పెన్సిల్ ములికిపై పార్వతీపుత్రుడు
పెద్దాపురం :
గణపతి నవరాత్రులను పురస్కరించుకుని స్వర్ణకారుడు తాళాబత్తుల సాయి పెన్సిల్ ములికిపై వినాయక ఆకృతిని చెక్కారు. ఇందుకు మెుత్తం 3 గంటల 30 నిమిషాల 30 సెకన్ల సమయంలో ఆరు రోజుల వ్యవధిలో ఈ ఆకృతిని చెక్కినట్టు సాయి తెలిపారు. నైపుణ్యంతో గణనాథుని ఆకృతిని మలచిన ఆయనను పట్టణంలోని పలువురు ప్రముఖులు,కళాభిమానులు అభినందించారు.