మావుళ్లమ్మవారి నిత్యాన్నదానానికి విరాళం
భీమవరం: భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారి నిత్యాన్నదాన పథకానికి భీమవరం మండలం చినఅమిరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల వేణుగోపాలరాజు, సుభద్రస్వాతి దంపతులు సోమవారం రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ధర్మకర్తల మండల సభ్యులు అడ్డగర్ల ప్రభాకరగాంధీ, కట్టా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.