరుజ్జీవన చర్యలు చేపట్టాలి. -
World Water Day,: ‘సాగు’ మారకుంటే∙ నదులు ఎడారే
కోల్కతా: మన పంటల సాగు పద్ధతులు తక్షణమే మారకపోతే దేశంలోని నదులు ఈ శతాబ్దంలోనే ఎండిపోయి ఎడారిగా మారడం ఖాయమని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కల్యాణ్ రుద్ర హెచ్చరించారు. భూగర్భ జలాలు ఎప్పటికీ అంతరించిపోవని చాలామంది భావిస్తున్నారని, అందులోని ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం అనేది నదుల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పంటల సాగు పద్ధతులను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే గంగానదితో సహా ఇతర నదులు ఎండిపోతాయని వెల్లడించారు. తద్వారా మన నాగరికత ఉనికి సైతం ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో కల్యాణ్ రుద్ర మాట్లాడారు. మనదేశంలో పంటల సాగు కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలన్నారు. చెరువులు, కుంటలు విస్తృతంగా తవ్వుకోవాలని, వాననీటిని, ఉపరితల జలాలను సంరక్షించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడడం మానుకోవాలని చెప్పారు. డ్యామ్లు, కాలువల నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. -
పవిత్ర నదుల్లో గౌతమ్రెడ్డి అస్థికల నిమజ్జనం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/ఉదయగిరి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అస్థికలను పవిత్ర నదుల్లో నిమజ్జనం చేశారు. గౌతమ్రెడ్డి వారం రోజుల క్రితం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన అస్థికలను కుమారుడు కృష్ణార్జునరెడ్డి ఆదివారం కృష్ణా, గోదావరి నదుల్లో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద పావన గోదావరి నదిలో స్థానిక కోటిలింగాల ఘాట్ వద్ద నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు పాల్గొని గౌతమ్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతమ్రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. విజయవాడలోని కృష్ణానదిలో నిర్వహించిన గౌతమ్రెడ్డి అస్థికల నిమజ్జనం కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: ఎగసిన జల.. లక్ష్మీ కళ
సాక్షి, హైదరాబాద్: ‘నీళ్లు, వ్యవసాయంపై గత ఏడేళ్లలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రాష్ట్రానికి లక్ష్మిని తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం 2014–15లో రూ. 5.50 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ 2021–22లో రెట్టింపై రూ. 11.54 లక్షల కోట్లకు పెరిగింది. వ్యవసాయం, అను బంధ రంగాల్లో సాధించిన వృద్ధి జీఎస్డీపీ పెరుగుదలకు దోహదపడింది. ఈ రంగాల ఉత్పత్తి విలువ రూ. 90,828 కోట్ల నుంచి రూ. 2,16,285 కోట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం సైతంరూ. 2,78,933కు పెరిగింది. జీఎస్డీపీ వృద్ధిలో ఏటా ఒక రాష్ట్రాన్ని అధిగమిస్తూ రాష్ట్రం పురోగమిస్తోంది. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నదులపై జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన వెంటనే నదుల పునరుజ్జీవం, చెరువుల పునరుద్ధరణను సీఎం కేసీఆర్ ప్రాధాన్య అంశంగా చేపట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన 46 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించడంతో 25 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 25 లక్షల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు లభిస్తోందని హరీశ్రావు చెప్పారు. గతంలో భారీ వర్షాలకు చెరువులు తెగిప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని, మిషన్ కాకతీయ కింద చెరువు కట్టలు, తూ ములు, అలుగులను పటిష్టం చేయడంతో అలాంటి ఘటనలు జరగడం లేదన్నారు. వా గులు, వంకల్లోని నీళ్లు వృథా కాకుండా రూ. 6 వేల కోట్లతో రాష్ట్రంలో 4 వేల చెక్డ్యాంలు నిర్మిస్తున్నామన్నారు. ప్రతి వర్షపు చుక్కను చెరువులు ఒడిసి పట్టుకుంటున్నాయని, చెక్డ్యాముల్లో ఏడాదంతా నీళ్లు నిల్వ ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. గోదావరిపై 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 5 రిజర్వాయర్లను నిర్మించడంతో 300 కి.మీల జీవనదిగా మారిందని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లను వెనక్కి తీసుకొచ్చి నదికి కొత్త నడకను సీఎం కేసీఆర్ నేర్పారని ప్రశంసించారు. వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేం ద్రసింగ్ ఆలోచనల్నే సీఎం కేసీఆర్ అమలు చేశారని వివరించారు. ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులకు ఏళ్లు పడుతున్నాయని, ఈ విధానంలో మార్పులు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో రైతు ఆత్మహత్యలు కనుమరుగు: పల్లా రాజేశ్వర్రెడ్డి రైతుబంధు, సాగునీరు, కరెంట్ సదుపాయంతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని, రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జల సంరక్షణకు కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు సదస్సు చివరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందజేశారు. మూడేళ్లలో మూసీలో తాగునీళ్లు... మూసీ నది ప్రక్షాళన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ఎస్టీపీల నిర్మాణం, మురుగు కాల్వ మళ్లింపు పనులు జరుగుతున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. గోదావరి నీళ్లను సైతం మూసీకి తరలిస్తున్నామన్నారు. రెండు, మూడేళ్లలో మూసీలో స్వచ్ఛమైన తాగునీళ్లను చూస్తామన్నారు. మూసీని ప్రక్షాళన చేయాలని రాజేంద్రసింగ్ విజ్ఞప్తి చేయగా హరీశ్రావు ఈ మేరకు హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన మూసీ నది ఒడ్డున మూడేళ్ల తర్వాత రాజేంద్రసింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో జలవిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాజేంద్రసింగ్ ఈ అంళాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దేశంలోని నదులన్నీ ఐసీయూలో..: రాజేంద్రసింగ్ గంగ, యమున, మూసీ సహా దేశంలోని నదులన్నీ ఐసీయూలో ఉన్నాయని, వాటి పరిరక్షణకు అధిక చొరవ తీసుకోవాల్సిన అవసరముందని రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. దేశంలో ఒక్క నది కూడా ఆరోగ్యంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కళ్లలో నీళ్లున్నాయని, నీళ్లపై లక్ష్మిని ఖర్చు పెడుతున్నారని అభినందించారు. -
నదులకు జీవం పోశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నదులకు జీవం పోసిందని, అందుకు గోదావరే సాక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 200 కి.మీ. మేర గోదావరి నది నేడు సజీవంగా ఉందన్నారు. నదుల పరిరక్షణపై రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం హైదరాబాద్లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల రికార్డు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రం నుంచి వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చారని గుర్తుచేశారు. నదులు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ సదుపాయాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని నిరంజన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 8 ఏళ్లలో 3 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు యావత్ దేశానికి ఆదర్శనమని, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు తప్ప ఇలాంటి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నదులకూ హక్కులున్నాయి: వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ప్రకారం నదులకు సైతం హక్కు లుంటాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత దేశపౌరులపై ఉందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. నదుల పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరులకు బాధ్యత ఉన్న ట్లు రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముం బైలోని ఐదు నదులు నామరూపాల్లేకుండా పోవడంతో ఆ స్థలాల్లో అక్కడి ప్రభుత్వం ప్రజలకు పట్టాలిచ్చిందన్నారు. తాము కేసు వేస్తే కోర్టు పట్టాలను రద్దు చేసి నదులను పరిరక్షించిందని చెప్పారు. దేశ ప్రజలు నదులను ఒకప్పుడు తల్లిగా పూజించగా, నేడు మురికి కూపాలుగా తయారుచేశారని రాజేంద్రసింగ్ దుయ్యబట్టారు. అత్యధిక అక్షరాస్యతగల ఢిల్లీలో యమునా, హైదరాబాద్లో మూసీ నదికి పట్టిన దుస్థితే నిదర్శనమని ఆయన అన్నారు. నదులపై అడ్డగోలుగా ఆనకట్టలు కడితే పర్యావరణ సమతౌల్యత దెబ్బతిం టుందని ఆందో ళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా నదుల పరిరక్షణకు ఈ సదస్సులో ముసాయిదా మేనిఫెస్టో తయారు చేస్తామ న్నారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల నిర్లక్ష్యంతోనే దేశంలో నదులకు ఈ దుస్థితి ఏర్పడిందని న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్ పేర్కొ న్నారు. నదుల పరి రక్షణపై సుప్రీంకోర్టు తీర్పులను సైతం ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకా‹శ్, కృష్ణా రివర్ ఫ్యామిలీ చైర్మన్ ఎం.శ్యామ్ప్రసాద్రెడ్డి, నీటిపారుదల శాఖ రిటైర్డ్ సీఈ ఐఎస్ఎన్ రాజు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తోలు తీసి.. నదిని దాటేసి.. ఏ కాలం నుంచి మొదలు?
వాగులు, వంకలు దాటేందుకు ఇప్పుడంటే పడవలు, బోట్లు ఉన్నాయి. సముద్రాలను కూడా అలవోకగా దాటేస్తున్నాం. ఇవన్నీ ఎందుకనుకుంటే పెద్ద పెద్ద వంతెనలే కట్టుకుంటున్నాం. మరి ఇలాంటి సౌకర్యాలేవీ లేని పూర్వకాలంలో కొన్ని ప్రాంతాల్లో వాగులు, నదులను ఎలా దాటే వాళ్లో తెలుసా? చనిపోయిన జంతువుల కళేబరాలను ఒలిచి, వాటిలో గాలిని ఊది బెలూన్లలా చేసుకొని వాడేవారు. వినడానికి విచిత్రంగా ఉన్నా అప్పట్లో ఇలాగే చేసేవారు. అసలు రంధ్రాలు పడకుండా జంతువుల కళేబరాలను పక్కాగా ఎలా ఒలిచేవాళ్లు, వాటి నుంచి గాలి పోకుండా ఏం చేసేవాళ్లు, కదిలే నీటిలో వాటితో ఎలా ప్రయాణించే వాళ్లు, ఇలాంటి పద్ధతులు ఏ ప్రాంతాల్లో వాడేవారో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఏ కాలం నుంచి మొదలు? ఆదిమ కాలం నాటి ఈ నదులు దాటే పద్ధతి మెసపటోమియా కాలం నుంచి కనిపిస్తోంది. క్రీస్తుపూర్వం 880ల కాలంలో నిర్ముడ్ ప్రాంతంలోని (ప్రస్తుతం ఇరాక్లో ఉంది) ఓ శిల్పంలో ఈ విధానం గురించి చెక్కారు. అప్పటి ఆ ప్రాంతపు అస్సీరియన్ సైనికులు గాలి నింపిన మేక ఆకారంలోని జంతు చర్మాల సాయంతో వాగును దాటుతున్నట్టు ఆ శిల్పంలో ఉంది. అప్పట్లో గ్రీకు రాజు సైరస్ కూడా ఇలాంటి జంతు చర్మాల సాయంతో బాబిలోనియన్ నదిని దాటాడని నాటి తత్వవేత్త జెనోఫోన్ చెప్పాడు. పర్షియా రాజు డేరియస్, మంగోలియన్ సైనికులు, రోమన్లు, అరబ్బులు కూడా ఈ పద్ధతి వాడారు. చర్మాలను ఎలా ఒలిచేవాళ్లు? ఓ ప్రత్యేక పద్ధతిలో జంతువుల చర్మాలను ఒలిచేవారు. ఆ తర్వాత చర్మాన్ని కొన్నిరోజులు పాతి పెట్టేవారు. తర్వాత దానిని తీసి పదును లేని కత్తితో రాసి వెంట్రుకలను తొలిగించేవారు. ఆ తర్వాత చర్మాన్ని తిప్పి లోపలి భాగంవైపు ముక్కు, మూతి, కళ్లు, చెవులు లాంటి ఇతర రంధ్రాలుండే ప్రాంతాలను కుట్టేసేవారు.4 కాళ్లలో మూడింటిని కట్టేసేవారు. నాలుగో కాలును గాలి ఊదేందుకు, తీసేందుకు వాడేవారు. చర్మంలోపల తారు లాంటి పదార్థాన్ని పోసి పూర్తిగా అంటుకునేవరకు ఊపేవారు. వాడనప్పుడు తోలును ఎండబెట్టి ఉంచేవారు. వాడాలనుకున్నప్పుడు తోలుకు సున్నితత్వాన్ని పెంచడానికి నీళ్లలో నానబెట్టేవారు. నదులను ఎలా దాటేవాళ్లు? చర్మం బెలూన్లో గాలి ఊదాక తమకు తాముగా ఆ బెలూన్తో పాటు నదిలో దూకేవారు. ఒకవైపు కాలుతో, మరోవైపు చిన్న తెడ్డుతో నీటిని వెనక్కి తోస్తూ ముందుకెళ్లేవారు. జంతు చర్మం బెలూన్ మాములూగానే గుండ్రంగా ఉంటుంది. దూకగానే పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే సాధన చేస్తూ చేస్తూ ఆ చర్మం బెలూన్ సాయంతో ఈదడం నేర్చుకునేవారు. వీటిపైన ఇతర ప్రయాణికులను, చిన్న చిన్న వస్తువులు, సరుకును కూడా రవాణా చేసేవారు. ప్రయాణికులను తీసుకెళ్లేటప్పుడు రెండు, మూడు చర్మం బెలూన్లను ఒక చిన్న సైజు తెప్పలా చేసి వాడేవారు. మనదేశంలో వాడేవాళ్లా? మనదేశంలోనూ పంజాబ్, కశ్మీర్, సిమ్లాల్లో ఇలాంటి వాటిని వాడేవారు. 1900వ సంవత్సరం తొలినాళ్లలో అమెరికా స్కూల్ టీచర్ జేమ్స్ రికాల్టన్ మన దేశాన్ని చూసేందుకు వచ్చినప్పుడు పంజాబ్లోని కొండ ప్రాంత గ్రామాల్లో జంతు చర్మాల సాయంతో సట్లెజ్ నదిని గ్రామస్తులు దాటడం గమనించాడు. ఆ దృశ్యాలను తన స్టీరియోస్కోపిక్ కెమెరాలో బంధించాడు. సరుకులనూ నది దాటించేవాళ్లా? సరుకు రవాణాకూ ఈ జంతు చర్మాల బెలూన్లను వాడేవారు. ఇంగ్లిష్ అన్వేషకుడు విలియం మూర్క్రాఫ్ట్ మన దేశానికి వచ్చినప్పుడు తనకు సంబంధించిన వ్యక్తులు 300 మంది, 16 గుర్రాలు, కంచర గాడిదలు, దాదాపు 7,400 కిలోల వివిధ రకాల బ్యాగులను 31 మంది తమ జంతు చర్మాల సాయంతో సట్లెజ్ నదిని దాటించారని చెప్పాడు. ఈ పనినంతా వాళ్లు కేవలం గంటన్నరలోనే పూర్తి చేశారన్నాడు. చైనా వాళ్లు కూడా ఇలాంటి జంతు చర్మాలతో చేసిన తెప్పలపై రకరకాల సరుకులను రవాణా చేసేవారు. -
ఊహించనంత వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు.. లీడ్స్ యూనివర్సిటీ హెచ్చరిక
లండన్: పలు జీవనదులకు పుట్టిల్లైన హిమాలయాల్లోని హిమానీ నదాలు (గ్లేసియర్లు) ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ నివేదిక హెచ్చరించింది. భూతాపం అనూహ్యంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమని, దీనివల్ల ఆసియాలో కోట్లాది ప్రజలకు నీటి లభ్యత ప్రశ్నార్ధకం కానుందని తెలిపింది. లండన్కు చెందిన ఈయూనివర్సిటీ నివేదిక జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించారు. 400–700 సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్ ఎక్స్పాన్షన్ సమయం (లిటిల్ ఐస్ ఏజ్)తో పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్ గ్లేసియర్స్లో మంచు పదింతలు అధికంగా కరిగిపోయిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కన్నా హిమాలయాల్లోని గ్లేసియర్లు అత్యంత వేగంగా కుంచించుకుపోతున్నట్లు హెచ్చరించింది. హిమాలయాల్లోని 14,798 గ్లేసియర్లు లిటిల్ ఐస్ ఏజ్ సమయంలో ఎలా ఉన్నాయో నివేదిక మదింపు చేసింది. అప్పట్లో ఇవి 28 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండగా, ప్రస్తుతం 19,600 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యాయని, అంటే దాదాపు 40 శాతం మేర కుచించుకుపోయాయని తెలిపింది. ఆ సమయంలో మంచు కరుగుదల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు 0.92– 1.38 మీటర్ల చొప్పున పెరిగాయని, ప్రస్తుత మంచు కరుగుదల అంతకు పదింతలు అధికంగా ఉందని నివేదిక రచయిత జొనాధన్ కార్విక్ చెప్పారు. మానవ ప్రేరిత శీతోష్ణస్థితి మార్పుల కారణంగా మంచు కరిగే వేగం పెరిగిందన్నారు. మూడో అతిపెద్ద గ్లేసియర్ సముదాయం అంటార్కిటికా, ఆర్కిటికా తర్వాత హిమాలయాల్లోని గ్లేసియర్లలో మంచు అధికం. అందుకే హిమాలయాలను థర్డ్ పోల్ (మూడో ధృవం)గా పిలువడం కద్దు. ఆసియాలోని అనేక దేశాల జనాభాకు అవసరమైన పలు నదులకు ఈ హిమానీ నదాలు జన్మస్థానం. వీటి క్షీణత కోట్లాది మందిపై పెను ప్రభావం చూపుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బ్రహ్మపుత్ర, గంగ, సింధుతో పాటు పలు చిన్నా పెద్ద నదులకు హిమాలయాలే జన్మస్థానం. గతకాలంలో మంచు కరుగుదల, గ్లేసియర్ల విస్తీర్ణం మదింపునకు పరిశోధక బృందం శాటిలైట్ చిత్రాలను, డిజిటల్ సాంకేతికతను ఉపయోగించింది. గతంలో గ్లేసియర్లు ఏర్పరిచిన హద్దులను శాటిలైట్ చిత్రాల ద్వారా కనుగొని, ప్రస్తుత హద్దులతో పోల్చడం ద్వారా వీటి క్షీణతను లెక్కించారు. హిమాలయాల తూర్పు ప్రాంతంలో గ్లేసియర్ల క్షీణత వేగంగా ఉంది. హిమానీ నదాలు సరస్సుల్లో కలిసే ప్రాం తాల్లో వీటి క్షీణత అధికంగా ఉంది. ఇలాంటి సరస్సుల సంఖ్య, విస్తీర్ణం పెరగడమనేది గ్లేసియర్లు కుంచించుకుపోతున్నాయనేందుకు నిదర్శనమని తెలిపింది. మానవ ప్రేరిత ఉష్ణోగ్రతా మార్పులను అడ్డుకునేందుకు తక్షణ యత్నాలు ఆరంభించాలని నివేదిక పిలుపునిచ్చింది. -
చెరువులు మింగేసి... ఊరు మునకేసి..
వరద వెళ్లిపోవాలంటే కాల్వలు కావాలి.. వాటిని పూడ్చేసి ఇళ్లు నిర్మిస్తే..? నీరు నిల్వ కావాలంటే చెరువులు ఉండాలి.. వాటిలో కాలనీలు కట్టేస్తే..? మరి వాన నీళ్లన్నీ ఎటు పోవాలి? ఎటూ పోలేకనే.. వరద రోడ్ల మీద పారుతోంది.. కాలనీల్లో ప్రవహిస్తోంది.. ఇళ్ల్లను ముంచెత్తుతోంది.. ఎనలేని నష్టాన్ని మిగుల్చుతోంది! ఇలా కాల్వలు, చెరువులు, కుంటలు ఆక్రమణల పాలవడం వల్లే.. చిన్న వానకే నగరాలు, పట్టణాలు వణికిపోతున్నాయి. ఒకటీరెండు చోట్ల కాదు.. రాష్ట్రంలోని చాలా నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి. వివిధ పార్టీల నేతలు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ఎక్కడికక్కడ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నాలాలను, చెరువులను పూడ్చేస్తున్నారు. ఆయా చోట్ల వెంచర్లు వేసి కాలనీలు కట్టేస్తున్నారు. అక్కడ ఇళ్లు కొనుక్కుంటున్న సాధారణ జనం ఆగమాగం అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఆగస్టులో, ఈ ఏడాది జూలైలో, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తి చాలా పట్టణాలు అస్తవ్యస్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు పట్టణాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. చెరువులు, నాలాల ఆక్రమణలు, వాటివల్ల ఉత్పన్నమైన పరిస్థితిని గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. –సాక్షి నెట్వర్క్ ఇది సిరిసిల్ల పట్టణ శివార్లలో కరీంనగర్ వెళ్లే రోడ్డులో ఉన్న కొత్త చెరువు. ఆధునీకరణ పేరిట చెరువును సగం మేర పూడ్చి.. పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. రాజీవ్నగర్, జేపీ నగర్, ముష్టిపల్లి, చంద్రంపేట పరిసరాల నుంచి వచ్చే వరదను కొత్త చెరువులోకి మళ్లించారు. ఓవైపు చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి, మరోవైపు వరద చేరిక పెరిగిపోయి.. కాస్త గట్టివాన పడితే మత్తడి దూకుతున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా శాంతినగర్ ప్రాంతం జల దిగ్బంధం అవుతోంది. ఇక కొత్త చెరువులోకి మురికినీరు చేరకుండా ఉండాలని మురికినీటి శుద్ధి (ఈటీపీ) ప్లాంటును ఏర్పాటు చేశారు. అది లోపభూయిష్టంగా ఉండటంతో మురికినీరు సిరిసిల్ల పట్టణ వీధులను ముంచెత్తుతోంది. కొత్తచెరువు మత్తడి నీళ్లు వెళ్లేందుకు గతంలో కాల్వ ఉండేది. దాన్ని కొందరు కబ్జా చేసి, ఇళ్లు, ఇతర సముదాయాలు నిర్మించారు. దీనితో మత్తడి వరద రోడ్డుపై ప్రవహిస్తూ.. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. నిర్మల్ బస్టాండ్ పక్కనే ఉన్న ధర్మసాగర్ చెరువులో వాకింగ్ ట్రాక్ పేరిట ఏర్పాటు చేసిన కట్ట ఇది. మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తామంటూ పోసిన ఈ కట్ట.. చెరువు ఎఫ్టీఎల్ మధ్యలోనే ఉండటం గమనార్హం. దీని అవతల మరింత చెరువు, ఎఫ్టీఎల్ పరిధి భూములు ఉన్నాయి. కానీ ఆ భూములు చెరువు పరిధిలోవి కావని, ఎఫ్టీఎల్ పరిధి ఆ కట్ట వద్దే ముగిసింది అన్నట్టుగా చూపుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రముఖుల భూములు ఉండటంతోనే.. ఇలా కట్ట నిర్మించారన్న ఆరోపణలున్నాయి. కొందరు పెద్దలు చెరువుల సమీపంలోని భూములను కొనుగోలు చేస్తూ.. మెల్లగా చెరువుల భూములను చెరబడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. చెరువు మధ్యలో రోడ్డు.. నీళ్ల మధ్యలోకి వెళ్తున్నట్టుగా ఉన్న ఈ రోడ్డు.. ఖమ్మం పట్టణశివార్లలోని ఖానాపురం చెరువులోనిది. ఖమ్మం కార్పొరేషన్గా మారినప్పుడు శివార్లలోని ఖానాపురం హవేలి పంచాయతీని విలీనం చేశారు. నాటి నుంచే ఇక్కడి చెరువుపై ఆక్రమణ దారుల కన్ను పడింది. ఖానాపురం చెరువు పూర్తి విస్తీర్ణం సుమారు 133 ఎకరాలు. సర్వే నంబర్ 13లో 75.23 ఎకరాల మేర చెరువు ఉండగా.. ఎఫ్టీఎల్ పరిధిలోని 57.17 ఎకరాల్లో పట్టా భూములు ఉన్నాయి. గతంలో ఈ చెరువు ద్వారా 200 ఎకరాలకు సాగునీరు అందేది. ఇప్పుడు ఆక్రమణలు పెరిగి కుంచించుకుపోతోంది. ప్రధాన చెరువులోనే రెండెకరాల వరకు కబ్జాలుకాగా.. ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. నిజానికి చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలోని భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఓ రియల్ వెంచర్కు దారి కోసం ఇటీవల చెరువు మధ్యలోంచి మట్టిరోడ్డు వేశారు. జనం ఫిర్యాదులు చేయడంతో అధికారులు దానిని తవ్వించేశారు. ఇలాంటి ఆక్రమణలు మరెన్నో ఉన్నాయని స్థానికులు అంటున్నారు. వరంగల్ శివనగర్లో కబ్జాల పాలై ఇరుకుగా మారిపోయిన శివనగర్ నాలా ఇది. ఇదొక్కటే కాదు. వరంగల్లో ప్రధాన నాలాలు అయిన నయీంనగర్ నాలా, బొందివాగు నాలా సహా అన్నీ కూడా ఆక్రమణలతో కుదించుకుపోయాయి. దీనితో భారీ వర్షాలు పడినప్పుడు వరద అంతా రోడ్ల మీద ప్రవహిస్తోంది. ఇది హన్మకొండలోని గోపాల్పూర్ ప్రాంతం. నిండుగా ఇళ్లతో కనిపిస్తున్న ఇక్కడ 25 ఏళ్ల కింద ఓ చెరువు ఉండేది. ఇదొక్కటే కాదు గోపాలపురం, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఆరు చెరువులు ఆక్రమణల పాలయ్యాయి. మెల్లగా నిర్మాణాలు వెలుస్తూ.. ఇప్పుడు చెరువుల ఆనవాళ్లే లేకుండా పోయాయి. దీంతో వానలు పడ్డప్పుడల్లా కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ‘గొలుసుకట్టు’తెంపేశారు! రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. కాకతీయ రాజులు ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక్కో చెరువు నిండిన కొద్దీ నీళ్లు దిగువన ఉన్న చెరువులోకి వెళ్తూ ఉండేలా అనుసంధానం చేశారు. ఇప్పుడా చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగతా చెరువులు, నాలాలు కూడా సగానికిపైగా కబ్జాల పాలయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 823, వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 190 చెరువులు ఉన్నట్టు నూతన మాస్టర్ ప్లాన్లో చూపించారు. ఈ చెరువుల్లో సగానికిపైగా కుదించుకుపోయాయి. వందలకొద్దీ కాలనీలు వెలిశాయి. ఏ చిన్న వాన పడినా అవన్నీ నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్ శాఖ, అన్ని జిల్లాలు, కుడా, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో వేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలు నామ్కేవాస్తేగా మారాయి. అంతేకాదు అధికారులు నోటిఫై చేసి, ఆయా వెబ్సైట్లలో పెట్టిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్లు, ఇతర డేటాకు పొంతనే లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఒక్క వానతో ఆగమాగం గత ఏడాది ఆగస్టులో వరంగల్లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అసలే చెరువులు, నాలాలు అన్నీ కబ్జాలు, ఆక్రమణల పాలై ఉండటంతో.. భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా నగరంలోనే నిలిచిపోయింది. 40 కాలనీలు పూర్తిగా నీటమునిగాయి, వందల కొద్దీ కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టమూ నమోదైంది. దీంతో అధికారులు వరంగల్లో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. క్షుణ్నంగా సర్వే చేసి చెరువుల ఎఫ్టీఎల్, ఇతర హద్దులు తేల్చాలని.. వాటి పరిధిలో ఎన్ని ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. కేటీఆర్ ఆదేశించినా.. గత ఏడాది వరదలు ముంచెత్తిన సమయంలో మంత్రి కేటీఆర్ వరంగల్లో పర్యటించారు. మళ్లీ వరదల సమస్య రాకుండా చూడాలని, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమణల కూల్చివేతలు, నాలాల విస్తరణ నామమాత్రంగానే మిగిలిపోయింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో సుమారు 33 కాలనీలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. కాకతీయ రాజులు ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక్కో చెరువు నిండిన కొద్దీ నీళ్లు దిగువన ఉన్న చెరువులోకి వెళ్తూ ఉండేలా అనుసంధానం చేశారు. ఇప్పుడా చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగతా చెరువులు, నాలాలు కూడా సగానికిపైగా కబ్జాల పాలయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 823, వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 190 చెరువులు ఉన్నట్టు నూతన మాస్టర్ ప్లాన్లో చూపించారు. ఈ చెరువుల్లో సగానికిపైగా కుదించుకుపోయాయి. వందలకొద్దీ కాలనీలు వెలిశాయి. ఏ చిన్న వాన పడినా అవన్నీ నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్ శాఖ, అన్ని జిల్లాలు, కుడా, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో వేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలు నామ్కేవాస్తేగా మారాయి. అంతేకాదు అధికారులు నోటిఫై చేసి, ఆయా వెబ్సైట్లలో పెట్టిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్లు, ఇతర డేటాకు పొంతనే లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఒక్క వానతో ఆగమాగం గత ఏడాది ఆగస్టులో వరంగల్లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అసలే చెరువులు, నాలాలు అన్నీ కబ్జాలు, ఆక్రమణల పాలై ఉండటంతో.. భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా నగరంలోనే నిలిచిపోయింది. 40 కాలనీలు పూర్తిగా నీటమునిగాయి, వందల కొద్దీ కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టమూ నమోదైంది. దీంతో అధికారులు వరంగల్లో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. క్షుణ్నంగా సర్వే చేసి చెరువుల ఎఫ్టీఎల్, ఇతర హద్దులు తేల్చాలని.. వాటి పరిధిలో ఎన్ని ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. కేటీఆర్ ఆదేశించినా.. గత ఏడాది వరదలు ముంచెత్తిన సమయంలో మంత్రి కేటీఆర్ వరంగల్లో పర్యటించారు. మళ్లీ వరదల సమస్య రాకుండా చూడాలని, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమణల కూల్చివేతలు, నాలాల విస్తరణ నామమాత్రంగానే మిగిలిపోయింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో సుమారు 33 కాలనీలు జలమయం అయ్యాయి. హన్మకొండ హంటర్రోడ్ న్యూశాయంపేట లో 150 ఎకరాల కోమటి చెరువులో సుమా రు 15–20 ఎకరాలు కబ్జాల పాలైంది. ► కాజీపేట బంధం చెరువు 57 ఎకరాల విస్తీర్ణం ఉండేది. ఇప్పుడు సగమే మిగిలింది. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నా.. కార్పొరేషన్ వారు ఇంటి నంబర్లు ఇస్తున్నారు. ► హన్మకొండ వడ్డేపల్లి చెరువు 324 ఎకరాలు ఉంటుంది. ఇందులో సుమారు 40 ఎకరాల స్థలం అన్యాక్రాంతమైంది. ► గొర్రె కుంట కట్టమల్లన్న చెరువు 21.24 ఎకరాలు ఉండేది. ఇందులో ఎనిమిది ఎకరాల దాకా ఆక్రమణల పాలైంది. చెరువులోనే భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ► వరంగల్కు కీలకమైన భద్రకాళి చెరువు విస్తీర్ణం 336 ఎకరాలుకాగా.. 30 ఎకరాలు ఇప్పటికే కబ్జా అయినట్టు అంచనా. ► హాసన్పర్తి పెద్దచెరువు 157 ఎకరాలు ఉండాలి. ఇటీవల కొందరు.. పట్టాభూమి పేరుతో చెరువు పరిధిలోని 30 ఎకరాలను చదును చేయడం వివాదాస్పదమైంది. ► ములుగు రోడ్లోని కోట చెరువు 159 ఎకరాల విస్తీర్ణం ఉండేది. సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు రెవెన్యూ శాఖ తేల్చింది. ► చిన్నవడ్డేపల్లి చెరువు విస్తీర్ణం 100 ఎకరాలుకాగా.. 20 ఎకరాల వరకు ఆక్రమణలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ► 170 ఎకరాల మామునూరు పెద్ద చెరువు లో 40 ఎకరాలు ప్రైవేటు చెరలోనే ఉంది. ► పాతబస్తీ ఉర్సు రంగసముద్రం (ఉర్సు చెరువు) 126 ఎకరాల్లో ఉండగా.. సుమారు 26 ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది. ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు సాగుతున్నాయి. ► అమ్మవారిపేట దామెర చెరువు విస్తీర్ణం 134 ఎకరాలు. ఇక్కడ రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు 20 ఎకరాల వరకు మాయమైంది. ► తిమ్మాపూర్ శివారు బెస్తం చెరువును స్మృతి వనంగా మార్చే ప్రతిపాదన ఉంది. 6 ఎకరాల విస్తీర్ణం ఉండే ఈ చెరువులో.. సగం దాకా ఆక్రమణలోనే ఉంది. వరంగల్ పెరకవాడలో ఓ స్థానిక ప్రజాప్రతినిధి సోదరుడు నాలాపైనే కట్టిన భవనం ఖమ్మం.. ఆక్రమణలకు గుమ్మం ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు పరిస్థితికి అద్దం పడుతున్న చిత్రాలివి. 2006 నాటితో పోలిస్తే.. ప్రస్తుతం చెరువు ఎంతగా కుంచించుకుపోయిందో ఈ ఫొటోల్లో స్పష్టంగా తెలిసిపోతుంది. నిజానికి ఈ చెరువు పూర్తిస్థాయి విస్తీర్ణం 163 ఎకరాలు. పాకబండ బజార్, ఖానాపురం హవేలీ రెవెన్యూ పరిధిలోని 66, 234 సర్వే నంబర్లలో విస్తరించి ఉన్న ఈ చెరువులో ఆరేడు ఎకరాలకు పైనే కబ్జాల పాలైంది. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాదు ప్రభుత్వ భవనాలు కూడా చెరువు భూముల్లో వెలిశాయి. కొందరు చెరువుల పక్కనే ఉన్న భూములు కొని, ఆ సర్వే నంబర్లతోనే చెరువు భూములకు పట్టాలు చేయించుకున్నారు. తీరా ఇన్నేళ్ల ఆక్రమణలను కూల్చేందుకు అధికారులు వెళ్తే.. కోర్టు నుంచి తెచ్చుకున్న స్టేలు, తామే హక్కుదారులమంటూ పత్రాలు చూపిస్తుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. భూముల రేట్లు పెరిగి.. కబ్జాదారుల కన్నుపడి ఖమ్మం పట్టణం 2012 అక్టోబర్లో కార్పొరేషన్ హోదా పొందింది. అప్పటి నుంచి పట్టణం విస్తరణ, భూముల రేట్లు బాగా పెరిగాయి. పట్టణంలోని లకారం చెరువు చుట్టుపక్కల చదరపు గజం రూ.30 వేలకుపైనే పలుకుతుండటంతో కబ్జా దారుల కన్ను పడింది. మెల్లమెల్లగా ఆరేడు ఎకరాలకుపైనే ఆక్రమణలు వెలిశాయి. గతంలో చెరువు పరిధిలో భూమిని లీజుకు ఇచ్చిన ఉద్దేశం కూడా మూలకుపడి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. చివరికి 2015లో చెరువు ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఆక్రమణలు ఆగాయి. కానీ ఇప్పటికే కబ్జాల పాలైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీనికితోడు చెరువుల్లోని నీళ్లు వెళ్లే కాల్వలు, నాలాలు కూడా కబ్జా కావడంతో.. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇండ్లు నీట మునుగుతున్నాయి. నిర్మల్.. కబ్జాల ఖిల్లా! నిర్మల్ జిల్లా కేంద్రం చుట్టూ గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. 450 ఏళ్ల క్రితమే కాకతీయుల స్ఫూర్తితో స్థానిక పాలకుడు నిమ్మనాయుడు, ఆయన తర్వాతివారు వీటిని తవ్వించారు. ప్రస్తుతం 11 చెరువులు ఉనికిలో ఉండగా.. దాదాపు అన్నింటిలో ఆక్రమణలు ఉన్నాయి. ఈ చెరువుల మధ్య నీళ్లు తరలిపోయే కాల్వలు కూడా కబ్జాల పాలయ్యాయి. ఈ కారణంగానే భారీ వర్షాలు పడ్డప్పుడల్లా చెరువుల్లోకి చేరాల్సిన నీళ్లు.. కాలనీలు, ఇండ్లను ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాది జూ లైలో భారీ వర్షాలతో పలు చెరువులు పూర్తిగా నిండాయి. సమీప కాలనీలు నీట మునిగాయి. కొందరు పట్టాభూములుగా చెప్పుకొంటున్న భూములు కూడా ఇప్పటికీ చెరువు నీటిలో మునిగే ఉన్నాయి. అవన్నీ ఆక్రమణలేనని.. అధికారులు పట్టించుకోకున్నా వానలతో బయటపడిందని స్థానికులు అంటున్నారు. నిజానికి నిర్మల్ గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై స్థానిక న్యాయవాది ఒకరు మూడేళ్ల కిందటే హైకోర్టులో పిల్ వేశారు. దానిపై కొద్దినెలల కింద జరిగిన విచారణ సందర్భంగా.. చెరువుల ఆక్రమణలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలను గుర్తించి తొలగించాలని కలెక్టర్ను ఆదేశించారు. దాంతో కొంతమేర తొలగింపు చేపట్టినా.. ఇంకా భారీగా కబ్జాలు అలాగే ఉన్నాయి. ఆక్రమణలపై టాస్క్ఫోర్స్ వేశాం ఖమ్మం జిల్లాలో చెరువులు, కుంటలు, ఇతర నీటివనరుల ఆక్రమణలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఎక్కడికక్కడ పరిశీలన జరిపి.. కేసులు పెడుతున్నాం. పూర్తిస్థాయి నివేదికలు సిద్ధమయ్యాక ప్రభుత్వానికి అందజేస్తాం. – శంకర్నాయక్, సీఈ, జలవనరుల శాఖ, ఖమ్మం చెరువుల ఆక్రమణలు, అధికార యంత్రాంగం ఆలోచన లేని నిర్ణయాల ఫలితంగా సిరిసిల్ల పట్టణం వరదను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి భారీ వర్షాలకు సిరిసిల్లలోని 20 వరకు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు అయితే ఏ చిన్నపాటి వాన పడినా జలమయం అవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకుపైగా ఉండగా.. అందులో 48వేల మంది వరకు ఇలా ముంపును ఎదుర్కొంటున్నారు. ► 1990 దశకంలో సిరిసిల్లలోని రాయిని చెరువును పూర్తిగా పూడ్చేసి.. సుమారు పది వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనితో వరద వెళ్లే దారి లేక.. చిన్నపాటి వానలు కురిసినా బీవై నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్లు మునుగుతున్నాయి. ►మానేరువాగు నుంచి వచ్చే మంచినీటి కాల్వ ఉదారువాగు ఇప్పుడు మురికి కూపంగా మారింది. కాల్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి. చెరువుల ఆక్రమణలు, అధికార యంత్రాంగం ఆలోచన లేని నిర్ణయాల ఫలితంగా సిరిసిల్ల పట్టణం వరదను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి భారీ వర్షాలకు సిరిసిల్లలోని 20 వరకు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు అయితే ఏ చిన్నపాటి వాన పడినా జలమయం అవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకుపైగా ఉండగా.. అందులో 48వేల మంది వరకు ఇలా ముంపును ఎదుర్కొంటున్నారు. ► 1990 దశకంలో సిరిసిల్లలోని రాయిని చెరువును పూర్తిగా పూడ్చేసి.. సుమారు పది వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనితో వరద వెళ్లే దారి లేక.. చిన్నపాటి వానలు కురిసినా బీవై నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్లు మునుగుతున్నాయి. ► మానేరువాగు నుంచి వచ్చే మంచినీటి కాల్వ ఉదారువాగు ఇప్పుడు మురికి కూపంగా మారింది. కాల్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి. చదవండి: GHMC: కోటికి చేరువలో టీకా -
సాగర్కు భారీ వరద.. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్/ధరూరు/కందనూలు: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు పడుతుండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. జూరాల నుంచి 4.71 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతుండగా.. దీనికి తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.37 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. ప్రస్తుత సీజన్లో కృష్ణా నదిలో గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. గురువారం రాత్రి సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి.. 3,76,170 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. సాగర్ వైపు ప్రవాహం: శ్రీశైలం స్పిల్వే నుంచి విడుదల చేస్తున్న నీటితోపాటు.. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 66 వేల క్యూసెక్కులకుపైగా వదిలేస్తున్నారు. ఈ వరద అంతా నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను.. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 204.96 టీఎంసీలకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీలోకి తగ్గిన వరద: వానలు తగ్గుముఖం పట్టడంతో వైరా, కట్టలేరు, మున్నేరు నుంచి వరద తగ్గింది. పులిచింతలలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న నీటికి వైరా, కట్టలేరు, మున్నేరు ప్రవాహం కలిసి.. ప్రకాశం బ్యారేజీకి 10,468 క్యూసెక్కులు వరద కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద: కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీకి ప్రాణహిత నది ద్వారా 1.1 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. గురువారం 85 గేట్లకు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులు తున్నారు. అవుట్ఫ్లో 74.56 వేల క్యూసెక్కులు వెళ్తోంది. -
ఉప్పొంగుతున్న నదులు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/అచ్చంపేట/తాడేపల్లి రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు వరదతో పోటెత్తుతున్నాయి. ఎగువన కృష్ణా నదిలో వరద పెరగడంతో ముందు జాగ్రత్తగా ఆల్మట్టి, నారాయణపూర్లను ఖాళీ చేస్తూ దిగువకు ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని పెంచేస్తూ దిగువకు 31 వేల క్యూసెక్కులను వదిలేస్తోంది. దీంతో శ్రీశైలం నీటిమట్టం 849 అడుగుల వద్దే ఉండిపోయింది. 854 అడుగుల స్థాయికి నీటిమట్టం చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అత్యవసరాల కోసం ఆరేడు వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి శనివారం వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మూసీ, కట్టలేరు, వైరా, మున్నేరు ఉప్పొంగడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1.22 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో 70 గేట్లు ఎత్తి 1.20 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. గోదావరిలోనూ వరద ఉధృతి గోదావరిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్దకు రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో నీటిమట్టం 28.7 మీటర్లకు పెరిగింది. వచ్చిన వరదను వచ్చినట్టు 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.09 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 1.64 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి పోలవరం ప్రాజెక్టు వద్దకు పది నుంచి 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంపునకు గురయ్యే తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, చింతూరు, వీఆర్ పురం, కూనవరం, నెల్లిపాక మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు పునరావాసం కల్పిస్తున్నారు. కాగా, నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 2,048 క్యూసెక్కులు వస్తుండగా.. ఆయకట్టుకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,562 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వంశధార నుంచి 1,873 క్యూసెక్కులు గొట్టా బ్యారేజీలోకి చేరుతుండగా.. ఆయకట్టుకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,200 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పెన్నానదిపై ఉన్న సోమశిల ప్రాజెక్టులోకి 8,700 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 52.21 టీఎంసీలకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితి ఇలా.. వచ్చే మూడు రోజులు వర్షాలు బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం సాక్షి, అమరావతి/విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరంల్లో 7.2 సెం.మీ., పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 7.1 సెం.మీ. వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో 1 నుంచి 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వివరించారు. -
చుక్ చుక్ రైలు.. 35 కి.మీ. వెనక్కి
నైనిటాల్ : ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని తానక్పూర్కి వెళుతున్న పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ హఠాత్తుగా వెనక్కి పరుగులు తీయడం ప్రారంభించింది. డ్రైవర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగకుండా 35 కి.మీ. వెనక్కి ప్రయాణించింది. చివరకు ఖాతిమా స్టేషన్లో ఆగడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి బుధవారం బయల్దేరిన రైలు తానక్పూర్ చేరుతుందనగా రైల్వే ట్రాక్పైనున్న జంతువుని ఢీకొట్టింది. దీంతో రైలు నియంత్రణ కోల్పోవడమే కాకుండా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వెనక్కి మళ్లింది. డ్రైవర్ బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తే అవి ఫెయిల్ అయ్యాయి. రైల్వే బోగీల మధ్యనున్న ప్రెజర్ పైపులు లీక్ కావడంతో బ్రేకులు ఫెయిల్ అయ్యాయని భావిస్తున్నారు. తానక్పూర్ కొండల మధ్య ఉండడంతో రైలు వెనక్కి పరుగులు తీసిందని చెప్పారు. -
భవిష్యత్లో ఇసుక దొరకదా!?
ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణరంగం ప్రస్తుతం తీవ్ర ఇసుక కొరతను ఎదుర్కొంటోంది. భవిష్యత్లో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇసుక నిల్వల్లో పనికొచ్చేది మాత్రం కొంతే ఉంటుందని, ఆ ఇసుక నిల్వలు వేగంగా అడుగంటి పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా వినియోగించే సహజ వనరుల్లో నీరు తర్వాత స్థానం ఇసుకదే. షాపింగ్ మాల్స్, ఆఫీస్లు, అపార్ట్మెంట్లు.. ఇలా ఒకటేమిటి ఏది నిర్మించాలన్నా ఇసుక ప్రధాన ముడిసరుకు. అంతేకాదు స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ల నుంచి కిటీకీల గ్లాస్ల తయారీ వరకూ.. కంప్యూటర్లలో చిప్స్ నుంచి ఇంట్లో వినియోగించే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులోనూ ఇసుక మరో అవతారం సిలికా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సరాసరి 50 బిలియన్ టన్నుల ఇసుక వినియోగం ఉంటుందని లెక్కతేల్చారు. పట్టణీకరణతోనే ముప్పు.. మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పట్టణీకరణ జరుగుతుండటమే ఇసుక కొరతకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి ఏటా లక్షలాది మంది పట్టణాల బాట పడుతున్నారు. 1950 నుంచి ఇప్పటి వరకూ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా పట్టణాల్లో నాలుగురెట్ల జనాభా పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న 4.2 బిలియన్ల జనాభాకు వచ్చే మూడు దశాబ్దాల్లో మరో 2.5 బిలియన్ల జనాభా తోడవుతుందని ఐరాస అంచనా వేసింది. వీళ్లందరికి మౌలిక సదుపాయాలు కల్పించే నిర్మాణాల్లో భారీ ఎత్తున ఇసుక వినియోగించాల్సి ఉంటుంది. భారతదేశంలో అయితే 2000 సంవత్సరం నుంచి ఏటా ఇసుక వినియోగం మూడు రెట్లు పెరుగుతూ వస్తోంది. 20వ శతాబ్దం మొత్తంలో అమెరికా వినియోగించినంత ఇసుక ఈ ఒక్క దశాబ్దంలోనే చైనా వాడేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఆకాశ హార్మ్యాలను నిర్మించే దుబాయ్ ఇప్పటికే ఆస్ట్రేలియా నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటోంది. తీరంలో పర్యావరణానికి ముప్పు.. సముద్రంలో ఇసుక తవ్వకంతో కెన్యా, పర్షియన్ గల్ఫ్, ఫ్లోరిడా తీరంలోని అత్యంత విలువైన కోరల్ రీఫ్స్కు ముప్పు ముంచుకొచ్చింది. ఇసుక తవ్వకంతో ఏర్పడ్డ బురద వల్ల సముద్రంలో సహజ వాతావరణంలో బతికే జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అలాగే నదుల్లో ఇసుక మైనింగ్తో నీటి జీవులు ఊపిరాడక చనిపోతున్నాయి. క్వాలిటీ సిలికా మైనింగ్ కోసం ఏటా వేలాది ఎకరాల అడవులను నరికేస్తున్నారు. ఇసుక మైనింగ్ వల్ల వియత్నాంలోని మెకాంగ్ డెల్టా మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. కంబోడియా, లావోస్లో ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల నదుల గట్లు దెబ్బతిని పొలాలు, ఇళ్లు ఆ నదుల్లో కలసిపోతున్నాయి. అయెయార్వాడీ నదిలో ఇసుక తవ్వకం వల్ల తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని మయన్మార్ రైతులు వాపోతున్నారు. శాండ్ మైనింగ్తో 2000వ సంవత్సరంలో తైవాన్లో ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఆ తర్వాత ఏడాది కూడా ఇలాంటి తవ్వకాలతో పోర్చుగల్లో బ్రిడ్జి కూలడం వల్ల బస్సులో వెళ్తున్న 70 మంది మృత్యువాత పడ్డారు. కృత్రిమ ఇసుక దీవులు ఉన్న స్థలం చాలకపోవడంతో సింగపూర్ గడిచిన 40 ఏళ్లలో 130 చదరపు మైళ్ల మేర సముద్రాన్ని ఇసుకతో నింపి ఇళ్లు నిర్మించింది. దీని కోసం ఇతర దేశాల నుంచి భారీగా ఇసుకను దిగుమతి చేసుకుంది. ఇలాగే దుబాయ్తో పాటు ఇతర దేశాలు కూడా సముద్రంలో నయా నగరాలను ఇసుకతో నిర్మిస్తున్నాయి. ఓ డచ్ పరిశోధన బృందం లెక్కల ప్రకారం 1985 నుంచి ఇప్పటి వరకూ వివిధ దేశాలు ఇసుక వినియోగించి తీరంలో 13,563 చదరపు కిలోమీటర్ల మేర కృతిమ భూమిని సృష్టించాయి. ప్రత్యామ్నాయమే దారి.. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక వినియోగాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. కాంక్రీట్లో ఇతర ముడిసరుకులను వినియోగించడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఫ్లైయాష్, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బూడిద, ఆయిల్ పామ్ పొట్టు, ఊక తదితరాలను ఇసుకకు ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు. రీసైకిల్ కాంక్రీట్ను మరింత సమర్థంగా ఉపయోగించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే నదుల్లో మైనింగ్కు స్వస్తిపలికారు. ఇతర దేశాలు దీనిని అనుసరించడం కష్టమైనా.. నదులకు జరిగే నష్టాన్ని నివారించడానికి నిర్మాణ రంగం ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. – ఏపీ సెంట్రల్ డెస్క్ -
నదులకు జీవం.. అడవుల రక్షణ
సాక్షి, అమరావతి: దేశంలోని గోదావరి, కృష్ణాతోపాటు 13 జీవ నదుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నదీ తీరం వెంబడి ఇరువైపులా అడవులను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని సాధించడం.. హఠాత్తుగా వచ్చే వరదల (ఫ్లాష్ ఫ్లడ్స్)కు అడ్డుకట్ట వేయడం.. ఏడాది పొడవునా నదుల్లో నీటి ప్రవాహం ఉండేలా చేయడానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు రూపొందించే బాధ్యతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్ఆర్ఈ)కి అప్పగించింది. అడవుల పెంపకం వల్ల నదీ పరీవాహక ప్రాంతంలో ఏకరీతిగా వర్షం కురిసే అవకాశం ఉంటుందని.. వర్షం నీటి ప్రవాహ ఉధృతికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలు పెంపొందేలా చేస్తాయని.. ఇది నదిలో సహజసిద్ధ ప్రవాహాన్ని పెంచుతుందని పర్యావరణ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. మరోవైపు భూమి కోతకు గురవకుండా అడవులు అడ్డుకుంటాయని, ఇది జలాశయాల్లో పూడిక సమస్యను పరిష్కరిస్తుందని చెబుతున్నారు. ‘నమామి గంగే’ తరహాలో.. ♦దేశంలో అత్యధిక శాతం ఆయకట్టుకు సాగునీటిని, అధిక శాతం ప్రజలకు తాగునీటిని అందించే జీవ నదులుగా బియాస్, చీనాబ్, జీలం, రావి, సట్లెజ్, లూని, యమున, నర్మద, గోదావరి, కృష్ణా, కావేరి, బ్రహ్మపుత్ర, మహానది పేరొందాయి. ♦గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ తరహాలోనే ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ 13 నదులను పరిరక్షించకపోతే తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పవని అటవీ, పర్యావరణ శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచి్చంది. ♦దీని ఆధారంగా ఈ నదుల పరిరక్షణకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు రూపొందించే బాధ్యతను డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేసే ఐసీఎఫ్ఆర్ఈకి కేంద్రం అప్పగించింది. ♦నది జన్మించిన ప్రదేశం నుంచి.. సముద్రంలో కలిసే వరకూ నదికి ఇరువైపులా ఎంత విస్తీర్ణంలో అడవుల్ని పెంచవచ్చనేది డీపీఆర్లో ఐసీఎఫ్ఆర్ఈ పొందుపర్చనుంది. ఈ నదుల పరిధిలోని అడవుల్లో ఎలాంటి చెట్లను పెంచాలన్నది నిర్ణయిస్తుంది. ♦ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అటవీ విస్తీర్ణం పెరిగి పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల అన్నిచోట్లా ఏకరీతి వర్షపాతం సాధ్యమవుతుంది. ♦వర్షపు నీటిని అడవులు ఒడిసి పట్టడం ద్వారా నీటి ప్రవాహాన్ని క్రమబద్ధం చేసి ఫ్లాష్ ఫ్లడ్స్ను నివారిస్తాయి. దీనివల్ల భూగర్భ జలమట్టాలు స్థిరపడి నదిలో సహజసిద్ధ (ఊట) ప్రవాహం పెరిగేందుకు దోహదం చేస్తుంది. తద్వారా వేసవిలోనూ నదుల్లో పుష్కలంగా జలాలు లభిస్తాయి. ♦అడవుల్ని పెంచడం వల్ల జలాలు కలుషితం కావు. భూమి కోత నివారించబడి ప్రాజెక్టుల్లో పూడిక చేరదు. -
150 నదుల జలాలతో అయోధ్యకు..
న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్యలో భవ్య రామాలయం ఈ సోదరుల కల. అది నెరవేరుతుందనే విశ్వాసం నిలువెల్లా నింపుకుని దేశంతోపాటు శ్రీలంకలోని సముద్ర, నదీ జలాలతో పాటు పవిత్ర ప్రదేశాల్లో మట్టిని వీరు సేకరిస్తూ వచ్చారు. ఈ క్రతువును ప్రారంభించిన రాధేశ్యామ్ పాండే, శబ్ద్ వైజ్ఞానిక్ మహాకవి త్రిఫల అనే ఈ అన్నదమ్ముల వయస్సు 70ఏళ్లుపైనే. ఇప్పటివరకు 150కిపైగా నదుల జలాలను సేకరించి, భద్రపరిచారు. చివరికి వారి కల నిజమైంది. మందిర నిర్మాణం ఖాయమైం ది. తాము సేకరించిన జలాలను, మట్టిని తీసుకుని ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. ‘శ్రీరాముని కృపతో మా కల ఫలించింది. 151 నదులు, 8 మహానదులు, 3 సముద్రాల నీటితోపాటు శ్రీలంకలోని 16 పవిత్ర ప్రదేశాల మట్టిని సేకరించాము. వీటి కోసం 1968 నుంచి 2019 వరకు కాలినడకన, సైకిల్, బైక్, రైలు, విమాన ప్రయాణాలు చేశాము. వీటిని ఆ రాముడికి అర్పించుకుంటాం’అని వారు తెలిపారు. మందిరంతో సోదరభావం, సామరస్యం మందిరం ఉద్యమం కారణంగా రాజకీయంగా, సామాజికంగా ఏర్పడిన అంతరం, మందిరం నిర్మాణంతో సమసిపోతుందని ఆలయ ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. ‘అయోధ్యలో భూమిపూజ రామరాజ్యానికి పునాది కానుంది. శ్రీరాముని జీవితం సోదరభావం, సామరస్యాలతో ముడిపడి ఉంది. ఆలయ నిర్మాణంతో ఇవే విలువలు∙సమాజంలో పెంపొందుతాయి’అన్నారు. అయో«ధ్యలో ఆలయ పరిసరాలను శానిటైజ్ చేస్తున్న సిబ్బంది -
అయోధ్య నిర్మాణం: 151నదుల నీళ్లు
అయోధ్య: దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 5 ప్రారంభించనున్నారు. అయితే 70ఏళ్లు కలిగిన ఇద్దరు సోదరులు రాధే శ్యామ్ పాండే, షాబ్ వైజ్ఞానిక్ మహాకవి త్రిఫాల తమ రామభక్తిని చాటుకున్నారు. వీరు 1968 నుంచి శ్రీలంకలోని పదహారు ప్రదేశాలు, ఎనిమిది నదులు, మూడు సముద్రాల ద్వారా రామమందిర నిర్మాణానికి నీటిని సేకరించారు. ఓ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధే శ్యామ్ పాండే స్పందిస్తు.. రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి భారత్, శ్రీలంక నదుల నుంచి నీటిని సేకరించడం తన కళని రాధే శ్యామ్ తెలిపారు. రాముడి అనుగ్రహంతోనే తన లక్ష్యం నెరవేరిందని తెలిపారు. ఓవరాల్గా 151 నదులు, అందులో 8 పెద్ద నదులు, 3 సముద్రాల నుండి రామమందిర నిర్మాణానికి నీటిని సేకరించామని అన్నారు. ఇక శ్రీలంకలోని 16 చోట్ల నుంచి మట్టిని కూడా సేకరించినట్లు పేర్కొన్నాడు. దీన్ని కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నట్లు ఆ సోదరులు తెలిపారు. 1968 నుంచి 2019వరకు వివిధ మార్గాల ద్వారా నీటిని సేకరించామన్నారు. కాలినడకన, సైకిల్, రైలు, విమానం ఇలా అనేక మార్గాల్లో నీటిని, మట్టిని సేకరించడానికి వెళ్లినట్లు తెలిపారు. మందిర నిర్మాణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. (చదవండి: అయోధ్య: ముస్లిం భక్తుడి 800 కి.మీ. పాదయాత్ర) -
లాక్డౌన్..స్వచ్చంగా నదులు
-
నదీజలాల్లో ఆక్సిజన్ అదృశ్యం
సాక్షి, అమరావతి: మన దేశ నదీ జలాల్లోని ఆక్సిజన్ లభ్యతలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయా? కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నదుల్లోని ఆక్సిజన్ శాతం తగ్గి అందులోని జలచరాల ఉనికికి ముప్పు ఏర్పడుతుందా? కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తాజా నివేదికల ప్రకారం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం, మురుగునీటిని నదుల్లోకి యథేచ్ఛగా వదిలేయడం.. ఇష్టారాజ్యంగా గనులు తవ్వకం, గ్లోబల్ వారి్మంగ్ వల్ల అవి కాలుష్య కాసారాలుగా మారాయని.. దాంతో నదీజలాల్లో ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుందని వెల్లడైంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే దేశ ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని సీడబ్ల్యూసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 13 నదుల్లో ఆక్సిజన్ లభ్యతపై పరీక్షలు దేశంలోని నదీ జలాల్లో రోజురోజుకు మత్స్యసంపద తగ్గిపోవడానికి గల కారణాలు అన్వేషించాలని జీవశాస్త్రవేత్తలు చేసిన సూచన మేరకు సీడబ్ల్యూసీ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. కాలుష్యం, భూతాపం వల్ల నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతుందని, తక్షణం కాలుష్యానికి అడ్డుకట్ట వేసి జీవావరణ (ఎకాలజీ) సమతుల్యతను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు కలిపి మొత్తం 13 నదుల్లోని 19 ప్రాంతాల్లో మూడు కాలాల్లో రోజూ మూడు గంటలకోసారి నీటిని సేకరించి డీఓ(నీటిలో కరిగిన ఆక్సిజన్) శాతాన్ని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. డీఓ తగ్గినా.. పెరిగినా ముప్పే డీఓ పరిమాణం 1 నుంచి 2 మిల్లీగ్రాముల మధ్య ఉంటే చేపలు చనిపోతాయి. 7 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ డీఓ ఉంటే ఆ నదుల్లో చేపల పునరుత్పత్తి్త గణనీయంగా తగ్గిపోతుంది. నదీజలాల్లో డీఓ శాతం 1 మిల్లీగ్రాము కంటే తగ్గితే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. నాచు(ఆల్గే), గుర్రపుడెక్క వంటి నీటి మొక్కలు ఎక్కువగా పెరిగి నది జీవావరణం దెబ్బతింటుంది. దీంతోచేపల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ►హిమాలయాల్లో జన్మించి ఉత్తరాది రాష్ట్రాల్ని సస్యశ్యామలం చేసే గంగ, యమునా, బ్రహ్మపుత్ర తదితర నదులు కాలుష్య కాసారాలుగా మారాయి. ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా జలాల్లో ఆక్సిజన్ లభ్యత దాదాపుగా లేదు. అన్ని కాలాల్లో ఏ రోజూ కూడా అక్కడ ఆక్సిజన్ ఉనికి కని్పంచలేదు. యమునలో ఒకటీ అరా చేపలు కూడా కానరాలేదు. ►గంగా నదిలో వారణాసి వద్ద లీటర్ నీటిలో కనిష్టంగా 6.12 మిల్లీ గ్రాములు.. గరిష్ఠంగా 9.14 మిల్లీగ్రాముల డీఓ ఉంది. గాం«దీఘాట్ వద్ద గంగలో లీటర్ నీటిలో కనిష్టంగా 5.24 మి.గ్రా., గరిష్టంగా 7.95 మి.గ్రా.ల డీఓ ఉంది. నమామి గంగలో భాగంగా నది ప్రక్షాళనతో కాలుష్య ప్రభావం క్రమేణా తగ్గుతుంది. ►తుంగభద్ర నదిలో మంత్రాలయం వద్ద లీటర్ నీటిలో కనిష్టం 5.20, గరిష్టం 9.60 మిల్లీగ్రాముల ఆక్సిజన్ లభిస్తోంది. మహారాష్ట్రలోని పుల్గావ్ వద్ద భీమా నదిలో కనిష్టంగా 6.20 మి.గ్రా., గరిష్టంగా 10.90 మి.గ్రాముల డీఓ ఉంది. ►హిమాలయ నదుల కంటే మధ్య, దక్షిణ భారతదేశంలోని నదుల్లో ఆక్సిజన్ లభ్యత మెరుగ్గా ఉంది. ద్వీపకల్ప నదుల్లోనూ ఆక్సిజన్ లభ్యతలో ఎప్పటికప్పుడు మార్పుల వల్ల మత్స్యసంపద వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ►కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం లీటర్ నీటిని శుద్ధి చేయక ముందు.. డీఓ ఆరు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటేనే వాటిని తాగునీటి కోసం వినియోగించవచ్చు. ఐదు మిల్లీగ్రాముల కంటే డీఓ ఎక్కువ ఉంటే వాటిని స్నానానికి వాడొచ్చు. శుద్ధి చేసిన తర్వాత డీఓ శాతం నాలుగుగా ఉంటే ఆ నీటిని తాగొచ్చు. -
84 ఏళ్ల వయసులో 2 కోట్ల లీటర్ల నీటిని..
ఆబిద్ సుర్తి.. 84 ఏళ్ల వయసులోనూ చుక్క నీరు వృథా కాకుండా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఆయన దాదాపు 2 కోట్ల లీటర్ల నీటిని వృథా కాకుండా అరికట్టాడు. ఇంతకీ ఎలా అరికట్టాడడనే కదా? ఆ వివరాలేవో ఆయన మాటల్లోనే చదవండి... మాది చాలా పేద కుటుంబం. ఉండటానికి ఇల్లు కూడా లేదు. రోడ్డు మీదే జీవనం. బకెట్ నీళ్ల కోసం కొట్టుకున్న రోజులు గుర్తున్నాయి. అందుకే.. నాకు నీటి విలువ బాగా తెలుసు. నాపేరు ఆబిద్ సుర్తి. నేను పెయింటర్, రచయిత, కార్టునిస్ట్. ఇవి కాక.. రోజూ ఓ కాలనీని ఎంచుకొని.. ప్రతి ఇంటికి వెళ్తా. ఆ ఇంట్లో వాటర్ లీకేజీ ఉన్న నల్లాలను సెట్ చేస్తా. చుక్క నీరు కూడా వృథాగా పోవద్దనేది నా ఆశయం. అందుకే లీకేజీ ఉన్న నల్లాలను సెట్ చేస్తుంటా. ఇందుకోసం రూపాయి కూడా తీసుకోను. చుక్క నీరే కదా అని పెద్దగా పట్టించుకోనివారు మన ఇంట్లోనే ఉంటారు. కానీ ప్రతి నీటి బొట్టూ విలువైందే. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. ఏ ఇంట్లో కూడా టప్.. టప్ అనే సౌండ్ రాకూడదని ఫిక్స్ అయ్యా. అందుకే.. డ్రాప్ డెడ్ ఫౌండేషన్ను ప్రారంభించా. ఇందుకోసం ముందుగా ఒక ప్లంబర్ను తీసుకొని నా బంధువులు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లా. వాళ్ల ఇళ్లలో లీకేజీ ఉన్న నల్లాలను ముందు ఫిక్స్ చేశా. అప్పుడు చాలా ఆనందమేసింది. అది నాకు ఎంతో రిలీఫ్నిచ్చింది. తర్వాత ప్రతి ఇంటికి వెళ్లడం ప్రారంభించా. ఏ ఇంట్లో లీకేజీ లేకుండా నల్లాలను ఫిక్స్ చేయడం ప్రారంభించా. నీకు ఇవన్నీ అవసరమా? చుక్క నీళ్లకు అంత బాధపడుతున్నావు. మా ఇంట్లో నుంచి నదులకు నదుల నీళ్లు వృథా అవుతున్నాయా? అంటూ నా సన్నిహితులు అంటుంటారు. కానీ.. నేను అవేవీ పట్టించుకోను. ముందు నా దగ్గర ఉన్న డబ్బుతో ప్రతి ఇంటికి తిరిగి నల్లాలు ఫిక్స్ చేసేవాడిని. తర్వాత నాకు లిటరేచర్ అవార్డు ద్వారా వచ్చిన డబ్బును ఉపయోగించి.. నల్లాలను ఫిక్స్ చేస్తున్నాను. ఈ సమాజానికి నువ్వు ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.. దేవుడే నీకు ఎలాగోలా దారి చూపిస్తాడు. నాకు కూడా చూపించాడు. నీటి విలువను ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం 2007 నుంచి కృషి చేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి ఇళ్లలో నల్లాల లీకేజీని అరికట్టి.. 2 కోట్ల లీటర్ల నీటిని కాపాడగలిగా. ఈ ఉద్యమాన్ని నేను నా చివరి శ్వాస వరకు కొనసాగిస్తా. -
‘మూసీ’ కేంద్రంగా నదుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై తెలంగాణ మరోమారు తన వైఖరిని కేంద్రానికి స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా అకినేపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి నీటిని మళ్లించే ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా కొత్తగా తెరపైకి తెచ్చి న జనంపేట అలైన్మెంట్ సైతం తమకు ఏమాత్రం సమ్మతం కాదని తెలిపింది. ఈ అలైన్మెంట్ ద్వారా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని, కావు న దీన్ని మార్చాలని సూచించింది. నీటి లభ్యత అం శాలపై సంపూర్ణంగా అధ్యయనం చేయాలంది. ఆ తర్వాతే మూసీని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేసి అక్కడ్నుంచి గొట్టిముక్కలను, అట్నుంచి నాగార్జునసాగర్ను నింపిన అనంతరమే నీటిని దిగువకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. నదుల అనుసంధానంపై జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) సంస్థ బుధవారం ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించింది. జాతీయ జల వనరల శాఖ కార్యదర్శి వీపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ తరఫున ఈఎన్సీ మురళీధర్, అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహారావు, ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వాదనను సమావేశంలో స్పష్టం చేశారు. గోదావరిలో తెలంగాణకు 954 టీఎంసీల నీటి కేటాయింపు ఉందని, ఈ నీటిలోంచి చుక్క నీటిని వదులుకునేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. ముందు ఇక్కడ అదనంగా నీటి లభ్యత ఉందా.. లేదా.. అన్న అం శంపై కూలంకషంగా అధ్యయనం చేయాలన్నారు. అభిప్రాయాల తెలుసుకున్నాకే డీపీఆర్లు.. ఇక నదుల అనుసంధానం విషయంలో ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు, ఆమోదాన్ని పరిగణనలోకి తీసుకున్నాకే డీపీఆర్లు తయారు చేయాలని కోరినా, కేంద్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ అధికారులు దృష్టికి తెచ్చారు. దీనిపై కేంద్ర అధికారులు స్పందిస్తూ.. డీపీఆర్లు తయారు చేసి రాష్ట్రాల ఆమోదం తీసుకుంటామని చెప్పారు. దీనికి తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో రాష్ట్రాల అభ్యంతరాలపై కేంద్రమంత్రితో మాట్లాడి నిర్ణయిస్తామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చారు. -
కొత్తకుంటకు జలకళ
గన్నేరువరం : మిడ్ మానేరు నీటితో మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంటుంది. మండలంలోని మాధాపూర్ గ్రామం కొత్తకుంటకు మిడ్ మానేరు నీటిని డిస్ట్రిబ్యూటర్ 9 ఉపకాల్వ ద్వారా విడుదల చేశారు. ఆ నీటితో కుంట నిండుకోవడంతో జలకళ వచ్చింది. రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాకలో నిర్మించిన మిడ్ మానేరు నుంచి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం వరకు గతంలో 34 కిలోమీటర్ల వరదకాల్వను పూర్తి చేశారు. మండలంలోని చీమలకుంటపల్లె, గునుకుల కొండాపూర్, పీచుపల్లి గ్రామాల మీదుగా మిడ్ మానేరు కుడికాల్వ నిర్మాణం ఉంది. అలాగే ఈ ఏడాది తోటపల్లి గ్రామంలో తోటపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి గత నెల 11వ తేదీన దీనిలోకి మిడ్మానేరు కుడికాల్వ ద్వారా నీటి పారుదలశాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ నిండుకుని కుడికాల్వలో బ్యాక్వాటర్ పెరిగింది. ఈ క్రమంలో ఈ నీటిని అక్టోబర్లో డిస్ట్రిబ్యూటర్ 4 ఉపకాల్వ ద్వారా గన్నరువరం గ్రామ చెరువుకు, పారువెల్ల గ్రామ పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. బుధవారం ఖాసీంపేట గ్రామంలోని డిస్ట్రిబ్యూటర్ 8 ఉప కాల్వకు విడుదల చేశారు. తాజాగా మాధాపూర్ గ్రామానికి నీటిని విడుదల చేసి కొత్తకుంటను నింపడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బావుల్లో భూగర్భజలాలు పెరగడానికి దోహదపడుతుందని అంటున్నారు. కుడికాల్వలో నీటినిల్వతో దాని సమీపంలోని బావుల్లో, బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగినట్లు చీమలకుంటపల్లెకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. రబీలో వరిసాగు చేయడానికి అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. -
చెరువులకు పూర్వ వైభవం తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో మురికి కూపాలుగా మారిన చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వీలుగా కఠినంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందులో భాగంగా చెరువుల్లోకి వ్యర్థాలను వదిలే మార్గాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేయాలని హైదరాబాద్ సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రజలకు సైతం హెచ్చరికలు జారీ చేయాలంది. అవసరమైతే కఠిన చర్యలకు సైతం వెనుకాడొద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో అవసరాన్ని బట్టి తాము తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. లోటస్ పాండ్, ఖాజాగూడ పెద్ద చెరువు, నాచారం పెద్ద చెరువు, మీర్ ఆలం చెరువు, కూకట్పల్లి రంగథాముని చెరువుల నుంచే ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణ, జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అం శంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్లు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగాఇప్పటికే పలుమార్లు విచారించింది. ఏమైనా చేయండి.. చెరువుల్లోకి మురికి నీటిని వదలకూడదని ప్రజలకు తెలియజేయాలని, పరిస్థితిని బట్టి హెచ్చరికలు కూడా చేయాలని ధర్మాసనం పేర్కొంది. చెరువుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థాలు చేరడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం వల్లే చెరువులకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాల్సిందేనని, ఇందుకు ఏం కావాలంటే అది చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. చెరువుల్లోకి వ్యర్థాలను తీసుకొచ్చే మార్గాలను ధ్వంసం చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని జీహెచ్ఎంసీ న్యాయవాదిని ప్రశ్నించింది. 4 వారాలు పడుతుందని జీహెచ్ఎంసీ న్యాయవాది చెప్పగా, అంత గడువు ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా ఉన్నారని చెప్పగా, ఈ సమాధానం తమకు అవసరం లేదంది. ఏది అడిగినా కూడా ఎన్నికలని చెప్పడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి... మొత్తం వ్యవహారంపై తమకు నివేదిక ఇవ్వాలని, వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఏయే మార్గాల ద్వారా వస్తున్నాయి. వీటి ధ్వం సానికి ఎన్నిరోజుల సమయం పడుతుంది తదితర వివరాలను అందులో పొందుపరచాలని సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితరులను ఆదేశించింది. ఈ సమయంలో హెచ్ ఎండీఏ తరఫు న్యాయవాది రామారావు జోక్యం చేసుకుంటూ, తాము చర్యలు తీసుకుంటే, వా టిపై కొందరు హైకోర్టును ఆశ్రయించి, సింగిల్ జడ్జి వద్ద స్టే పొందుతున్నారని ధర్మాసనం దృష్టి కి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ అలాంటి ఉత్తర్వులు ఏవైనా వస్తే వాటిని తమ దృష్టికి తీసుకురావాలంది. ఇదే ధర్మాసనం చెరువుల శుద్ధీకరణకు జియో ట్యూబ్ టెక్నాలజీ అత్యుత్తమమైనదని, ఇందుకు చాలా తక్కువ వ్య యం అవుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విషయం పై ఓ నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీలకు ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఎడతెరిపిలేని వర్షాలతో తెలంగాణ ఉక్కిరిబిక్కిరి
-
నదుల్లో గరళం
సాక్షి, హైదరాబాద్ : చుక్క చుక్క ఒడిసిపట్టి దాచుకోవాల్సిన క్షణాలు రానే వచ్చాయి. నీటి సంరక్షణ కోసం మనం గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు సరిపోవని నిర్ధారణ అయిపోయింది.మన కళ్ల ముందే కేప్టౌన్ మహానగరానికి వచ్చిన దుస్థితే భారత్లో ఎన్నో నగరాలకు పట్టబోతోందని వరల్డ్ వాటర్ డే సందర్భంగా వచ్చిన పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు నదీ కాలుష్యం అనే భూతం మనకు పెను సవాల్ విసురుతోంది. దేశంలోని సగం నదుల్లో నీరు ఇప్పటికే విష తుల్యంగా మారింది. అయిదేళ్ల క్రితం 121 నదుల్లో నీరు కలుషితంగా మారితే ఇప్పుడు వాటి సంఖ్య 275కి చేరుకుంది. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, క్రిమిసంహారక అవశేషాలు వంటివి స్వచ్ఛమైన జలాల్ని కాలుష్యమయం చేస్తున్నాయి. నీటిలో ఆక్సిజన్ శాతం బాగా తగ్గిపోతోంది. దక్షిణ భారతంలో గోదావరి, కృష్ణా, కావేరి నదులు ఎండిపోవడమే కాదు ఉన్న ఆ కాస్త నీరు కాలుష్యంగా మారడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ ఎండాకాలం గట్టేక్కేదెలా అన్న ఆందోళనలు అప్పుడే మొదలయ్యాయి. ఇక బహిరంగ మల విసర్జన కారణంగా భారత్లో భూగర్భజలాలు కూడా కలుషితంగా మారిపోవడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ‘ఇంకా ఏప్రిల్ నెల కూడా రాలేదు. అప్పుడే కృష్ణమ్మ ఎండిపోయింది. శ్రీశైలం డ్యామ్లు నీటిచుక్క కనిపించడం లేదు. మెట్టూరు డ్యామ్ దగ్గర కావేరి పాక్షికంగా ఎండిపోయింది. రాజమండ్రిలో గోదావరి నది పరిస్థితి కూడా అదే. ఆంధ్రప్రదేశ్లో ఈ సారి నీటికి కట కట తప్పదు‘ అని ఏపీకి చెందిన నీటి సంరక్షణ కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. నీటి కటకటని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఏపీ రైతులకు నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి, చెరుకుపంటలు పండించవద్దన్న సూచనలు వెళ్లాయి. నదులు విషంగా మారిన రాష్ట్రాలు మహారాష్ట్ర – 49 నదులు అసోం–28 నదులు, మధ్యప్రదేశ్–21 నదులు, గుజరాత్–20నదులు, పశ్చిమబెంగాల్–17 నదులు భూగర్భ జలాలు విషతుల్యంగా మారిన రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఢిల్లీ నీరు దొరక్క కరువులో చిక్కుకున్న రాష్టాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సురక్షిత మంచి నీరు లేక విలవిలలాడుతున్న రాష్ట్రాలు రాజస్థాన్, పశ్చిమబెంగాల్, బీహార్, పంజాబ్ మనకు లభించే నీటిలో 2 శాతం మాత్రమే స్వచ్ఛమైనది.. గ్రామీణ భారతంలో 4శాతం మంది ప్రజలు గత్యంతరం లేక కలుషిత నీరుని తాగుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రకృతి సంబంధమైన పరిష్కారాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని నిపుణులు చెబుతున్నారు. నదీతీరం వెంబడి అడవులు పెంచడం, భూమిలోకి వర్షపు నీరు ఇంకేలా చర్యలు చేపట్టడం, కృత్రిమంగా చిత్తడి నేలల్ని పెంచడం వంటివి చేయడం ద్వారా నీటిసమస్యను కొంతైనా పరిష్కరించుకోవచ్చునని అంటున్నారు. నీరు ఎలా తాగాలో మీకు తెలుసా ! మన శరీరంలో 75 శాతం నీరే ఉంటుంది. శరీరభాగాలు అన్నీ సక్రమంగా పని చేయడానికి నీరు అత్యంత అవసరం. అలాంటి నీటిని సరైన విధంగా తాగడానికి కొన్ని సూచనలు. చాలా మంది ఎత్తిన గ్లాసు దించకుండా ఒకే గుటకలో నీరు తాగేస్తారు. మరికొందరు సీసాల ద్వారా నీటిని నేరుగా గొంతులోనే పోసుకుంటారు. అలా తాగకుండా.. నోట్లో నీళ్లని పోసుకొని కాసేపు ఉంచుకొని, నెమ్మదిగా మింగాలి. అప్పుడే నోట్లో లాలాజలం ఆహారనాళం ద్వారా కడుపులోని వెళ్లి యాసిడ్స్ లెవల్స్ని సమం చేస్తుంది. నిరంతరం మనం మంచినీళ్లను తాగుతూనే ఉండాలి. అప్పుడే ఆకలికి, దాహానికి మధ్య తేడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలా నీళ్లు తాగకపోతే దాహం వేసినా, ఆకలివేస్తునట్టుగా తప్పుడు సంకేతాలు అందుతాయి. మితిమీరి తినడాన్ని అరికట్టాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. భోజనానికి ముందు, భోజనం చేస్తున్న సమయంలోనూ నీటిని అతిగా తాగడం మంచిది కాదు. అన్నం తినేటప్పుడు నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడానికి దోహదపడే ద్రవాలపై ప్రభావం పడుతుంది. దాని వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. వ్యాయామానికి ముందు, తర్వాత తప్పనిసరిగా మంచినీళ్లు తాగాలి. అప్పుడే వ్యాయామం సమయంలో కండరాలు పట్టేయడం, తిమ్మిర్లు ఎక్కడం వంటివి జరగవు. వ్యాయామం సమయంలో చెమట రూపంలో మన శరీరం నుంచి నీరు అధికంగా వెళ్లిపోతుంది. అందుకే తప్పనిసరిగా నీరు తాగాలి. పరగడుపునే గోరువెచ్చని నీటిని తాగాలి.. వెచ్చని నీరు తాగడం వల్ల కండరాల కదలిక సులభంగా ఉంటుంది. ఎక్కువ వేడిగా, మరీ ఎక్కువ చల్లగా ఉన్న నీటిని ఎప్పుడూ తాగకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న నీటినే తాగాలి. అప్పుడే శరీర భాగాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. లేదంటే ఒత్తిడికి లోనవుతాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
బ్రహ్మపుత్రపై.. చైనా దొంగబుద్ధి
బీజింగ్ : ఈశాన్యరాష్ట్రాలకు వరప్రదాయిని అయిన బ్రహ్మపుత్ర నదిని పూర్తిగా కబ్జా చేసేందుకు చైనా ప్రయత్నాలు మమ్మురం చేసింది. హిమాలయ నదుల్లో ప్రత్యేకమయిన బ్రహ్మపుత్ర నదిపై వివిధ ప్రాంతాల్లో భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను చైనా నిర్మిస్తోందని గ్లోబెల్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. చైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తే.. ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్లు పూర్తిగా ఎండిపోతాయని ఆ పత్రిక పేర్కొంది. ఇదిలా ఉండగా.. బ్రహ్మపుత్ర నది (దీనిని చైనాలో యార్లుంగ్ త్సాంగ్పోగా పిలుస్తారు)కి భారీ సొరంగం తవ్వి నీటని జిన్జాయాంగ్ ప్రాంతానికి తరలిస్తారనే పుకార్లు గత నెల్లో వచ్చాయి. అయితే వీటిని చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవపట్టించేందుకు చైనా ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని.. వాస్తవంగా టన్నెల్ నిర్మాణ పనుల గురించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆ పత్రిక స్పష్టం చేసింది. కేవలం బ్రహ్మపుత్ర లక్ష్యంగా..! టిబెట్లో బ్రహ్మపుత్రతో పాటూ.. జిన్షా, లాన్శాంగ్, నుజియాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. హైడ్రోపవర్కు బ్రహ్మపుత్రకన్నా ఇవి అత్యుత్తమమని నిపుణులు ఇప్పటికే తేల్చారు. అయితే ఆ నదులు భారత్లో ప్రవహించనందున చైనా వాటిపై దృష్టి పెట్టలేదు. కేవలం దొంగబుద్ధితో బ్రహ్మపుత్ర నదిపై విరివిగా జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జాంగ్ము..! ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించిన జాంగ్ము ప్రాజెక్టు 2014 నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టులో 86.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిలువచేయవచ్చు. ఇలాంటివి మరిన్ని టిబెట్ సరిహద్దుల్లో నిర్మించాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. -
‘95% ప్లాస్టిక్ వ్యర్థాలకు పది నదులే కారణం’
బెర్లిన్: ప్రపంచవ్యాప్తంగా కేవలం పది నదుల ద్వారానే 88–95 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయని తేలింది. ఈ జాబితాలో గంగా, సింధు సహా 8 నదులు ఆసియాలో ఉండగా, మరో రెండు నదులు ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్నాయి. సరైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులు పాటించకపోవడంతో ఏటా 5 ట్రిలియన్ పౌండ్ల ప్లాస్టిక్ సముద్రంలో చేరుతోందని ఈ పరిశోధనలో పాల్గొన్న డా.క్రిస్టియన్ ష్మిత్ తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా 57 నదుల్లో, 79 చోట్ల నమూనాలు సేకరించామన్నారు. 5 మి.మీ కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లో కనుగొన్నామనీ, ఇది అక్కడి పర్యావరణానికి చాలా ప్రమాదకరమన్నారు. వీటిని నీటి నుంచి తొలగించడం కూడా అసాధ్యమన్నారు. ఇదే పరిమాణంలో వ్యర్థాలు చేరుతూపోతే 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ వ్యర్థాల వల్ల 10 లక్షల సముద్రపు పక్షులు, లక్ష క్షీరదాలతో పాటు అసంఖ్యాకంగా చేపలు మృత్యువాత పడుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్లో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంకల వాటాయే 50 శాతానికిపైగా ఉంటుందన్నారు. జాబితాలోని తొలి 20 స్థానా ల్లో అమెరికా (1%) కూడా ఉందన్నారు. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో 28% చైనా నుంచే సముద్రాల్లోకి చేరుతున్నాయన్నారు. వ్యర్థాలను చేరవేస్తున్న తొలి 10 నదులు: యాంగ్జీ, సింధు, యెల్లో రివర్, హైహీ (ఆసియా); నైలు (ఆఫ్రికా); గంగా, పెరల్, అముర్ (ఆసియా); నైజర్ (ఆఫ్రికా), మెకాంగ్ (ఆసియా). -
నేడు ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమం
నదుల పరిరక్షణకు ఏకమవుదాం - అంతరించిపోతున్న నదుల్ని కాపాడుకుందాం - సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపు - హైదరాబాద్ చేరిన ‘నదుల రక్షణ–భారత సంరక్షణ’యాత్ర సాక్షి, హైదరాబాద్: దేశంలోని నదులు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, మన జీవ నదులు రుతువుల్లో మాత్రమే పారే నదులై పోతున్నాయని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక చిన్న నదులు ఇప్పటికే అంతరించిపోయాయని, ఈ పరిస్థి తుల్లో అందరం కలసి నదుల సంరక్షణకు అడు గులు వేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ‘నదుల రక్షణ–భారత సంరక్షణ’ యాత్ర బుధవారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని సెర్టన్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ.. వరదలూ, కరువులూ ఎక్కువైపోతున్నాయని, అందువల్ల భారత జీవధారలను కాపాడుకోవాల్సి ఉందన్నారు. వర్షాకాలంలో నదులు వరదల్లో చిక్కుకుంటున్నాయని, వర్షకాలం వెళ్లిపోయాక ఎండిపోతున్నాయని చెప్పారు. మరో 15 ఏళ్లలో దేశంలోని 25 శాతం భూమి ఎడారిగా మారబోతోందని, మనకు కావాల్సిన నీటిలో సగమే దొరుకుతుందని అన్నారు. బెంగళూరులో 40 ఏళ్ల క్రితం పది నుంచి 15 అడుగుల లోతులో నీరు లభించేదని, ఇప్పుడు వేల అడుగులు తవ్వితేనే నీరు లభ్యమవుతోం దని చెప్పారు. మన జీవితం నదులపై ఆధారపడి ఉందనే విషయం మరువకూడదని, నదులు లేకపోతే అనేక సమస్యలు చుట్టుముడతాయని చెప్పారు. గంగా, కృష్ణ, నర్మద, కావేరీ నదులు అంతరించిపోతున్నాయని, మనం ఇప్పుడు నదుల సంరక్షణకు కదలకపోతే భవిష్యత్తు తరాలకు నీటి కోసం ఘర్షణలు, కరువులు అందించిన వారమవుతామన్నారు. వాతావరణ మార్పులతో కరువులు, వరదలు మనకు 65 శాతం నీరు నదుల ద్వారానే లభ్యమవుతోందని, దేశంలో మూడింట రెండు వంతుల నగరాలు ఇప్పటికే నీటి కరువుతో సతమతమవుతున్నాయని వాసు దేవ్ చెప్పారు. నీరు లేకపోవడంతో ఒక బిందె నీటి కోసం పదిరెట్ల డబ్బు వెచ్చిస్తున్నా మన్నారు. సగటున ఏటా ప్రతి వ్యక్తికీ 11 లక్షల లీటర్ల నీరు అవసరమని చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే 25 నుంచి 50 ఏళ్లలో మరిన్ని వరదలు, కరువు రాబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులతో దేశంలో పదేళ్లలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. జనాభా నియంత్రణ ఉండాలని, గతంలో 30 కోట్లు ఉన్న దేశ జనాభా ఇప్పుడు 130 కోట్లకు చేరుకున్న విషయం మరువకూడదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పచ్చదనం బాగుందన్నారు. రైతులను సంప్రదాయ సాగు నుంచి శాస్త్రీయ సాగు వైపు మళ్లించాలన్నారు. నదుల అంశం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినదని, అందరూ అనుకుని ముందుకు వెళ్తేనే నదుల సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. నేడు ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమం కోయంబత్తూరులో ప్రారంభమైన ర్యాలీ ఫర్ రివర్స్ యాత్ర పలు రాష్ట్రాల మీదుగా 4 వేల కి.మీ.లు సాగిందన్నారు. యాత్రకు విద్యార్థులు, ప్రజలు, రైతులు బ్రహ్మరథం పట్టారన్నారు. సెప్టెంబర్ 14న గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. గవర్నర్ నరసింహన్, మంత్రి హరీశ్రావు పాల్గొంటారన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ యాత్ర అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని జగ్గీ వాసుదేవ్ చెప్పారు. -
నదులు కలిసేనా.?
► అనుసంధానంపై అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ► మహానది–గోదావరి అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్న ఒడిశా ► తమ ప్రాంతాలు ప్రభావితమవుతాయని.. నీటి కొరత తప్పదని స్పష్టీకరణ ► గోదావరిలో మిగులు జలాలు లేవంటున్న తెలంగాణ ► ఇచ్చంపల్లి–సాగర్, ఇచ్చంపల్లి–పులిచింతలతో తెలంగాణలో 9 లక్షల హెక్టార్లకు నీరొస్తుందంటున్న కేంద్రం ► అనుసంధానం చేయనున్నమొత్తం నదులు60 ► నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఖర్చు (సుమారుగా)5.5 లక్షల కోట్లు సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధానం.. ఒక నదిలో అధిక లభ్యతగా ఉన్న నీటిని మరో నదికి తరలించేందుకు ఏకంగా రూ.5.5 లక్షల కోట్లతో కేంద్రం చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞం ఏ తీరాలకు చేరనుంది? అదనపు జలాల లభ్యతపై జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ఏం చెబుతోంది? తెలంగాణ, ఒడిశా వైఖరులేంటి? వాటి వాదనలేంటి? నీటి లెక్కలపై ఏమంటున్నాయి? ‘సంధానం’పై సమగ్ర కథనం.. మొత్తం 60 నదులు.. లక్షల కోట్ల భారీ వ్యయంతో దేశంలోని 60 నదులను అనుసంధానించే కార్యక్రమా న్ని కేంద్రం వేగవంతం చేస్తోంది. ఇం దులో భాగంగా పెద్దఎత్తున డ్యామ్ లు, కాల్వల నెట్వర్క్ను నిర్మించాలని భావిస్తోంది. దీంతో రుతుపవనాలపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తప్పించి, సాగునీటి వ్య వస్థకు ప్రాణం పోయవచ్చని అంచనా వేస్తోంది. తొలి ప్రాధా న్యం దక్షిణాదికే ఇస్తూ తెలంగాణ, ఒడిశాలతోనే చర్చలకు అంకురార్పణ చేస్తోంది. మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను మొదలు పెట్టింది. మన దగ్గర ఎంత ఖర్చు? ఒడిశాలోని మహానదిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, కృష్ణాలతో కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించాలన్నది కేంద్రం ప్రణాళిక. మహానదిలో సుమారు 360 టీఎంసీలలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకు ఉన్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్నాయన్నది కేంద్రం లెక్క. వీటి వినియోగం కోసం తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్(కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచిం తల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. ఇందుకు 299 కిలోమీటర్ల పొడవైన ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధాన ప్రక్రియకే రూ. 26,289 కోట్లు అవసరం అవుతాయని, ఇందులో ప్రధాన లింక్ కెనాల్కు రూ.14,636 కోట్లు అవసరమని లెక్కకట్టింది. ఇక 312 కిలోమీటర్ల పొడవైన ఇచ్చంపల్లి–పులిచింతలకు పూర్తి అంచనా తెలియకున్నా ప్రధాన కెనాల్కు రూ.4,252 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక అనుసంధాన కాల్వల వెంట రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలతో 226 గ్రామా లు, లక్ష మంది జనం ప్రభావితం కానున్నారు. 51 వేల అటవీ, 70 వేల ఎకరాల వ్యవసాయ భూమి ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 9 లక్షల హెక్టార్లకు లబ్ధి! ఇచ్చంపల్లి–పులిచింతల, ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో తెలంగాణలో 9 లక్షల హెక్టార్ల మేర అదనపు సాగు అందుబాటులోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. గృహ, సాగునీటి అవసరాల నిమిత్తం మరో 15 టీఎంసీల మేర నీరు అందుబాటులోకి రావడంతో పాటు 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా గుర్తించింది. ఇచ్చంపల్లి–సాగర్తో కరీంనగర్ జిల్లాలోని 2 మండలాలు, వరంగల్లోని 11, నల్లగొండ జిల్లాలోని 9 మండలాల్లోని 2.87 లక్షల హెక్టార్లకు సాగునీరు అందనుంది. అలాగే ఇచ్చంపల్లి–పులిచింతల తో వరంగల్లోని 2 మండలాలు, ఖమ్మంలోని 13, నల్లగొండలో 2, కరీంనగర్లో ఒక మం డల పరిధిలో 6.13 లక్షల హెక్టార్ల భూమికి నీరందనున్నట్లు అంచనా వేసింది. పదేళ్ల తర్వా త విద్యుత్, సాగు రూపేణా ఇచ్చంపల్లి–సాగర్ కింద ఏటా రూ.3 వేల కోట్లు, ఇచ్చంపల్లి–పులిచింతల కింద రూ.2201.67 కోట్ల మేర ప్రయోజనాలు దక్కుతాయని భావిస్తోంది. మేం ఒప్పుకోం..: ఒడిశా నదుల అనుసంధానానికి ఒడిశా అభ్యంతరం చెబుతోంది. మహానది–గోదావరి అనుసంధానంతో తమ పరీవాహక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని, భవిష్యత్లో తమకు నీటి కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తోంది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలున్నాయన్న కేంద్రం లెక్కలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బార్ముల్ డ్యామ్ నుంచి 321.39 టీఎంసీల నీటిని మహానది నుంచి మళ్లిస్తే అందులో 141.6 టీఎంసీల నీటిని ఒడిశాలో 3.97 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తేవచ్చని, విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని కేంద్రం చెబుతోంది. మిగతా 180 టీఎంసీలను గోదావరికి మళ్లిస్తామని అంటోంది. ఈ వాదనకు ఒడిశా బ్రేక్లు వేస్తోంది. ఈ అనుసంధానంతో తమ ప్రాంతంలో 1,500లకు పైగా ప్రాంతాలు ప్రభావితమవుతాయని పేర్కొంటోంది. అదీగాక మహానదిలో 100 టీఎంసీలకు మించి మిగులు లేదని చెబుతోంది. మిగులు జలాలెక్కడివి? గోదావరిలో తెలంగాణకు హక్కుగా ఉన్న 954 టీఎంసీల్లో నిర్మితమైన, నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 684 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటారని, మిగతా 270 టీఎంసీలు మిగులు జలాలేనని ఎన్డబ్ల్యూడీఏ చెబుతున్న లెక్కలను తెలంగాణ తప్పుపడుతోంది. తమ వాటా 954.2 టీఎంసీల వినియోగానికి తగ్గట్టుగా ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కింద 433.04 టీఎంసీలు వినియోగంలో ఉండగా, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు, చేపట్టనున్న ప్రాజెక్టులతో మరో 45.38 టీఎంసీలను వినియోగంలోకి తెస్తామని స్పష్టంచేస్తోంది. మా ప్రయోజనాలు కాపాడాకే..: తెలంగాణ తమ ప్రయోజనాలు కాపాడాకే అను సంధాన ప్రక్రియ మొదలుపెట్టాలని తెలంగాణ కోరుతోంది. రాష్ట్ర ప్రాజెక్టులకు రావాల్సిన నీటిని పూర్తిగా కేటాయించాక అదనం గా ఉన్న జలాలను అనుసంధానం చేసి తర లిస్తే అభ్యంతరం లేదని చెబుతోంది. గోదావరిలో అదనపు జలాలు ఉన్నాయని కేంద్రం పదేపదే చెప్పడాన్ని తప్పుపడుతోంది. గోదావరిలో లభ్యతగా ఉన్న 954 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతాయని అంటోంది. 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో అదనపు జలాలున్నాయనడం సరికాదంది. అదనపు జలాలపై తాజాగా అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని, అలాకాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలా ల్లో్ల కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీల నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేస్తోంది. ముందు మహానది–గోదావరి కలపాలి మహానది–గోదావరి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే గోదావరి–కృష్ణా అనుసంధానం చేపట్టాలి. నదుల ఇంటర్లింకింగ్తో పాటు ఇంట్రాలింకింగ్(అంతర్గత నదుల అనుసంధానం)కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్లో నీళ్లు రాని పరిస్థితి ఉంటే గోదావరిలో మాత్రం పుష్కలంగా నీరుంది. ఈ స్థితిలో గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించేందుకు కేంద్రం సహకరిస్తే బాగుంటుంది. – మంత్రి హరీశ్రావు ఎన్నెన్నో ప్రశ్నలు..! ► 20 ఏళ్ల కింద వేసిన మిగులు జలాల లెక్కలతో ప్రస్తుత అనుసంధానం ఎలా సాధ్యం? రాష్ట్రాలు తమ అవసరాలకు తగ్గట్టు ప్రాజెక్టుల డిజైన్లు, రీ డిజైన్ చేశాయి. వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకోదా? ► నదీ జలాలకు సంబంధించి కొన్నింటిపై ట్రిబ్యునల్ తీర్పులు వచ్చినా అమల్లోకి(అవార్డు) రాలేదు. కొన్నిచోట్ల ఇంకా విచారణలో ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల సుప్రీంలో కేసులున్నాయి. ఈ నేపథ్యంలో మిగులు జలాలని ఎలా తేలుస్తారు? ► ఒక నదీ బేసిన్ నుంచి వేరే రాష్ట్ర పరిధిలోని నదికి నీటిని తరలించేందుకు ఆయా రాష్ట్రాలు ఎందుకు అంగీకరించాలి? వారికి చేకూరే ప్రయోజనంపై కేంద్రం ఇస్తున్న స్పష్టత ఏంటి? ► సుమారు రూ.5.5 లక్షల కోట్ల భారీ ఖర్చుతో నదుల అనుసంధానానికి సిద్ధమైన కేంద్రం.. రాష్ట్రాలు చేపట్టే భారీ ప్రాజెక్టులు ఎందుకు అంతే ఖర్చుతో రాష్ట్రాలు ప్రాజెక్టులు చేపడితే ఎందుకు అభ్యంతరం చెబుతోంది? ► గోదావరి నీటిని కృష్ణా బేసిన్లోని పట్టిసీమకు తరలించి నదుల అనుసంధానం అంటున్న ఏపీ.. ఎగువ రాష్ట్రాలు వా టాలడిగితే మాత్రం దిక్కులు చూస్తోంది. దీనిపై కేంద్రం వైఖరి ఏంటి? ► రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులకు భూసేకరణ చట్టం, పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న కేంద్రం.. నదుల అనుసంధానానికి అనుమతులు ఎలా ఇస్తుంది? ► వృథాగా పోతున్న గోదావరి నీటిని కాళేశ్వరం ద్వారా కృష్ణా బేసిన్ ప్రాంతా లకు తరలిస్తుంటే అనుమతుల విష యంలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోంది? -
నదుల అనుసంధానికి శ్రీకారం
రూ. 5.5లక్షల కోట్ల నిధులతో మొదటి దశ మొదటి దశకు అనుమతుల పూర్తి భారత దేశం వర్షాధారిత వ్యవసాయ దేశం. దాదాపు 70 శాతం మంది కేవలం వ్యవసాయం మీద ఆధాపడి జీవిస్తున్నారు. వ్యవసాయానికి అవసనమైన వర్షపాతం కొన్నేళ్లుగా తక్కువగా ఉంటోంది. కాలాలతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో వరదలు, తుఫానులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదులు అనుసంధానం తెర మీదుకు వచ్చింది. ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటైన రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. న్యూఢిల్లీ : దేశంలో కరుపు కాటకాలను, వరదలను నియంత్రించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానం త్వరలో పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ మొదటి దశకు అన్నిరకాల అనుమతులు మంజూరయ్యాయి. త్వరలోనే 5.5 లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ తొలి అడుగు వేయనుంది. మొత్తం 60 నదులు దేశవ్యాప్తంగానున్న 60 నదులను రివర్ లింకింగ్ ప్రాజెక్టులో భాగంగా అనుసంధానం చేయాలన్నది ప్రధాన లక్ష్యం. ఇందులో గంగ, యమున, గోదావరి, కృష్ట సహా చాలా నదులను అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశవ్యాప్తంగా వేల హెక్టార్ల భూమి సాగులోకి రావడంతో పాటు వరదల ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.. కరవు కాటకాలను ఎదుర్కోవచ్చు. అంతేకాక వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. అనుమతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నదుల అనుసంధానం మీద ప్రత్యక శ్రద్ధ చూపడంతో రివర్ లింకింగ్ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతులు లభించాయి. నదుల అనుసంధానాన్ని ప్రకృతి, జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నదుల అనుసంధానం వల్ల ప్రకృతి నాశణం అవుతుందని వారు చెబుతున్నారు. కెన్-బెత్వా ప్రాజెక్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్లో ప్రవహించే కర్నావతి-బెత్వా నదులను రివర్ లికింగ్లో భాగంగా మొదట అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్సులు లభించాయని ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. గంగా, గోదావరి, మహానదులను అనుసంధానం చేయడంవల్ల వరదలు, కరువు కాటకాలనుంచి దేశాన్ని రక్షించవచ్చని రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఏరియా కర్నావతి నది మొత్తం 425 కి.మీ. ప్రవహిస్తుంది. లింకింగ్ ప్రాజెక్టును టైగర్ రిజర్వ్ వ్యాలీ అయిన వేదాంత వద్ద నిర్మాంచాలన్నది ప్రాజెక్ట్ అధికారులు ఆలోచన. అందుకోసం ఫారెస్ట్ రిజర్వ్లో 6.5 శాతం భూమిని ప్రభుత్వం ప్రాజెక్ట్కు అప్పగించింది. అక్కడ ఆవాసం ఉంటున్న 2 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు స్థానిక ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద అన్ని రకాల క్లియరెన్సులతో మోదీ గ్రీన్ సిగ్నల్ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. తరువాత ? ఈ ప్రాజెక్ట్ తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్-మహరాష్ట్రలోని నదులను అనుంసంధానం చేయాలన్న ఆలోచన ఉందని రివర్ లికింగ్ ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. సమస్యల్లో జంతువులు నదులు అనుంసంధానం వల్ల పులులు, రాబందులు, నీటిలో పెరిగే చేపలు ఇతర జంతుజాల మనుగడ ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. -
మీ వైఖరేంటో చెప్పండి!
నదులను ప్రాణమున్న జీవులుగా గుర్తించాలన్న పిల్పై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో ప్రవహి స్తున్న పెన్నా, కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు, వాటి ఉపనదులను ప్రాణ మున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహా రంపై మీ వైఖరేంటో తెలుపుతూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర నీటి వనరులశాఖ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పర్యావరణశాఖల ముఖ్య కార్యదర్శులు, పీసీబీ సభ్యకార్య దర్శులకు నోటీసులిచ్చింది. తదుపరి విచా రణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్రంగనాథన్, జస్టిస్ టి.రజనీతో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులిచ్చింది. మనుషులకు ఉండే అన్ని చట్టబద్ధమైన హక్కులనూ నదులకు కల్పించాలని కోరుతూ న్యాయ విద్యార్థిని ఉన్నం దీప్యాచౌదరీ వేసిన పిల్పై ధర్మాసనం విచారణ జరిపింది. ఆ ఆదేశాలు మేమెలా ఇవ్వగలం..! పిటిషనర్ తరఫు న్యాయవాది మురళీధర రావు వాదనలు వినిపిస్తూ.. నదులను పరి రక్షించే వ్యవస్థ ఏదీ లేదని, ఉన్న వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదని తెలిపారు. కనుక నదులను ప్రాణమున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ధర్మాస నం స్పందిస్తూ, అటువంటి ఆదేశాలు తామె లా ఇవ్వగలమని ప్రశ్నించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఈమేరకు ‘చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులిచ్చిందని మురళి బదులిచ్చారు. -
ఆ నదులను ప్రాణ జీవులుగా గుర్తించండి
హైకోర్టులో న్యాయ విద్యార్థిని దీప్యా చౌదరి పిల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల్లో ప్రవహిస్తున్న పెన్నా, కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులను, వాటి ఉప నదులను ప్రాణమున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. మనిషికి ఉండే అన్ని చట్టబద్ధమైన హక్కులను వాటికీ కల్పించాలని కోరుతూ న్యాయ విద్యార్థిని దీప్యా చౌదరి పిల్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర నీటి వనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శులు, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నదులు తమను తాము రక్షించుకోలేవు కాబట్టి వాటిని ప్రాణమున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించాలని కోరుతున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నదులను, ఉప నదులను పరిరక్షిం చేందుకు, వాటి సహజ ప్రవాహానికి ఎటువంటి అడ్డంకుల్లేకుండా చూసేందుకు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు లేదా ఇతర ఏ అధికారులనైనా నియమిం చాలని కోరారు. నదుల్లో చెత్తా చెదారం ఆసుపత్రుల వ్యర్థాలు తదితరాలను వేయకుండా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్థించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్కడెక్కడ మురి కినీటి శుద్ధి కేంద్రాల వివరాలను కోర్టు ముందుంచేలా ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలివ్వాలని కోరారు. -
భారీ వర్షాలున్నాయ్.. వరదలతో జాగ్రత్త!
► రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర జల సంఘం ► రాష్ట్రంలోని 10 ప్రాజెక్టుల పరిస్థితిపై సీడబ్ల్యూసీ సీఈ నవీన్కుమార్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నదీ బేసిన్ల పరిధిలో గుర్తించిన వరద ప్రభావ ప్రాంతాలపై ఆయా రాష్ట్రాలను కేంద్ర జల సంఘం అప్రమత్తం చేసింది. గతేడాదితో పోలిస్తే భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అందుకు తగ్గట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర జల సంఘం గుర్తించిన నదీ బేసిన్లు, ప్రాజెక్టులతోపాటు ఏవైనా ప్రమాద ముప్పు ప్రాంతాలు ఉన్నట్లయితే వాటి వివరాలను తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పింది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ నవీన్కుమార్ ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రాజెక్టుల ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, కడెం, మూసీ, మున్నేరు, ప్రాణహిత, ఇంద్రావతి తదితర బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల వరదపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూరాల, శ్రీశైలం, సాగర్, నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, తుపాకులగూడెం, మూసీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆటోమెటిక్ రెయిన్ గేజ్ స్టేషన్లు, ఆటోమెటిక్ వాటర్ లెవల్ రికార్డులు, డిజిటల్ వాటర్ లెవల్ రికార్డుల ఏర్పాటు అంశాలపై రాష్ట్ర అధికారుల నుంచి వివరణలు కోరారు. అవసరాలను ముందుగానే గుర్తించి వాటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. గోదావరి, కృష్ణా, తుంగభద్రలకు వచ్చే వరదలపై పొరుగున ఉన్న, లేక ఆ బేసిన్ పరివాహకం ఉన్న రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి చేసుకోవాలని, ప్రాజెక్టుల నీటి నిల్వ పరిస్థితులను ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలకు తెలియజేయాలని సూచించారు. నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు వచ్చే 4 రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషాలను ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది దక్షిణ దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వివరించింది. కొంకణ్, మధ్య కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వెల్లడించింది. మరో మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గత 24 గంటల్లో పేరూరు, తల్లాడల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం, ఆసిఫాబాద్లల్లో 4 సెంటీమీటర్లు, టేకులపల్లి, మధిర, ఏన్కూరు, గుండాల, ఇల్లెందు, జూలూరుపాడు, పాల్వంచల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. -
నదులున్నా.. నీళ్లులేవు
దేశంలో నదుల దుస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన అమర్కంఠక్: దేశంలోని నదుల దుస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పలు నదులు మ్యాపుల్లో ఉన్నా.. వాటిల్లో నీరు లేదన్నారు. సోమవారం మధ్యప్రదేశ్లోని అన్నూపూర్ జిల్లాలో ‘నమామి దేవి నర్మదే సేవా యాత్ర’ ముగింపు కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్మదా నది రక్షణకు నడుంకట్టిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను అభినందించారు. నర్మదా నది సంరక్షణకు రోడ్మ్యాప్ను సిద్ధం చేయడాన్ని ‘భవిష్యత్ దృష్టితో చేసిన సరైన కార్యక్రమం’ అని అభివర్ణించారు. ఆ డాక్యుమెంట్ను ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వాలని సూచించారు. డాక్యుమెంట్ను తాను పరిశీలించానని, అన్నీ సవివరంగా ఉన్నాయని అభినందించారు. నర్మదా నదిని కాపాడే కార్యక్రమం చేపట్టిన మధ్యప్రదేశ్కు ఆ నది నీటిని వినియోగించుకునే గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర శుభాభినందనలు తెలపాలన్నారు. ఈ కార్యక్రమానికి ముందు నర్మదా నది జన్మస్థానమైన అమర్కంఠక్ వద్ద మోదీ పూజలు నిర్వహించారు. కాగా, నమామి దేవి నర్మదే సేవా యాత్రను 2016 డిసెంబర్ 11న అమర్కంఠక్లో ప్రారంభించారు. సుమారు 150 రోజుల పాటు సాగిన ఈ యాత్ర 1100 ఊళ్ల మీదుగా 3,344 కి.మీ., పాటు సాగింది. -
నదుల చరిత్రపై అన్వేషణ
- గోదావరి వెంట 6వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర - కృష్ణానది వెంట 2,500 కిలోమీటర్ల పర్యటన జూపాడుబంగ్లా: పన్నెండునదుల పుట్టుపుర్వోత్తరాలు తెలుసుకోవడమే ధ్యేయంగా సీనియర్ జర్నలిస్టు పొన్నాల గౌరిశంకర్(65) సైకిల్ యాత్ర చేపట్టి ఆరువేల కిలోమీటర్లు పర్యటించారు. మూడో పర్యాయంగా కృష్ణానదిపై పర్యటిస్తున్న గౌరిశంకర్ గురువారం జూపాడుబంగ్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొదటి పర్యాయం గోదావరి నది వెంట 6వేల కిలోమీటర్లు, రెండో పర్యాయం 7వేల కిలోమీటర్లు ప్రయాణించి నర్మదా నది వెంట ప్రయాణించి వాటి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. మూడోపర్యాయంగా కృష్ణానదిపై పర్యటిస్తున్నానన్నారు. ఆగష్టు 12న కృష్ణాపుష్కరాలను పురష్కరించుకొని సైకిల్ యాత్ర ప్రారంచానన్నారు. ఇప్పటి వరకు కృష్ణానది ఉత్తర ఒడ్డుమీదుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి ఏపీలోకి ప్రవేశించినట్లు తెలిపారు. 5వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కృష్ణానది వెంట ఇప్పటి దాకా 2,500 కిలోమీటర్లు ప్రయాణించానని తెలిపారు. 65ఏళ్లు పైబడిన గౌరిశంకర్ చెక్కుచెదరని విశ్వాశంతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా సైకిల్పైనే సకలసౌకర్యాల వస్తువులతో పాటు జాతీయ పతాకాన్ని పెట్టుకొని పర్యటిస్తుండడం విశేషం. -
ఎస్సారెస్పీ జలాలతో చెరువులను నింపాలి
తుంగతుర్తి : ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి కాలువల ద్వారా చెరువులను నింపి రైతులను ఆదుకోవాలని వైస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో సరిగా వర్షాలు లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా జలాలను మళ్లించి ఈ ప్రాంతంలోని చెరువులను నింపాలని కోరారు. ఆయనతో పాటు ఎస్సారెస్పీ నాయకులు తుమ్మరాస్వామి, సంద రవి, గులాం సందాని, ఇరుగు సైదులు, రమేష్, సతీష్, వీరభద్రం, వెంకన్న, వినయ్ పాల్గొన్నారు. -
ఆదిలాబాద్ జిల్లాలో పొంగుతున్న వాగులు
ఆదిలాబాద్: రెండు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో సైతం భారీగా వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పుడుతోంది. కొమురం భీం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. -
వరంగల్ ఏజెన్సీలో ఉప్పొంగిన వాగులు
హన్మకొండ: వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు 47 మండలాల్లో భారీగా వర్షం కురిసింది. అత్యధికంగా ఏటూరునాగారంలో 59.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఏటూరునాగారం మండలంలో జీడివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నబోయినపల్లి వద్ద వట్టివాగు ఉప్పొంగడంతో వరంగల్- ఏటూరునాగారం మధ్య రవాణా స్తంభించింది. ఏటూరునాగారం మండలంలోని గోగుపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు చెరుకుల ధర్మయ్య, నాగేశ్వర్రావు పాఠశాల గదిలోనే ఉన్నారు. నాగేశ్వర్రావు ద్విచక్రవాహనం వరదకు కొట్టుకుపోయింది. రాత్రి 7 గంటలకు వరద తగ్గిన తర్వాత వారు బయటకు వచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. మేడారంలోని జంపన్నవాగు బుధవారం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రెండు బ్రిడ్జిలకు ఆనుకుని వరదనీరు పరవళ్లు తొక్కింది. మోరంచవాగులో చిక్కిన ఇద్దరు యువకులు గణపురం మండల కేంద్రం-ధర్మారావుపేట గ్రామాల మధ్య మోరంచవాగులో ఇద్దరు యువకులు చిక్కిపోయారు. మండల కేంద్రానికి చెందిన ఏరువ రత్నాకర్, వెంకటాపురం మండలం రామానుజాపురం శివారు నారాయణగిరిపల్లెకు చెందిన నరిగె అశోక్లు ధర్మారావుపేటకు వెళ్లేందుకు బయలుదేరారు. మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో దాటలేకపోయారు. అరగంట సేపు అక్కడ ఆగారు. తిరిగి గణపురం పోవడానికి వెనక్కిరాగా.. అక్కడ కూడా పిల్లవాగు (కాజ్వే) ఉధృతంగాప్రవహించడంతో మధ్యలో బందీలుగా మారారు. గ్రామస్తులు వారిని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. రాత్రి వరకు కూడా వారు బయటపడే అవకాశం కనిపించడం లేదు. -
సంక్రాంతికి శ్రీరంగం
శ్రీమహావిష్ణువు శేషతల్పశాయిగా కొలువైన క్షేత్రం శ్రీరంగం. 108 వైష్ణవ క్షేత్రాలలో ఇదే మొదటిది. శ్రీరంగనాథుడు, రంగనాయకి కొలువైన ఈ క్షేత్రం తమిళ నాడులోని తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉభయ కావేరీ నదుల మధ్య ఉంది. 156 ఎకరాల విస్తీర్ణం.. ఏడు ప్రాకారాలు.. ఇరవెరైండు గోపురాలు... తొమ్మిది తీర్థాలతో అలరారే ఈ ఆలయం ప్రాచీన శిల్పకళా నైపుణ్యానికి కూడా పట్టుగొమ్మ. విఖ్యాత నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా ఆస్థాన విద్వాంసుడిగా సేవలందించింది ఈ ఆలయానికే. సంక్రాంతికి వైష్ణవ క్షేత్రాల దర్శనం సకల శుభాలకు ఆరంభం. శ్రీరంగనాథుడు సాక్షాత్తు శ్రీరాముడి చేత పూజలు అందుకున్న దేవుడు. శ్రీరాముడు స్వయంగా వైష్ణవ అవతారమే అయినా శ్రీరంగనాథుడిని పూజించేవాడట. లంకపై విజయం తర్వాత విభీషణుడికి తన వాత్సల్యానికి గుర్తుగా ఈ ప్రతిమను బహూకరించాడని దానిని తీసుకొని విభీషణుడు లంకకు బయలుదేరగా శ్రీరంగంలో స్వామి విరామం తీసుకో ప్రయత్నించాడట. ఆ సమయంలో అక్కడి ప్రభువైన ధర్మవర్మ స్వామిని శాశ్వతంగా అక్కడే ఉండిపొమ్మని కోరాడట. అలాగైతే నా కటాక్షం లంకపై ఉండేలా నన్ను దక్షిణాభిముఖంగా ప్రతిష్టించమని కోరాడనీ అప్పటి నుంచి రంగనాథుడు ఆలయంలో దక్షిణాభిముఖుడై పూజలందుకుం టున్నాడని కథనం. ఈ స్వామినే కస్తూరి రంగడని, కావేటి రంగడని కూడా భక్తులు పిలుస్తారు. గుడిని ‘కోవెల’ అనడం ప్రారంభమైనది ఈ ‘కోవెల’తోనే అని చరిత్రలో మొదటి కోవెల రంగనాథ కోవెలే అని భావించేవారు ఉన్నారు. ఏడు ప్రాకారాలు... శ్రీరంగ ఆలయం వైశాల్యంలో చాలా పెద్దది. దీనికి ఏడు ప్రాకారాలు ఉన్నాయి. వీటిలోని మూడు ప్రాకారాలలో దుకాణాలు, నివాస గృహాలు ఉన్నాయి. నాలుగో ప్రాకారంలో వేయిస్తంభాల గుడి ఉంది. నాలుగో ప్రాకారంలోనే గరుడ మండపం, దాని ఎదురుగా ముఖమండపం ఉన్నాయి. ముఖమండపం ఎదుట ఉన్న రాతి ధ్వజస్తంభానికి సమీపంలో అభయాంజనేయ స్వామి సన్నిధి ఉంది. అనంతశయనుడిగా రంగనాథుడు శ్రీరంగం గర్భాలయంలో శ్రీమహావిష్ణువు అనంతశయనుడిగా దర్శనమిస్తాడు. గర్భాలయానికి చేరువలోనే రంగ వల్లిగా పిలుచుకునే రంగనాయకి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈమె ఉన్న ఆలయాన్ని శ్రీరంగనాయకి మందిరంగా, శ్రీరంగ నాచియర్ కోవెలగా పిలుస్తారు. శ్రీరంగం ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ నరసింహస్వామి ఆలయం, శ్రీ చక్రతాళ్వార్ ఆలయాలు కూడా ప్రశస్తి పొందాయి. ఏటా నాలుగుసార్లు బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఏటా నాలుగుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సౌరమానం ప్రకారం మకర, కుంభ, మీన, మేష మాసాలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో మకరమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాధాన్యం ఉంది. బ్రహ్మోత్సవాలతో పాటు గజేంద్రమోక్ష ఉత్సవం, వసంతోత్సవం, తైల సమర్పణోత్సవం, పవిత్రోత్సవం, విజయదశమి ఉత్సవం, ఊంజల్ ఉత్సవం, కర్పూర పడియత్ సేవోత్సవం, తెప్పోత్సవం కూడా ఈ ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ధనుర్మాసం నెలపొడవునా ఈ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి రోజున వైకుంఠద్వార దర్శనం, ఉగాది వేడుకల్లో కూడా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. తిరువనైకవల్లో జంబుకేశ్వరాలయం... శ్రీరంగం ఆలయానికి చుట్టుపక్కల పలు సుప్రసిద్ధ పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో కావేరీ నదికి ఉత్తర తీరాన ఉన్న జంబుకేశ్వరాలయం ప్రసిద్ధం. దీనినే తిరువానైకోయిల్ అని కూడా అంటారు. శివుని తపస్సు భంగపరచిన పార్వతీదేవి శివుని శాపానికి గురై, ఇక్కడి జంబు అరణ్యంలో తపస్సు చేసిందని, శివలింగాన్ని ప్రతిష్ఠించి కావేరీ జలాలతో అభిషేకించిందని, అందువల్లే ఈ ఆలయంలో శివలింగం కింద ఎల్లప్పుడూ నీరు ఉంటుందని చెబుతారు. పార్వతీదేవి తపస్సు చేసిన చోటే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి స్థలపురాణం. ఈ ఆలయ ఆవరణలో పంచభూత స్థలంగా పేరుపొందిన నీటికొలను ఉంది. ఇందులో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. శక్తి క్షేత్రం సమయపురం... శ్రీరంగపట్టణానికి సమీపంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం శక్తి క్షేత్రమైన సమయపురం మరియమ్మన్ ఆలయం. ఈ ఆలయం తిరుచిరాపల్లికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తులతో రద్దీగా ఉంటుంది. అమ్మవారికి బియ్యపు పిండి, నెయ్యి, పప్పు, బెల్లంతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మవిళక్కు మావు అని పిలిచే ఈ ప్రసాదం అమ్మవారికి ఇష్టమని భక్తుల నమ్మకం. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే పుష్పోత్సవం ఇక్కడ మరో ప్రధానమైన పండుగ. దీనిని ‘పూరోరితల్’ అంటారు. - దాసరి దుర్గా ప్రసాద్ ఇలా చేరుకోవాలి క్షేత్రానికి ఏ ప్రాంతం నుంచైనా సులువుగా చేరుకోవచ్చు. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచిరాపల్లిలో అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లు ఉన్నాయి. చెన్నైలోని జీటీ రైల్వేస్టేషన్ నుంచి శ్రీరంగం పట్టణానికి 330 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి రైలులో వచ్చేవారు జి.టి.స్టేషన్ నుంచి తిరుచిరాపల్లికి రైలులో చేరుకోవచ్చు. తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగానికి విరివిగా సిటీబస్సులు అందుబాటులో ఉంటాయి. వసతి సదుపాయం బస చేయడానికి అనేక హోటళ్లు , సత్రాలు అందుబాటులో ఉన్నాయి. శ్రీరంగంలో బస చేయని వారు తిరుచిరాపల్లిలో కూడా బస చేయవచ్చు. ఆసియాలోనే అతిపెద్ద గోపురం ఆలయానికి ముందున్న గోపురాన్ని మహాగోపురం అంటారు. ఈ మహాగోపుర నిర్మాణాన్ని అచ్యుత దేవరాయలు ప్రారంభించారు. అందువల్ల దీనిని అచ్యుత గోపురం అని కూడా అంటారు. అయితే మధ్యలోనే ఈ నిర్మాణం ఆగిపోయింది. తర్వాతి కాలంలో 44వ అహోబిల మఠాధిపతి దీనిని పూర్తి చేశారు. పదమూడు అంతస్తుల ఈ గోపురం ఎత్తు 236 అడుగులు, వెడల్పు 192 అడుగులు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం. -
నదులను కాపాడే సీతాకోకచిలుకలు!
రంగు రంగు రెక్కలతో.. హరివిల్లును తలపిస్తూ...పచ్చని చెట్లపై ఎగిరే అందమైన సీతాకోక చిలుకలు.. చూపరులకు కనువిందు చేస్తాయి. మొక్కలపై వాలి.. వాటి పూల పుప్పొడితో ఆ జాతి అభివృద్ధికి దోహద పడతాయి. ఇప్పటికే సీతాకోకచిలుకలు ప్రపంచంలోని అనేక ఇతర జీవుల కన్నా శక్తివంతమైనవిగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం నదులను కాపాడ్డంలోనూ, అడవుల ఆరోగ్యాన్ని రక్షించడంలోనూ ఈ కీటకాలు సహాయపడతాయంటున్నారు పరిశోధకులు. సుమారు ఆరు దశాబ్దాలుగా సీతాకోక చిలుకల సమగ్ర జాబితాను తయారు చేస్తున్నారు సైంటిస్టులు. ఉత్తరాఖండ్ నైనిటాట్ జిల్లా భిట్మాల్ లోని బట్టర్ ఫ్లై రీసెర్చ్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్త స్మెటాసెక్...ఏళ్ళ తరబడి సీతాకోకచిలుకల సంగ్రహణకు పాటుపడుతూనే వాటి కొత్త జాబితానూ రూపొందిస్తున్నారు. స్మెటాసెక్... తన పరిశోధనల్లో భారతదేశ వ్యాప్తంగా 1,318 రకాల సీతాకోక చిలుకల జాతులు ఉన్నట్లుగా కనుగొన్నారు. సంవత్సరాల కాలం సీతాకోకచిలుకల సంగ్రహణలోనే గడిపిన స్మెటాసెక్... వాటిని పత్రబద్ధం చేయడమే కాక, అవి ఇండియాలోని నదులను కాపాడేందుకు ఎంతగానో సహకరిస్తాయని చెప్తున్నారు. క్రిమి కీటకాలను ఉపయోగించి అడవుల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రతయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సీతాకోక చిలుకల జాబితాను సేకరిస్తున్నామని, అవి ఎక్కడ ఏ రకంగా ఉన్నాయో తెలిస్తే.. వాటి జాతుల వర్గీకరణను స్పష్టం చేయవచ్చని, ఆపై అడవుల ఆరోగ్యాన్ని కనిపెట్టవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే ముందుగా వాటి జాబితాను సిద్ధం చేస్తున్నారు. భారత దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన జాతులు ఉన్నట్లుగా కనుగొన్నామని, ముఖ్యంగా నదీ ప్రాంతాల్లో ఉన్న సీతాకోక చిలుకలు నీటి ఆరోగ్యాన్ని పెంపొందించేవిగా ఉన్నాయని సైంటిస్ట్ స్మెటాసెక్ చెప్తున్నారు. నిజానికి అటవీశాఖ వారు అడవుల్లోని క్రిమి కీటకాలు, పక్షులు, ఇతర జాతుల వివరాలను సేకరించడం, వాటి లెక్కలను తెలపడంవల్ల నదీతీరాల్లోని అడవుల ఆరోగ్యం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని సీతాకోక చిలుకల నిపుణులు అంటున్నారు. వాటి జన్మ స్థలాన్ని బట్టి అక్కడి పర్యావరణ సమాచారం ఆధారంగా జల భద్రతను నిర్థారించేందుకు, నదీ ప్రవాహం స్థిరీకరించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు. సీనాకోక చిలుకలు.. మొక్కల పరపరాగ సంపర్కానికి మాత్రమే కాక... కప్పలు, కందిరీగలు, పక్షులు, పలు రకాల కీటకాలకు, ఇతర జాతులకు ఆహారాన్ని అందించడంలోనూ ఉపయోగపడతాయట. స్వాతంత్ర్యానంతరం భారత దేశంలో ప్రత్యేకంగా ఓ సీతాకోక చిలుకల జాబితా తయారు చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఎటువంటి జాతులు ఉన్నాయనేది ఎవ్వరూ తెలుసుకోలేదు. ప్రస్తుతం ఇండియాలో సైంటిస్ట్ స్మెటాసెక్ తో పాటు, జూలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆర్కే వర్స్ నే... అటువంటి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇండియాలోని కేరళ, కర్నాటక ప్రాంతాల్లో మాత్రమే వైవిధ్యంగా కనిపించే ట్రావెన్కోర్ ఈవెనింగ్ బ్రౌన్ సీతాకోకచిలుకలు ఉన్నాయని, అంతరించిపోతున్న ఇటువంటి జాతికి సమీపంగా కనిపించే కొన్ని జాతులు దక్షిణ ఆమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. రక్షిత ప్రాంతాల్లో ఇటువంటి జాతులు ఉండటం ఎంతో అదృష్టమని స్మెటాసెక్ తెలిపారు. -
నదుల అనుసంధానం పేరుతో మోసం: నెహ్రు
-
జపాన్లో వరదలు
-
‘నదుల అనుసంధానం’ సభ్యుడిగా శ్రీరాం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కలల ప్రాజెక్టు అయిన ‘నదుల అనుసంధానం’ ప్రాజెక్టు త్వరగా సాకారమయ్యేందుకు వీలుగా ‘టాస్క్ ఫోర్స్’ కమిటీని కేంద్ర జలవనరుల శాఖ మంగళవారం ఏర్పాటుచేసింది. ఇందులో సభ్యుడిగా తెలుగు ప్రముఖుడు శ్రీరాం వెదిరె నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కమిటీకి చైర్మన్గా బీఎన్ నవాలావాలా నియమితులయ్యారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం అమెరికాలో ఓ కంపెనీలో 15ఏళ్లపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. 2009లో భారత్కు తిరిగొచ్చారు. నీరు పారుదలపై అనేక రచనలు చేశారు. బీజేపీలో చేరిన ఆయన పార్టీ వాటర్ మేనేజ్మెంట్ సెల్ జాతీయ కన్వీనర్గా విధులు నిర్వర్తించారు. ఏకాభిప్రాయం కోసం కృషి శ్రీరాంను టాస్క్ఫోర్స్ విధులపై ‘సాక్షి’ ప్రశ్నించగా పలు విషయాలు వివరించారు. ‘దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ఈ కమిటీ పనిచేస్తుంది. నదుల అనుసంధానాకి సంబంధించి కొత్త లింకులను అధ్యయనం చేస్తుంది. ఇబ్బందులున్న చోట ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తుంది. సమగ్ర , సాధ్యాసాధ్యాల నివేదికలతోపాటు ప్రాజెక్టు పూర్తికి షెడ్యూలు ఇస్తుంది’ అని అన్నారు. -
కలసిపోతాను... కలుపుకుంటాను...
గమనం నదుల స్వగత కథనం నేను నిరంతర ప్రవాహాన్ని. భారతదేశ జీవన విధానం నా గమనంతో మమేకమై పోయింది. భరతమాతకు కీర్తికిరీటం వంటి హిమాలయాలే నా పుట్టిల్లు. భారతీయుల జీవనంలో నేనో భాగాన్ని. అయినా సరే... తొలివేద కాలం నాటి గ్రంథాల్లో నా ఊసే కనిపించదు. అప్పట్లో సింధు, సరస్వతి నదులే ప్రముఖంగా కనిపించాయి. ఆర్యులు అప్పటికి నా వైపుగా రాకపోవడంతో నాకు పెద్దగా ప్రాచుర్యం రాలేదు. మలివేదకాలం నాటికి నేను కీలకమయ్యాను. కాశీ పట్టణం నా తీరానే ఉంది. పేర్లు గుర్తు పెట్టుకుంటూ... పుట్టినప్పటి నుంచి సాగరంలో కలిసే వరకు నేను నేనుగా ఉండను. పేర్లు మార్చుకుంటూ ప్రయాణిస్తాను. విష్ణుప్రయాగలో ధౌలిగంగ, అలకనంద కలుస్తాయి. నందప్రయాగలో నందాకిని తోడవుతుంది. కర్ణప్రయాగలో పిండార్ వచ్చి చేరుతుంది. ఇవన్నీ కలిసి వచ్చి దేవప్రయాగలో నాలో కలిసిన తర్వాత నాకు ‘గంగ’ అనే అసలు పేరు వస్తుంది. అప్పటి వరకు భాగీరథినే. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి హిమానీనదంలో పుట్టి, ఉత్తరప్రదేశ్లో అడుగుపెట్టిన నా ప్రయాణంలో ఋషికేశ్ ఓ మైలురాయి. మంచు పర్వతాలను దాటి కొండల ఆసరాతో పయనించిన నేను నేల మీద అడుగుపెట్టేదిక్కడే. అప్పటివరకు నైరుతిదిశగా సాగిన నా ప్రయాణం హరిద్వార్ దగ్గర ఆగ్నేయదిక్కుకు మారుతుంది. నేను అలహాబాద్ చేరేలోపు ‘రామగంగ’ పలకరిస్తుంది. యమున దగ్గరలోనే ఉందని చెప్పి ముందుకు సాగుతానో లేదో అంతలోనే యమున కనిపిస్తుంది నా కోసమే ఎదురు చూస్తున్నట్లు. యమున పేరుకి నాకు ఉపనదే కానీ, నా ప్రవాహం కంటే యమున ప్రవాహమే మిన్న. యమునకు నాతో కలవాలనే ఉత్సాహం ఉంది కానీ తన మనుగడను కోల్పోవడం ఇష్టం లేదు కాబోలు. అంత త్వరగా కలవదు. ఒక ఒడ్డున నేను ఎరుపు వర్ణాన్ని కలుపుకున్నట్లు, మరో ఒడ్డున యమున, నేను నీల మేఘపు ఛాయలాగా ప్రవహిస్తుంటాం. పది మైళ్ల ప్రయాణం తర్వాత కానీ నా పెద్దరికాన్ని ఆమోదించదు యమున. అక్కడి నుంచి నా ప్రయాణం ‘తామస’ను కలుపుకుని తూర్పు ముఖంగా సాగిపోతుంది. తీరా కాశీ పట్టణం చేరేసరికి ఒక్కసారిగా ఉత్తరానికి తిరుగుతాను. గోమతి, ఘాఘ్రా నదులను స్వాగతించి బీహార్ దారి పట్టి పాటలీపుత్రాన్ని చూస్తూ చంద్రగుప్తుల కాలాన్ని తలుచుకుంటూ సోన్, గండకీ, కోసీ నదులతో చెలిమి చేస్తూ ఝార్ఖండ్లో అడుగుపెట్టి ‘పాకుర్’ చేరానో లేదో... ఓ హఠాత్పరిణామం! నా దేహం నుంచి గుండెను వేరుచేసిన భావన. నా ప్రవాహంలో పెద్ద చీలిక. హుగ్లీ పేరుతో ఓ పక్కగా వెళ్లిపోతుంది. నా అంశగా కోల్కతా దాహం తీరుస్తుందిలే అని సర్దిచెప్పుకుంటాను. నా నీటిని నిల్వ చేసుకోవడానికి కట్టిన ఫరక్కా బ్యారేజ్ను చూస్తూంటే... ఇండో- పాక్ జల వివాదాలు, ‘భారత్-బంగ్లాదేశ్ల మధ్య జరిగిన నీటి సంధి’ జ్ఞాపకాలు కందిరీగల్లా చుట్టుముడతాయి. ఈ లోపు ‘పద్మ’ అనే పలకరింపు... అంటే బంగ్లాదేశ్లో అడుగుపెట్టానన్నమాట. అది ఒకప్పటి భారతావనే. బ్రహ్మపుత్ర నుంచి చీలిన ఓ పాయ ‘జమున’ను నాకు తోడుగా తీసుకుని ముందుకెళ్తూ ఉంటే అలాంటిదే మరో పాయ ‘మేఘన’ నేనూ కలుస్తానని నా అంగీకారంతో పనిలేకనే చేరిపోతుంది. మేఘన నాతో కలుస్తుంది అనడం కంటే మేఘన వచ్చి నన్ను తనలో కలుపుకుంటుంది - అనడం సబబేమో. ఎందుకంటే ఆ క్షణం నుంచి ‘పద్మ’ అనే పేరును కూడా నాకు మిగల్చకుండా తన పేరుతోనే పిలిపించుకుంటుంది. నన్ను అందరూ ‘మేఘన’ అంటూ ఉంటే ఇక నేను లేనా అనిపించి మనసు కలుక్కుమంటుంది కూడా. ఏమైనా మనుషుల్లో స్వార్థంతోపాటు కొంచెం ఉదార స్వభావం కనిపిస్తుంటుంది. బంగాళాఖాతంలో కలిసే చోటుకు గంగా (గంగ- బ్రహ్మపుత్ర) డెల్టా అంటూ... నేను మర్చిపోయిన నా పేరును గుర్తు చేసి మురిపిస్తారు. ఎన్ని భాషలో... ఎన్నెన్ని యాసలో! కపిల మహర్షి మాట మేరకు స్వర్గంలో ఉన్న నన్ను భూమ్మీదకు తీసుకువచ్చే బాధ్యతను కోసల రాజ్యాన్ని పాలించిన సూర్యవంశ రాజు భగీరథుడు చేపట్టాడని పురాణోక్తి. అలా ఆవిర్భావ దశలో నా పేరు భాగీరథి అయింది. గంగోత్రికి నాలుగు కి.మీ.ల దూరంలో తపోవన్... భగీరథుడు తపస్సు చేసినట్లు చెప్పే ప్రదేశం ఉంది. ఇక్కడ 18వ శతాబ్దంలో నాకో ఆలయం కట్టారు. అక్కడ అందరూ ‘గంగామాత’ అంటూ పూజిస్తారు. సముద్రమట్టానికి దాదాపు పదమూడు వేల అడుగుల ఎత్తులో పుట్టిన నన్ను, 2525 కిలోమీటర్ల ప్రయాణంలో అందరూ అక్కున చేర్చుకునేవారే. నా తీరాన్ని ఆసరాగా చేసుకుని జీవనం సాగిస్తున్న మనుషులను చూస్తూ హరిద్వార్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, ఘాజీపూర్, భాగల్పూర్, మీర్జాపూర్ల మీదుగా ప్రయాణిస్తుంటే ఎన్నెన్ని భాషలో, యాసలో. రకరకాల ఆహారపుటలవాట్లు, వస్త్రధారణలు. ఈ మధ్యలో సుందర్బన్స్ టైగర్ రిజర్వ్లో బెంగాల్ టైగర్ను చూస్తూ, రాజ్మహల్ కొండల్లో ప్రయాణిస్తూ నా నీటికి ఖనిజలవణాలను సమకూరుస్తుంటాను. అక్కడి ‘సంథాల్’ గిరిపుత్రుల వ్యవసాయాన్ని చూసి తీరాల్సిందే. నా తీరాన ఉన్న నేల సారం అంతా ఇంతా కాదు. నేలను నమ్ముకున్న రైతు, నీటిని నమ్ముకున్న జాలరి సంతోషంగా జీవిస్తుంటే నా మది పులకించిపోతుంటుంది. వలలో డాల్ఫిన్లు పడితే జాలరికి పండగే. పొట్టపోసుకోవడానికి చేపలు పట్టే జాలరి పొట్టకొడుతూ కొందరు అత్యాశపరులు భారీవ్యాపారం కోసం డాల్ఫిన్లను విచక్షణరహితంగా తోడేస్తుంటే నాకు గుండె పిండేసినట్లు ఉంటుంది. నేను ఎన్ని ఇచ్చినా మనిషికి ఇంకా ఏదో కావాలనే ఆశ. ఆ అత్యాశతోనే నన్నూ కలుషితం చేస్తున్నారు. దాంతో మిగిలి ఉన్న జలచరాలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నన్నే నమ్ముకుని పుట్టిపెరుగుతున్న ఆ ప్రాణులను కాపాడుకోవాలంటే నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలి. అందుకు మీరూ ఓ చెయ్యి వేస్తారా? నా నీటిని గొంతులో పోస్తే పోయే ప్రాణం నిలుస్తుందని ఒకప్పటి విశ్వాసం, నా నీరు తాగితే ఉన్న ప్రాణం ప్రమాదంలో పడుతుందనేది నేటి నిజం. నా నీటిలో ఆమ్లజని శాతం చాలా ఎక్కువ. స్వయంగా ప్రక్షాళన చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్న నదిని. అలాంటి నన్ను ప్రపంచంలోకెల్లా కలుషితమైన నదుల్లో ముందంజలో చేర్చారు. రోజూ గంగాహారతి ఇస్తూ నా ఔన్నత్యాన్ని కీర్తించే ప్రతి పెదవినీ అడుగుతూనే ఉన్నాను. నన్ను నేను ప్రక్షాళన చేసుకోలేని అసహాయతలో చిక్కిన నా కోసం సాయం చేసే చేతులు ఉన్నాయా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. - వాకా మంజులారెడ్డి పుట్టింది: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి (14 వేల అడుగుల ఎత్తు) {పవాహదూరం: 2525కి.మీ.లు సాగర సంగమం: గంగ- బ్రహ్మపుత్ర డెల్టా దగ్గర (బంగాళాఖాతంలో) గంగానది ప్రక్షాళన కోసం 1986 జనవరి 14వ తేదీన అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ ‘గంగా యాక్షన్ ప్లాన్’కు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు ఆ పని చేస్తున్నాయి. తాజాగా నరేంద్ర మోదీ అదే ప్రయత్నంలో ఉన్నారు. -
పాతాళంలో గంగ
సాక్షి, మహబూబ్నగర్ : జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది సరైన వర్షాలు పడక చెరువులు, కుంటలు వెలవెలబోయాయి. భూగర్భజలాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సగటు భూగర్భజలాల నీటిమట్టం 11.35 మీటర్ల కంటే లోతుకు పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో 8.75 మీటర్ల లోతులో ఉంటే ఈసారి ఏకంగా మూడు మీటర్లకు పైగా లోతుకు పడిపోయాయి. పది మండలాల్లో 20 మీటర్ల కంటే లోతుకు నీటిమట్టం చేరింది. ఫలితంగా బోర్లలో చుక్కనీరు రావడం లేదు. అంతేకాదు జలాలు అడుగంటడంతో కొత్తగా బోర్లు వేయడానికి వీల్లేదని భూగర్భజలశాఖ నివేదిక అందించింది. దీంతో ఈ సారి వేసవిలో తాగడానికి నీళ్లు దొరకడమే గగనం కానుంది. ఈ మేరకు జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక అందించారు. జిల్లాలో 1313 గ్రామ పంచాయతీల పరిధిలో 3,417 ఆవాసాలున్నాయి. వీటిలో 483 ఆవాసాలకు మల్టీ విలేజ్ స్కీం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించి శుద్ధి చేసిన నీరు అందిస్తున్నారు. 2,216 ఆవాసాలలో పీడబ్ల్యూఎస్ (బోర్ల ద్వారా ట్యాంక్, అక్కడి నుంచి నల్లాల ద్వారా సరఫరా), 1,250 ఆవాసాలలో ఎంపీడబ్ల్యూఎస్ (బోరు మోటర్ల ద్వారా నేరుగా సరఫరా) అవుతోంది. మల్టీ విలేజ్ స్కీం ద్వారా తాగునీరు అందుతున్న గ్రామాలను మినహాయిస్తే మిగతాచోట్ల వేసవి వచ్చిందంటే చుక్కనీటి కోసం పుట్టెడు కష్టం పడాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 13,118 చేతి పంపులు, 5273 బోరు మోటర్లున్నా వేసవి వచ్చిందంటే ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. ప్రతి ఏటా ట్యాంకర్ల ద్వారానో లేదా లీజు బోర్ల ద్వారా కాసింత ఉపసమనం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు.. వేసవి రాకముందే జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణంగా జిల్లాలో 8 మీటర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 11.35 మీటర్ల లోతుకు పడిపోయాయి. సాధారణంగా 604.60 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 476 మి.మీటర్లు మాత్రమే నమోదైంది. బలమైన వర్షాలు లేనందున చెరువులు, కుం టలు కూడా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. దీంతో భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. అయితే గతేడాది మాత్రం సాధారణ వర్షపాతం కంటే దాదాపు 277.33 మి.మీటర్లు అదనంగా కురిసింది. తద్వారా భూగర్భజలాల పరిస్థితి మెరుగ్గా ఉంది. వేసవిలో తాగునీటికి అంతగా ఇబ్బంది ఏర్పడలేదు. కానీ ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఈసారి సాధారణ వర్షపాతం కంటే 16శాతం లోటు ఏర్పడింది. ఏప్రిల్, మే నెలలో నమోదు కావాల్సిన భూగర్భ జలాల నీటిమట్టం ఇప్పుడే కావడం ఆందోళనకరంగా మారింది. భూగర్భజలాల గణాంకాలను పరిశీలిస్తే ఈ సారి వేసవిలో తాగునీటికి కటకట తప్పేట్లు లేదు. అంతటా అదే పరిస్థితి... జిల్లాలో మొత్తం 64 మండలాలు ఉంటే 50 మండలాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణ వర్షపాతం కంటే అతితక్కువగా నమోదు కావడం వల్ల ప్రస్తుతం జిల్లాలో పది మండలాలలో 20మీటర్ల కంటే ఎక్కువ లోతుకు నీటి మట్టం పడిపోయింది. కల్వకుర్తి మండలంలోని మార్చలలో అత్యంత దారుణంగా 34.56 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. ఇక షాద్నగర్లో 30.10మీ, కల్వకుర్తిలో 26.59, వెల్దండలో 25.53, మిడ్జిల్లో 24.95, తలకొండపల్లిలో 24.22 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ప్రభుత్వానికి నివేదిక ఈ ఏడాది వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు భారీ అంచనాలు వేశారు. భూగర్భ జలశాఖ ఇచ్చిన నివేదికతో పాటు జిల్లాలో ప్రత్యేక సర్వే చేశారు. గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు గ్రామాల్లో నీటి సరఫరాపై డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా పరిస్థితిని వివరిస్తూ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ ఏడాది ట్యాంకర్ల ద్వారా మొత్తం 195 గ్రామాల్లో తాగునీటి అందించాల్సి ఉంటుందని.. అందుకోసం రూ.5.74 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. లీజు బోర్ల ద్వారా 168 గ్రామాల్లో తాగునీటి అందించాలని, అందుకోసం రూ.47.13 లక్షలు ఖర్చు అవుతాయని పేర్కొంది. ప్రస్తుతం పనిచేస్తున్న వాటిలో దాదాపు 355 బోర్లను ప్రెషింగ్ చేయాలని.. అందుకోసం 49.49 లక్షల రూపాయలు అవసరమవుతాయని రూరల్ వాటర్ స్కీం అధికారులు సూచించారు. -
నదులు కబ్జా
ఆక్రమణలకు గురైన తుంగభద్ర, హంద్రీ నదులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు రెవెన్యూ, నీటి పారుదల శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులదే రాజ్యం మరుగున పడిన రూ. 244.7 కోట్ల రక్షణ గోడల నిర్మాణ ప్రతిపాదనలు కర్నూలు : కర్నూలులోని ప్రధాన నదులు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి. అక్రమార్కులు తుంగభద్ర, హంద్రీ నదుల్లోకి చొరబడి.. ఆక్రమ నిర్మాణాలు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తుంగభద్ర, హంద్రీ నదుల్లో పెద్దపెద్ద భవంతులు వెలిశాయి. కర్నూలు నగరం నడిబొడ్డున హంద్రీ నది ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే చాలు ఈ నది ఉప్పొంగి ప్రవహించి లోతట్టు కాలనీలను ముంచేస్తుంది. ఇందుకు కారణం ఈ నది భారీగా ఆక్రమణలకు గురికావడమేనని స్పష్టంగా అర్థమవుతోంది. విశాలంగా ఉన్న నది ఆక్రమణల వల్ల కుచించుకుపోయింది. దీంతో ప్రవాహం పెరిగి లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరుతుంది. ఎగువన లక్ష్మీపురం నుంచి దిగువన కల్లూరు మీదుగా హంద్రీ నది కర్నూలులోని జొహరాపురం వరకు ప్రవహించి ఆ తరువాత తుంగభద్రలో కలుస్తుంది. కల్లూరులోని ఇండస్ట్రీయల్ ఎస్టేట్ నుంచి జొహరాపురం వరకు అక్రమార్కులు భారీగా నదిని ఆక్రమించేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో నది భూముల్లో భారీ భవంతులు, ఫంక్షన్హాళ్లు నిర్మించుకున్నారు. తుంగదీ అదే దుస్థితి... మరో పక్క తుంగభద్ర నది పరిస్థితి ఇలాగే ఉంది. కర్నూలు శివారులో రోజా దర్గా ప్రాంతం నుంచి నగరంలోకి ప్రవేశించే తుంగభద్రకు పాతబస్తీ మీదుగా జొహరాపురం వరకు వివిధ ప్రాంతాల్లో నది కబ్జాకు గురైంది. ఈ పరిస్థితుల ప్రభావంతోనే 2007, 2009 ప్రాంతాల్లో వరద కర్నూలుని ముంచేసింది. ఫలితంగా భారీగా ఆస్తి, ఆర్థిక నష్టాలు వాటిల్లాయి. హంద్రీ పొడవున 7.71 కిలోమీటర్లు, తుంగభద్ర పొడవున 4 కిలోమీటర్లు వరద రక్షణ గోడలు నిర్మించాలని 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఇందుకులో రూ. 244.7 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమైనా డిజైన్ మార్పు, అంచనా వ్యయాలు పెరగడంతో ఆ పనులు పెండింగ్లో పడిపోయాయి. దీంతో రక్షణ గోడలు నిర్మాణాలకు నోచుకోలేదు. ఇదిలాగుంటే నదుల్లో ఆక్రమ నిర్మాణాలు, కబ్జాలపై కొరడా ఝళిపించాల్సిన నీటిపారుదల, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపం కరువైంది. కబ్జాదారులకి నోటీసులిచ్చి, రెవెన్యూ అధికారులకి నదీ భూములకు సంబంధించిన మార్కింగ్లు గుర్తించమని చెప్పిన నీటిపారుదల శాఖ ఇంతటితో తమ పనైపోయిందని చేతులు దులుపుకుంది. ఇటు రక్షణ గోడల నిర్మాణానికి నోచుకోక అటు అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కదలిక లేని ప్యాకేజీ-1,2,3,4,5 పనులు.. వరదల నుంచి కర్నూలు నగరానికి రక్షణ కల్పించడానికి తుంగభద్ర, హంద్రీ నదులకు కరకట్టలు, రక్షణ గోడలు నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండేళ్ల కింద రూ.244.7 కోట్ల నిధులు కేటాయించారు. 2008 డిసెంబర్ 11న ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సకాలంలో సాంకేతికపర అనుమతులు రాకపోవడం, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో ఫ్లడ్వాల్స్ ప్రాజెక్టు నిర్మాణం నేటికీ ఒక కొలిక్కిరాలేదు. అప్పట్లో తుంగభద్ర, హంద్రీ నదీ తీరంలో రక్షణ గోడలు, కరకట్టల నిర్మాణం పనులను త్వరగా పూర్తి అయ్యే విధంగా ఐదు ప్యాకేజీలుగా విభజించి వేర్వేరు కాంట్రాక్టర్లకు కేటారుుంచాలని అధికారులు నిర్ణయుం తీసుకున్నారు. వీటిలో 1,2 ప్యాకేజీలను 2008లోనే ఈపీసీ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఒప్పందం కుదిరిన వెనువెంటనే పనులు ప్రారంభించాల్సిన కాంట్రాక్టర్లు తాత్సారం చేయడం.. మిగిలిన ప్యాకేజీ-3,4,5లకు సంబంధించిన పనులు సాంకేతిక పరమైన అనుమతులు రాకపోవడంతో దాదాపు ఆరేళ్లు గడిచినా ఆ పనులేవీ ప్రారంభానికి నోచుకోలేకపోయాయి. అనంతరం వాటి అంచనా వ్యయం రూ. 954 కోట్లకు పెరిగింది. పెరిగిన అంచనా వ్యయంతో 2013-14 ఆర్థిక సంవత్సానికి బడ్జెట్ ప్రతిపాదనలను నీటిపారుదల శాఖాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఆ ప్రతిపాదనలు అప్పటి కిరణ్కుమార్రెడ్డి సర్కారు తిరస్కరిస్తూ 2008లో ఆమోదించిన బడ్జెట్లోనే పనులు చేపట్టాలని, అందుకు కొత్తగా మళ్లీ ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. దీంతో ఆ ఏడాది కూడా ఈ పనులకు కేటాయింపులు జరగలేదు. తాజాగా నీటిపారుదల శాఖాధికారులు 7 పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపారు. అందులో హంద్రీ నదిపై రెండుచోట్ల, తుంగభద్ర నదిపై ఒక ప్రాంతంలో రక్షణ గోడల నిర్మాణాలు, జొహరాపురం, ఆనంద్ థియేటర్ వద్దబ్రిడ్జిల నిర్మాణం, సుద్ద వాగు 0 కి.మీ నుంచి 1.75 కి.మీ వరకు కాంక్రీట్ గోడల నిర్మాణం, కల్లూరులోని జాతీయ రహదారి వద్ద నుంచి తుంగభద్ర, హంద్రీ నదులు కలిసే పాయింట్ వరకు నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా నదిని 5.5 కి.మీ మేర సమానంగా చదును చేయనున్నారు. -
రివర్సే.. సిటీ పవర్సు!
హైదరాబాదీలు చాలా పనులు రివర్సులో చేస్తారు. ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా చేస్తారు. భలే వైవిధ్యంగా చేస్తారు. కానీ చాలా గొప్పగా చేస్తారు. సాధారణంగా మనం రోటీలు చేయాలనుకుంటే ఏం చేస్తాం. కలిపిన పిండిని రొట్టెల పీట మీద పెట్టి అప్పడాల కర్రతో చుట్టూ విస్తరిస్తూ పోయేలా రౌండ్గా చేస్తాం. కానీ హైదరాబాదీ రుమాలీ రోటీని విస్తరించడం ఎప్పుడైనా చూశారా? అలాగే నిలబడిపోయి మామూలు రోటీలు చేసేవాడి ఆ కళానైపుణ్యాన్ని అదేపనిగా చూడ బుద్ధేస్తుంది. కాస్తంత వెడల్పు చేసిన రోటీని మాటిమాటికీ గాలిలోకి చక్రంలా ఎగరేసి గిర్రున తిప్పుతూ అలా వెడల్పయ్యేలా చేస్తుంటాడు. పేరుకు రుమాలీ గానీ.. దాదాపు టవల్కూ, శాలువాకూ సెంటర్ సైజులో ఉండేలా విస్తరిస్తూ తిప్పి.. అంత పెద్ద రోటీని అప్పుడు పెనం మీద వేస్తాడు. మళ్లీ ఇక్కడ పెనం విషయంలోనూ రివర్సే. సాధారణంగా రోటీలు చేసే పెనం మధ్యలో కాస్త గుంటలా ఉండి, అంచులు ఉబ్బెత్తుగా ఉంటాయి. కానీ రుమాలీ రోటీని కాల్చే పెనం పూర్తిగా రివర్సు. మూకుడును బోర్లా తిరగేసి, దాని కింద మంట పెట్టి రుమాలీ రోటీని కాలుస్తారు. అలా కాల్చాక రుమాలీ అని పేరు పెట్టినందుకో ఏమోగానీ... రుమాల్లాగా మడతలు వేస్తారు. జేబులో మాత్రం పెట్టరు. చుట్టలుగా చుట్టి నోట్లోకి పెట్టి రుచిని ఆస్వాదిస్తారు. ఇలాంటి రివర్స్ కేసే మరోటి! సాధారణంగా రోటీని కాల్చాలంటే మనమంతా పెనాన్ని పొయ్యి మీద పెడతాం కదా! కానీ ఇక్కడా మరో తరహా రివర్సు కేసే! తందూరీ రోటీ అని పిలిచే ఈ రొట్టెను చేసే పాత్ర పొయ్యిలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. పైన ఉండే రంధ్రం ద్వారా రోటీని పాత్ర అంచుకు అతుక్కుపోయేలా చేసి, రోటీనీ కాల్చి ముల్లుకర్రలాంటి దానితో బయటకు తీస్తారు. ఈ తందూరీని మన హైదరాబాదీలంతా ఎంతో ఇష్టంతో తింటుంటారు. రివర్సులు బాగా ఇష్టం కాబట్టి వేరే నగరాల్లో ఉన్న మరో సౌకర్యాన్ని మనమూ పొందాలని ఓ ప్రాజెక్టు చేపట్టాం. సాధారణంగా ఇంటి ముందు కాళ్లు తుడుచుకోడానికి వేసే పట్టానైనా లేదా కాళ్లకు పెట్టుకునే పట్టా(గొలుసు)లైనా కిందే ఉంచుతాం. అంటే నేల మీదే ఉంచుతాం. కానీ మనకిష్టమైనదాన్ని నెత్తిన పెట్టుకునే స్కీము కింద ఈ పట్టాలను రివర్సులో గాల్లో పెట్టుకుంటున్నాం. అదే మెట్రో రైలు ‘పట్టా’లు! రోజూ తలెత్తి గాల్లోని ఆ పట్టాలను చూస్తున్నప్పుడల్లా... రుమాలీ, తందూరీ రోటీల రుచిని ఆస్వాదించినట్లే... ఆ మెట్రో రైడ్ను ఎప్పుడెప్పుడు ఆస్వాదిద్దామా అనే ఓ కుతూహలం. ఎప్పుడెప్పుడు నేలపై కాకుండా రివర్సులో టవర్సు మీద గాల్లో పోయే ఆ ట్రైన్లో ఎంత త్వరగా ఎక్కుదామా అనే ఆత్రుత. ఇది నా ఒక్కడిదే కాదు... రోజూ తలెత్తి గర్వంగా చూసుకునే మన నగర ‘పట్టా’దారులందరికీ ఇష్టమైన సమష్టి కోరిక! -
నదుల కలయిక కలే
విభజిస్తే గోదావరి నీరు కృష్ణా బేసిన్కు తరలింపు కష్టమే! ఇక దుమ్ముగూడెం ప్రాజెక్టును కూడా వురచిపోవాల్సిందే ఇప్పటికే పక్కన పెట్టారు.. విభజిస్తే పూర్తిగా రద్దయ్యే ప్రమాదం పోలవరానికి ఇప్పటికే కష్టాలు.. వుుంపు ప్రాంతం తెలంగాణలో... పోలవరం నుంచి కృష్ణాకు 80 టీఎంసీల తరలింపూ సులువు కాదు ఇన్నాళ్లూ ఒక స్వప్నంలాగే ఉండిపోరుున నదుల అనుసంధానం ఇక దక్షిణ భారతాన అసలు సాధ్యమే కాని పరిస్థితులు ఏర్పడతాయూ!? గోదావరి నుంచి కృష్ణా తదితర దిగువ బేసిన్ల అవసరాలకు జలాల తరలింపు ఇక ప్రణాళికలకే పరిమితం కానుందా!? దువుు్మగూడెం వురచిపోవల్సిందేనా!? పోలవరం ఓ సుదీర్ఘ స్వప్నం కానుందా!? ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, వుహారాష్ట్రలతో ఇప్పటికే జలవివాదాలు తీరని నష్టాలు తీసుకొస్తున్న నేపథ్యంలో... రాష్ట్ర విభజన తరువాత వురిన్ని తగాదాలు, నీటికష్టాలూ తప్పవనేది తాజాగా ఇంజనీర్ల మనోగతం!! సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నదులను అనుసంధానించడం వల్ల సవుుద్రంలో వృథాగా కలిసే ప్రవూదాన్ని తగ్గిస్తూనే, వరదలు- కరువు కష్టాలకు తెరవేయూలనేది ఎంతోకాలంగా ఉన్న ఆలోచన. నీరు పుష్కలంగా ఉన్న గోదావరి నుంచి నీటికొరత పీడిస్తున్న కృష్ణాకు అనుసంధానించడం కూడా అందులో ఒకటి. రాష్ట్రంలో దువుు్మగూడెం, పోలవరం ఆ దిశలో ఉపయుుక్త ప్రాజెక్టులు. ఏ కోణం నుంచి చూసినా రాష్ట్రాన్ని విభజిస్తే ఆ రెండూ కలలుగానే మిగిలిపోతాయునేది ప్రస్తుతం అందరినీ కలవరపరుస్తున్న అంశం! దువుు్మగూడెం- నాగార్జునసాగర్ టెరుుల్పాండ్ ప్రాజెక్టు నిర్మాణానికి 2007-08లోనే టెండర్లు ఖరారు అయ్యూరుు. రూ.20 వేల కోట్ల అంచనా వ్యయుంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా వరదలు వచ్చిన 80 రోజుల్లో దువుు్మగూడెం నుంచి 165 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్కు తరలించి నాగార్జునసాగర్ టెరుుల్ పాండ్లోకి తీసుకురావాల్సి ఉంది. ఈ నీటిని కృష్ణా ఆయుకట్టుకు వాడుకోవాలని భావించారు. తద్వారా కృష్ణా ఎగువన మిగిలే నీటితో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎవ్మూర్పీలతో పాటు రాయులసీవు, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాలకు ప్రయోజనం కలిగే గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ లాంటి ప్రాజెక్టుల అవసరాలు తీరే వీలు ఏర్పడేది. కృష్ణా బేసిన్లో సరైన వర్షాలు కురియుక నీటి కొరత ఏర్పడితే సాగర్ ఆయుకట్టుతో పాటు, డెల్టా రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పటికే రూ. 547 కోట్లను ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు పనులు 2014-15కి పూర్తి కావాలి. టెండర్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికలు రావడం, తర్వాత వైఎస్ వుృతి చెందడంతో దీనికి కష్టాలు మొదలయ్యూరుు. రోశయ్యు సీఎంగా ఉన్నప్పుడు కొందరు తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయూలని డివూండ్ చేశారు. దాంతో అప్పటి నుంచి పనుల్ని చేయుడం లేదు. విభజన అనంతరం దీన్ని పూర్తిగా రద్దు చేయుడంగానీ లేదంటే కేవలం తెలంగాణకు ఉపయుుక్తవుయ్యేలా డిజైన్లు వూర్చి చేపట్టే అవకాశాలే ఉంటారుు. ప్రస్తుత అంచనాలను బట్టి దీనికి రూ.30 వేల కోట్లు కావాలి. అంత ఖర్చు భరించి తెలంగాణ ప్రభుత్వం కోస్తాకు నీటిని ఇవ్వడవునేది ఊహకందని విషయుం. ఒకవేళ చేపట్టినా తెలంగాణ ప్రాంత అవసరాలకు వూర్చుకుంటావుని తెలంగాణవాదులు బహిరంగంగానే చెబుతున్నారు. 50 ఏళ్లలో కేంద్రం నిర్మించిన ప్రాజెక్టే లేదు: పోలవరం ప్రాజెక్టును కేంద్ర పరిధిలోనే చేపడుతామని టీ బిల్లులో పేర్కొన్నారు. అయితే సాగునీరు అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. పైగా గత 50 సంవత్సరాలుగా దేశంలో ఒక్క ప్రాజెక్టును కూడా కేంద్రం నిర్మించలేదని నిపుణులు చెబుతున్నారు. 1952లో ఒరిస్సాలోని మహానదిపై హీరాకుడ్ డ్యాం నిర్మాణం తప్ప, ఆ తర్వాత కేంద్ర జల సంఘం ఎలాంటి ప్రాజెక్టును చేపట్టలేదు. పైగా ఈ ప్రాజెక్టు వుుంపు బాధితులు ఆదివాసులు, తెలంగాణ ప్రాంతం వారు. దాంతో వారు కోల్పోయే భూములకు సమాన భూములను ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో కేటాయించాల్సి ఉంది. అయితే... పోలవరం ఆయకట్టు ప్రాంతంలోని 80 వేల నుంచి లక్ష ఎకరాల ఆయకట్టును.. తెలంగాణ ప్రాంత ముంపు బాధితులకు పంచడానికి ఎన్ని ఇబ్బందులో ఊహించుకోవాల్సిందే. అందుకే పోలవరం డిజైన్లు వూర్చాలనే డివూండ్ను తెలంగాణవాదులు వదులుకునే అవకాశాలూ లేవు. ఒకవేళ నిర్మించినా పోలవరం కుడికాలువ నుంచి అవసరమైతే కృష్ణా డెల్టా అవసరాలకు 80 టీఎంసీలను త రలించవచ్చు గానీ అంతకు మించి ఇతర బేసిన్లకు తరలించడం సాధ్యం కాదు! పాలమూరుకు ఇక్కట్లు: ఈ ప్రాజెక్టుల నుంచి కృష్ణాకు నీటి తరలింపు నిలిచిపోతే... పాలవుూరుపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. కల్వకుర్తి (25 టీఎంసీలు), నెట్టెంపాడు (22 టీఎంసీలు) ప్రాజెక్టులు వరద జలాలపై ఆధారపడ్డారుు. కృష్ణాలో భారీగా వరదలు వచ్చిన సవుయుంలోనే ఈ ప్రాజెక్టులకు నీరు అందనుంది. ఎప్పుడో కానీ ఇలాంటి పరిస్థితి రాదు. అరుుతే దువుు్మగూడెం, పోలవరం నీరు కృష్ణా బేసిన్కు వస్తే ఈ ప్రాజెక్టులకు నీటి వాడకానికి వెసులుబాటు కలగనుంది. ఇదే జిల్లాలో రాజీవ్ బీవూ (20 టీఎంసీలు) ప్రాజెక్టుకు కూడా కష్టాలే. కృష్ణా డెల్టా ఆధునీకరణ ద్వారా ఆదా అయ్యే నీటిని ఈ ప్రాజెక్టుకు కేటారుుంచారు. అరుుతే ప్రస్తుతం ఆధునీకరణ పనులు పూర్తి కాలేదు. దాంతో నీటి ఆదా లేదు. వురో పక్క బీవూ ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంది. దీని నీటిని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తే కృష్ణా డెల్టాకు నీటి కొరత ఏర్పడనుంది. దాంతో రెండు ప్రాంతాల వుధ్య నీటి వివాదానికి తెరలేవనుంది. రెండు ప్రభుత్వాల ఏకాభిప్రాయంతోనే సాధ్యం రాష్ట్రం విడిపోతే.. రెండు ప్రభుత్వాలు పరస్పరం ఏకాభిప్రాయానికి వస్తేనే నదుల అనుసంధానం సాధ్యం. పోలవరంపై ఇప్పటికే ముంపు సమస్య ఉంది. విభజనతో అభ్యంతరాల జాబితాలో మరో రాష్ర్టం చేరనుంది. అలాగే దుమ్ముగూడెం-సాగర్ టెయిల్ పాండ్ సాధ్యం కావాలంటే... తెలంగాణ రాష్ర్టమే చేపట్టాల్సి ఉంటుంది. - టి. హన్మంతరావు, సాగునీటి రంగ నిపుణుడు -
రాష్ట్రంలో నీటి ప్రాజెక్ఖుల పరిస్ధితి ఏంటీ?
-
నష్టం @ రూ. 551 కోట్లు
పాలమూరు, న్యూస్లైన్: గత నాలుగు రోజులుగా కురిసిన వర్షం జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇళ్లు కూలిపోయి ఎందరో నిరాశ్రయులయ్యారు. వాగులు, వంకలు పారి మరెన్నో మారుమూల గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యం స్తంభించిపోయింది. పశువులు, కోళ్లు పిట్టల్లారాలాయి. జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో వాగులో ఇద్దరు గల్లంతయ్యాయి. జిల్లాలో వర్షం తాకిడికి రూ.551కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు జిల్లా అధికారయంత్రాంగం శనివారం అంచనావేసింది. కాగా, ఇళ్లు కూలి పోవడం, రోడ్లు దెబ్బతినడం, చెరువులు కుంటలు తెగిపోవడం, పశువులు చనిపోవడం తదితర వాటితో జిల్లాలో రూ.800 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 54 మండలాల పరిధిలో దాదాపు 853 గ్రామాలకు చెందిన 15లక్షల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి డివిజన్ల పరిధిలో సుమారు 2.80 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగి నష్టంవాటిల్లింది. పత్తి, మొక్కజొ న్న, మిర్చి, వరి, జొన్న, ఆముద, ఇతర పం టలు నీటమునిగాయి. శనివారం నాగర్కర్నూల్లో బల్మూరు మండలం పోశెట్టిపల్లికి చెందిన పార్వతమ్మ తెలకపల్లి మండలం లింగాల వెళ్లేదారిలోని గౌరెడ్డిపల్లి వాగులో నీటిలో కొట్టుకుపోయి గల్లంతైంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ని గాండ్లోనికుంట తెగిపోవడంతో మహబూబ్నగర్ పట్టణంలోని బాయమ్మతోట, న్యూటౌన్, ప్రేమ్నగర్ తదితర ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. న్యూటౌన్ ప్రాంతంలోని హరహర ఫంక్షన్హాల్ సమీపంలో ప్రధాన రోడ్డుపై కుంటనీరు వరద లా పారింది. నాలుగు గంటల పాటు వాహనా ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంత కష్టం..ఎంత కష్టం జిల్లావ్యాప్తంగా గడచిన నాలుగురోజుల్లో కురిసిన భారీవర్షాల కారణంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వన పర్తి, గద్వాల డివిజన్ల పరిధిలో కలిగిన పంటనష్టం, దెబ్బతిన్న ఇళ్లు, ఇతర సంఘటనల కారణంగా జిల్లావ్యాప్తంగా రూ.551.13 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ అధికారులు అంచనావేశారు. శనివారం నాటికి వివిధ రకాల పంటలు 35వేల ఎకరాల్లో దెబ్బతినగా రూ.58.70 కోట్లు నష్టం కలిగినట్లు తెలుస్తోంది. 3054 ఇళ్లు దెబ్బతినగా అందులో 248 ఇళ్లు నేలమట్టమైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రూ.8.54 కోట్ల నష్టం వాటిల్లింది. పశువులు, జీవాలు 118, కోళ్లఫారాల్లో 50వేల కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. 398 చెరువు కట్టలు తెగిపోయి 22.21కోట్ల నష్టం కలుగగా, ఆర్అండ్బీ బ్రిడ్జిలు 21, 50 కి.మీ రోడ్డు దెబ్బతినడంతో రూ.51.62 కోట్ల నష్టం జరిగింది. పంచాయతీ రోడ్లు 75 కిమీ పాడై రూ.31 లక్షలు నష్టంవాటిల్లినట్లు అంచనా. జిల్లాలో 21 గ్రామీణ నీటి సరఫరా పథకాలు దెబ్బతిని రూ.33 ల క్షల నష్టం కలిగినట్లు అధికారులు అంచనావేశారు. జిల్లా వ్యాప్తంగా 12.4 మి.మీ వర్షం శనివారం జిల్లా వ్యాప్తంగా 12.4 మి.మీ వర్షం పాతం నమోదైందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. 48.2 మిల్లీ మీటర్లతో కొత్తూరు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. కేశంపేట 46.2 మి.మీ, మాడ్గులలో 43.0, ఆమనగల్లు 38.6, హన్వాడ 38.0, షాద్నగర్, వెల్దండ 32.6, బాలానగర్ 30.2, బల్మూరు 28.6, తలకొండపల్లి 28.0, పెద్దకొత్తపల్లి 24.0, మహబూబ్నగర్ 21.2, ఉప్పునుంతల 20.0 మి.మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దౌల్తాబాద్, దామరగిద్ద, కోడేరు, వడ్డేపల్లి, అలంపూరు, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో ఏమాత్రం వర్షం పడలేదు. మిగిలిన 44 మండలాల్లో 20 మి.మీ లోపు వర్షపాతం నమోదైంది. -
గోదారమ్మను కృష్ణమ్మతో కలపాల్సిన అవసరం ఉంది.
-
గుండె ‘చెరువు’
కర్నూలు రూరల్, న్యూస్లైన్: కర్ణాటక ప్రాంతం నుంచి వరద నీరు జిల్లా మీదుగా ప్రవహిస్తున్నా చెరువుల్లో చుక్క నీరు చేరని పరిస్థితి. నేతల మౌనంతో వీటి కింద 80,190 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమవుతోంది. రెండు మూడేళ్లుగా వరుస కరువుతో చెరువులు ఒట్టిపోయాయి. ఈ ఏడాది వర్షాకాలంలో రెండు నెలలు గడిచినా 10 శాతం చెరువుల్లోనూ నీరు చేరకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో 479 పంచాయతీరాజ్, 163 చిన్న నీటిపారుదల చెరువులతో పాటు సుమారు 1000 పైగా చిన్న చెరువులు, ఊట కుంటలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వర్షాలు ఆశాజనకంగా లేకపోవడం.. చెరువుల్లో ఆశించిన నీరు చేరకపోవడం గమనార్హం. ఆదోని, తుగ్గలి, హలహర్వి, మద్దికెర, వెలుగోడు ప్రాంతాలను మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లో వర్షపాతం అంతంతమాత్రమే నమోదైంది. కర్ణాటక, మహరాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా తుంగభద్ర, కృష్ణా నదులకు భారీగా వరద నీరు రావడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. అయితే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంలో నీటి పారుదల శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వృథాగా దిగువకు వదిలే బదులు కాల్వలకు అనుబంధంగా ఉన్న చెరువుల్లో నింపుకునే అవకాశాలున్నా.. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం రైతన్నకు శాపమవుతోంది. ఈ కారణంగా సీజన్లో చెరువుల కింద ఆయకట్టు సాగు ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల డివిజన్లోని మహానంది మండలంలో ఆరు చెరువుల పరిధిలో 1892.41 ఎకరాల ఆయకట్టు ఉండగా వర్షాలు లేకపోవడంతో బీడావారుతున్నాయి. పాణ్యం, బనగానపల్లె, అవుకు మండలాల్లో 21 చెరువుల కింద 7914.31 ఎకరాల ఆయకట్టు సాగవుతుండగా.. ఇప్పటి వరకు ఏ ఒక్క చెరువులో చుక్క నీరు చేరకపోవడంతో రైతులు బెంగపెట్టుకున్నారు. కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లోని చెరువుల కింద నేటికీ విత్తనం పడకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కర్నూలు డివిజన్ విషయానికొస్తే పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని 16 చెరువుల్లో మాత్రమే నీటి నిల్వలు ఉండగా.. మిగతా మండలాల్లోని చెరువుల్లో నీరు లేక సాగు ప్రశ్నార్థకమైంది. ఈ విషయాన్ని ‘న్యూస్లైన్’ ఎస్ఈ ఎ.సుధాకర్ దృష్టికి తీసుకెళ్లగా జిల్లాలోని చిన్న నీటి పారుదల శాఖ పరిధిలోని చెరువులను కాల్వల ద్వారా నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదన్నారు. ఉత్తర్వులు అందిన వెంటనే చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.