చిత్తూరు : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపల్లె వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న టెంపో, చెన్నై నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటెయినర్ లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లు, క్లీనర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.