తపాలశాఖ అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో స్టాంపు డిజైను పోటీలను నిర్వహిస్తున్నట్టు తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.హరికృష్ణప్రసాద్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు.
తపాలాశాఖ స్టాంపు డిజైన్ పోటీలు
Published Tue, Jul 19 2016 6:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
తెనాలి : తపాలశాఖ అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో స్టాంపు డిజైను పోటీలను నిర్వహిస్తున్నట్టు తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.హరికృష్ణప్రసాద్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘స్వచ్ఛభారత్’ అనే అంశంపై నిర్వహించే ఈ పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు తమ ఎంట్రీలను ‘అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఫిలా టెలి), రూమ్ నం.108 (బి), ఢాక్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ –110001 చిరునామాకు, స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ నెల 22వ తేదీకి చేరేలా పంపాలని కోరారు.
Advertisement
Advertisement