వినాయక శోభాయాత్రలో అపశ్రుతి | Ganesh | Sakshi

వినాయక శోభాయాత్రలో అపశ్రుతి

Sep 15 2016 12:00 AM | Updated on Sep 5 2018 2:26 PM

దోమకొండ మండల కేంద్రంలో వినాయక శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.

దోమకొండ :
దోమకొండ మండల కేంద్రంలో వినాయక శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దోమకొండలో మంగళవారం రాత్రి గణేశ్‌ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నటరాజ్‌ యూత్‌క్లబ్‌ గణేష్‌ మండపం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై నిలిపి ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాలకు కరెంట్‌ సరఫరా కోసం విద్యుత్‌ స్తంభం వద్ద వైర్లను వేస్తుండగా ఐరేని వివేక్‌l(16) ప్రమాదానికి గురయ్యాడు. వివేక్‌lమొదట ఒక వైరును విద్యుత్‌ స్తంభం వైర్లపై వేశాడు. కింద ఉన్న మరో వైరుపై కాలు వేయడంతో కరెంట్‌ షాక్‌ తగిలింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో కామరెడ్డిలోని రుద్ర ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వివేక్‌ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వివేక్‌ కామారెడ్డిలోని సాంధీపని కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి తండ్రి రాజ్‌వీర్‌ దినసరి కూలీ. తల్లి కమల బీడీలు చడుతుంది. వీరికి ముగ్గురు కుమారులు కాగా వివేక్‌ చిన్నవాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్‌ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాఛాయలు నెలకొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement