
బాలికతో భర్త కలిసుండటం చూసి..
తాళ్లపొలంలో గత నెల ఏడున అనుమానాస్పదంగా మరణించిన పప్పుల ఆదిలక్ష్మిది హత్యేనని ప్రత్యేక దర్యాప్తు అధికారి, కాకినాడ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.
భార్య నిద్రపోయాక రాధాకృష్ణ ఆ బాలికతో కలిసి ఉండగా, అదే సమయంలో మెలకువ వచ్చిన ఆదిలక్ష్మి వారిని గమనించింది. భర్తతో, బాలికతో ఆమె గొడవకు దిగింది. ఈ క్రమంలో భార్యాభర్తలు కలిసి బాలికను కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని భావించిన రాధాకృష్ణ తన భార్యతో కలిసి ఇంటిలోనే బాలికను హతమర్చారు. గ్రామానికి చెందిన రాధాకృష్ణ అనుచరుడు పంపన త్రిమూర్తులు సహకారంతో, ఆ బాలిక ఇంటిలో ఉరివేసుకున్నట్టు చిత్రీకరించారు. కేసు దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూడడంతో, నిందితులు వీఆర్వో వద్ద మంగళవారం లొంగిపోయారు. రామచంద్రపురం డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, సీఐ పి.కాశీవిశ్వనాథ్, ఎస్సైలు ఫజల్ రహ్మాన్, ఎల్.శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.