పుట్టపర్తి అర్బన్: గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్న జన్మభూమి కమిటీ సభ్యులపై తమ ప్రభుత్వం రాగానే క్రిమినల్ కేసులు బనాయించనున్నట్లు పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని కంబాలపర్తి, చెర్లోపల్లి, వెంగళమ్మచెరువు గ్రామాల్లో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరిగిన ఆయన పలువురు వృద్ధులు, యువకులు, వికలాంగులు చేసిన ఫిర్యాదులను చూసి చలించిపోయారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఉన్నఫలంగా పింఛన్లు, రేషన్ కార్డులు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇళ్లు మంజూరులో సైతం సొంత పార్టీ వారికే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు చేతులు లేని వారికి సైతం పింఛన్ ఇవ్వలేదన్నారు. రుణ మాఫీ ఒక మాయ అని ఇలాంటి కల్లబొల్లి మాటలతో ప్రభుత్వం పబ్బం గడుపుతోందన్నారు. తమ ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు పరిష్కరించనున్నట్లు దుద్దుకుంట భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం బడుగు, బలహీన వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని చాకలి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. కార్యక్రమంలో భాగంగా శనివారం సుమారు 1,350 ఇళ్లు తిరిగారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు డీఎస్ కేశవరెడ్డి, లోచర్ల విజయభాస్కరరెడ్డి, గంపల రమణారెడ్డి, సర్పంచ్ ఆదినారాయణ, ఎంపీటీసీ సుశీల,కంబాలపర్తి రమణ, నాయుడు, శేఖర, చెర్లోపల్లిలో బయపరెడ్డి, శివారెడ్డి, నాగరాజు, ఓబిరెడ్డి, తిప్పారెడ్డి, వేమారెడ్డి, చిన్నకుళ్లాయప్ప, లోకనాథరెడ్డి, వెంగళమ్మచెరువులో ప్రతాప్రెడ్డి, సహకార సంఘం అద్యక్షుడు నరసారెడ్డి, ఈశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, మహేష్, రమణ,నమస్తే రామాంజనేయులు, దారా శంకర్, ఆంజనేయులు పాల్గొన్నారు.
గడప గడపలో సమస్యల వెల్లువ
Published Sun, Jul 24 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
Advertisement
Advertisement