వాగులో పడి బాలిక గల్లంతు | Teenager drowns in pond | Sakshi
Sakshi News home page

వాగులో పడి బాలిక గల్లంతు

Oct 15 2016 5:09 PM | Updated on Apr 7 2019 4:36 PM

వాగులో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.

ఖానాపూర్ (ఆదిలాబాద్) : వాగులో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. ఇది గుర్తించిన ఇతర కుటుంబ సభ్యులు ఇద్దరు బాలికలను రక్షించగా.. మరో బాలిక గల్లంతైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్‌మాటు వాగు వద్ద శనివారం చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ఓ ముస్లిం కుటుంబం సదర్‌మాటు వాగును సందర్శించడానికి వచ్చింది. ఆ సమయంలో వాగులో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలు నీట మునిగి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఇద్దరిని రక్షించగా.. మరో బాలిక(15) నీట మునిగి గల్లంతైంది. గల్లంతైన బాలిక కోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement