పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట | love couple seeks securitty | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

Published Mon, Dec 19 2016 12:26 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

love couple seeks securitty

గుత్తి: ప్రేమ వివాహం చేసుకున్న తమకు ఇరుకుటుంబాల నుంచి రక్షణ కల్పించాలని ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. గుత్తిలోని పైమాల వీధికి చెందిన పవ¯ŒS, తాడిపత్రి రోడ్డు కాలనీకి చెందిన సన మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోరని రెండు రోజుల క్రితం కసాపురం వెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

విషయం తెలిశాక పెద్దలు తమను విడదీసే అవకాశం ఉందని భావించిన ఇద్దరూ గుత్తికి వచ్చి పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదుచచేశారు. ఎస్‌ఐ రామాంజనేయులు ఇరువురి తల్లిదండ్రులనూ స్టేష¯ŒSకు పిలిపించారు. ఇద్దరూ మేజర్లని, ఇష్ట్రపకారమే పెళ్లి చేసుకున్నారని, వారిపై ఎటువంటి ఒత్తిడి తెచ్చినా, భయపెట్టినా నేరంగా పరిగణిస్తామని చెప్పి పంపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement