మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
పొనుగోడు (గరిడేపల్లి) :మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని మంగళవారం పొనుగోడులో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ నందిపాటి సైదులు, జ్యోతిల పెద్ద కుమారుడు నందిపాటి సునీల్ (17)మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లోని బాత్ రూంలో ఒంటిపై పెట్రోల్పోసుకుని నిప్పటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ శనివారం సినిమాకు వెళ్లడంతో తండ్రి మండలించగా మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తండ్రి సైదులు తెలిపారు. తన కుమారుడు సునీల్ కోదాడ అనురాగ్ కళాశాలలో డిప్లోమా మెకానికల్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్నాడని చాలా తెలివిగా ఉంటాడని తాను మంచిగా చదువుకోమని మందలించడంతో తెల్లవారుజామున ఎవరూ లేవని సమయంలో 4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. తన చిన్న కుమారుడు రోహిత్ ఎస్ఆర్ఎం కోదాడలో 9వ తరగతి చదువుతున్నాడన్నారు. తాను చదువుకోమని చెప్పానని ఇలా చేసుకుంటాడని ఊహించలేదని తెలిపాడు.
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
తమ కుమారుడు సునీల్ మృతి చెందడంతో తల్లిదండ్రులు సైదులు, జ్యోతి, చిన్నకుమారుడు రోహిత్తో పాటు బంధువులు, స్నేహహితులు, కన్నీరు మున్నీరయ్యారు. తండ్రి సైదులు మేజర్ గ్రామ పంచాయతీ గ్రామసర్పంచ్గా, కళాకారునిగా ప్రతి ఒక్కరికి పరిచయముండడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సంతాపం తెలియజేశారు.