విద్యార్థినుల మృతదేహాలు లభ్యం | students dead body found | Sakshi
Sakshi News home page

విద్యార్థినుల మృతదేహాలు లభ్యం

Published Tue, Sep 6 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

విద్యార్థినుల మృతదేహాలు లభ్యం

ఘంటసాల : 
ఘంటసాలలోని గుండేరు బెడ్‌రెగ్యులేటర్‌ వద్ద ఆదివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థినుల మునగాల నళినీ, చైతన్య మృతదేహాలు సోమవారం లభించాయి. గుండేరు చూసేందుకు వెళ్లిన మిత్ర బృందంలో నళినీ, చైతన్యలు కాలు జారి పడిపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో గల్లంతయ్యారు. ఘంటసాల ఎస్‌ఐ కేవీజీవీ సత్యనారాయణ పర్యవేక్షణలో గజ ఈతగాళ్లు, ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌ బి.బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో మొవ్వ అగ్నిమాపక సిబ్బంది, స్థానిక జాలర్ల సాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సోమవారం ఉదయం చైతన్య మృతదేహం సంఘటన స్థలానికి సమీపంలో లభించగా, మధ్యాహ్నం నళినీ మృతదేహం దాలిపర్రులోని కోళ్లఫారాల వద్ద స్వాధీనం చేసుకున్నారు. సంఘటన ప్రాంతాన్ని తహసీల్దార్‌ ఎం.బాబూరావు సందర్శించారు. అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement