23న ఐదోతరగతిలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
Published Fri, Aug 19 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
మహబూబ్నగర్ విద్యావిభాగం : ఐదోతరగతిలో ఖాళీల భర్తీకి ఈనెల 23వ తేదీ ఉదయం 11గంటలకు జడ్చర్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వíß ంచనున్నట్టు జిల్లా సమన్వయకర్త కష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ బాలుర 14, బాలికలు 38, ఎస్టీ బాలికలు ఐదు, బీసీ బాలుర, బాలికలు, ఓసీ బాలుర రెండు చొప్పున, బాలికలు మూడు, మైనారిటీ బాలుర, బాలికలు నాలుగు చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే 21కొత్త గురుకుల పాఠశాలల్లో 6, 7తరగతులలో ప్రవేశాలకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సీజీజీ ద్వారా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తామన్నారు. ప్రవేశం పొందిన వారికి మెసేజ్ పంపడంతోపాటు కేటాయించిన పాఠశాల వివరాలు ్tswreis.telangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకుని, నేరుగా పాఠశాలకు వెళ్లి చేరాలని ఆయన సూచించారు.
Advertisement
Advertisement