హైనా దాడిలో దూడ మృతి
ఫతేషాపూర్(రఘునాథపల్లి) : మండలంలోని ఫతే షాపూర్ శి వారు రామచంద్రగూడెంలోని మేకల ఉప్పలయ్యకు చెందిన పశువుల కొట్టంలో కట్టేసిన రెం డు దూడలపై హైనా(కొండ్రిగాడు) దాడి చేసింది. ఈ ఘటన లో ఒక దూడ మృతిచెందగా, మరోదానికి తీవ్ర గాయాలయ్యా యి. ఈ సంఘటన మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. నిడిగొండ పశువైద్యురాలు ఇంద్రావతి, గోపాలమిత్ర పండుగ యాకన్న తీవ్ర గాయాలపాలైన దూడకు చికిత్స చేశారు.