అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు 3 నుంచి 8 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 34 డిగ్రీలు, కనిష్టం 24 నుంచి 25 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 70 నుంచి 80, మధ్యాహ్నం 54 నుంచి 65 శాతం మధ్య ఉండొచ్చన్నారు. గంటకు 16 నుంచి 20 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు
Published Fri, Jun 30 2017 11:58 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement