మరో రెండు నెలల్లో పెళ్లి.. కానీ ! | Young Man dies of electric shock in Bhadradri district | Sakshi
Sakshi News home page

మరో రెండు నెలల్లో పెళ్లి.. కానీ !

Nov 18 2017 4:27 PM | Updated on Sep 5 2018 2:26 PM

Young Man dies of electric shock in Bhadradri district - Sakshi

సాక్షి పాల్వంచ: వివాహం నిశ్చయమైంది.. మరో రెండు నెలల్లో పెళ్లి జరగాల్సి  ఉంది. కానీ ఇంతలో అనుకోని రీతిలో మృత్యువు అతడిని కబళించింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని పాల్వంచ మండలం తోగ్గూడెం వద్ద మిషన్‌ భగీరథ పనులు జరుగుతున్నాయి. అదే గ్రామానికి చెందిన జర్పుల మోహన్‌ సింగ్‌ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. 

వెల్డింగ్‌ పనులు చేస్తున్న సమయంలో శనివారం మధ్యాహ్నం తన చేతిలో ఉన్న ఇనుప రాడ్‌కు విద్యుత్‌ వైర్‌కు తగలడంతో షాక్‌ తగిలి మరణించాడు. కాగా, మరో రెండు నెలల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వాడు ఇలా విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలుల అలుముకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement