పెళ్లయిన 20 రోజులకే మెడికో ఆత్మహత్య | medico suicide in karimnagar | Sakshi
Sakshi News home page

పెళ్లయిన 20 రోజులకే మెడికో ఆత్మహత్య

Published Wed, Mar 16 2016 10:51 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

పెళ్లయిన 20 రోజులకే మెడికో ఆత్మహత్య - Sakshi

పెళ్లయిన 20 రోజులకే మెడికో ఆత్మహత్య

కరీంనగర్: కరీంనగర్ మండలం నంగునూరు ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సౌమ్య ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్లో ఉంటున్న సౌమ్య మంగళవారం రాత్రి గదిలో ఉరేసుకుంది.

సౌమ్య సొంతూరు ఖమ్మం జిల్లా మన్రీలియగూడేం. ఆమెకు వివాహం కుదరడంతో నెల రోజుల క్రితం సొంతూరుకు వెళ్లింది. గత 27న నల్గొండ జిల్లాకు చెందిన పవన్ కుమార్‌ రెడ్డితో ఆమెకు పెళ్లయింది. పెళ్లయిన తర్వాత మంగళవారం భర్తతో కలిసి ఆమె కాలేజీకి వచ్చింది. హాస్టల్లో వదిలిపెట్టి భర్త వెళ్లిపోయాక ఆమె రాత్రి ఆత్మహత్య చేసుకుంది. కాగా సౌమ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పెళ్లి కారణంగానే ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. కరీంనగర్ రూరల్ సీఐ కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు భర్త కోసం ఆరా తీస్తున్నారు. పవన్ కుమార్ రెడ్డి కూడా వైద్యుడే. భర్త మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజిలో వేరే ఏమైనా గొడవలు జరిగాయా అని కూడా ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement