పెరుగు రామకృష్ణకు సత్కారం
నెల్లూరు(బారకాసు): స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన స్వాతంత్ర సప్తతి కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన కవి పెరుగు రామకృష్ణ సత్కారం పొందారు. స్వాతంత్య్ర సమరయోధులకు కన్నీటి అభిషేకం చేస్తూ ఆయన రెండు కవితలు చదివి అందరి మన్ననలు పొందారు. కవితల పఠనంతో పాటు గజల్స్, గానంతో అందరినీ అలరించారు. అనంతరం ఆయనను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఘనంగా సత్కరించారు.