Pond (Lake)
-
ఎస్టీ రైతులపై పోలీసుల దాడి
ఖాజీపేట: చెరువులోని మట్టిని తరలించడంవల్ల తమ భూములకు నష్టం కలుగుతుందని ఎస్టీ రైతుల పోరాటం ఓవైపు.. ప్రభుత్వం అనుమతిచ్చిoది కాబట్టి చెరువు మట్టిని ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకుపోతాం అని కాంట్రాక్టర్ల బెదిరింపులతో ఆదివారం వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లె ఎస్టీ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఎస్టీ కాలనీ వాసులపై దాడిచేసి అడ్డొచ్చిన వారిని ఈడ్చిపడేసి పోలీసులు కాంట్రాక్టర్లకు దన్నుగా నిలిచారు. వివరాలివీ.. జాతీయ రహదారి నిర్మాణం కోసం నాగసానిపల్లె చెరువులో నుంచి మట్టిని తరలించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిoది. సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించుకునేందుకు అధికారులు ఓకే అన్నారు. అయితే, ఈ మట్టిని తరలించడంవల్ల చెరువుపై ఆధారపడ్డ రైతుల భూములకు నష్టం కల్గుతుందని.. సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని ఎస్టీ రైతులు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్నారు. అలాగే, చెరువు మట్టిని తరలించొద్దని ఎస్టీ రైతులు రహదారికి అడ్డుగా మట్టివేసి నిరసనకు దిగారు. కానీ, ప్రత్యేక బలగాలతో వచ్చిన పోలీసులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన వారిని ఈడ్చిపడేశారు. నిర్దాక్షిణ్యంగా చొక్కాలు పట్టుకుని బలవంతంగా జీపు ఎక్కించే ప్రయత్నం చేశారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు వారిపై దౌర్జన్యం చేశారు. దీంతో నాగమ్మ అనే ఎస్టీ మహిళకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను కడప రిమ్స్కు తరలించారు. అలాగే, బలరాంనాయక్ అనే రైతుపై కూడా పోలీసుల దాడిచేయడంతో అతనికీ గాయాలయ్యాయి. పైగా అతని మెడలోని బంగారు గొలుసు మాయమైంది. వీరితోపాటు మరో ముగ్గురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మట్టిని తరలించుకునేందుకు వీలుగా గ్రామంలో పోలీస్ పహారా ఏర్పాటుచేశారు. స్థానిక ప్రజలెవరూ అడ్డురాకుండా పోలీసులు తీవ్రస్థాయిలో గ్రామస్తులను హెచ్చరించారు. బయటకొస్తే కేసులు పెడతామని బెదిరించారు. అనంతరం కాంట్రాక్టర్లు రోడ్డుపై అడ్డుగా ఉన్న మట్టిని తొలగించి చెరువులోని మట్టిని యథేచ్ఛగా తరలించారు. పోలీసుల దౌర్జన్యం దారుణం.. మట్టి తరలింపుతో మా పొలానికి నీళ్లువచ్చే అవకాశంలేదు కాబట్టి నిరసన తెలుపుతున్నాం. అయితే, కాంట్రాక్టర్లకు మద్దతుగా పోలీసులు మాపై దౌర్జన్యం, దాడిచేయడం దారుణం. నా మెడలో గొలుసు పోయింది. పోలీసులు కాంట్రాక్టర్లకు మేలుచేయడం మంచి పద్ధతికాదు. – బలరాంనాయక్, నాగసానిపల్లె ఎస్టీ కాలనీరైతులు నష్టపోయినా ఫర్వాలేదా!? చెరువులో మట్టిని తరలించడంవల్ల మాకు పూర్తిగా నష్టం కల్గుతుందని మేం పోరాడుతున్నాం. కానీ, పోలీసులు మాత్రం కాంట్రాక్టర్ల మేలు కోరడం బాధాకరం. అంటే.. రైతులు నష్టపోయినా వారికి ఫర్వాలేదా!? – కృష్ణానాయక్, రైతు, నాగసానిపల్లె ఎస్టీ కాలనీ -
చెరువుల కబ్జాపై కన్నెర్ర!
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణదారుల చెర పడకుండా చెరువులను కాపాడేందుకు కంకణం కట్టుకున్న హైడ్రా (Hydraa) వాటి పరిరక్షణే లక్ష్యంగా దృష్టి సారిస్తోంది. ఇటీవల హైడ్రా బృందం శివారుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి చెరువుల పరిస్థితితోపాటు ప్రభుత్వ భూముల కబ్జాల సంగతి తేల్చేందుకు పర్యవేక్షణలు చేపట్టింది. ఈ సందర్భంగా స్థానికులు, బస్తీవాసులు, ప్రజలు తమ చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, భవనాలు, బహుళ అంతస్తులు వెలుస్తున్నాయని వినతులు సమర్పించారు. హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో కూడా చాలామంది చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాత పూర్వక ఫిర్యాదులను అందజేశారు. ఈ మేరకు హైడ్రా రాజధానికి సమీపంలోని చాలా చెరువులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.ఆక్రమణదారులు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 200 చెరువులను, చెరువు శిఖం భూములను, బఫర్జోన్లలో పెద్ద ఎత్తున వెంచర్లు వేసి, రూ.వందల కోట్లు ఆర్జించారు. అసలు విషయం తెలియక స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకొన్న సామాన్య, మధ్యతరగతి (Middle Class) ప్రజలు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షాకాలంలో ఈ కాలనీలు, అపార్ట్మెంట్లు జలాశయాలుగా మారుతున్నాయి. హబ్సిగూడ, రామంతాపూర్ చెరువును ఆనుకొని ఏర్పడిన మూడు కాలనీలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మునకేస్తున్నాయి. కూకట్పల్లి, (Kukatpally) కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, గాజుల రామారం, సరూర్నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, వెంకటాపూర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, టోలిచౌకి, గుండ్లపోచంపల్లి, జల్పల్లి, బడంగ్పేట్, నాచారం, ఉప్పల్, చెంగిచర్ల, మల్కాజిగిరి, ఘట్కేసర్, పోచారం తదితర ప్రాంతాల్లో చెరువులు అదృశ్యమై కాలనీలు పుట్టుకొచ్చాయి. ఆక్రమణలో.. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ‘రా’చెరువు, చింతల చెరువులోని బఫర్ జోన్లను దర్జాగా కబ్జా చేసి, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. చెంగిచర్ల బస్సు డిపో సమీపంలో ఉన్న చెరువు కట్టను ధ్వంసం చేసి.. బహుళ అంతస్తుల భవనాలను నిర్మించటం వల్ల సమీపంలోని కాలనీలు జలమ యం కాగా, రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. పోచారం పురపాలక సంఘం పరిధిలోని వెంకటాపూర్ నాడెం చెరువు ఆక్రమణకు గురికావటంతో బహుళ అంతస్తులు వెలిశాయి. దమ్మాయిగూడ, నాగారం, (Nagaram) బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్ పురపాలక సంఘాల పరిధిలోని చెరువు భూముల్లో కూడా అక్రమంగా భవనాలు వెలిశాయి. రెవెన్యూ, నీటి పారుదల, పురపాలక శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే ఈ కబ్జాల పర్వం మూడు పూవ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, ఉప్పల్ సర్కిళ్లలో వరదలతో కాలనీలన్నీ జలమయంగా మారినప్పుడల్లా.. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధితో ఉన్న పలు అక్రమ కట్టడాలను మొక్కబడిగా కూల్చివేస్తున్నారు. వీరి అలసత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్న కబ్జారులు కోర్టు కెళ్లుతుండటంతో వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.అంతంతే.. శివారుల్లో చెరువులు, కుంటల ఆక్రమణలు ,ప్రభుత్వ భూముల కబ్జాలపై ఫిర్యాదులు చేసినప్పుడు , కథనాలు వచ్చినపుడు లేదా ఉన్నతస్థాయి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం కదలి తూతూ మాత్రంగా కూల్చివేతలకు శ్రీకారం చుట్టి .. రాజకీయ పెద్దల జోక్యంతో చేతులు దులుపేసుకుంటున్నారు. కొన్ని చోట్ల కూల్చివేతలకు చేపట్టినా కొంత కాలం తర్వాత తిరిగి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం కబ్జాదారులకు అనువుగా మారుతోంది. హైడ్రా ఏర్పడిన తర్వాత కబ్జాదారులు, భూఅక్రమణ దారుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ బండారం బయట పడి అక్రమ కట్టడాలు నేలమట్టమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. చదవండి: చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ.. -
కొత్తచెరువు ఆక్రమణలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామం పరిధిలోని కొత్తచెరువుకు సంబంధించిన సర్వే నంబర్ 5లోని 5.25 ఎకరాల భూమిలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలపై పిటిషనర్ల ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరపాలని, నీటి వనరులను పరిరక్షించాలని జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ (హైడ్రా) విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా కూల్చివేతలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. రోడ్లు, వీధులు, ఫుట్పాత్లు, నీటి వనరులు వంటి పబ్లిక్ స్థలాలను ఆక్రమించి చేపట్టే అనధికార నిర్మాణాలకు అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు వర్తించవని తేల్చి చెప్పింది. ఫిర్యాదులు పరిశీలించాల్సిందే కొత్తచెరువు శిఖం ఆక్రమణపై తాము సెప్టెంబర్ 6వ తేదీన, అదే నెల 10న అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఖాజాగూడకు చెందిన ఆర్.రామకృష్ణతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు పత్రాలతో అత్యంత విలువైన భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. బిల్డర్స్, బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీతో పాటు భరతేందర్రెడ్డి, ఘనేశ్వర్, రాఘవరావు ఈ ఆక్రమణలో కుట్రదారులని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి బుధవారం విచారణ చేపట్టగా.. కొత్తచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) సుమారు 5.5 ఎకరాల్లో విస్తరించి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అక్రమ నిర్మాణాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ముంపు సమస్య తలెత్తుతోందని, నీటి వనరుల మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతోందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రైవేట్ ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించారు. శిఖం భూమి లేదా ట్యాంక్ బండ్పై ఆక్రమణలు గుర్తిస్తే వాటిని తొలగించాలని, నీటి వనరులను పరిరక్షణతోపాటు పర్యావరణ వ్యవస్థకు మరింత నష్టం జరగకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 26వ తేదీకి వాయిదా వేశారు. -
45 ఏళ్ల డేటాతో ఎఫ్టీఎల్ లెక్క
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో చెరువులకు సంబంధించిన పూర్తిస్థాయి నీటి నిల్వమట్టం (ఫుల్ ట్యాంక్ లెవల్ –ఎఫ్టీఎల్)ను గుర్తించడంతోపాటు గరిష్టంగా జలాలు విస్తరించే ప్రాంతం (మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియా– ఎండబ్ల్యూఎస్ఏ)ను తేల్చడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ‘లేక్ ప్రొటెక్షన్ కమిటీ (ఎల్పీసీ)’శాస్త్రీయ విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమైంది. ఎల్పీసీ చైర్మన్గా ఉన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో దీనిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.నీటిపారుదల, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్సీ), స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఎన్ని చెరువులు ఉన్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయనే లెక్కలను శాస్త్రీయంగా తేల్చాలని రంగనాథ్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఆయా చెరువులకు గతంలో నిర్ధారించిన ఎఫ్టీఎల్ పక్కాగా లేకున్నా, సహేతుకమైన అభ్యంతరాలు వ్యక్తమైనా.. సమీక్షించి, సవరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణలపై 2018లో కాగ్ ఇచి్చన నివేదికను పరిశీలించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు రంగనాథ్ స్పష్టం చేశారు. 45 ఏళ్ల లెక్కలను తీసుకుని.. ఇక చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, వాటర్ స్ప్రెడ్ ఏరియాను గుర్తించడానికి 45 ఏళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 1979 నుంచి ఆయా జల వనరులకు సంబంధించిన విలేజ్ మ్యాప్స్, భూ వినియోగం సర్వే నంబర్లతో సహా సమాచారం ఇచ్చే కాడాస్ట్రల్ మ్యాప్లను క్రోడీకరించి ఖరారు చేయనున్నారు. హిమాయత్సాగర్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపుతో ఈ విధానం ప్రారంభించి మిగతా వాటికీ వర్తింపజేయనున్నారు. గట్టి నిఘా పెట్టేలా చర్యలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు తీసుకోనుంది. ఆయా ప్రాంతాలను జియో ఫెన్సింగ్, ట్యాగింగ్ చేయడంతోపాటు ప్రత్యేక యాప్ను వినియోగంలోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఎక్కడ, ఎలాంటి ఆక్రమణలు జరుగుతున్నా తక్షణమే ఆ సమాచారం హైడ్రాకు చేరేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాప్ ద్వారానే ప్రజలు సమాచారం తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదు చేయడానికీ ఆస్కారం ఏర్పడుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులు చేపట్టే పరిశీలనలు, వాటి ఫలితాలతోపాటు తీసుకున్న చర్యలను ఇందులో నమోదు చేస్తారు.ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడమే కాకుండా, పూర్వవైభవం తీసుకురావడంపైనా హైడ్రా అధికారులు దృష్టి పెడుతున్నారు. కూలి్చవేతలకు సంబంధించిన వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్పల్లి నల్లచెరువుతో ఈ పనులు ప్రారంభించాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. చెరువుల పరిరక్షణ కోసం ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
చెరువులో పడి ముగ్గురు పిల్లల మృతి
మేడ్చల్ జిల్లా కొల్తూర్లో విషాదంశామీర్పేట్: ఆటలో భాగంగా మట్టి గణపతిని చేసిన ముగ్గురు పిల్లలు.. ఆ ప్రతిమను నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తూ చెరువులో పడి మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కొల్తూర్లో శుక్రవారం ఈ విషాదకర ఘటన జరిగింది. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తుల గాలానికి ఓ మృతదేహం చిక్కడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్న బాలేకర్ మణి హర్ష (14), సలేంద్రి హర్షవర్ధన్న్(13), ఈరబోయిన మనోజ్ (10) స్నేహితులు. దసరా సెలవుల నేపథ్యంలో వీరు శుక్రవారం మట్టి గణపయ్యను చేసి పూజలు చేస్తూ ఆడుకున్నారు. నిమజ్జనం కోసం చెరువు వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. చెరువు వద్ద కొందరు వ్యక్తులు చేపల కోసం నీటిలో గాలాలు వేశారు. ఓ వ్యక్తి గాలానికి ఏదో తగిలినట్లు అనిపించడంతో పైకి లాగగా.. మనోజ్ మృతదేహం కనిపించింది. దీంతో వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. మిగతా ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఏపీలో ‘చెర’వులు.. 2,032!
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధికంగా చెరువులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. అత్యధికంగా చెరువులు ఆక్రమణలకు గురైన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే అని కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1,13,425 చెరువులను పరిశీలించగా.. వాటిలో 2,032 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని తెలిపింది. దేశంలో నీటి వనరులపై మొదటి సారిగా కేంద్ర జల్ శక్తి శాఖ విస్తృతంగా అధ్యయనం చేసింది. 2018–19లో ప్రారంభమైన ఈ అధ్యయనం రెండేళ్ల పాటు కొనసాగింది. ఇటీవల అధ్యయనం వెల్లడైన అంశాలపై నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో చెరువులతో పాటు కుంటలు, రిజర్వాయర్లు, సరస్సులు(లేక్లు), చెక్డ్యామ్లు, ఊట కుంటలు వంటి మొత్తం 1,90,777 నీటి వనరులను పరిశీలించగా వాటిలో 3,920 కబ్జాకు గురైనట్లు తెలిపింది. కబ్జాకు గురైన వాటిలో 51.8 శాతం చెరువులేనని వెల్లడించింది. నీటి వనరులలో 75 శాతానికి పైగా ఆక్రమణకు గురైనవి 199 ఉండగా, 50 నుంచి 75 శాతం ఆక్రమణకు గురైనవి 186, 25 నుంచి 50 శాతం వరకు ఆక్రమణకు గురైనవి 249, 25 శాతం లోపు ఆక్రమణకు గురైనవి 1,828 ఉన్నట్లు చెప్పింది. నీటి వనరులు దేశవ్యాప్తంగా సగటున 1.6 శాతం ఆక్రమణకు గురైతే.. ఆంధ్రప్రదేశ్లో 2.06 శాతం కబ్జాకు గురయ్యాయని వెల్లడించింది. నీటి వనరుల ఆక్రమణలపై జల వనరుల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పోలీసులకు చేసిన ఫిర్యాదులు వందల్లో ఉన్నాయని తెలిపింది. నిరుపయోగంగా ఉన్న నీటి వనరులు తక్కువేం కాదు.. రాష్ట్రంలోని నీటి వనరుల్లో 1,49,279 ఉపయోగంలో ఉన్నాయని, వీటిలో 8,475 కుంటలు, 1,03,952 చెరువులు, 60 సరస్సులు, 667 రిజర్వాయర్లు, 32,011 చెక్ డ్యామ్లు, ఊట కుంటలు, ఇతర వనరులు 4,114 ఉన్నాయని తెలిపింది. 41,498 నీటి వనరులు నిరుపయోగంగా ఉన్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది. వీటిలో అత్యధికంగా చెరువులు 9,473 ఉండటం గమనార్హం. ఫీడర్ చానళ్లు (వంకలు, వాగులు) కబ్జాకు గురవడం వల్ల వర్షం నీరు చేరకపోవడంతో 9,473 చెరువులు ఎండిపోయి, నిరుపయోగంగా మారినట్లు చెప్పింది. ఇలా నిరుపయోగంగా మారిన చెరువులు ఏపీలోనే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఏటా పూర్తి స్థాయిలో నిండే నీటి వనరులు 79,320 ఉండగా.. సాధారణంగా నీటిని మళ్లించడం ద్వారా నిండేవి 18,198గా తెలిపింది. అరుదుగా నిండేవి 28,633, ఎప్పుడూ నిండని వనరులు 2,171 ఉన్నాయని పేర్కొంది. -
చెరువులో అక్రమ కట్టడం.. పేల్చివేత
కొండాపూర్ (సంగారెడ్డి): హైడ్రాను స్ఫూర్తిగా తీసుకొని సంగారెడ్డిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముందస్తుగా పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనం పూర్తిగా నీటిలో ఉండటంతో బుల్డోజర్ల సహాయంతో కూల్చివేసేందుకు వీలు కాలేదు. దీంతో తహసీల్దార్ జిలెటిన్ స్టిక్స్ స్పెషలిస్టులను పిలిపించి వారి సహాయంతో భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు. అయితే భవనం కూలుస్తున్న సమయంలో అక్కడే ఉన్న హోంగార్డు గోపాల్కు రాయి ఎగిరి వచ్చి బలంగా తాకడంతో తలకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 12 ఏళ్ల క్రితమే నిర్మాణం కొండాపూర్ మండలం కుతుబ్షాహీ పేట శివారులోని సర్వే నంబర్ 93లో ఉన్న చెరువుకు సంబంధించిన మూడెకరాల భూమిని సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అక్కడ ఐదంతస్తుల భవనంతోపాటు స్విమ్మింగ్ పూల్, గెస్ట్హౌస్ను నిర్మించాడు. ఆ భవనం ఎఫ్టీఎల్లో ఉండటంతో భవనం చుట్టూ నీరు చేరకుండా ప్రత్యేకంగా చిన్నపాటి బ్రిడ్జిని కూడా నిర్మించుకున్నాడు. ఇది నిర్మించి 12 ఏళ్లయింది. అయినా హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాక, గ్రామస్తులు ఫిర్యాదు చేసే వరకు అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులో నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు భవనాన్ని పరిశీలించడం, మామూళ్లు తీసుకోవడం పరిపాటిగా మారిందని అంటున్నారు. -
చెరువులకు జలకళ
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట/నాగార్జునసాగర్: భారీ వర్షాలతో చెరువులకు జలకళ సంతరించుకుంది. దీంతో ఈసారి పంటలకు నీటి సమస్య తలెత్తే అవకాశం లేదు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరుగుతోంది. కోటి పది లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి, నీటిపారుదల శాఖ మొత్తం 19 డివిజన్లుగా విభజించగా, వాటి పరిధిలోని చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ చీఫ్లు ఇచి్చన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,176 చెరువులు ఉంటే.. అందులో 15,608 చెరువులు పూర్తిగా మత్తడి దుంకుతున్నాయి. 5,952 చెరువులు మాత్రం ఇంకా 50 శాతం కంటే తక్కువ నీరు ఉన్నట్టు నీటిపారుదలశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 75 నుంచి 100 శాతం మేరకు నిండిన చెరువులు 8,144 ఉన్నాయి. ఇవికాక 50–75 శాతం మేరకు నిండిన చెరువులు మరో 5,012 వరకు ఉన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. వర్షాకాల సీజన్ ఈనెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ మధ్యలో పడే వర్షాలకు మిగిలిన చెరువులు కూడా పూర్తిస్థాయిలో నిండుతాయన్న ఆశాభావాన్ని నీటిపారుదలశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వర్షాలతో భూగర్భజల నీటిమట్టం కూడా పెరుగుతుందని, తద్వారా నీటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. 50 శాతంలోపు నిండిన చెరువుల్లోకి కూడా నీరు వచ్చి చేరితే, ప్రాజెక్టులు, రిజర్వాయర్లతోపాటు, అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నిండినట్టు అవుతుందని అంటున్నారు. మేడిగడ్డ వద్ద ఉధృతంగా గోదావరి మేడిగడ్డ వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ బరాజ్ నుంచి 9.02 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దాని ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుండగా, వచ్చిన వరదను వచ్చినట్టే వదిలేస్తున్నారు. శ్రీరాంసాగర్కు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే.. దిగవనకు 2.40 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 4.72 లక్షల క్యూసెక్కులు వస్తుంటే.. దిగువకు అంతేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇక సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) బరాజ్లో నుంచి 7.23 లక్షల క్యూసెక్కుల నీరు, సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) నుంచి 7.55 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. శాంతిస్తున్న కృష్ణమ్మ ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో నీటి ప్రవాహం లేకపోయినా.. క్యాచ్మెంట్ ఏరి యాల్లో పడిన వర్షంతో జూరాల నుంచి 2.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలంలోకి వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.16 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంటే.. దిగువకు పదిగేట్లు ఎత్తి 3.61 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. నాగార్జునసాగర్ డ్యాంలోకి 3.04 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటే.. అంతే మొత్తాన్ని ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు వదిలేస్తున్నారు. -
అధికారులపైనా కేసులు
సాక్షి, హైదరాబాద్: చెరువులను చెరబట్టిన ఆక్రమణలను కూల్చివేయడంతోపాటు రికార్డులను తారుమారు చేస్తూ, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపైనా ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’ ఫోకస్ చేసింది. కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రగతినగర్లోని ఎర్రకుంట, చందానగర్ ఈర్ల చెరువుల ఆక్రమణలకు సంబంధించి ఐదుగురు ప్రభుత్వ అధికారుల పాత్రను గుర్తించింది. సదరు ఆక్రమణలపై నమోదైన కేసుల్లో ఈ అధికారులను కూడా నిందితులుగా చేర్చాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతికి హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం లేఖ రాశారు. ఎర్రకుంట వ్యవహారంలో నలుగురిపై.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట బఫర్ జోన్లో 0.29 ఎకరాలను బిల్డర్లు ఆక్రమించి మూడు భవనాలను నిర్మించారు. అవన్నీ గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తుల్లో నిర్మితమయ్యాయి. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు.. ఈ నెల 14న కూల్చేశారు. ఆ నిర్మాణాలకు కారణాలపై దర్యాప్తు చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ విభాగానికి చెందిన ‘సర్వేయర్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్’ కె.శ్రీనివాస్ ఈ స్థలానికి సంబంధించి రెండు రికార్డులు రూపొందించినట్లు హైడ్రా విచారణలో తేలింది. ఒకదానిలో అది ప్రభుత్వ స్థలమని, మరో దానిలో అది ప్రైవేట్ స్థలమని పొందుపరిచారు. అవసరాన్ని ఒక్కో రిపోర్టును తీసి ఇవ్వడం చేశారు. ఈ అక్రమ నిర్మాణాలకు చెరువు సర్వే నంబర్ను కాకుండా దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న మరో భూమికి సంబంధించిన సర్వే నంబర్ కేటాయించారు. ఈ వ్యవహారంలో బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్ పాత్ర కూడా ఉన్నట్టు తేలింది. అంతేకాదు హెచ్ఎండీఏలో అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఆ స్థలాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండానే అనుమతి మంజూరు చేశారు. ఇందులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణారావు పాత్ర కూడా ఉన్నట్టు హైడ్రా నిర్ధారించింది. దీనితో ఈ కేసులో నలుగురు అధికారులనూ నిందితులుగా మార్చాలని పోలీసులను కోరింది. ఏమీ రాయకుండా ‘చుక్క’ పెట్టి లైన్ క్లియర్! చందానగర్ పరిధిలోని ఈర్ల చెరువు ఆక్రమణ వ్యవహారంపైనా హైడ్రా లోతుగా ఆరా తీయగా మరో బాగోతం బయటపడింది. ఇక్కడ 0.16 ఎకరాలను ఆక్రమించిన కొందరు.. గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులతో ఒక నిర్మాణం, గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులతో మరో రెండు నిర్మాణాలను చేపట్టారు. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు.. ఈ నెల 10న ఆ మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ ఆక్రమణలకు సంబంధించి చందానగర్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ నిర్మాణాలకు ఆన్లైన్లోనే అనుమతులు మంజూరైనట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. పూర్వాపరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ గత డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఎన్.సుధాంశ్తోపాటు మాజీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) ఎం.రాజ్కుమార్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఈర్ల చెరువు ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా.. దరఖాస్తుతోపాటు ఇరిగేషన్ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకుని జత చేయాలి. బిల్డర్లు అలా చేయలేదని గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీఓ) ఆ వివరాలను పొందుపరుస్తూ రాజ్కుమార్కు ఫార్వర్డ్ చేశారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్పై రాజ్కుమార్ తన అభిప్రాయాలను జోడిస్తేనే అది డిప్యూటీ కమిషనర్కు వెళుతుంది. కానీ రాజ్కుమార్ దానిపై ఎలాంటి కామెంట్లు రాయకుండా.. కేవలం ఓ చుక్క (డాట్) పెట్టి డిప్యూటీ కమిషనర్కు ఫార్వర్డ్ చేసేశారు. దీని ఆధారంగా డిప్యూటీ కమిషనర్ భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేశారు. ఇది గుర్తించిన హైడ్రా చందానగర్లో నమోదైన కేసులో సుధాంశ్, రాజ్కుమార్లను నిందితులుగా చేర్చాలని సిఫార్సు చేసింది. ఏసీబీ అధికారుల దృష్టికి కూడా.. సాధారణంగా అన్నీ సరిగా ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు అనుమతి కావాలన్నా.. సంబంధిత అధికారుల చేతులు తడపనిదే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. అలాంటిది చెరువులు, కుంటలు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతోపాటు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు అంటే.. అధికారుల చేతికి ముడుపులు దండిగా అందినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎర్రకుంట, ఈర్ల చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో రూ.లక్షలు చేతులు మారి ఉంటాయని హైడ్రా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల వివరాలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అందించాలని యోచిస్తున్నారు. భవిష్యత్తులో కొన్ని కీలక ఉదంతాలపై విజిలెన్స్ విచారణలు కూడా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగించాలని హైడ్రా భావిస్తున్నట్టు తెలిసింది. -
నిల్చున్న చోటే నిగ్గుతేల్చే యాప్!
సాక్షి, హైదరాబాద్: ఏ చెరువు పరిధి ఎక్కడి దాకా ఉంది? దాని ఫుల్ ట్యాంక్ లెవల్ ఎంత వరకు? బఫర్ జోన్ ఏ మేరకు విస్తరించి ఉంది? తెలుసుకోవడం ఎలా?.. ఔటర్ రింగు రోడ్డు పరి«ధిలోని ఆక్రమణలపై అనునిత్యం హైదరా బాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో స్థలం, ఇల్లు, ఫ్లాట్ కొనాలని భావిస్తున్న సామాన్యుడికి వస్తున్న సందేహాలు ఇవి. బడా బాబులు, రియల్టర్లు, వ్యాపారుల మాదిరిగా వీరికి సమాచారం సేకరించే నెట్వర్క్ ఉండదు. దీంతో ఏమాత్రం తొందరపడి ముందడుగు వేసినా నిండా మునిగిపోతామనే భయం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఔటర్’ పరిధిలోని చెరువులకు సంబంధించిన సమాచారంతో ఓ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నారు. హెచ్ఎండీఏ ఆన్లైన్లో ఉంచినా.. రాజధానితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులకు సంబంధించిన సమస్త సమాచారం ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) వద్ద ఉంది. ఈ విభాగం ప్రతి చెరువు, కుంట, ట్యాంక్కు ప్రత్యేక ఐడీ సైతం జారీ చేసింది. దానికి సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల లెక్కలతో పాటు వీటిని గుర్తిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలనూ క్రోడీకరించింది. ఈ వివరాలన్నింటినీ మ్యాపులతో సహా అధికారిక వెబ్సైట్ (https:// lakes. hmda. gov. in) లో అందుబాటులో ఉంచింది. అయితే ఈ వివరాలు పూర్తి సాంకేతిక పదజాలంతో ఉండటంతో సామాన్యుడికి అర్థమయ్యే పరిస్థితి లేదు. టెస్ట్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్... ఇలా సాంకేతిక పరిభాష, అంకెలతో ఉన్న ఆ వివరాలను డీ కోడ్ చేయాలంటే సాధారణ ప్రజలు నిపుణుల సహాయం తీసుకోవాల్సివస్తోంది. లేనిపక్షంలో తాను ఖరీదు చేయబోతున్న ప్రాంతం వివరాల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.వివరాలన్నీ సరళంగా అందుబాటులో.. అదే సమయంలో ప్రస్తుతం హెచ్ఎండీఏ వద్ద అందుబాటులో ఉన్న వివరాలన్నింటినీ సరళంగా మార్చి హైడ్రా కోసం రూపొందించే ప్రత్యేక వెబ్సైట్తో పొందుపరచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆక్రమణలు సహా వివిధ అంశాలపై ఫిర్యాదులు చేయడానికి వాట్సాప్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలతో పాటు యాప్ను హైడ్రా అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులోనే జియో ట్యాగింగ్ డేటాను పొందుపరుస్తారు. అవసరమైతే ఈ విషయంలో గూగుల్ మ్యాప్స్ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ఎవరైనా ఓ ప్రాంతంలో నిల్చుని యాప్ను ఓపెన్ చేస్తే.. ఆ ఏరియా ఏదైనా చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల కిందికి వస్తుందా? అనేది స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు, పార్కులు తదితరాలనూ ఈ యాప్లోకి తీసుకురావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భావిస్తున్నారు. నగరంలో ఉన్న చెరువుల్లో సర్వే, ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఫైనల్ వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తయినవి 54 ఉన్నాయి. వీటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై స్పష్టత ఉండటంతో తొలిదశలో వీటికే జియో ఫెన్సింగ్ చేయించనున్నారు. జియో ఫెన్సింగ్తో పరిరక్షించనున్న హైడ్రా సువిశాలంగా విస్తరించి ఉన్న నగరంలోని కొన్ని చెరువులు, పార్క్లు, ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచడానికి డ్రోన్లు, సీసీ కెమెరాలు, గార్డుల వ్యవస్థ సైతం సరిపోదు. ఈ నేపథ్యంలో కీలకమైన వాటిని పరిరక్షించడానికి జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేయడానికి హైడ్రా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ), అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (అడ్రిన్) సహా మరికొన్ని సంస్థలతో సంప్రదింపులు జరపనున్నారు.వీరి సహకారంతో ఉపగ్రహాల ద్వారా ఆయా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల హద్దులను పక్కాగా గుర్తించడంతో పాటు వాటికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా ఆ పరిధిలోకి వెళ్లి పూడ్చటానికి, నిర్మాణాలు చేపట్టడానికి సహా ఏ ఇతర ప్రయత్నం చేసినా ఆ కార్యకలాపాలను జియో ఫెన్సింగ్ ఆధారంగా శాటిలైట్లు గుర్తిస్తాయి. వెంటనే ఆ సమాచారాన్ని హైడ్రా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో పాటు కీలక అధికారులకు అందిస్తూ అప్రమత్తం చేస్తాయి. -
అస్సాంలో ఆ కిరాతకుడు మృతి
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మరణించాడు. నాగావ్ జిల్లాలోని ధింగ్ గ్రామంలో శనివారం ఉదయం అతడు చెరువులో దూకి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని శుక్రవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అతడికి బేడీలు వేసి, అత్యాచార ఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లారు. నిందితుడు హఠాత్తుగా పోలీసులపై దాడి చేసి తప్పించుకొని సమీపంలోని చెరువులో దూకాడని నాగావ్ జిల్లా ఎస్సీ చెప్పారు. చెరువులో రెండు గంటలపాటు గాలించి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి దాడిలో ఒక పోలీసుకు గాయాలయ్యాయని, అతడిని ఆసుపత్రిలో చేర్చామని వెల్లడించారు.మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని ఎస్పీ వెల్లడించారు. చెరువులో దూకి చనిపోయిన నిందితుడి అంత్యక్రియలను తమ గ్రామ ఖబ్రస్తాన్లో నిర్వహించడానికి వీల్లేదని అతడి సొంత గ్రామమైన బార్భేటి ప్రజలు తేలి్చచెప్పారు. అంతేకాకుండా అతడి కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత్యక్రియలకు ముందు జరిగే ప్రార్థనలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. పదో తరగతి చదువుతున్న బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు బంధించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, హింసను సహించే ప్రసక్తే లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శనివారం తేలి్చచెప్పారు. మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
చెరువులు చోరీ!
సాక్షి, హైదరాబాద్: చినుకు పడితే చిత్తడి.. రోడ్డెక్కాలంటే రోత.. కాస్త గట్టి వానొస్తే కాలనీలు, బస్తీల్లో ఎక్కడ చూసినా నీళ్లే.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాల పాలవడంతో వచ్చిన దుస్థితి ఇది. రియల్టర్ల ధనదాహానికి, అధికారుల అవినీతి తోడై.. చెరువులు, కుంటలన్నీ కాలనీలుగా, భారీ భవనాలుగా మారిపోతున్నాయి. దీనిపై ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ (హైడ్రా)’ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్ఆర్ఎస్సీ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని 56 ప్రధాన చెరువుల పరిస్థితిని పరిశీలించింది. 1979లో 10,416.8 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జలవనరులు.. గత ఏడాది చివరి నాటికి 3,974.1 ఎకరాలకు పడిపోయాయని తేల్చి0ది. అంటే 61 శాతం మాయమై 39 శాతమే మిగిలినట్టు లెక్కగట్టింది. ఇదిలా కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ధనదాహం, అవినీతి కలగలిసి.. ‘గ్రేటర్’హైదరాబాద్తోపాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని జలవనరులు కబ్జా కావడం వెనుక రియల్టర్లు, బిల్డర్ల ధనదాహం, అధికారుల అవినీతి, సామాన్యుల అవగాహన రాహిత్యం కారణమని హైడ్రా చెబుతోంది. చెరువులు, కుంటలు సహా జల వనరులన్నీ సాగునీటి శాఖ అదీనంలో ఉంటాయి. కొన్నిచోట్ల చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ల పరిధిలో పట్టా భూములున్నా.. వాటిని పంటల సాగుకు వినియోగించాలే తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ క్రమంలోనే భారీ నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, వెంచర్లు వేసే రియల్టర్లు సాగునీటిశాఖ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)’తీసుకోవాలనే రూల్ ఉంది. అయితే ఈ ఎన్ఓసీ లేకపోయినా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇరిగేషన్ శాఖ నుంచీ అక్రమంగా ఎన్ఓసీలు జారీ అవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ముందే జారీ.. ఏదైనా భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు.. ఆ నిర్మాణాన్ని ఆద్యంతం పరిశీలించి, నిబంధనలన్నీ పాటించారని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నివాస యోగ్యమంటూ ‘ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ (ఓసీ)’జారీ చేయాలి. కానీ గ్రేటర్ నగరంలోని చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో వెలుస్తున్న చాలా భవనాలకు నిర్మాణ పనులు కూడా పూర్తి కాకుండానే ‘ఆక్యుపెన్సీ’జారీ అయిపోతోంది. కొందరు అధికారుల కాసుల కక్కుర్తే దీనికి కారణం. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి పలు ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు.. లోతుగా విచారణ చేపట్టారు. ఇక చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చినట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. వాటిని రద్దు చేయాలంటూ హెచ్ఎండీఏకు లేఖ రాశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టనున్నారు. జాడ కూడా లేని తుమ్మలకుంట హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 56 జల వనరులను ‘ఎన్ఆర్ఎస్సీ’అధ్యయనం చేసింది. కీసర మండలం అహ్మద్గూడలో 101 ఎకరాల్లో ఉండాల్సిన తుమ్మలకుంట పూర్తిగా మాయమైనట్టు తేలింది. ఆ చెరువు మొత్తం ఇప్పుడు ఓ కాలనీగా మారింది. అన్నింటికంటే తక్కువగా ఆక్రమణలకు గురైనది హుస్సేన్సాగర్.. 1,475.2 ఎకరాలు ఉండాల్సిన హుస్సేన్సాగర్ 21 శాతం ఆక్రమణలకు గురై 1,163.8 ఎకరాల మేర మిగిలింది. సాధారణ ప్రాంతాల్లో ఉన్న జల వనరుల కంటే రక్షణశాఖ పరిధిలో ఏరియాల్లో ఉన్నవి సురక్షితంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. హకీంపేటలో రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న 18 ఎకరాల చెరువు ఇప్పటికీ అలాగే ఉండటం గమనార్హం. ఆయా చోట్ల నిఘా, ఆంక్షలు ఎక్కువగా ఉండమే దీనికి కారణమని అంటున్నారు. సికింద్రాబాద్లోని చంద్రపురికాలనీలో ఉన్న చెన్నపురం చెరువు.. విస్తీర్ణం పెరిగినట్టు తేలడం ఆసక్తికరంగా మా రింది. 1979లో 16 ఎకరాలుగా రికార్డుల్లో ఉన్న ఈ చెరువు.. 2023లో 18.2 ఎకరాలు ఉన్నట్టు తేలింది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన హైడ్రా.. అదెలా జరిగిందో తేల్చాలని నిర్ణయించింది.గ్రేటర్ హైదరాబాద్, శివార్లలోని ప్రధాన చెరువులు 5644 ఏళ్ల కిందట ఈ చెరువుల విస్తీర్ణం10,416.8 ఎకరాలుఇప్పుడు వాటి విస్తీర్ణం 3,974.1 ఎకరాలు కబ్జా అయిన శాతం 61%సిటీ నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్లోనూ కబ్జా అయినది 21% -
లేక్లు లేఔట్లపాలు
సాక్షి, హైదరాబాద్: ఒకనాడు నిండుగా చెరువులతో, వాటి పక్కన తోటలతో కళకళలాడిన నగరం హైదరాబాద్.. కానీ నాటి చెరువులు కుంటలు అయిపోతే.. కుంటలన్నీ బస్తీలుగా మారిపోయాయి. చెరువు కనిపిస్తే చెరపట్టడమే లక్ష్యంగా చెలరేగిపోయిన కబ్జాదారులతో ఎక్కడికక్కడ భారీ నిర్మాణాలు వెలిశాయి. దశాబ్దాలుగా ఈ తతంగం జరుగుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల కమీషన్ల కక్కుర్తితో.. వందల కొద్దీ చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. పెద్ద పెద్ద కాలనీలను చూపించి.. ఒకప్పుడు ఇక్కడ పెద్ద చెరువు ఉండేదని చెప్పుకునే రోజులు వచ్చాయి. గత 45 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 61 శాతం చెరువులు మాయమైపోయినట్టు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’ తేల్చింది. దీనికి సంబంధించి ఇటీవల ‘హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (హైడ్రా)’కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాల తొలగింపుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అనేక ప్రాంతాలకు అవే గుర్తింపు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల పేర్లలో బాగ్, తలాబ్, కుంట, కట్ట వంటి పదాలు ఉంటాయి. అవన్నీ నగరంలో చెరువులు, కుంటలు, తోటలు ఉన్న ప్రాంతాలే. దానికితోడు పెద్ద పెద్ద చెరువులూ ఎన్నో ఉండేవి. రియల్ఎస్టేట్ బూమ్తో కబ్జాలు, ఆక్రమణలతో పరిస్థితులు మారిపోయాయి. చెరువుల శిఖం భూములతోపాటు తూములు,అలుగులు, నాలాలపై అడ్డగోలుగా నిర్మాణాలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో 1979, 2024 మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసిన ఎన్ఆర్ఎస్సీ.. పెద్ద సంఖ్యలో చెరువులు మాయమైనట్టు తేల్చింది. బుధవారం ఎన్ఆర్ఎస్సీలో జరిగిన సమావే«శంలో ఈ వివరాలను వెల్లడించింది. ఉదాహరణకు శాతం చెరువు విస్తీర్ణం గతంలో 70 ఎకరాలుకాగా.. ఇప్పుడు మిగిలింది పదెకరాలే. ఎల్బీనగర్ కప్రాయి చెరువు 71 ఎకరాలకుగాను 18 ఎకరాలే మిగిలింది. హెచ్ఎండీఏ యంత్రాంగం నిర్లక్ష్యంతో.. ఇటీవలి వరకు గ్రేటర్లో చెరువుల బాధ్యతలను హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పర్యవేక్షించింది. దీని పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 1,728 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పూర్తి నీటి మట్టం (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ హద్దులను నిర్ధారించడంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యం చూపారు. కేవలం 200 చెరువుల హద్దులను మాత్రమే నోటిఫై చేశారు. ఈ కారణంగానే కబ్జాల పర్వం యథేచ్చగా కొనసాగింది. 472 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫాక్స్సాగర్లో.. ఇప్పటివరకు 120 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయి. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే రసాయన గోదాములు, భారీ నిర్మాణాలు వెలిశాయి. 2003లో అప్పటి ప్రభుత్వం చెరువు భూముల్లోనే 11 ఎకరాల్లో పేదలకు పట్టాలివ్వడం గమనార్హం. ఇక మూసాపేట మైసమ్మ చెరువు భూముల్లో ఏకంగా ఆకాశ హరŠామ్యలే వెలిశాయి. శేరిలింగంపల్లిలోని దేవునికుంట, సున్నం చెరువు, మంగలి కుంటలు దాదాపు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు గోల్కొండ రాజులకు మంచినీరు అందించిన దుర్గం చెరువు చిక్కిపోయింది. దీని 125 ఎకరాల విస్తీర్ణంలో 25 ఎకరాల మేర గార్డెన్స్ వెలిశాయి. నేతలు, రియల్టర్లు, అధికారులు కుమ్మక్కై చెరువులు, కుంటలు కబ్జా చేసి నిర్మించిన, నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు, లేఔట్ల వెనుక రాజకీయ నాయకులు, రియల్టర్లు ఉంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు బినామీ పేర్లతో చెరువుల్లో వెంచర్లు, లేఔట్లు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి కొందరు అధికారుల కక్కుర్తి తోడుకావడంతో అక్రమాలు విచ్చలవిడిగా కొనసాగాయి. కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి, హడావుడి చేయడం పరిపాటిగా మారిపోయింది. వాటిని పూర్తిగా కూల్చివేయడానికి బదులు నిర్మాణాల పైకప్పు, గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి వదిలేస్తూ వచ్చారు. నేతలు, రియల్టర్లు తమ పలుకుబడి వినియోగించి తర్వాతి చర్యలు లేకుండా చూసుకుంటున్నారు. భవనాలకు పెట్టిన రంధ్రాలను పూడ్చేసి తమ దందా కొనసాగించేస్తున్నారు. తాజాగా ఎన్ఆర్ఎస్సీ ప్రజెంటేషన్ నేపథ్యంలో ‘హైడ్రా’ డైరెక్టర్ ఏవీ రంగనాథ్ వేగంగా స్పందించారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను పూర్తిగా కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్మాణంలో ఉన్నవాటిని కూల్చాలని, తర్వాత పాత నిర్మాణాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో.. ఎనిమిది భవనాలను (ఐదు అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఎత్తయినవి) అధికారులు కూల్చేశారు. రెండు లేఔట్లను ధ్వంసం చేశారు. స్థిరాస్తి కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోండి చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ భవనాలను కూల్చేయడంతోపాటు వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. శనివారం రెండు ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 15 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పరిసరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని.. తెలుసుకోకుండా ముందుకెళ్తే నష్టపోవాల్సి వస్తుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్రమ నిర్మానాలు, కబ్జాలపై సమాచారం ఇవ్వాలి. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ -
భాగ్యనగరంలో కంపు కొడుతున్న చెరువులు
-
ఆక్వా చెరువు బోరు నుంచి గ్యాస్
రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఓ ఆక్వా చెరువు వద్ద బోరు బావి నుంచి నీటితో కలిసి 15 అడుగుల మేర గ్యాస్ పైకి ఎగజిమ్మింది. అయితే, మంటలు వ్యాపించకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... రాజోలు మండలంలోని చింతలపల్లి–అరవపాలెం రోడ్డులో కె.విజయేంద్రవర్మ అనే వ్యక్తికి చెందిన ఆక్వా చెరువు వద్ద ఉన్న బోరు బావి నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆకస్మికంగా నీరు ఎగసిపడింది. విద్యుత్ మోటారు, ఆయిల్ ఇంజన్ వంటివి ఏమీ లేకుండానే బోరు బావి నుంచి నీరు 15 అడుగుల మేర ఎగసిపడుతుండటంతో సమీపంలోని కూలీలు వెళ్లి చూశారు. అయితే, గ్యాస్ వాసన రావడంతో భయాందోళనలకు గురైన కూలీలు వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారి సీహెచ్ అనిల్కుమార్, సిబ్బంది గ్యాస్ లీక్ అవుతున్న బోరు బావి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బోరు బావి లోపల తీవ్రమైన ఒత్తిడి పెరిగి, నీటితో కలసి గ్యాస్ ఉధృతంగా పైకి వస్తోందని గుర్తించారు. నీటిలో సుమారు ఆరు శాతం గ్యాస్ ఉందని నిర్ధారించారు. బోరు బావిని ఇసుకతో పూడ్చివేసి గ్యాస్ పైకి రాకుండా చేశారు. కొత్తగా బోర్లు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉప్పు నీటి కోసం 200 మీటర్ల మేర భూమి లోపలకు బోర్లు వేయడం వల్ల గ్యాస్ పైకి వస్తుందని అనిల్కుమార్ చెప్పారు. కొన్నిసార్లు గ్యాస్ శాతం ఎక్కువగా ఉండడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. -
ప్రాణం తీసిన టెస్లా కారు రివర్స్
వాషింగ్టన్: అమెరికాతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ మోడ్లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్ మోడ్కు మార్చడంతో అది చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్చ్ మెక్కానెల్ బంధువు, ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్మోస్ట్ గ్రూప్ సీఈఓ ఏంజెలా చావో(50) మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆమె తన మిత్రులతో కలిసి టెక్నాస్లోని ఆస్టిన్ సమీపంలో ఉన్న తన ప్రైవేట్ అతిథి గృహానికి వెళ్లారు. 900 ఎకరాల్లో ఈ ఎస్టేట్ విస్తరించి ఉంది. మిల్లర్ సెలయేర్ ఇక్కడ ఈ ఎస్టేట్ గుండా ప్రవహిస్తోంది. ఏంజెలా చావో ఓ రెస్టారెంట్కు వెళ్లి, రాత్రిపూట టెస్లా కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు. మధ్యతో త్రీ పాయింట్ మూలమలుపు వచి్చంది. దానిని దాటే క్రమంలో ఏంజెలా గందరగోళానికి గురై పొరపాటున కారును రివర్స్ మోడ్లోకి మార్చారు. దాంతో అది వేగంగా వెనక్కి వెళ్లి కొలనులో పడిపోయింది. ఏంజెలా భయాందోళనకు గురై స్నేహితురాలికి పోన్ చేశారు. వెంటనే గెస్ట్ హౌస్ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా మునిగిపోయింది. అద్దాలు చాలా స్ట్రాంగ్గా ఉండటంతో వాటిని పగలగొట్టడం సాధ్యం కాలేదు. చివరికి కారును బయటకు తీసినా అప్పటికే ఏంజెలా ప్రాణాలు కోల్పోయారు. ఆమె అమెరికాలో ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ జిమ్ బ్రేయార్ సతీమణి. అమెరికా మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి అవుతారు. -
చెరువుల ఆక్రమణలను తీవ్రంగా పరిగణించాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల శిఖం, ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్), ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, చుట్టూ కంచె ఏర్పాటు.. తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించేందుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎస్జీ) గాడి ప్రవీణ్కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్రెడ్డిని అడ్వొకేట్ కమిషనర్లుగా హైకోర్టు నియామించింది. రెండు జిల్లాల పరిధిలోని 16 చెరువులను పరిశీలించి మూడు వారాల్లో స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. అంతరించిపోతున్న చెరువులను కాపాడేందుకు వీరిని నియమించినట్లు చెప్పింది. దీనికంతటికీ అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. ‘భవిష్యత్ తరాలు బాగుండాలన్నదే మా అభిమతం. ఒకప్పుడు హైదరాబాద్ను సరస్సుల నగరంగా పిలిచేవారు. ఇప్పుడు చాలా చెరువులు, సరస్సులు ఆక్రమణలతో అంతరించిపోయాయి. హైకోర్టు పక్కనే ప్రవహించే నది(మూసి) దుస్థితినే మనం చూడవచ్చు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. లేదంటే భవిష్యత్ తరాలు క్షమించవు’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వ్యాఖ్యానించారు. 13 నీటి వనరులపై నివేదిక.. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, శిఖంను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాశారు. ముఖ్యంగా దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, పిర్జాదిగూడ, దామర చెరువు, దుండిగల్, చిన రాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్పేట, బావురుడ తదితర చెరువులు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకుపోయాయని పేర్నొన్నారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్గా విచారణ స్వీకరించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. దుర్గం చెరువు, సున్నం చెరువు, ఫిర్జాదిగూడ పెద్ద చెరువు, చినదామర, చినరాయుని, గ్నాగారం పెద్ద చెరువు, మేడికుంట, నల్లచెరువు, బోయిన్ చెరువు, మద్దెలకుంట, నల్లగండ్ల చెరువు, అంబీర్ చెరువు, గోసాయి కుంట.. 13 నీటి వనరులకు సంబంధించి ఆక్రమణలు, ఎఫ్టీఎల్, కంచె ఏర్పాటుపై నివేదికను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు అందజేశారు. పరస్పర విరుద్ధ స్టేట్మెంట్లతో అడ్వొకేట్ కమిషనర్ల నియామకం అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. దుర్గం చెరువు చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసినందున కంచె వేయడం సాధ్యం కాదని చెప్పారు. అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ అందజేసిన నివేదికలో మాత్రం కంచె ఏర్పాటు చేసినట్లు ఉండటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పరస్పర విరుద్ధంగా స్టేట్మెంట్లు ఉండటంతో అడ్వొకేట్ కమిషనర్ల నియామకం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరు చెరువులను పరిశీలించి నివేదిక అందజేస్తారని చెప్పింది. ఇద్దరికీ రూ.25 వేల చొప్పున రెమ్యునరేషన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణకు జీహెచ్ఎంసీ తరఫున జయకృష్ణ, కేంద్రం తరఫున డీఎస్జీ గాడి ప్రవీణ్కుమార్, రెవెన్యూ తరఫున శ్రీకాంత్రెడ్డి హాజరయ్యారు. దుర్గం చెరువు చుట్టూ కంచె ఏర్పాటుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవాలని ఏఏజీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 11కు వాయిదా వేసింది. -
రాత్రికి రాత్రే చెరువు మాయం! తెల్లారేసరికి అక్కడ..!
కొన్ని రాష్ట్రాల్లో జరిగే వింత ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వామ్మో! ఇదేంటి అనిపిస్తుంది. సాధారణంగా దొంగలు చైన్లు, పర్సులు, ఇళ్లు దోచుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ బిహార్లో మాత్రం దొంగలు చాలా వెరైటీగా ఉంటారు. అక్కడ ఒక్కసారి ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఓ సొరంగం మార్గం ద్వారా బెగుసరాయ్లోని రైల్వే యార్డ్ నుంచి ఏకంగా రైలు ఇంజన్ని ఎత్తుకుపోయారు. ఇలాంటి విచిత్రమైన చోరీలతో బిహార్ తరుచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మళ్లీ ఇప్పుడూ ఈ చెరువు కారణంగా మరోసారి హాట్టాపిక్గా వార్తల్లో నిలిచింది. ఎక్కడైన చెరువుని ఎత్తుకెళ్లడం గురించి విన్నారా! అదికూడా ఒక్కరాత్రిలో మాయం చేయడం అంటే నమ్ముతారా?. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ దుండగలు ఎవరో గానీ ఎత్తుకెళ్లే దమ్ముంటే ఏదైనా చెయ్చొచ్చు అన్నా రేంజ్లో చేసి చూపించారు!. ఈ విచిత్ర ఘటన బిహార్లోని దర్భంగా జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఓ చెరువు రాత్రికి రాత్రే మాయమైపోయింది. తెల్లారేసరికి ఆ ప్రదేశంలో నీళ్లు లేకుండా మట్టితో పూడుకుపోయి, అక్కడ ఒక గుడిసె మాత్రమే కనిపించింది. దీంతో షాకైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చెరువుని చేపలు పట్టడానికి, వ్యవసాయానికి వినియోగించేవాళ్లమని స్థానికులు చెబుతున్నారు. ఇంతకమునుపు మండల అధికారులు చెరువు పూడిక తీత పనులు మొదలుపెట్టారని తాము అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పనులు నిలిపేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఎలా జరిగిందన్నాది తామకిప్పటికీ అంతుపట్టడం లేదన్నారు. అంతేగాదు రాత్రికి రాత్రే ఎలా చెరవు మాయం చేశారన్నది తమకు తెలియదని ఫిర్యాదులో పోలీసులకు తెలిపారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ ప్రదేశంలో రోజూ రాత్రిపూట ట్రక్కులు నడిచేవని స్థానికులు చెప్పారు. ట్రక్కులతోపాటు ప్రొక్లెయినర్లు, ఇతర భారీ యంత్రాలు ఆ చెరువు వద్ద పనులు సాగించినట్లు పోలీసులకు తెలిపారు. అయితే అక్కడ ఏం జరుగుతుందనేది తమకు మాత్రం తెలియదని పేర్కొన్నారు. తీరా అక్కడికి వెళ్లి చూడగా.. నీళ్లు ఉన్న చెరువు స్థానంలో మొత్తం మట్టితో నింపేసి.. అక్కడ ఒక గుడిసె వేసినట్లు గుర్తించారు. అంతేగాదు ఈ పని అంతా కేవలం రాత్రి పూట మాత్రమే జరిగిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. కానీ దర్భంగాలో పెరుగుతున్న భూముల ధరల కారణంగా దుండగుల దృష్టి ఈ చెరువుపై పడిందని అంటున్నారు. అందుకే ఇంతలా పకడ్బంధీగా చీకట్లోనే చెరువు కబ్జా చేసేందుకు యత్నించారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు, చెరువుని మాయం చేసేలా మట్టిని ఎలా నింపారనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇది మాములు మిస్టరీ కాదు. ఎదుకంటే? కటిక చీకటిలోనే గుట్టు చప్పుడు కాకుండా అదికూడా ఏకంగా ఓ చెరువునే మాయం చేశారు దుండగలు. (చదవండి: New Year 2024: ఇవాళ ఇవి తింటే..లక్కే లక్కు..డబ్బే..డబ్బు..) -
మురికికూపాలు..సుందర జలాశయాలుగా..
(నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి) నిర్లక్ష్యానికి నిలయాలుగా.. అపరిశుభ్రతకు ఆలవాలంగా.. కాలుష్యపు కాసారాలుగా మారిన పట్టణాల్లోని చెరువులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తీసుకొస్తోంది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా చూడముచ్చటగా అభివృద్ధి చేస్తోంది. పార్క్ వాతావరణం, గట్లపై వాకింగ్ ట్రాక్ల నిర్మాణం, చుట్టూ రక్షణ కంచె, ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలను ఏర్పాటుచేస్తోంది. వరద నీరు సరైన మార్గంలో అందులోకి చేరేలా, నిండిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా మురుగునీరు వాటిల్లోకి చేరకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. మొదటి దశలో 101 జలాశయాలను, రెండో దశలో మరో 95 చెరువులను సుందరీకరించే పనిని ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీబీసీ) ఇప్పటికే చేపట్టింది. రాష్ట్రంలోని చెరువులను పునరుద్ధరించి, తిరిగి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీలు–అర్బన్ లోకల్ బాడీలు) 196 చెరువులను ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.522 కోట్లను వెచ్చిస్తోంది. మొదటి దశలోని 101 జలాశయాల్లో ఇప్పటికే 50 చెరువుల్లో సుందరీకరణ పనులు దాదాపు పూర్తిచేశారు. ఆయా పనులకు అవసరమైన ప్రణాళికను పురపాలక శాఖ రూపొందించి, ఇప్పటికే అమలుచేస్తోంది. ఈ నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తోంది. మొదటి దశలోని చెరువుల్లో సగం చెరువుల పనులు పూర్తిగా, మిగతావి దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. వరద నష్టాన్ని నివారించేలా మార్పులు.. వరదలు వచ్చినప్పుడల్లా పట్టణాల్లో వీధులు నీటమునగడం పరిపాటిగా మారి, ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం సైతం పట్టణాల్లోని చెరువులను అమృత్ 2.0 పథకంలో అభివృద్ధి చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలోని పట్టణ జలాశయాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తీసుకొచ్చేందుకు నడుంబిగించింది. మొదటి దశలోని 101 చెరువులను రూ.189.07 కోట్లతోను, రెండో దశలో 95 చెరువులకు రూ.332.97 కోట్లతోను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టులో చెరువులను వినియోగంలోకి తీసుకొచి్చ, వరద నీరు సరైన మార్గంలో అందులోకి చేరేలా, నిండిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా వర్షపు నీరు తప్ప మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వాటిల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగును శుద్ధిచేసి నీటిని స్వచ్ఛంగా మారుస్తున్నారు. జలాశయాల గట్లను రాళ్లతో పటిష్టం చేసి గట్లపై మొక్కలు నాటుతున్నారు. దీనివల్ల వరదలు సంభవించినప్పుడు ఆయా పట్టణాలకు ఈ చెరువులు సహజ రక్షణ వలయాలుగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. నాడు ఈ ఫొటోలో కనిపిస్తున్నది గుంటూరు మున్సిపాలిటీలోని అంకిరెడ్డిపాలెం చెరువు. దాదాపు 12 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు ముఫ్పై ఏళ్ల క్రితం వరకు తాగునీటిని అందించింది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో మురుగునీరు, జారిపోయిన గట్లు, ముళ్ల చెట్లతో నిండిపోయింది. దీనినిప్పుడు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కొత్తగా తీర్చిదిద్దుతోంది. పటిష్టమైన గట్లు, సెంట్రల్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో సందర్శకులకు నిలయమైంది. పక్కనే ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ సైతం ఏర్పాటుచేస్తున్నారు. వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నేడు చెరువుల అభివృద్ధి ఇలా.. మురుగుతో నిండిపోయిన జలాశయాలను శుద్ధి చేస్తారు. గట్లను పటిష్టం చేయడం, వీలైనంత ఎక్కువగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కుల్లా తీర్చిదిద్దుతారు. గట్లపై వాకింగ్ ట్రాక్ల నిర్మాణం, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుచేస్తారు. ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలను కలి్పస్తారు. ఆక్రమణలు జరగకుండా చుట్టూ రక్షణగా ఇనుప కంచె వేస్తున్నారు. తాగునీటి చెరువులుగా మార్పు జలాశయాల పునరుజ్జీవంలో మొదటి విడతగా 101 చెరువులను తీసుకున్నాం. ఇవి సుమారు 5 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో 50 జలాశయాల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ప్రతి చెరువును శుద్ధమైన నీటితో ఉండేలా ప్రక్షాళన చేయడంతో పాటు, గట్లను పటిష్టం చేసి, పార్కులు, వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్, ఓపెన్ జిమ్, పిల్లలకు ఆటస్థలం, వస్తువులతో పాటు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తున్నాం. పట్టణంలో కురిసిన వర్షపునీరు చెరువులోకి చేరేలా.. అక్కడ నుంచి బయటకు వెళ్లేలా ఇంజినీరింగ్ పనులు చేస్తున్నాం. తాగునీటి చెరువులను సైతం అభివృద్ధి చేస్తున్నాం. నవంబర్కి మొదటి దశ చెరువుల అభివృద్ధి పనులు పూర్తిచేస్తాం. – బొమ్మిరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఏపీయూజీబీసీ ఎండీ స్థలాల రేట్లు పెరిగాయి ఈ ఊరిలో ఇక్కడే పుట్టి పెరిగాం. ఈ చెరువు నీటితోనే గ్రామం దాహం తీర్చుకునేది. కానీ, గత 30 ఏళ్లుగా నిరుపయోగంగా మారిపోయింది. ఊరు గుంటూరులో కలిసిపోయినా ఇటువైపు ఎవరూ వచ్చేవారు కాదు. ప్రభుత్వం ఈ చెరువును పార్కులా మారుస్తుండడంతో చుట్టుపక్కల స్థలాల రేట్లు పెరిగాయి. చుట్టూ వెంచర్లు కూడా వస్తున్నాయి. వచ్చే ఐదేళ్లల్లో ఈ ప్రాంతమంతా కొత్త పట్టణంగా మారిపోతుంది. – అప్పిరెడ్డి, అంకిరెడ్డిపాలెం (గుంటూరు) మా ప్రాంతానికి ఐకాన్ గతంలో ఈ చెరువులో చేపలు పెంచేవాళ్లం. కలుషిత నీరు చేరడంవల్ల చేపలు చనిపోతుండడంతో మానేశాం. వాకింగ్కు భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజెల్స్ లిమిటెడ్ (బీహెచ్వీపీ)కి వెళ్లా ల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు మా చెరువును ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండడంతో ఇకపై వాకింగ్కు, పిల్లలు ఆడుకునేందుకు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఈ ప్రాంతానికి ఇప్పుడీ చెరువు ఐకాన్లా మారుతోంది. – వి.వెంకటరమణ, అక్కిరెడ్డిపాలెం (విశాఖ) ఆక్రమణలు తొలగించి ఆహ్లాదకరంగా.. విశాఖపట్నం లంకెలపాలెం చెరువు మూడెకరాలకు పైగా ఉండేది. 20 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు పెరిగిపోయి అసాంఘిక పనులకు అడ్డాగా మారిపోయింది. ఇన్నేళ్లకు అధికారులు ఆక్రమణలను తొలగించి అద్భుతంగా మారుస్తున్నారు. గతంలో వాకింగ్కు స్టీల్ ప్లాంట్కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఈ చెరువు గట్టుపైనే చేస్తున్నాం. జిమ్, పార్కు కూడా అభివృద్ధి చేస్తున్నారు. – సాలపు విజయకుమార్, లంకెలపాలెం (విశాఖపట్నం) బోటింగ్ కూడా పెడుతున్నారు హిందూపూర్లోని 113 ఎకరాల సూరపుకుంట చెరువు గత నెల వరకు గట్లు అడవిలా, పాములు, పందులకు నిలయంగా ఉండేవి. నీరు కూడా మురికిగా ఉండేది. అధికారులు పదిరోజుల్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు చెరువు గట్టుపై వాకింగ్ చేస్తున్నాం. అధికారులు బోటింగ్ పెట్టాలని కూడా నిర్ణయించారు. బెంగళూరు, ఎలహంకలో ఇలా చెరువుల అభివృద్ధిని చూశాను. – సింగిరెడ్డిపల్లి ప్రసాదరెడ్డి, హిందూపూర్ -
బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ముగ్గురు కార్మికులు గల్లంతు
సాక్షి, సిద్దిపేట జిల్లా: జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ కోసం చెరువులో చెత్తను తొలగిస్తుండగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికులు గిరిపల్లి బాబు, గిరిపల్లి భారతి, యాదమ్మల కోసం స్థానికులు గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: కూతురు ప్రేమ వ్యవహారం.. ఉన్మాదిగా మారిన తండ్రి ఏం చేశాడంటే -
జేసీబీలో నిండుగర్భిణి తరలింపు
భీమ్గల్: ఓ నిండుగర్భిణి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా దారి మధ్యలో చెరువుకట్ట తెగి నీటి ప్రవాహం పెరిగింది. జేసీబీ సహాయంతో ఆమెను నీటిప్రవాహంలోంచి దాటించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భీమ్గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన నిండుగర్భిణి అనిలకు గురువారం పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పిప్రి నుంచి బాచన్పల్లి వెళ్లే దారిలో ఉన్న చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఆమెను జేసీబీలో కూర్చోబెట్టి దాని సహాయంతో నీటి ప్రవాహాన్ని దాటించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
జైన విగ్రహాలతో చెరువు తూము
సాక్షి, హైదరాబాద్: అదో చెరువు.. అంతగా సాగునీటి వనరులు లేని ఆ గ్రామంలో ఆ చెరువు నీళ్లే వ్యవసాయానికి ఆధారం.. అందుకోసం పల్లంగా ఉన్న ప్రాంతానికి నీటి నిల్వను చెరువుగా చేసి పక్కాగా కట్టకట్టి నీటి విడుదలకు తూము నిర్మించారు. ఇదంతా వందేళ్ల నాటి సంగతి. ఇప్పుడు ఆ చెరువుతో పనిలేదు. అయితే, తూము నిర్మాణానికి వినియోగించిన రాళ్లు మామూలువి కాదని, అవి ఓ జైన క్షేత్రం శిల్పాలతో కూడిన శిలలని తేలింది. వాన నీరు... చెట్టు నీడన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామ చెరువు కట్ట తూము నిర్మాణంలో రాళ్లుగా వినియోగించిన వెయ్యేళ్లనాటి జైన శిల్పాలు ఇప్పుడు వెలుగు చూశాయి. క్రీ.శ. 9–10 శతాబ్దాల నాటి జైన బసది కేంద్రంలో ఉన్న జైన చౌముఖి శిల్పాలను ఈ చెరువు తూములో వినియోగించినట్టు చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఔత్సాహిక పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్రెడ్డి ఇటీవల ఎన్కేపల్లి గ్రామానికి వెళ్లారు.ఆ సమయంలో వాన కురుస్తుండటంతో చెట్టునీడన నిలబడి ఉండగా, సమీపంలోని చెరువుకట్టలో శిల్పాలు కనిపించాయి. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆదివారం ఆ చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా, అవి జౌన చౌముఖి శిల్పాలుగా గుర్తించారు. శిలలపై ఆదినాథ, నేమినాథ, పార్శ్వనాథ, వర్ధమాన మహావీరులు ధ్యానముద్రలో ఉన్నట్టు, పైన కీర్తిముఖాలతో మలిచి ఉన్నట్లు శివనాగిరెడ్డి చెప్పారు. వాటిపై 9–10 శతాబ్దాల నాటి తెలుగు, కన్నడ లిపిలో శాసనాలు కూడా చెక్కి ఉన్నాయన్నారు. ఆ శాసనభాగాలు చెరువుగట్టు గోడలోకి చొచ్చుకుపోయి ఉన్నందున చదవటం వీలు కావటం లేదని, జైన బసదికి చెందిన దానశాసనాలు అయి ఉండే అవకాశం ఉందన్నారు. వాటిని బయటకు తీస్తే స్థానిక చరిత్రకు సంబంధించిన వివరాలు వెలుగుచూసే అవకాశం ఉందని తెలిపారు. ఆ ప్రాంతం జైన కేంద్రం.. మొయినాబాద్ ప్రాంతం ఒకప్పుడు జైన కేంద్రం. సమీపంలోని చిలుకూరు ప్రాంతం రాష్ట్రకూట, వేములవాడ చాళుక్యుల కాలంలో సుప్రసిద్ధ జైన కేంద్రమని పేర్కొంటూ ఇటీవలే ఆ ఊళ్లోని జైన దేవాలయ జాడలను వెలుగులోకి తెచ్చారు. చిలుకూరుకు అతి సమీపంలో ఉన్న ఎన్కేపల్లి గ్రామంలో కూడా జైన బసది కేంద్రం ఉండేదని, దానికి సంబంధించిన చౌముఖి శిల్పాలని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఆ జైన బసది, దాని అనుబంధ దేవాలయం ధ్వంసమైన నేపథ్యంలో, వాటి శిథిల శిల్పాలను చెరువు తూముకు వినియోగించి ఉంటారన్నారు. -
అశోక్ సాగర్లో విషాద ఘటన.. సూసైడ్ స్పాట్గా మారిన పర్యాటక ప్రాంతం
ఖలీల్వాడి /ఎడపల్లి : ఆహ్లాదకరమైన వాతావరణం అందించే అశోక్ సాగర్ ఇప్పుడు సూసైడ్ స్పా ట్గా మారింది. శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయగా అందులో మూడేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనతో అశోక్ సాగర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నాలుగు నెలల్లో సుమారు పది ఘటనల వరకు ఇక్కడ జరిగాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట్ పరిధిలో ఉన్న ఈ చెరువు వందేళ్ల క్రితం ఏర్పడింది. దీనిని పెద్ద చెరువుగా పిలిచేవారు. నిజామాబాద్, బోధన్ రహదారిపై చెరువు ఉండటంతో ప్రయాణికులకు ఆహ్లాదం అందించడానికి 2001లో అప్పటి జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ పర్యాటకంగా అభివృద్ధి చేశారు. రాక్ గార్డెన్తో పాటు చెరువులో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జానకం పేట చెరువు అశోక్ సాగర్గా పిలువబడు తోంది. ఇది నగరానికి 12 కిలోమీటర్లు దూరంలో ఉంది. బీజీలైఫ్ గడిపే నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ చెరువు నుంచి 5 కిలోమీటర్ల దూ రంలో అలీసాగర్ ఉద్యానవనం ఉంది. ఈ రోడ్డు బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారి కావడంతో పర్యాటకులకు పిక్నిక్ స్పాట్గా మారింది. అయితే గత కొంత కాలంగా అశోక్సాగర్ వద్ద ఆత్మహత్యల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ కలహాలు, భర్త మద్యానికి బానిసై వేధింపులకు గురిచేయడంతో మహిళలు పిల్లలతో సహా ఆత్మహత్య చే సుకున్న ఘటనలు ఇక్కడ గతంలో చోటుచేసుకున్నాయి. నిరుద్యోగ యువకులు, వ్యాపారంలో న ష్టం వచ్చి ఆర్థిక ఇబ్బందుతో బాధపడుతున్న వారు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. పోలీసుల భద్రత పెంచాలి అశోక్ సాగర్లో పోలీసుల భద్రతతో పాటు బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉంది. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే వా రిని కాపాడి కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరకట్న వేధింపులతోనే.. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు అక్షయ, నిఖిత తమ ముగ్గురు పిల్లలతో కలిసి శుక్రవారం అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందులో అక్షయ కుమారుడు చిన్నా అలియాస్ భువనేశ్వర్ (3) నీటిలో గల్లంతు అయ్యా డు. అక్షయతో పాటు నిఖిత ఆమె పిల్లలు భవశ్రీ, శ్రీమాన్లను రోడ్డున వెళ్లే వారు కాపాడారు. అక్షయ వివాహం హైదరాబాద్కు చెందిన హేమంత్తో, నిఖిత వివాహం మెదక్కు చెందిన మహేశ్తో జరిగింది. కొంతకాలంగా హేమంత్, మహేష్ ఇద్దరూ కట్నంగా ఇచ్చిన ఇంటిస్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలని తమ భార్య లను వేధిస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన అక్కా చెల్లెళ్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో రోడ్డు వెంట బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకు లు దీనిని గమనించి, ఘటన స్థలానికి చేరుకున్నారు. నిజామాబాద్ నెహ్రూనగర్కు చెందిన షేక్ హైదర్ చెరువులోకి దిగి నిఖిత, అక్షయలతోపాటు భవశ్రీ, శ్రీమాన్లను రక్షించాడు. మిగతా ఇద్దరు గౌస్, షారూక్ ఖాన్ ఒడ్డున ఉండి బాధితులను బయటకు తీశారు. -
కరకట్ట కలేనా..? ముందుకు సాగని నిర్మాణ పనులు
మంగపేట: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణం కలగానే మిగులుతుంది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచగా ఉన్న కరకట్ట నిర్మాణంపై ఒక అడుగుముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. అధి కారులు, ప్రజాప్రతినిధులు. ప్రతి ఏటా వర్షాకాలంలో వరద కారణంగా గోదావరి ఒడ్డు వెంట గల వేలాది ఎకరాల సాగుభూములు గోదావరిలో కలిసిపోతోన్నాయి. దీంతో 30 ఏళ్ల క్రితం నుంచి గోదావరి ఒడ్డు వెంట రైతులుకు వరద కోత గుండెకోతగా మారింది. గోదావరి ఒడ్డు వెంట సాగుభూములు కోతకు గురి కాకుండా ఉండేందుకు 2008లో అప్ప టి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్యాకేజీ వర్క్ కింద రూ.5,77,40,450 నాబార్డు నిధులను మంజూరు చేశారు. కమలాపురం నుంచి సుమారు 3 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణం చేపట్టిన గుత్తేదారు మండల కేంద్రంలోని గౌరారంవాగు బ్రిడ్జి వద్ద నుంచి సుమారు 500 మీటర్ల మేర రిటైనింగ్వాల్ నిర్మాణం, పొదుమూరు వరకు కరకట్ట నిర్మించి, దొంగలఒర్రె నుంచి పుష్కరఘాట్ వరకు క రకట్ట నిర్మాణం చేపట్టకుండా వదిలేయడంతో ప్రతి ఏటా గోదావరి ఒడ్డు వెంట సాగుభూములు కోత కు గురవుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గడిచిన 15 ఏళ్లకాలంలో గోదావరి ఒడ్డు వెంట విలువైన వందల ఎకరాల నల్లరేగడి భూములు ఇప్పటికే కోతకు గురై గోదావరిలో కలిసిపోయాయి. గోదావరి ఒడ్డు వెంట ఉన్న ఎకరం, రెండెకరాల సాగుభూమి మొత్తం గోదావరిలో కలిసిపోయిన పేదరైతులు నిరుపేదలుగా మారారు. మండల కేంద్రం కనుమరుగయ్యే ప్రమాదం కరకట్ట నిర్మాణంలో గత 15 ఏళ్ల నుంచి జరుగుతున్న జాప్యం వల్ల మున్ముందు మండల కేంద్రం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని పొదుమూరుకు కిలో మీటరుకు పైగా దూరంలో ఉండే గోదావరి గడిచిన 15 ఏళ్ల కాలంలో ఒడ్డు కోతకుగురి కావడంతో ప్రస్తుతం గ్రామానికి సుమారు 200 మీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతోపాటు ఊరచెరువుకు గోదావరి ఒడ్డుకు సుమారు 80 నుంచి 100 మీటర్ల దగ్గరకు చేరింది. రాబోయే కాలంలో గోదావరి వరద కారణంగా చెరువుకు ప్రమాదం పొంచి ఉండటం, చెరువుకు అతి సమీపంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, లోతట్టు ప్రాంతం మీదుగా గోదావరి వరదనీరు మండల కేంద్రంలోకి వచ్చే ప్రమాదం లేకపోలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే మంగపేట మండల కేంద్రం సైతం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. పనులు చేపట్టకపోవడంలో అంతర్యం ఏమిటో..? ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ వద్ద 6 కిలోమీటర్లు, మంగపేట మండలంలోని దొంగలఒర్రె వద్ద నుంచి పుష్కరఘాట్ వరకు 2.5కిలో మీటర్ల వరకు గోదావరి తీరంవెంట కరకట్ట నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.109.79 కోట్ల, భూసేకరణకు రూ.27 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఆయా పనులు చేపట్టేందుకు హర్ష కన్స్ట్రక్షన్తో 2022 ఏప్రిల్ 04న అగ్రిమెంట్ కూడా పూర్తయింది. ఆయా పనులను ప్రారంభించే క్రమంలో అధిక వర్షాలు, గోదావరి వరదల కారణంగా పనులు నిలిచిపోయినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. 2022 జూలైలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు పడటంతో గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో జూలై 17న సీఎం కేసీఆర్ భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు ముంపు ప్రాంతాలను హెలీకాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏటూరునాగారం ఐటీడీఏలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2008 సర్వే నివేదిక ఆధారంగా చేపట్టే కరకట్ట నిర్మాణం పనుల తాత్కాలికంగా నిలుపుదల చేసి ప్రస్తుత జూలైలో వచ్చిన గోదావరి వరద నీటి ప్రమాదాన్ని నివారించే విధంగా భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు అవసరమైన ప్రతి చోటా కరకట్ట నిర్మించేందుకు రీసర్వే చేసి నూతన ఎస్టిమేట్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎక్స్ఫర్ట్ కమిటీని నియమించినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. భూసేకరణకు సర్వే మంగపేటలోని సండ్రోని ఒర్రె నుంచి పుష్కరఘాట్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించేందుకు రూ.54.09 కోట్ల ఫ్లడ్ బ్యాంక్ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం టెండర్ నిర్వహించగా హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీ టెండరు దక్కించుకుంది. పనులు ప్రారంభించేందుకు గోదావరి ఒడ్డు నుంచి సుమారు 30 మీటర్ల వెడల్పుతో రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు 50 నుంచి 60 ఎకరాల భూమి కోసం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించారు. కానీ, వర్షాకాలం వచ్చినా నేటి వరకు పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వం, అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం ప్రభుత్వం, ఎక్స్ఫర్ట్ కమిటీ ఆదేశాల మేరకు కరకట్ట నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన మేరకు భూసేకరణ కోసం సర్వే చేశాం. సర్వే నివేదికను ములుగు ఆర్డీఓకు సమర్పించాం. కరకట్ట నిర్మాణానికి డ్రాయింగ్ అప్రూవల్ కోసం పీఈసీడీఓ హైదరాబాద్ వారికి డ్రాయింగ్ సమర్పించాం. ఫ్లడ్ మోడల్ స్టడీస్ కోసం పీఎస్ ఈఆర్ఎల్ వారికి నివేదికలు అందచేశాం. ఆనుమతులు వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం. – ఇరిగేషన్ ఏఈఈ వలీ మహ్మద్,మంగపేట సెక్షన్ నాలుగు ఎకరాలు గోదారిలో కలిసింది.. గోదావరి ఒడ్డు వెంట 11 ఎకరాల భూమి కోతకు గురై గోదారిలో కలిసి పోగా ఎకరం మాత్రమే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. ఉన్న ఎకరం పొలంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నా. ఉన్న ఎకరంలో కరకట్ట నిర్మాణం కొరకు అర ఎకరం భూమి పోతోంది. అర ఎకరానికి మాత్రమే నష్ట పరిహారం చెల్లిస్తామంటున్నారు. గోదావరిలో కోల్పోయిన మొత్తం భూమికి పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – బొల్లె రాములు, పొదుమూరు, భూ యజమాని -
వరద కాలువ కోసం భిక్షాటన
కోరుట్ల: పట్టణంలోని మద్దులచెరువును అనుసంధానిస్తూ వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ బీజేపీ నాయకులు బుధవారం పట్టణంలో భిక్షాటన చేశారు. వర్షాకాలంలో చెరువునిండి ఆ వరద నీటితో 10, పదకొండో వార్డులు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. తక్షణమే వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ 11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునీత, పదో వార్డు బీజేపీ ఇన్చార్జి దాసరి శేఖర్ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. మున్సిపల్ కౌన్సిల్ పట్టించుకోవటం లేదని, అందుకే భిక్షాటనతో నిధులు సేకరిస్తున్నామని వారు తెలిపారు. మరికొన్ని నిధులు మున్సిపల్ కౌన్సిల్ విడుదల చేసి చెరువు నీళ్ల కోసం వరద కాలువ నిర్మించాలని వారు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు మాడవేని నరేశ్, పెండెం గణేశ్, నాయకులు బల్మూరి మురళి, ఇందూరి తిరుమల, పోతుగంటి శ్రీనివాస్గౌడ్, గిన్నెల అశోక్, బింగి వెంకటేశ్, వాసాల నవీన్, వినయ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువు వైపు చూస్తూ మొరుగుతున్న కుక్క.. పరిశీలనగా చూసి నివ్వెరపోయిన జనం!
తమ పెంపుడు కుక్కకు చెరువులో స్నానం చేయించాలని ఆ అన్నాచెల్లెలు ఎంతో ముచ్చటపడ్డారు. అయితే అదే వారిపాలిట శాపంగా మారింది. స్థానికంగా ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని డోంబివలీ దావాడీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అన్నాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్కను తీసుకుని చెరువుకు వెళ్లారు. అక్కడ దానికి స్నానం చేయించాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా వారు లోతైన నీటిలో మునిగిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. అయితే దాని ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. ఉమేష్నగర్కు చెందిన రంజిత్ రవీంద్రన్(22),కీర్తి రవీంద్రన్(16) కుటుంబంతో పాటు ఉంటున్నారు. రంజిత్ ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థి. కీర్తి ఈ ఏడాదే 12వ తరగతిలో చేరింది. వారి తల్లిదండ్రులు ఏదోపనిమీద తమ గ్రామానికి వెళ్లారు. దీంతో ఇంటిలో ఈ అన్నాచెల్లెళ్లలోపాటు వారి పెంపుడు కుక్క కూడా ఉంది. ఆదివారం ఈ అన్నాచెల్లెళ్లు స్కూటర్పై కుక్కను తీసుకుని గావ్దేవి చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ కుక్కకు స్నానం చేయించాలనుకున్నారు. ఈ నేపధ్యంలో వారు చెరువులోకి దిగినవెంటనే మునిగిపోయారు. అయితే కుక్క ఈ ప్రమాదం నుంచి బయటపడింది. వారిద్దరూ చెరువులో మునిగిపోవడాన్ని చూసిన ఆ కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. కొద్దసేపటి తరువాత కుక్క అలా మొరుగుతుండటాన్ని గమనించిన గ్రామస్తులకు ఏదో అనుమానం కలిగింది. వారు సంఘటనా స్థలానికి వచ్చి.. ఆ అన్నా చెల్లెళ్లు మునిగిపోయి ఉండటాన్ని గమనించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో భారీ సంఖ్యలో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో రెండు గంటలపాటు చేసిన ప్రయత్నాల అనంతరం ఆ అన్నాచెల్లెళ్ల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అన్నాచెల్లెళ్లు చదువు అంటే ఎంతో ఆసక్తి చూపేవారు. కీర్తి 10వ తరగతిలో 98శాతం మార్కులను సంపాదించింది. ఈ అన్నాచెల్లెళ్లద్దరూ ఆ కుక్కను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా..ఆక్రమణదారుల చెరలో 38,496 చెరువులు
సాక్షిప్రతినిధి, వరంగల్: నగరాలు, పట్ణణాలు, పల్లెలు.. ఇవేమీ తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు.. ఫలితంగా వేల సంఖ్యలో జలవనరులు కనుమరుగవుతున్నా యి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చినవాటి లో కొన్ని ఆక్రమణలపాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారాయి. ఇటీవల కేంద్ర మైనర్ ఇరిగేషన్ స్టాటిస్టిక్స్ విభాగం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ‘ఇరిగేషన్ సెన్సెస్’నిర్వహించింది. అనేక చెరువులు కనుమరుగైనట్లు, మరి కొన్ని ప్రమాదంలో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఓరుగల్లు చెరువులు ఎంతెంత పోయాయంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలతో కుచించుకు పోయాయి. 100 ఎకరాలకుపైగా ఉండే చిన్నవడ్డేపల్లి చెరువు సుమారు 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు కొద్ది రోజుల క్రితం రెవెన్యూ శాఖనే తేలి్చంది. మామునూరు పెద్ద చెరువు 170 ఎకరాలకుగాను సుమారు 40 ఎకరాలు, 126 ఎకరాల్లో విస్తరించి ఉన్న పాతబస్తీ ఉర్సు రంగ సముద్రం (ఉర్సు చెరువును) సుమారు 26 ఎకరాలు, హనుమకొండ హంటర్రోడ్ న్యూశాయంపేటలో 150 ఎకరాల విస్తీర్ణంలోని కోటి చెరువులో సుమారు 25–30 ఎకరాల వరకు ప్రైవేటుపరమయ్యాయి. హన్మకొండ, కాజీపేట ప్రాంతవాసుల తాగునీటి అవసరాలు తీర్చే హన్మకొండ వడ్డేపల్లి చెరువులో 40 ఎకరాలకు వరకు, 336 ఎకరాల భద్రకాళి చెరువులో సుమారు 40 ఎకరాల పైచిలుకు కనుమరుగైందని అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఆక్రమణకు గురైనవి 3,032 దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్ననీటి వనరులు కుచించుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 38,496 చెరువులు, ట్యాంకులు, సరస్సులు తదితర చిన్ననీటి వనరులు ఆక్రమణకు గురికాగా, సుమారు 14,535 చోట్ల ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కాగా అత్యధికంగా ఆక్రమణలకు గురైన ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 64,056 చిన్ననీటి వనరుల్లో 3,032 ఆక్రమణలకు గురైనట్లు నివేదిక తేల్చింది. ఈ 3,032 చెరువుల్లో ఎక్కువ హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు సెంటిమీటర్ల వాన పడితే నగరం మునుగుడే కాకతీయ రాజులు నిర్మించిన అనేక చెరువులు వరంగల్ నగరం చుట్టూ ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల వల్ల గొలుసుకట్టు చెరువుల సిస్టం దెబ్బతిని ఐదు సెంటిమీటర్ల వర్షం పడితే చాలు నగరం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆక్రమణలను నియంత్రించకపోతే ఆ చెరువులు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది. – చీకటి రాజు, రాష్ట్ర కన్వీనర్, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ లోకాయుక్తలో విచారణ జరుగుతోంది వరంగల్లో 8కి పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటన్నింటిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. భద్రకాళీ సహా అన్ని చెరువుల ఆక్రమణపై లోకాయుక్త కోర్టులో చేసిన ఫిర్యాదులపై తదుపరి విచారణ 2024 జూన్ 23న ఉంది. – సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు, వినియోగదారుల మండలి చెరువుల ఆక్రమణలపై నోటీసులు వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై వచి్చన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మా దృష్టికి వచి్చన వాటిని ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చాము. పోలీసు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశాం. – ఎ.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ, జలవనరులశాఖ చదవండి: ‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై! -
చెరువుల్లో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక చెరువులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1,13,425 చెరువులుంటే.. అందులో 1,03,952 చెరువులు వినియోగంలో ఉన్నాయి. అత్యధిక కుంటలు, రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ్ బెంగాల్ మొదటి స్థానంలో నిలిస్తే.. ఊటకుంటలు, చెక్డ్యామ్లు వంటి జలసంరక్షణ నిర్మాణాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే, అత్యధిక రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. అత్యధిక జలసంరక్షణ నిర్మాణాలున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. చిన్న నీటివనరుల కింద దేశంలో 14,75,29,626.21 హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఇందులో అత్యధిక ఆయకట్టు ఉన్న రాష్ట్రాల్లో 1,19,95,473 హెక్టార్ల ఆయకట్టుతో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో రాజస్థాన్(54,28,765.19 హెక్టార్లు), మూడో స్థానంలో తెలంగాణ (49,71,121.4 హెక్టార్లు) నిలవగా.. 13,37,841 హెక్టార్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలో జలవనరుల మొదటి గణన, చిన్న నీటివనరుల ఆరో గణనను కలిపి జలవనరుల గణన పేరుతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్వహించింది. వాటి ఫలితాలను కేంద్ర జల్శక్తి శాఖ ఇటీవల విడుదల చేసింది. అందులోని ప్రధానాంశాలివీ.. రాష్ట్రంలో 1,90,777 జలవనరులు.. ► దేశంలో 24,24,540 జలవనరులు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 23,55,055 (97.1 శాతం) ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 69,485 (2.9 శాతం) ఉన్నాయి. ఇందులో 14,42,993 (59.5 శాతం) కుంటలు, 3,81,805 చెరువులు (15.7 శాతం), రిజర్వాయర్లు 2,92,280 (12.1 శాతం), ఊటకుంటలు, చెక్ డ్యామ్లు 2,26,217 (9.3 శాతం), సరస్సులు 22,361 (0.9 శాతం), 58,885 ఇతరాలు (2.5 శాతం) ఉన్నాయి. ► ఈ జలవనరులలో మానవ నిర్మితమైనవి 18,90,463 (78 శాతం). సహజసిద్ధంగా ఏర్పడినవి 5,34,077 (22 శాతం). ► 20,30,400 జలవనరులు (83.7 శాతం) వినియోగంలో ఉండగా.. 3,94,500 జలవనరులు (16.3 శాతం) ఎండిపోయాయి. ► 7,47,480 (30.8 శాతం) జలవనరులతో పశ్చిమ బెంగాల్ తొలిస్థానంలో నిలిచింది. 2,45,087 (10.1 శాతం) జలవనరులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో, 1,90,777 (7.9 శాతం) జలవనరులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. 1,81,837 (7.5 శాతం) జలవనరులతో నాలుగో స్థానంలో ఒడిశా, 1,72,492 (7.1 శాతం) జలవనరులతో ఐదో స్థానంలో అస్సోం నిలిచాయి. ► జలవనరులను అత్యధికంగా చేపల పెంపకం, సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఉపయోగంలో 1,49,279 జలవనరులు.. ► ఆంధ్రప్రదేశ్లో 14,132 కుంటలు.. 1,13,425 చెరువులు, 62 సరస్సులు, 703 రిజర్వాయర్లు, 57,492 ఊటకుంటలు, చెక్ డ్యామ్లు, 4,963 ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో కుంటలు 8,475, చెరువులు 1,03,952, సరస్సులు 60, రిజర్వాయర్లు 667, ఊటకుంటలు, చెక్డ్యామ్లు 32,011, ఇతరాలు 4,114 వెరసి మొత్తం 1,49,279 ఉపయోగంలో ఉన్నాయి. ►రాష్ట్రంలో 37,257 జలవనరులను సాగునీటి కోసం ఉపయోగించుకుంటుండగా.. 680 వనరులు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగమవుతున్నాయి. చేపల పెంపకం కోసం అత్యధికంగా 69,510 జలవనరులను వినియోగించుకుంటుండగా. తాగునీరు, గృహావసరాల కోసం 1,945 వనరులను వాడుకుంటున్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు 38,460 వనరులు దోహదపడుతున్నాయి. -
కొమ్మకొమ్మకో సన్నాయి!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పోలంకి పిట్ట, పిగిలిపిట్ట, తేనె పిట్ట, నల్ల కొంగ, ఎర్ర గుడ్లగూబ, పెద్ద చిలుక, పసుపు పావురం.. ఈ పక్షులను ఎప్పుడూ చూడలేదు కదూ! చూడటం కాదు, కనీసం పేర్లు కూడా విననివారూ ఎక్కువే. వివిధ కారణాలతో పక్షుల సంఖ్య తగ్గిపోవడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్టులు, చెరువుల వద్ద ఏకంగా 446 రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. మన దేశంలో ప్రస్తుతమున్న 1,300 పక్షి జాతుల్లో మూడో వంతుకుపైగా తెలంగాణలో స్థిరనివాసం ఉండటంగానీ, వలస వచ్చిపోవడం గానీ జరుగుతోందని ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’ తాజా నివేదిక వెల్లడించింది. నల్లమల, అనంతగిరి, గుబ్బల మంగమ్మ (అశ్వారావుపేట), పోచారం, కవ్వాల్, ఏటూరునాగారం, నర్సాపూర్ అటవీ ప్రాంతాల్లో చాలా జాతుల పక్షులు ఆవాసాలు ఏర్పర్చుకున్నట్టు తెలిపింది. కొత్త పక్షులకూ ఆవాసం.. మన రాష్ట్రంలో పలుచోట్ల కొత్తగా తలపై పింఛంతో ఠీవిగా కనిపించే బ్లాక్ బాజా (నల్లడేగ), మూరెడు తోక కలిగిన బ్లిత్స్ పారడైజ్ ఫ్లైక్యాచర్ (తోట పిగిలిపిట్ట)లను గుర్తించారు. వీటికితోడు అనంతగిరిలో బ్లూఅండ్ వైట్ ఫ్లైక్యాచర్ (నీలి– తెల్ల పిగిలిపిట్టలు), అశ్వారావుపేట గుబ్బలమంగమ్మ ఫారెస్ట్లో రూఫస్ వుడ్పెకర్ (ఒక రకం వడ్రంగి పిట్ట), కవ్వాల్లో మార్స్ హారియర్, ఇండియా కోర్సర్, బ్లాక్ బెల్లిట్, లాఫింగ్ డవ్, హార్ట్ స్పాటెడ్ వడ్రంగి పిట్ట తదితర వలస పక్షులను కొత్తగా గుర్తించారు. కొన్నేళ్లుగా మంచి వర్షాలు, వేసవిలో దాహార్తిని తీర్చేందుకు రిజర్వు ఫారెస్టుల్లో ఏర్పాట్లు చేయటంతో.. పక్షుల సంతతి, రాక పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు. నగరాలు, చెరువుల వద్ద.. ఆందోళనకరం జీవావరణ సమతుల్యతలో కీలకపాత్ర పోషించే పక్షుల మనుగడ పెద్దగా మనుషుల అలికిడి లేని అటవీ ప్రాంతాల్లో భేషుగ్గా ఉండగా.. నగరాలు, చెరువుల వద్ద ఆందోళనకరంగా ఉందని తేలింది. రిజర్వ్ ఫారెస్ట్లలో స్థానికంగా ఉన్నవాటికి తోడు కొత్త రకాల పక్షులు వచ్చి చేరుతున్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని నిపుణులు చెప్తున్నారు. పక్షుల మనుగడకు తోడ్పడే పండ్లు, పూలచెట్ల స్థానంలో ఎలాంటి ప్రయోజనంలేని మొక్కల పెంపకం, భారీ నిర్మాణాలతో చెట్లు తగ్గిపోవడం, సెల్ టవర్లు, కర్బన ఇంధనాల కాలుష్యం వంటి కారణాలతో పావురాలు తప్ప మిగతా పక్షులేవీ పెద్దగా మనగలిగే పరిస్థితి లేదని ‘హైదరాబాద్ బర్డ్ పాల్స్’ సంస్థ ప్రతినిధి గోపాలకృష్ణ అయ్యర్ తెలిపారు. ఇక కొన్నేళ్లుగా చెరువుల సరిహద్దులు, కట్టల నిర్మాణాలు, వాటిపై వాకింగ్ ట్రాక్ల నిర్మాణం, ప్రకాశవంతమైన విద్యుత్ లైట్లు అమర్చడం వంటివాటితో.. వలస పక్షులతోపాటు ఇక్కడి నీటి పక్షులు గుడ్లు పెట్టి, సంతానోత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందని అయ్యర్ వివరించారు. మనుషుల అలికిడి పెరగడం, వేట (పురుగులు, చిన్నచేపలు) దొరకడం కష్టమవడంతో ఆయా పక్షుల మనుగడకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ కారణాలతో.. అక్టోబర్ నుంచి మార్చి వరకు యూరప్, సైబీరియా, ఆ్రస్టేలియాల నుండి వలసవచ్చే పక్షుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. చెరువుల పునర్నీర్మాణంలో పక్షుల మనుగడ అంశాన్ని మర్చిపోయి డిజైన్ చేయడమూ ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. ♦ కోకిల కిలకిలారావాలు, చిలుకల పలుకులు, పిచ్చుకల కిచకిచలతోపాటు ఏకంగా 304 రకాల పక్షుల సందడితో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రత్యేక జీవావరణ కేంద్రంగా మారింది. ఇక్కడ నల్లగద్ద, పోలంకి పిట్ట, తేనెపిట్ట, నల్లకొంగ, తోక పిగిలిపిట్ట, పెద్ద చిలుక, ఎర్ర గుడ్లగూబ తదితర పక్షులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. ♦వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రతి మొక్క ఆయుర్వేద గుణాలున్నదేనన్న పేరు పొందింది. ఈ అడవుల్లో 250 రకాల పక్షులు ఉన్నాయి. బండీడ్ బే కుకూ, బ్లూ బెయిర్డెడ్బీ ఈటర్, చెస్ట్నట్ టెయిల్డ్ స్టార్లింగ్, పొన్నంగి పిట్ట (ఇండియన్ పిట్ట) లతో పాటు చెవులపిల్లిని ఆహారంగా తీసుకునే కుందేటిసలవ గద్దలు వంటి పక్షు లు అనంతగిరి నుంచి ఉస్మా న్సాగర్ రిజర్వాయర్ వరకు సందడి చేస్తున్నాయి. డేంజర్ జోన్లో బుల్బుల్ పిట్ట.. ♦ చూసేందుకు ముద్దుగా, పలికితే వినసొంపుగా ఉండే బుల్బుల్ పిట్ట (ఎల్లో త్రోటెడ్ బర్డ్) అంతరించే స్థితికి చేరింది. దేశంలోపాటు మన రాష్ట్రంలోనూ వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటి నివాసం రాళ్లు, కొండ గుహలే. ♦ కుమురంభీం జిల్లా పెంచికల్పేట, బెజ్జూరులలో రాబందు (వల్చర్) సంరక్షణ కేంద్రం ఏర్పాటు కూడా ప్రయోజనం ఇవ్వలేదు. ప్రాణహిత తీరంలో రాబందుల పర్యవేక్షణ కోసం బయాలజిస్ట్, వాచర్ను నియమించి రోజూ ఒక ఆవును ఆహారంగా వదిలినా ఫలితం లేకపోవటంతో ఆ ప్రయత్నాలు ఇటీవలే ఉపసంహరించారు. ♦ జనగాం జిల్లా చిన్నమడూరు, పెద్ద మడూరు గ్రామాలకు ఏటా వచ్చే విదేశీ పక్షులకు అక్కడి కోతుల గుంపులు ప్రతిబంధకంగా మారాయి. ఈ ఏడాది వలస పక్షుల సంఖ్య భారీగా తగ్గింది. అడవుల్లో పక్షుల జోరు పెరిగింది తెలంగాణ అటవీ ప్రాంతంలో అన్నిరకాల స్థానిక పక్షు ల సంతతితోపాటు కొత్త పక్షుల వలస పెరిగింది. దేశీజాతి పక్షులు ఈ ప్రాంతానికి హిమాలయాలు మొదలుకుని ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి. అయితే అటవీ ప్రాంతాల్లో జన సందడిని మరింత తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవ సరం ఉంది. – మదన్రెడ్డి, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ చెరువుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలి చాలా చోట్ల చెరువులకు మరమ్మతులు చేస్తూ వాటికి ఒడ్డు లేకుండా చేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే చెరువుల నిర్వహణ ప్రైవేటు చేతుల్లోకి తీసుకుని వాకింగ్ ట్రాక్లు, విద్యుత్ లైట్లు వేస్తున్నారు. చుట్టుపక్కల చెట్లు కూడా లేకుండా పోతున్నాయి. వీటి ప్రభావం పక్షులపై తీవ్రంగా పడింది. విదేశీ వలస పక్షుల రాక తగ్గిపోయేందుకు కారణమైంది. – హరికృష్ణ అడపా, హైదరాబాద్ బర్డ్ పాల్స్ సంస్థ ప్రతినిధి -
టెండర్లకే టెండర్ పెట్టారు
ఎక్కడైనా ఏవైనా పనులు చేపట్టాలంటే ముందుగా ఎంత ఖర్చవుతుందని అంచనా (ఎస్టిమేషన్) వేసుకోవాలి... ♦ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతులు తీసుకోవాలి. ♦ అటు తర్వాత అంచనాకు అనుగుణంగా టెండర్లను ఆహ్వానించాలి. ♦ ఈ మేరకు నిర్దేశిత తేదీతో టెండర్ నోటిఫికేషన్ వేయాలి. ♦ దాఖలైన టెండర్లను పరిశీలించి కాంట్రాక్ట్ సంస్థను ఖరారు చేయాలి. ♦ అనంతరం వారితో ఒప్పందం కుదుర్చుకోవాలి. అప్పుడు పనులు మొదలెట్టాలి ♦ ఆ తర్వాత దశల వారీగా బిల్లులు చెల్లించుకుంటూ పోవాలి. ఏమిటీ నమ్మశక్యంగా లేదా.... అయితే ఒక్కసారి ఈ ఫొటో చూడండి.. ఇది వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని మర్రికుంట చెరువు. పైన చెప్పిన నిబంధనలేవీ పాటించకుండానే,టెండర్లు పిలవకుండానే దీన్ని ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయడంతోపాటు సుందరీకరణ పనులు కొనసాగించేస్తున్నారు. ఇలా అభివృద్ధి పనుల పేరిట నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఎక్కడైనా.. ఏ ఊళ్లో అయినా ఇదే లెక్క.. అయితే వనపర్తి జిల్లాలోని మంత్రి ఇలాకాలో మాత్రం లెక్క వేరేగా ఉంటుంది. ♦ ముందుగానే పనులు చేపడతారు. ♦ పనులు పూర్తయ్యే దశలో అంచనాలు రూపొందిస్తారు. ♦ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులుపొందుతారు. పోటీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండాటెండర్ ప్రక్రియ ముగిస్తారు. ♦ బిల్లులు చేయించి.. డబ్బులు తీసేసుకుంటారు. ‘బినామీ’ కాంట్రాక్టర్లు..? నిబంధనల ప్రకారం ఒక్కోవర్క్ రూ.5 లక్షల వరకు అయితే నామినేషన్ పద్ధతిన కేటాయింపులు చేయాలి. అంతకంటే మించి అయితే టెండర్ పద్ధతిన కాంట్రాక్ట్లు అప్పగించాలి. కానీ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన నాలుగు చెరువుల సుందరీకరణకు సంబంధించి ఒక్కో దానికి సుమారు రూ.30 లక్షలకు పైబడి వ్యయమవుతుందని అంచనా. ఈ మేరకు టెండర్ తప్పనిసరి కాగా.. పిలిస్తే పోటీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చినట్లు తెలుస్తోంది. లోలోపల టెండర్ దక్కించుకున్న ప్రముఖ కాంట్రాక్టర్లు అధికార పారీ్టకి చెందిన నాయకులేనని తెలుస్తోంది. వీరంతా ఓ ముఖ్య నేతకు ప్రధాన అనుచరులుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నోరు మెదపని అధికారులు.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించడం.. పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్, పంచాయతీరాజ్, అటవీ, మున్సిపల్ అధికారులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యనేత ఆదేశాల నేపథ్యంలో వారు నిబంధనలకు నీళ్లు వదిలినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పనులు పూర్తయి న క్రమంలో వ్యయానికి మించి అంచనాలు రూపొందించి.. ఎక్కువ మొత్తంలో దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది లక్షి్మకుంట. 20వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కూడిన ఈ చెరువు సుందరీకరణ పనులు 2021లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సుమారు ఎనిమిది నెలల అనంతరం రూ.31.75 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2022 సెప్టెంబర్లో పరిపాలనా అనుమతులు రాగా.. గత నెల 14న రూ.29.59 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పనులు కొనసాగగా.. అటవీ శాఖ కు సంబంధించి కంపా నిధులు వెచ్చించారు. ఇది రాజనగరం చెరువు. ట్యాంక్ బండ్ నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు గత ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. సుమారు రూ.49 లక్షల వ్యయంతో అదే ఏడాది ఫిబ్రవరిలో ఎస్టిమేషన్ (అంచనా) వేయగా.. అదే నెలలో పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. మార్చిలో కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా.. జూన్లో కొంత మేర బిల్లులు మంజూరయ్యాయి. 2021 ఆగస్టులో తాళ్లచెరువు సుందరీకరణ పనులు ప్రారంభం కాగా..గత ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేసి ప్రభుత్వానికి పంపించారు.అనుమతులు రాగా.. మార్చిలో టెండర్ ప్రక్రియ పూర్తయి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత జూన్లో బిల్లులు మంజూరయ్యాయి. -
నెల్లూరు చెరువులో పడవ బోల్తా..అయిదుగురి మృతదేహాలు లభ్యం
సాక్షి, నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఆరుగురిలో అయిదు మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. మృతులు బాలాజీ, చల్లా ప్రశాంత్, కళ్యాణ్, త్రినాథ్, రఘుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి సురేంద్ర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మంత్రి కాకాణి ,ఎస్పీ విజయరావు, కలెక్టర్ చక్రధర్ బాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జడ్పీ చైర్పెర్సన్ ఆనం అరుణమ్మ.. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (చదవండి: నెల్లూరులో ఘోర ప్రమాదం: తోడేరు చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు యువకుల గల్లంతు) -
నెల్లూరు: తోడేరు చెరువులో ఆరుగురు యువకుల గల్లంతు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తోడేరు చెరువులో బోటు ప్రమాద సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. ప్రమాదం నుంచి తెలియగానే.. కేరళ వ్యవసాయ సదస్సు నుంచి హుటాహుటిన బయలుదేరారు ఆయన. ఈ అర్ధరాత్రికి ఆయన తోడేరుకు చేరుకోనున్నట్లు సమాచారం. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారాయన. -
చెరువులో దూకి.. చెన్నైలో తేలిన టెక్కీ.. కేసులో ఊహించని ములుపు!
కోలారు: 16వ తేదీన కోలారు తాలూకాలోని కెందట్టి చెరువులో బెంగళూరు రూరల్ బాగలూరులో ఉండే చెందిన టెక్కీ రాహుల్ (27), కూతురు దియా (3)తో కలిసి దూకాడన్న కేసులో మిస్టరీ వీడుతోంది. చిన్నారి దియా అదే రోజు చెరువులో శవమై తేలడం తెలిసిందే. టెక్కీ జాడ మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసులు అతడు చెరువులోకి దూకలేదని, పాపను విసిరేసి పరారై ఉంటాడని అనుమానం వ్యక్తంచేశారు. చివరకు అదే నిజమైంది. టెక్కీ రాహుల్ శనివారం చెన్నై నుంచి భార్యకు ఫోన్కు చేసి తనను కిడ్నాప్ చేశారని ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నానని చెప్పినట్లు తెలిసింది. దీంతో అతడు బతికే ఉన్నాడని ఖరారైంది. మరో కొత్త డ్రామా అని అనుమానాలు అయితే కిడ్నాప్ అయ్యానని అతడు చెబుతున్న మాటలు మరో కొత్త డ్రామా అని భావిస్తున్నారు. 15వ తేదీన తన కుమార్తె దియాను బడికి వదలి వస్తానని కారులో బయలేదేరిన రాహుల్ అనంతరం కనిపించలేదు. తరువాత 16వ తేదీన తాలూకాలోని కెందట్టి చెరువులో కూతురు దియా మృతదేహం కనిపించింది. కానీ రాహుల్ కనిపించలేదు. రాహుల్ను నిజంగానే కిడ్నాప్ చేశారా, లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీడి దేవరాజ్ తెలిపారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలను తట్టుకోలేక ఈ విధంగా కథ నడుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చదవండి: షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి.. -
హైదరాబాద్ నానక్ రాంగూడలో విషాదం..
-
గంగ మీద ప్రమాణం చేద్దామని చెరువుకెళ్లి.. నీటిలో మునిగి..
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): తాగిన మత్తులో గొడవ పడిన స్నేహితులిద్దరు ప్రమాణం చేయడానికి చెరువు వద్దకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాసన్ తాలూకా తేజూరు గ్రామానికి చెందిన ఆనంద, చంద్రు హాసన్లో ఒక బేకరిలో పని చేస్తున్నారు. ఖాళీ సమయంలో శుభకార్యాలకు స్వీట్లు చేసి ఇచ్చేవారు. గురువారం బేకరిలో పని ముగించుకొని రింగ్రోడ్డులోని ఒక బార్లో మద్యం తాగారు. గతంలో ఒకరి నుంచి డబ్బు తీసుకుని మిఠాయిలు చేసివ్వలేదు. తాగిన మత్తులో ఈ విషయంపై గొడవ పడ్డారు. తప్పు చేయలేదని గంగను ముట్టి ప్రమాణం చేద్దామంటూ దగ్గరిలోని చెరువులోకి దిగారు. మత్తులో జారి నీటిలోకి పడి మునిగిపోవడంతో విగతజీవులయ్యారు. హాసన పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (నూతన జంట జలసమాధి.. ఐదు నెలల క్రితమే ప్రేమ వివాహం) -
ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా...
-
హిమాయత్ సాగర్ చెరువులో యువకుడు గల్లంతు
-
చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
-
కరువు ప్రాంతాల్లో అనుసంధానం
-
కాలువలతో చెరువుల అనుసంధానం
సాక్షి, అమరావతి: రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరువు ప్రాంతాల్లో కాల్వల ద్వారా చెరువులను అనుసంధానం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? వాటికి నీరు చేరడంలో ఉన్న ఇబ్బందులు, తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో ఈ ప్రాజెక్టు కింద పనులను పరుగులు పెట్టించాలని సూచించారు. విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో (ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్) రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరువు ప్రాంతాల్లో చెరువులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలని ఆదేశించారు. ఈ చెరువులన్నింటికీ గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందన్నారు. చెరువు కింద చక్కగా భూముల సాగు జరుగుతుందని, వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయని తెలిపారు. ఆ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరగాలి విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో వివిధ రంగాలలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్ధేశిత సమయంలోగా ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. న్యూ డెవలప్మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్బీ.. తదితర బ్యాంకుల రుణ సహాయంతో మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25,497.28 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గత చంద్రబాబు ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లును వెంటనే పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పోర్టుల పరిధిలో సత్వర అభివృద్ధి రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నామని, వీటి చుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాటి పరిధిలో ల్యాండ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం అన్నది చాలా అవసరం అని స్పష్టం చేశారు. దీనివల్ల పోర్టు ఆధారితంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ పి రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మించడమేంటి.. వినేవాడుంటే బాబు ఏదైనా చెప్తారు: కొడాలి నాని ఫైర్ -
400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్తో బెంగళూరు నిర్మాణం.. నేటి దుస్థితికి కారణాలేంటి?
చెరువుల నగరంగా ఒకప్పుడు పేరున్న బెంగళూరులో ఆ చెరువులు, వాటి అనుబంధ కాలువలు ప్రభుత్వ నిర్మాణాలకు, కబ్జాల వల్ల అదృశ్యమైపోయాయి. ఫలితంగా వర్షాలు వస్తే ఆ నీరు ఒకప్పుడు జల వనరులు ఉన్న చోటికే వెళ్తోంది. చివరికి ముంపు తయారవుతోంది. దీనివల్ల లక్షలాది జీవితాలు అవస్థల పాలయ్యాయి. బెంగళూరు: నాలుగు వందల ఏళ్ల కిందటే నాడప్రభు కెంపేగౌడ పకడ్బందీ ప్రణాళికతో నిర్మించిన చారిత్రక నగరం బెంగళూరు నేడు మామూలు వర్షానికే గజగజ వణికిపోవడం చూస్తే పరిస్థితి ఎంత దుర్భరంగా తయారైందో ఇట్టే అర్థమవుతుంది. నగరంలో పకడ్బందీగా ఉన్న రాజ కాలువలు వారూ వీరూ అని తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడి ఇళ్లు, భవనాలు కట్టేయడం, చెరువులను చదును చేసి లేఔట్లు నిర్మించడం వల్ల నైసర్గిక స్వరూపాలే మారిపోయి విపత్తులు పుట్టుకొస్తున్నాయి. ఉన్న చెరువులు, కాలువల్లో కూడా పూడిక పెరిగిపోయింది. వాతావరణ మార్పుల వల్ల ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడం మరో కారణం. వర్షపు నీరు రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి చొరబడటంతో ముంపు తలెత్తుతోంది. బెల్లందూరు చెరువు దుస్థితి బెంగళూరు నగరంలో చెరువుల స్థానంలో నిర్మించిన కట్టడాల వివరాలు ►శూలె చెరువులో ఇప్పుడు ఫుట్బాల్ స్టేడియం నిర్మాణమైంది. అక్కితిమ్మనహళ్లి చెరువు– హాకీ స్టేడియంగా, సంపంగి చెరువు –కంఠీరవ స్పోర్ట్ కాంప్లెక్సా్గ, ధర్మాంబుధి చెరువు–కెంపేగౌడ బస్టాండుగా, చల్లఘట్ట చెరువు–కర్ణాటక గోల్ఫ్ మైదానంగా మారిపోయాయి. ►కోరమంగల చెరువు– నేషనల్ గేమ్స్ కాంప్లెక్స్ మైదానం, సిద్దికట్టె చెరువు–కేఆర్.మార్కెట్గా, కారంజీ చెరువు–గాంధీ బజార్, కెంపాబుధి చెరువు–భూగర్భ డ్రైనేజీ సేకరణ ట్యాంక్గా మారిపోయాయి. ►నాగశెట్టిహళ్లి చెరువు– స్పేస్ డిపార్టుమెంట్, కాడుగొండనహళ్లి చెరువు–అంబేడ్కర్ మెడికల్ కాలేజీ, దుమ్మలూరు చెరువు–బీడీఏ లేఔట్, మిల్లర్స్ చెరువు–గురునానక్ భవన్ అయ్యాయి, ►సుభాష్ నగర చెరువు, కురబరహళ్లి చెరువు, కోడిహళ్లి చెరువు, సినీవాగిలు చెరువు, మారేనహళ్లి చెరువులు నేడు నివాస ప్రాంతాలుగా మారాయి. ►శివనహళ్లి చెరువు–క్రీడా మైదానం, బస్టాండుగా రూపాంతరం చెందాయి. ►చెన్నమనచెరువు –స్మశానం, పుట్టేనహళ్లి చెరువు– జేపీ నగర 6వ ఫేజ్, జక్కరాయనచెరువు – క్రీడా మైదానం అయ్యింది. మారతహళ్లిలో బోటులో వెళ్తున్న జనం నగరానికి ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు ప్రతి ఏడాది బెంగళూరు నగరాభివృద్ధి నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వరద ముంపు సమస్యను తప్పించడం సాధ్యం కావడం లేదు. బీబీఎంపీ బడ్జెట్ సుమారు రూ.11 వేల కోట్లు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరో రూ.10 వేల కోట్ల నిధులు లభిస్తాయి. ఇలా ప్రతి ఏడాది రూ. 20 వేల కోట్లను బెంగళూరుపై ఖర్చు చేసినప్పటికీ ప్రజల సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఒకనాటి పొలాలు, చిట్టడవులు మాయం ►అందుకే ఇంత ముప్పు! ప్రకృతిని కాపాడుకోకపోవడమే ఈ వరద ముంపునకు కారణమని పర్యావరణవాదులు పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షంతో జలమయమైన బెంగళూరులోని లేఔట్లు గతంలో పొలాలు, చెరువులు, అచ్చుకట్ట ప్రాంతాలు, చిట్ట అడవులతో కూడుకున్న ప్రదేశాలు. గత పది, ఇరవై ఏళ్లలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో భారీఎత్తున లేఔట్లు, కట్టడాలు, రోడ్లు నిర్మించారు. ఇప్పుడు కుండపోత వర్షాలకు చెరువుల్లా తయారయ్యాయి. ఏ ప్రాంతంలో ముందు చెరువు ఉండేది, ఎక్కడ రాజ కాలువ ఉండేది అనేదానిని ప్రస్తుత ముంపు చాటిచెబుతోందని పరిసరవాదులు అభిప్రాయపడ్డారు. రెయిన్ బో లేఔట్లో తీరని ముంపు కష్టం ప్రధానంగా బెల్లందూరు, వర్తూరు, విభూతిపుర, సావళచెరువు, బేగూరు చెరువు చుట్టుపక్కల లేఔట్లు ప్రస్తుతం భారీ వర్షాలతో జలంలో చిక్కుకున్నాయి. ఈ చెరువుల విస్తీర్ణం గత 40 ఏళ్లతో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. ఈ చెరువులకు వెళ్లే రాజ కాలువలపై కట్టడాలు వెలిశాయి. అక్రమ కట్టడాలను తొలగించాల్సిన ప్రభుత్వం సక్రమ పథకంతో అనుకూలం చేయడం ప్రకృతికి మంచి చేయదని పరిసరవాది యల్లప్పరెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
చెరువులకు చేవ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాన నీటిని ఒడిసిపట్టేందుకు ప్రభుత్వం చెరువులకు ఊపిరిపోస్తోంది. ఇప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేయడం.. అవసరమైతే కొత్తవి నిర్మించడానికి పూనుకుంది. కేంద్ర జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ‘క్యాచ్ ది రెయిన్’ (వర్షపు నీటిని ఒడిసిపడదాం) పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉండే అన్ని రకాల చెరువుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. వాగుల మధ్య చెక్ డ్యాంలను నిర్మించి కనీసం ఎకరం విస్తీర్ణంలో నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉన్నవి మొదలుకొని మైనర్ ఇరిగేషన్ విభాగం పరిధిలో ఉండే పెద్దపెద్ద చెరువులను ఒక్కొక్క వాటర్ బాడీ (నీటిని నిల్వ ఉంచే చెరువు)గా వర్గీకరించగా.. అలాంటివి మొత్తం 1,90,726 ఉన్నట్లు గుర్తించారు. ప్రతీ వాటర్ బాడీ ఎంత విస్తీర్ణంలో ఉందన్న సమాచారంతో పాటు రేఖాంశాలు, అక్షాంశాలతో కూడిన శాటిలైట్ గణాంకాల ప్రకారం అధికారులు జియో ట్యాగింగ్ చేశారు. ఆ వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిచారు. ఇక రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలతో పాటు 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలు ఉన్నాయి. అంటే ప్రతి ఊరిలో సరాసరి 10–14 వరకు ఈ తరహా చెరువులున్నాయి. అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 50 వేల వరకు ఉండగా, అత్యల్పంగా ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలో నాలుగేసి వేలకు లోపునే ఉన్నాయి. ప్రస్తుతం పురోగతిలో 74,722 పనులు ఇక రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చెరువులను సద్వినియోగం చేసుకునేందుకు వీలైనంత ఎక్కువ మొత్తంలో వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అన్ని శాఖలకు సంబంధించి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా మొత్తం రూ.3,970 కోట్లతో వర్షపు నీటి నిల్వకు ఉపయోగపడే పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టలు బలోపేతం, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టడం వంటి 74,722 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు తెలిపారు. అమృత్ సరోవర్లలో రాష్ట్రం రెండోస్థానం.. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ‘అమృత్ సరోవర్’ పేరిట వచ్చే ఏడాది కాలంలో ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువుల చొప్పున కొత్తవి ఏర్పాటుచేయడం.. లేదా పాతవాటిని అభివృద్ధి చేయడం చేయాలని.. వీటిలో 20 శాతం మేర ఈ ఆగస్టు 15కే పూర్తిచేయాలని రాష్ట్రాలకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. వీటిలో ఇప్పటికే 20 శాతం కంటే ఎక్కువగా అంటే 519 చెరువులను అభివృద్ధిచేసి దేశంలోనే రెండో స్థానంలో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. -
కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ.. సడన్గా నది దగ్గర ఆగి..
మాలూరు(బెంగళూరు): కళాశాల ముగించుకుని తిరిగి ఇంటికి బయల్దేరిన ఇద్దరు విద్యార్థినులు కాలువలోకి దూకారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. ఈఘటన బెంగుళూరు రూరల్ జిల్లా ముగళూరు గ్రామం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలిని బెంగుళూరు రూరల్ జిల్లా హొసకోట తాలూకా బాగూరు గ్రామానికి చెందిన రాజప్ప కుమార్తె ఆర్.రాజేశ్వరి(17)గా గుర్తించారు. గల్లంతైన విద్యార్థిని సుప్రియ(17)ను మాలూరు తాలూకా కోడూరు గ్రామ పంచాయతీకి చెందిన మునియప్ప, లక్ష్మమ్మల కుమార్తెగా గుర్తించారు. ఆమె కోసం గాలిస్తున్నారు. ఎం.సుప్రియ, రాజేశ్వరిలు చదువుల్లో ప్రతిభావంతులు. మంగళవారం ఉదయం ఎప్పటిలానే కళాశాలకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్లాల్సి ఉండగా బెంగుళూరు రూరల్ జిల్లా ఆనేకల్ తాలూకా ముగళూరు సమీపంలో ప్రవహించే దక్షిణ పినాకిని నది కాలువ వద్దకు వెళ్లారు. సమీపంలోని బేకరిలో తినుబండారాలు కొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో కాలువలోకి దూకారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అనుగొండనహళ్లి ఎస్ఐ సంగమేష్, అగ్నిమాపక సిబ్బంది వెళ్లి గాలించగా రాజేశ్వరి విగతజీవిగా కనిపించింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు కార్యాచరణ జరిపినా సుప్రియ ఆచూకీ కనిపించలేదు. తిరిగి బుధవారం ఉదయం నుంచి గాలిస్తున్నా జాడ తెలియలేదు. ఎమ్మెల్యే నంజేగౌడ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు. వీరిద్దరూ కాలువలోకి దూకడానికి దారితీసిన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. సూసైడ్ నోట్ లభ్యం మన పెళ్లికి ఎవరూ అంగీకరించేది లేదని, నీవు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అంటూ సుప్రియ రాసినట్లుగా చెబుతున్న లేఖ ఘటన స్థలంలో లభించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: Loan Apps: లోన్యాప్ వేధింపులకు బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య! -
నాన్నకు ప్రేమతో.. తన తండ్రి పేరు గుర్తుండిపోవాలని..
సాక్షి,నరసన్నపేట(శ్రీకాకుళం): తన తండ్రి పేరు గుర్తుండిపోయేలా.. నిత్యం అంతా గుర్తు తెచ్చుకునేలా ఓ కుమారుడు మంచి పని చేశాడు. నరసన్నపేట మండలం సత్యవరం కూడలి వద్ద జాతీయ రహదారికి ఆనుకుని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సుసరాం చెరువును తన తండ్రి పాగోటి రాములు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పాగోటి రాజారావు బాగు చేయించారు. పూడికతో అధ్వానంగా ఉన్న ఈ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. రూ.50 లక్షలకు పైగా సొంత నిధులు వెచ్చించి ఆదర్శంగా నిలిచా రు. గుర్రపు డెక్క, పూడికతో అధ్వానంగా ఉన్న ఈ చెరువును అభివృద్ధి చేయాలని సత్యవరం గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరిగారు. ప్రయోజనం లేకపోయింది. వర్షాలు అధికమైతే చెరువు నీరు పొలాల మీదకు వచ్చి పంటలను నష్ట పరుస్తుండేది. ఈ దశలో చెరువును అబివృద్ధి చేయాలని రాజారావును గ్రామస్తులు కోరగా ఆయన ముందుకు వచ్చి పనులు చేపట్టారు. దీంతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. రెండు నెలల కిందట అధ్వానంగా కనిపించిన చెరువు ఇప్పుడు అందంగా మారింది. అలాగే మరో రూ. 5 లక్షలు వెచ్చించి వంద అడుగుల వెడల్పుతో మెట్లు నిర్మించారు. గట్టు చుట్టూ 200 కొబ్బరి మొక్కలు వేయించారు. సత్యవరం గ్రామస్తులతో పాటు నరసన్న పేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాగోటి రాజారావును అభినందించారు. గ్రామాల్లో దాతలు ఈ విధంగా ముందుకు వచ్చి పూడుకుపోయిన చెరువులు అభివృద్ధి చేయాలని, భూగర్భ జలాలను పెంపొందించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాగా ఈ చెరువులో బోట్ షికార్ చేసేందుకు పంచాయతీ ఏర్పాట్లు చేస్తోంది. రాజారావు బోట్లను సమకూర్చుతుండగా దీని నిర్వహణ బాధ్యత పంచాయతీ తీసుకుంటుందని సర్పంచ్ బూరల్లి శంకర్ తెలిపారు. చదవండి: Extramarital Affair: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక.. -
శింగనమల ప్రజల 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేరిన వేళ
-
చెరువుల తవ్వకాల్లో బయటపడ్డ ఇటుకల గోడ...అది మౌర్య సామ్రాజ్యపు..
పాట్నా: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మిషన్ అమృత్ సరోవర్ పనుల్లో భాగంగా బీహార్లోని పాట్నాలో కుమ్రహర్ ప్రాంతంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో ఒక పురాతనమైన గోడల అవశేషాలు బయటపడ్డాయి. ఇవి రెండు వేల ఏళ్ల నాటి మౌర్య సామ్రాజ్యపు గోడల అవశేషాలని ఆర్కియాలజిస్ట్ గౌతమి భట్టాచార్య అన్నారు. అంతేకాదు బహుశా కుషాన్ యుగం నుంచి కూడా ఉండవచ్చని చెబుతున్నారు. వాస్తవానికి మిషన్ అమృత్ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా పాట్నాలో రక్షిత చెరువులను పునరుజ్జీవింప చేసే పనులను చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా ఈ తవ్వకాలు జరుపుతున్నప్పుడు చెరువులో ఈ పురాతన గోడల అవశేషాలు గుర్తించామని చెప్పారు. ఈ గోడలోని ఇటుకలు క్రీస్తు శకం 30వ శతాబ్దం నుంచి 375 కాలంలోని మధ్య ఆసియా(అంటే ప్రస్తుత ఆప్గనిస్తాన్)ని పాలించిన కుషాన్ యుగానికి చెందినవని తెలుస్తోందన్నారు. ఈ విషాయాన్ని న్యూఢిల్లీలోని ఏఎస్ఐ ప్రధాన కార్యాలయంలోని సీనియర్ అధికారులకు కూడా తెలియజేశాం అని గౌతమి పేర్కొన్నారు. ఈ మేరకు బీహార్లోని పాట్నాలో మొత్తం పదకొండు రక్షిత నీటి వనరులను పునరుజ్జీవింప పనులు చేపట్టింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ). (చదవండి: ఈ జంట మరీ వైల్డ్! పూల దండలుగా) -
అనంతపురం: నెరవేరిన నాలుగున్నర దశాబ్దాల కల
శింగనమల రంగరాయల చెరువు ఆయకట్టుదారుల కల నాలుగున్నర దశాబ్దాలకు సాకారమైంది. చెరువుకు ఒక టీఎంసీ కృష్ణా జలాలు కేటాయిస్తూ మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతవాసుల కలతో పాటు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంకల్పమూ నెరవేరినట్లయ్యింది. ఆరువేల ఎకరాల్లో సాగుకు సానుకూలమైంది. రైతులు, వ్యవసాయ కూలీలే కాదు.. మత్స్యకారుల మోముల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. సాక్షి,శింగనమల(అనంతపురం): శింగనమలలోని రంగరాయల చెరువు జిల్లాలోనే అతిపెద్దది. శింగనమల, గోవిందరాయునిపేట, సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం, పెద్దమట్ల గొంది, చీలేపల్లి, శివపురం, సి.బండమీదపల్లి, పోతురాజుకాల్వ, చక్రాయిపేట, పెరవలి గ్రామాల వరకు అధికారిక, అనధికారికంగా దాదాపు ఆరువేల ఎకరాల ఆయుకట్టు ఉంది. చెరువులో నీరుంటే ఈ గ్రామాలతో పాటు నాయనవారిపల్లి, చిన్నమట్ల గొంది, ఆనందరావుపేట, చిన్నజలాలపురం, గురుగుంట్ల, మదిరేపల్లి, నీలాంపల్లి, పాత చెదుల్ల, కొత్త చెదల్ల, కొర్రపాడు గ్రామాల వరకు భూగర్భజలం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెరువును లోకలైజేషన్ చేయాలన్నది ఈ ప్రాంత రైతుల డిమాండ్. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు లోకలైజేషన్ అంశాన్ని 1978 నుంచి ఎన్నికల హామీగా మార్చేశాయి. ఒకానొక దశలో టీడీపీ హయాంలో ‘లోకలైజేషన్’ జీఓ తెచ్చామని ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే ప్రజలు వారి మాటలను నమ్మలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నాలుగేళ్లపాటు శింగనమల చెరువుకు నీళ్లు వచ్చాయి. నార్పలలో నిర్వహించిన బహిరంగ సభలో ‘లోకలైజేషన్’ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన అకాల మరణంతో హామీ నెరవేరలేదు. కనీసం చెరువుకు నీరు విడిపించే దిక్కు లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చొరవ తీసుకుని పలు దఫాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి చెరువుకు నీరు విడుదల చేయించారు. నేటికీ నీటితో చెరువు కళకళలాడుతోంది. వైఎస్సార్ హయాంలో ఇచ్చిన హామీని.. తనయుడు సీఎం వైఎస్ జగన్ ద్వారా నెరవేర్చడంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సఫలీకృతులయ్యారు. ఏటా పంటలు శింగనమల రంగరాయల చెరువుకు ప్రతి ఏటా ఒక టీఎంసీ కృష్ణా జలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. హంద్రీ–నీవా కాలువ ద్వారా పీఏబీఆర్, అటు నుంచి నుంచి మిడ్ పెన్నార్ (ఎంపీఆర్), అక్కడి నుంచి దక్షిణ కాలువ ద్వారా శింగనమల చెరువుకు నీళ్లు రానున్నాయి. చెరువు నీటి నిల్వ సామర్థ్యం ఒక టీఎంసీ. నీరు వదిలితే ఏటా పంటలు పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులకు ఉపాధి చెరువులో నీరు ఉంటే చేపల వేటకు ఢోకా ఉండదు. 300 మత్స్యకార కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నాయి. మత్స్యకారులకు ఎప్పుడూ చేపల వేట ఉంటుంది. తద్వారా జీవనోపాధి మెరుగుపడనుంది. ఆనందంగా ఉంది శింగనమల చెరువుకు నీటి కేటాయింపు అనేది ఎన్నో ఏళ్లపాటు హామీగానే నిలిచిపోయింది. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఎవ్వరూ నెరవేర్చలేకపోయారు. కానీ జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మా చెరువుకు నీటిని కేటాయించడానికి ఎంతో కృషి చేశారు. చెరువు కింది ఆయకట్టు రైతులు, వ్యవసాయ కూలీలు చాలా సంతోషంగా ఉన్నారు. – గోవిందరెడ్డి, చెరువు ఆయకట్టు రైతు సంఘం నాయకులు, శింగనమల జలప్రదాత పద్మావతి శింగనమల చెరువుకు నీటి కేటాయింపునకు కృషి చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి మత్స్యకారులు జీవితాంతం రుణపడి ఉంటారు. చెరువులో నీరు లేక ఎన్నో సంవత్సరాలు చేపల పెంపకం చేపట్టలేకపోయాం. కానీ ఎమ్మెల్యే పద్మావతి చెరువుకు నీటి కేటాయింపులు చేయించి మాకు జలప్రదాతగా మారింది. – వెంకటనారాయణ, మత్స్యకారుడు, శింగనమల మాట ఇచ్చారు.. నెరవేర్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి నార్పల బహిరంగసభలో చెరువు లోకలైజేషన్ చేస్తామని మాట ఇచ్చారు. ఆయన మృతి చెందిన తర్వాత అధికారంలోకి వచ్చిన వారు పట్టించుకోలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత చెరువు సమస్యను వివరించా. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు శింగనమల చెరువుకు ఒక టీఎంసీ నీరు కేటాయించారు. శింగనమల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాం. చాలా సంతోషంగా ఉంది. – ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల -
మద్యానికి బానిసైన భర్త... భార్య ఇద్దరు పిల్లలను నీటిలో ముంచి...
ఇబ్రహీంపట్నం రూరల్: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి. కుటుంబ యజమాని భార్య, ఇద్దరు పిల్లలను చెరువులో ముంచి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ కథనం ప్రకారం.. హైదరాబాద్ సంతోష్నగర్కు చెందిన మహమ్మద్ ఖుద్దూస్ (37), ఫాతిమా (27) దంపతులకు మెహక్బేగం (9), ఫిర్దోస్ బేగం (6) సంతానం. వీరు అదే ప్రాంతంలోని సలావుద్దీన్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఖుద్దూస్ బడంగ్పేట్లో వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ప్రమాదానికి గురై నడుం నొప్పితో బాధపడుతున్న ఖుద్దూస్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో సాఫీగా సాగుతున్న సంసారంలో కలతలు మొదలయ్యాయి. పైగా ఆర్థిక ఇబ్బందులు తోడవంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. రెండు రోజుల క్రితం బావమరిది హమీద్ను రూ.10 వేలు అప్పు ఇప్పించాలని ఖుద్దూస్ అడగగా.. రెండు మూడు రోజుల తర్వాత చూద్దామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన ఖుద్దూస్.. భార్యను,ఇద్దరు పిల్లలను షాహీనగర్కు వెళదామని చెప్పి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మల్లాపూర్ చౌరస్తా నుంచి నేరుగా వెళ్లకుండా వాహనాన్ని కుర్మల్గూడ వైపు దారి మళ్లించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో కుర్మల్గూడ అంతిరెడ్డి చెరువు వద్ద ద్విచక్ర వాహనం నిలిపాడు. ముందుగా పిల్లలు, భార్యను చెరువులో ముంచి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలను చెరువులో ముంచుతుండగా.. అరుపులు వినిపించడంతో గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో ఖుద్దూస్, చిన్న కూతురు ఫిర్దోస్ బేగం మృతదేహాలను వెలికితీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మంగళవారం ఉదయం భార్య ఫాతిమా బేగం, మెహక్బేగం మృతదేహాలను బయటికి తీశారు. ఖుద్దూస్ బావమరిది హమీద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: ఫేస్బుక్ లవ్.. లవర్ కోసం నదిలో ఈది భారత్లోకి వచ్చాక.. షాకింగ్ ట్విస్ట్) -
ష్.. ఆ ఫిష్ తిన్నారో.. ఆరోగ్య సమస్యలు వద్దన్నా వస్తాయ్!
కొందరి స్వార్థం సమాజానికి హానికరంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించాలన్న దురాశ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో హానికరమైన క్యాట్ ఫిష్ను ప్రభుత్వం నిషేధించినా.. చాటు మాటుగా పెంపకాలు జరుగుతూనే ఉన్నాయి. కొర్రమీను పేరుతో హోటల్స్లో ఆహార పదార్థాల విక్రయాలు చేస్తున్నారు. వీటికి ఆహారంగా కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తుండటం అనేక అనార్థాలకు దారి తీస్తోంది. మరో వైపు చెరువు పరిసర ప్రాంతాలు, భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. చెరువుల గట్లపై పడిన చికెన్ వ్యర్థాలను పక్షులు తీసుకెళ్లడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు లేకపోలేదు. సాక్షి, నెల్లూరు: క్యాట్ ఫిష్.. ఇది కుళ్లిన మాంసాన్ని తిని పెరిగే చేప. కేవలం ఆరు నెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్ధం చేసుకోవచ్చు. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. చేపల చెరువుల మధ్యలో చిన్న చిన్న చెరువుల్లో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు. చేపల్లో బాగా డిమాండ్ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్ ఫిష్ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోనే.. జిల్లాలోని పెన్నాపరీవాహక ప్రాంతంలోని కోవూరు నియోజకవర్గంలో నిషేధిత క్యాట్ఫిష్ పెంపకం చేస్తోన్నారు. కోవూరు, ఇనమడుగు, దామరమడుగు, బుచ్చిరెడ్డిపాళెం, పెనుబల్లి ప్రాంతాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో మంచినీటి చేపల పేరుతో క్యాట్ఫిష్ పెంపకం చేస్తున్నట్లు తెలిసింది. వీటిని దొడ్డిదారిన జిల్లాతో పాటు చెన్నై, బెంగళూరు నగరాలకు రవాణా చేస్తున్నారు. కొర్రమీను పేరుతో.. క్యాట్ ఫిష్ చూసేందుకు కొర్రమీనును పొలి ఉంటుంది. కొర్రమీనులో ఒకే ముల్లు ఉంటుంది. కానీ క్యాట్ ఫిష్లో ముళ్లే ఉండవు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్ను విక్రయిస్తున్నారు. ఖర్చు తగ్గుతుందని.. చేపలకు ఆహారంగా తవుడు, సోయాబీన్ తదితర వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు. ఇది కిలో ధర రూ.28 నుంచి రూ.30 వరకు మధ్య ఉంటుంది. మేత ద్వారా కిలో చేపను పెంచడానికి సుమారు రూ.55 వెచ్చించాల్సి ఉంటుంది. అదే కోళ్ల వ్యర్థాలు చికెన్ సెంటర్ల నుంచి కిలో రూ.10 వంతున కోనుగోలు చేసి వీటి ద్వారా చేప పెంచడానికి రూ.25 సరిపోతుండడంతో కోళ్ల వ్యర్థాలను వాడుతున్నారు. ముఖ్యంగా క్యాట్ ఫిష్లు త్వరగా పెరగాలన్నా.. బరువు రావాలన్నా.. మాంసం వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. మాంసం వ్యర్థాలనే క్యాట్ ఫిష్లు బాగా తింటాయి కాబట్టి ఆహారంగా వేస్తున్నారు. వ్యర్థాలే మేత ఈ చేపలకు కోళ్ల వ్యర్థాలే మేతగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలో లభించే వ్యర్థాలతో పాటు చిత్తూరు, తిరుపతి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వ్యర్థాలు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాస్టిక్ డమ్ముల్లో నింపి ఆటోలు, లారీల్లో చేపల గుంతల వద్దకు తరలించి మేతగా వేస్తున్నారు. కిలో వ్యర్థాన్ని రూ.8 నుంచి రూ.10 వంతున కొనుగోలు చేసి మేతగా వినియోగిస్తున్నారు. 2016 లో రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ ఫిషతో అనర్థాలు ఈ చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్లో ఉండే ఒమేగా ఫ్యాట్ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ రకం చేప దవడ కింద ఉండే ముల్లు తింటే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో వీటి పెంపకం, అమ్మకాలు జరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు చేపలను తినాలని వైద్యులు చెబుతుండగా ఇలా కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్ను విక్రయాలు భారీగా పెరిగాయి. అధికారులకు తెలిసినా నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారని, కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు తరచూ పోలీసు దాడులు ద్వారా తెలిసినా మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కోవూరు ప్రాంతంలో జరుగుతున్న క్యాట్ ఫిష్ సాగు పక్కా సమాచారం ఉన్నా.. వారు తెలియనట్లు నటి స్తున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాట్ ఫిష్ సాగుదారులు అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. చర్యలు తీసుకుంటాం క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు వాడకూడదనే ఆదేశాలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోళ్ల వ్యర్థాలు వాడితే గరిష్టంగా రూ. 50 వేలు వరకు జరిమానా విధించే అధికారం మత్స్యశాఖ అధికారులకు ఉంది. రెండో సారి పునరావృతం చేస్తే సాగుదారుల లైసెన్స్ రద్దు చేసి సరుకు స్వాధీనం చేసుకుంటారు. ఎక్కడైనా క్యాట్ ఫిష్ సాగవుతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..! -
‘నాన్న.. దుబాయ్ నుంచి రాంగ సెల్ఫోన్ తీసుకురా అన్నావే’
సాక్షి,ధర్మపురి: ‘నాన్న.. దుబాయ్ నుంచి రాంగ సెల్ఫోన్, టీవీ తీసుకురా.. ఇక్కడ చెల్లె నేను మంచిగ చదువుకుంటున్నం అంటూ రోజూ ఫోన్లో మాట్లాడినవు.. నీ మాటలు దూరమయ్యాయి. బిడ్డా నువ్వు వెళ్లిపోయావా.. దుబాయ్ నుంచి నీ కోసం అచ్చిన లే బిడ్డా’.. అంటూ తండ్రి కిషన్.. ‘మరో మూడు నెలల్లో రావాలని అనుకుంటే నాన్నను ఇప్పుడే నీ దగ్గర కు రప్పించుకున్నావా కోడుకా’.. అంటూ తల్లి పుష్పలత రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. మండలంలోని తుమ్మెనాల చెరువులో ఆదివారం ఈత కోసం వెళ్లి ముగ్గరు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న విసయం తెలిసిందే. చివరిచూపు కోసం.. చెరువులో ఆదివారం మృతిచెందిన మారంపెల్లి శరత్, పబ్బతి నవదీప్ల మృతదేహాలను తుమ్మెనాలలో బాడీ ప్రీజర్లలో భద్రపరిచారు. సోమవారం మధ్యాహ్నం మృతుడు శరత్ మృతదేహానికి తండ్రి సతీశ్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈక్రమంలో మంగళవారం నవదీప్కు తుమ్మెనాల గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. దుబాయ్ నుంచి తండ్రి కిషన్ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించాడు. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకే తండ్రి తలకొరివి పెట్టడం అందరినీ కంటతడి పెట్టించింది. చదవండి: Bholakpur Corporator: పోలీసులకు వార్నింగ్.. కేటీఆర్ సీరియస్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్ -
‘కొడుకా.. ఎంత పని జేత్తివి బిడ్డా.. ’
సాక్షి,ధర్మపురి(కరీంనగర్): ‘కొడుకా.. ఒక్కగానొక్కడివి.. అల్లారు ముద్దుగా పెంచితిమి.. మంచి సదువులు సదివి ముసలోల్లమయ్యాక మమ్మల్ని సాకుతవని ఆశపడ్తిమి.. నీ మీద ఎన్నో కలలు కంటిమి.. మధ్యల నువ్ గిట్ల జేత్తివి బిడ్డా.. ఇక మేం ఎవరి కోసం బతుకుడు బిడ్డా’ అంటూ మారంపెల్లి శరత్ తండ్రి మారంపెల్లి సతీశ్ రోదించిన తీరు కంటతడి పెట్టించింది. తుమ్మెనాలకు చెందిన మారంపెల్లి శరత్(12,) పవ్బం నవదీప్(12), యాదాద్రి భువనగిరి జిల్లా దాసారం గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్(13) ఆదివారం ఈతకోసమని పాఠశాల సమీపంలోని చెరువులోకి వెళ్లి నీట మునిగి చనిపోయిన విషయం విదితమే. కన్నకొడుకు చనిపోయాడనే సమాచరం అందుకున్న సతీశ్.. బెహరాన్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. స్వగ్రామంలో ఉపాధి లేక, కొడుకు, భార్యను సాకేందుకని సురేశ్ 4నెలల క్రితమే బెహరాన్ వెళ్లాడు. అతడి భార్య రజిత గ్రామంలో కూలీ పనులు చేస్తూ కొడుకును అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఈత కోసం చెరువులోకి వెళ్లి కొడుకు మృతి చెందడంతో ఆమె కలలు కల్లలయ్యాయి. బెహరాన్ నుంచి వచ్చిన సురేశ్.. ప్రీజర్లో ఉంచిన కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. కుమారుడి చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తిచేశాడు. ఉపాధ్యాయుల సంతాపం ముగ్గురు విద్యార్థుల మృతికి ప్రధానోపాధ్యాయుడు గాదె శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాఠశాలలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. విషాదంలో నవదీప్ కుటుంబం.. కిషన్ – పుష్పలత దంపతులకు కుమారుడు పబ్బతి నవదీప్, ఓ కూతురు ఉంది. కిషన్ ఉ పాధి కోసం విదేశాలకు వెళ్లాడు. అతడు మంగళవారం స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉంది. నవదీప్ మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచా రు. తండ్రి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేస్తారు. మృతి చెందిన మరో విద్యార్థి గొలు సుల యశ్వంత్ మృతదేహాన్ని స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాకు తీసుకెళ్లారు. చదవండి: దొంగతనం కేసు.. సెల్ఫీ వీడియో తీసి.. -
చెరువు మెరిసి.. చేను మురిసి!
2021–22వ సంవత్సరానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 934 మి.మీ కాగా, మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,485 మి.మీ వర్షపాతం నమోదైంది. 2021 ఖరీఫ్ సీజన్లో 1,90,955 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 1,77,075 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో వరి 37,950 హెక్టార్లలో, వేరుశెనగ 94,629 హెక్టార్లలో, ఇతర పంటలు 44,496 హెక్టార్లలో సాగు చేశారని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల, చెరువులు నిండు కుండల్లా ఉండటంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అదే విధంగా వర్షాలకు కురిసిన నీటిని సంరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల వివరాలను పరిశీలిస్తే.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థకు ఆధారాలుగా ఉన్న చెరువులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత సర్కారు చేసిన తప్పిదాల వల్ల అనేక మంది రైతులు, ప్రజలు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, నూతన చెరువులు, ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ పనులకు వందల కోట్లు వెచ్చిస్తోంది. కాలువల తవ్వకానికి రూ.193.23 కోట్లు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్ జలాశయం నుంచి గంగాధరనెల్లూరు, పెనుమూరు మండలాల్లోని చెరువులకు నీరు సరఫరా చేసేందుకు వరద కాలువ తవ్వకాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.193.23 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత విజయవాడకు చెందిన ఎస్ఎల్టీసీ అనుమతితో టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరద ప్రవాహ కాలువల ప్రక్రియ పూర్తి కాగానే 2,439 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి పనులు ఇలా.. ► శ్రీకాళహస్తి, ఏర్పేడులలో కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్స్ పునరుద్ధరణ కింద 48 చెరువుల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.40 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ పనులు పూర్తి కాగానే 13,050 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. ► ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో జిల్లా వ్యాప్తంగా 187 చెరువుల అభివృద్ధికి రూ.54.39 కోట్లు మంజూరు చేశారు. ► గత ఏడాది నవంబర్లో తుఫాను కారణంగా దెబ్బతిన్న 617 చెరువులు, కాలువలు, ఇతర నీటి పారుదల కట్టడాల తాత్కాలిక మరమ్మతులకు రూ.11.37 కోట్లు ఖర్చు చేశారు. ► చిత్తూరు, బంగారుపాళ్యం, గుడిపాల, జీడీనెల్లూరు, సత్యవేడు, వరదయ్యపాళ్యం మండలాల్లో చెరువులు, సరఫరా కాలువల అభివృద్ధికి 15 పనులకు రూ.18.60 కోట్లు మంజూరు చేశారు. ఇవి పూర్తయితే 3,850 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. ► చిత్తూరు, తవణంపల్లి, ఐరాల, మొలకలచెరువు, కలకడ, గంగాధరనెల్లూరు, గుడిపాల, పెనుమూరు, గుర్రంకొండ, కలికిరి మండలాల్లో చెరువుల అభివృద్ధి పనులకు రూ.13.36 కోట్లు మంజూరు చేశారు. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే 2,790 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. ► ఏపీఐఎల్ఐపీ–2 పథకంలో భాగంగా 53 చెరువులకు రూ.32.82 కోట్లు మంజూరయ్యాయి. ► పిచ్చాటూరు మండలంలో అరణియార్ ప్రాజెకు పునరుద్ధరణకు రూ.35.64 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. కార్వేటినగరంలో కృష్ణాపురం ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రూ.31.80 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ఈ పనులు పూర్తయితే 26,626.78 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని ఇరిగేషన్ ఎస్ఈ విజయ్కుమార్ రెడ్డి వెల్లడించారు. చెరువుల అభివృద్ధికి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా పనుల పురోగతిపై ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. చెరువులను పునరిద్ధరించడం, ప్రాజెక్టుల పనులతో రైతులకు, ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. జిల్లా మొత్తం మంజూరైన పనులను వేగవంతంగా నిర్వహించి పురోగతి చూపేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నాం. – హరినారాయణన్, జిల్లా కలెక్టర్ -
చెరువులను పరిరక్షించండి
సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు, చెరువుల సుందరీకరణకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులపై శనివారం నానక్రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుల సంరక్షణపై ప్రత్యేకంగా చర్చించారు. నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువుల సంరక్షణకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కేటీఆర్ సూచించారు. హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ కూడా అనేక చెరువులను అభివృద్ధి చేస్తోందని, ఈ మేరకు రెండు సంస్థలు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. గండిపేట సుందరీకరణను మరింత వేగంగా విస్తృతస్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని, ఇది అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుతుందన్నారు. భూముల భద్రతపై దిశానిర్దేశం.. మరోవైపు హెచ్ఎండీఏ అదీనంలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రేడియల్ రోడ్లు, మూసీ ప్రక్షాళన, మూసీపై బ్రిడ్జీల నిర్మాణం, హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణం, రానున్న స్వల్ప , దీర్ఘకాలిక భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రణాళికలపై అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. -
రూ.70 కోట్లతో ఎస్టీపీల అభివృద్ధి
మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గంలోని ముఖ్యమైన చెరువుల వద్ద సుమారు రూ.70 కోట్లతో ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు. సఫిల్గూడలోని ఎస్టీపీతో పాటు నూతనంగా ఏర్పాటు చేయనున్న బండ చెరువు ప్రాంతాలను శనివారం ఆయన జలమండలి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సఫిల్గూడ లోని 0.5 ఎంఎల్డీ ప్లాంట్ సామర్థ్యాన్ని సుమారు రూ.12.45 కోట్లతో 5.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీగా మార్చుతున్నామన్నారు. బండచెరువు వద్ద సుమారు 28.15 కోట్లతో 15 ఎంఎల్డీ ఎస్టీపీ సామర్థ్యం గల ఎస్టీపీ ఏర్పాటు కోసం పిల్లి నర్సింగరావు కాలనీలో సుమారు మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామన్నారు. ఆల్వాల్ కొత్త చెరువు వద్ద సుమారు రూ.28.90 కోట్లతో 15.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు, నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎమ్మెల్యే వెంట జలమండలి ప్రాజెక్ట్ అధికారి నరేందర్కుమార్, జీఎం సునీల్కుమార్, డీజీఎంలు స్రవంతి రెడ్డి, భాస్కర్, జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ డీసీ జి.రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేష్, తహసీల్దార్ వినయలత, ఉన్నారు. చెరువుల ప్రక్షాళనకు చర్యలు.. అల్వాల్: అల్వాల్లో చెరువుల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం ఆయన అధికారులు, కార్పొరేటర్లతో కలిసి అల్వాల్ కొత్త చెరువును పరిశీలించారు. భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడుతున్న అల్వాల్లోని మోత్కుల కుంట చెరువు, కొత్త చెరువు, చిన్నరాయుడి చెరువులలో మురుగు నీరు కలుస్తుండటంతో నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. చెరువులలోకి వరదనీటిని మళ్లించడంతో పాటు వ్యర్థాలను శుద్ధి చేయడానికి ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఇందుకోసం రూ.1 50 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, ప్రేంకుమార్, డీసీ నాగమణి, అధికారులు నాగేందర్, నిర్మల, పవన్కుమార్, ఈఈ రాజు, డీఈలు మహేష్ , ప్రశాంతి, ఏఈ, లక్ష్మీ, జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా వసతుల కల్పన అల్వాల్: వెంకటాపురం డివిజన్లో అన్ని కాలనీల్లో ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రూ.1.03 కోట్ల వ్యయంతో భూదేవినగర్, సుభాష్నగర్, ఇందిరానగర్లో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన కార్పొరేటర్ సబితాకిషోర్తో కలిసి ప్రారంభించారు. -
ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..
సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రమాదవశాత్తు చెరువులో బైక్తో సహా పడి.. రాత్రంతా నిస్సాహాయంగా అక్కడే ఉండిపోయిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీ చెందిన రాజుపాలెం ప్రసాద్ (22) రాడ్బెండింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. ఈనెల 20వ తేదీన ఉన్నవకు వచ్చిన తన స్నేహితుడిని బైక్పై కొప్పర్రు గ్రామంలో విడిచి రాత్రి 11.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. కొప్పర్రు దాటి అరకిలోమీటరు దూరంలోకి రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. సమీపంలోని చెరువులోకి నేరుగా దూసుకెళ్లింది. చెరువులో పడ్డ ప్రసాద్ మీద బైక్ పడటంతో తిరిగి లేవలేకపోయాడు. ప్రమాదం నుంచి రక్షించమని కోరేందుకు ఇరువురుకి ఫోన్ చేయగా అర్థరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ ఎత్తలేదు. చెరువు నీటిలో తడవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ప్రసాద్ రాత్రంతా చెరువులోనే బైక్ కింద నిస్సహాయంగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ వైపుగా పొలం పనులకు వెళ్తున్న రైతులు గమనించి చెరువు నుంచి బయటకు తీశారు. వివరాలను అడిగి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించి, 108 వాహనం ద్వారా గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పెదనందిపాడు పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో ఉన్నవకు తీసుకువచ్చారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు') ఆ తండ్రి బాధ తీర్చలేనిది.. మృతుడి తండ్రి రమణయ్యకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. పదేళ్ల కిందట భార్య రాగమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాటి నుంచి ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ త్వరలోనే పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వేగం రూపంలో మృత్యువు ముంచుకొచ్చి పెళ్లీడుకొచ్చిన కొడుకుని మింగేసింది. తనకు ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇలా అకాల మృత్యువు బారిన పడడంతో ప్రసాద్ మృతదేహాన్ని చూసిన తండ్రి రమణయ్య విలవిల్లాడి పోయాడు. ఆ తండ్రి ఆవేదనను చూసి చూపరుల హృదయాలు సైతం ద్రవించాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగించారు. -
మూడు రోజులుగా చెరువులోనే..చలించిపోయిన ఎస్సై..!
రాయపర్తి: సాయంత్రం పూట అలా బయటికి వెళ్తేనే చలి వణికిస్తోంది. కానీ చెరువులో దుస్తులు లేకుండా అచేతన స్థితిలో మూడు రోజులుగా పడి ఉన్నాడో వృద్ధుడు. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురంలో చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ తరువాత మంగళవారం అటుగా వెళ్లిన గొర్రెల కాపరులకు కొండాపురం ఊర చెరువులో అచేతనంగా ఓ వృద్ధుడు కనిపించాడు. వెంటనే వార్త గ్రామమంతా వ్యాపించింది. సర్పంచ్ కోదాటి దయాకర్రావు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై బండారి రాజు వృద్ధుడిని చూసి చలించిపోయారు. గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో దుస్తులు తొడిగించి, చెరువులోంచి మోసుకొచ్చాడు. 108 వాహనంలో ఆస్పత్రికి తరలించాడు. కరుకుగా కనిపించే ఖాకీ బట్టలమాటున మంచి మనసుందని నిరూపించాడు. ఆ వృద్ధుడు ఎవరు? ఎక్కడినుంచి వచ్చాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. -
జీవితం మీద విరక్తి.. చెరువులోకి దూకిన కుటుంబం
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జీవితం మీద విరక్తి చెంది చెరువులోకి దూకగా, ముగ్గురు మృతిచెందిన సంఘటన మాగడి తాలూకా దమ్మనట్టె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెదిన సిద్ధమ్మ (55), ఈమె కుమార్తె సుమిత్ర (30), అల్లుడు హనుమంతరాజు (35), వీరి కుమార్తె కీర్తన (11)లు ఆత్మహత్య చేసుకోవాలని గ్రామం సమీపంలోని చెరువులో దూకారు. వీరిలో ముగ్గురు మృత్యువాత పడగా, ప్రాణాలతో ఉన్న కీర్తనను గ్రామస్తులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. వీరి కుటుంబానికే చెందిన ఒక బాలిక (10)కు విషయం ముందే తెలిసి పారిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లరికం వచ్చిన హనుమంతరాజు మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడేవాడని, దీంతో కుటుంబ కలహాలు పెరిగి ఆత్మహత్య బాటపట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. కీర్తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కుదూరు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. చదవండి: (బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..) -
చేపలవేటకు వెళ్లి.. మృత్యుఒడికి
సాక్షి, వికారబాద్: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చిగురాల్పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంపల్లి నర్సింలు(43) గ్రామ శివారులోని చెరువులో నిత్యం చేపలు పడుతుండేవాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు గ్రామానికి చెందిన పసుల నరేష్తో చేపల వేటకు వెళ్లాడు. నీటిలోకి వెళ్లిన నర్సింలు ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో నరేష్ గ్రామంలోకి వచ్చి విషయం స్థానికులకు తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాలించారు. ఎంతవెతికినా మృతదేహం లభించకపోవడంతో ఎస్ఐ విఠల్రెడ్డి చెరువులో దిగి గాలించి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతుడి తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
చేపల వేటకు వెళ్లి నలుగురు గల్లంతు
పళ్లిపట్టు(చెన్నై): చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన నలుగురిలో ముగ్గురిని గ్రామస్తులు కాపాడగా, యువకుడు మృతిచెందాడు. 18 గంటల తర్వాత మంగళవారం అతని మృతదేహాన్ని వెలికి తీశారు. పళ్లిపట్టు సమీపంలోని వెంకట్రాజుకుప్పానికి చెందిన నలుగురు యువకులు సోమవారం సాయంత్రం లవ నదిలో చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకున్నారు. వారి కేకలు విన్న స్థానికులు ముగ్గురిని కాపాడారు. గల్లంతైన బాలాజీ (22) కోసం అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం ఉదయం పళ్లిపట్టు–షోళింగర్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. మృతదేహం లభించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే.. -
సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను తీసింది
మైసూరు(బెంగళూరు): చెరువు కట్ట పైన నిలబడి మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటు ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన హుణసూరు తాలూకాలోని హోసకోటె దగ్గర కెంచన చెరువులో చోటు చేసుకుంది. మృతులు అబ్దుల్లా (21), తన్వీర్ (20). ముగ్గురు కలిసి చెరువు చూడడానికి వచ్చారు. కట్టపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఇద్దరు జారిపడ్డారు. చెరువు లోతుగా ఉండడంతో ఈదలేక మృత్యువాత పడ్డారు. హుణసూరు గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. రౌడీషీటర్ అరెస్ట్ శివమొగ్గ: వ్యాపారుల ను బెదిరించి దందాలు చేయడంతోపాటు అనేక నేరాలతో సంబంధం కలిగి ముంబైలో తలదాచుకున్న శివమొగ్గ నగరంలోని టిప్పు నగర్కు చెందిన పేరుమోసిన రౌడీషీటర్ బచ్చన్(29)ను శివమొగ్గ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఇతనిపై జిల్లాలోని అనేక పోలీస్స్టేషన్లలో 53 కేసులున్నాయి. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో బసవనగుడికి చెందిన మహ్మద్ తౌహిద్(19), మహ్మద్ బిలాల్(21)ను నవంబర్ 16న పోలీసులకు పట్టుబడ్డారు. వారు ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ముంబై వెళ్లి బచ్చన్ను పట్టుకొచ్చారు. చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది -
పొట్ట కూటి కోసం చేసే పనే పొట్టన పెట్టుకుంది..
సాక్షి,మంచిర్యాల: పొట్టకూటి కోసం ట్రాక్టర్ డ్రైవర్ పనిచేస్తున్న ఓ దినసరి కూలీని రాళ్లవాగు మింగేసింది. ఇసుక తోడేందుకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన కనుకుంట్ల దుర్గయ్య తన ట్రాక్టర్ ద్వారా ఇసుక సరఫరా చేస్తుంటాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు ఇసుక తరలించేందుకు బొంతల శంకర్ (27)తోపాటు మరో ఇద్దరు కూలీలను తీసుకెళ్లాడు. ఉదయం 9 గంటల సమయంలో శంకర్ నీటిలో మునిగి మృతి చెందాడని, వెంట వెళ్లిన కూలీలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శంకర్ అనారోగ్యంతో ఉన్నా ట్రాక్టర్ యజమాని బలవంతంగా పనిలోకి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ట్రాక్టర్ యజమాని దుర్గయ్య ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన దిగారు. సమాచారం అందుకున్న ఎస్సై ప్రవీణ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య పప్పి, ఇద్దరు కుమార్తెలు హేమలత, యేసుమణి, కుమారుడు ఏసుమంత్ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే.. రాళ్లవాగు నీటి నుంచి అక్రమంగా ఇసుక తోడుతున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు కూలీలతో ప్ర మాదకరంగా నీటి అడుగుభాగం నుంచి ఇసుక ను వెలికితీస్తున్నారని వారు పేర్కొంటున్నారు. రోజుకు వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ప్రమాదకరంగా వాగుల నుంచి ఇసు క తోడుతున్న ట్రాక్టర్ యజమానులపై కఠిన చ ర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: -
‘లే అమ్మా, లే చెల్లె.. మా అమ్మ కావాలే’
సాక్షి,దుబ్బాక( మెదక్): ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తల్లీకూతురు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని ఎనగుర్తి గ్రామానికి చెందిన చెప్యాల రోజా(26) గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కుమారైలతో కలిసి వెళ్లింది. బట్టలు ఉతుకుతున్న క్రమంలో చిన్న కుమార్తె చైత్ర(5) చెరువులో ఆడుకుంటూ నీటి లోతులోకి వెళ్లింది. గమనించిన తల్లి చైత్రను కాపాడటానికి ముందుగా తన చీరను విసిరింది. చీరను అందుకోకపోవడంతో తానే నీటి లోతులోకి వెళ్లి కుమార్తెను కాపాడాలనుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ నీటమునిగి ఊపిరాడకపోవడంతో మృతి చెందారు. చెరువు గట్టుపై ఉన్న పెద్దకుమార్తె రషి్మక, మరో ఇద్దరు చిన్నారులు కేకలు వేయడంతో పంట పొలాల వద్ద ఉన్న వారు గమనించి మృతదేహాలను బయటకు తీశారు. రోజాకు మిరుదొడ్డి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరేష్తో వివాహం జరిగింది. భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో రోజా ఇటీవలె తల్లిగారింటికి వచ్చింది. బతుకమ్మ పండగ రోజు తల్లీ కూతురు మృతి చెందడంతో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా అమ్మ కావాలే..లే అమ్మా తల్లి, చెల్లి మృతి చెందడంతో రష్మిక ఏమి చేయలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నది. తల్లిదండ్రులను కోల్పోయిన రష్మిక ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. నాకు మా అమ్మ కావాలి.. నువ్వు లే అమ్మా అంటూ ఆ చిన్నారి ఏడవడంతో అందరూ కంటతడి పెట్టారు. చెల్లి చేతులు పట్టుకుని లే చెల్లె ఆడుకుందాం అంటూ ఏడ్చేసింది. చదవండి: Hyderabad: రాజేంద్రనగర్లో మహిళపై సామూహిక అత్యాచారం -
ఒక్కగానొక్క కొడుకు.. సరదాగా స్నేహితులతో బయటకు.. మృతదేహమై ఇంటికి
సాక్షి,లావేరు( శ్రీకాకుళం): స్నేహితులతో చెరువుకు వెళ్లిన కుర్రాడు మృతదేహమై ఒడ్డుకు చేరాడు. గార, లావేరు మండలాల్లో జరిగిన ఈ ఘటనలతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మండలంలోని కేశవరాయునిపురం గ్రామంలో చెరువులో మునిగి అదే గ్రామానికి చెందిన ఇనపకుర్తి సూర్య(12) సోమవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన సూర్య లావేరు హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ద సరా సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉన్న విద్యార్థి అదే గ్రామానికి చెందిన మరో నలుగురు విద్యార్థులతో సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో గ్రామంలోని ఎర్ర చెరువులో స్నానానికి వెళ్లాడు. ఇటీవలే ఆ చెరువులో జేసీబీతో మట్టి తీశారు. స్నానానికి దిగిన సూర్య లోపలకు వెళ్లి ఆ గోతుల్లో చిక్కుకుని మునిగిపోయాడు. మిగిలిన విద్యార్థులు భయపడి ఇళ్లకు వచ్చేశారు. రాత్రి 7 గంటలు దాటినా సూర్య ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకగా.. విద్యార్థి చెరువుకు వెళ్లాడని తెలిసింది. అంతా కలిసి చెరువుకు వెళ్లి గాలించగా సూర్య మృతదేహం లభించింది. ఒక్కగానొక్క కుమారుడు ఇలా పన్నెండేళ్లకే చనిపోవడంతో తల్లిదండ్రులు రమేష్, రాణి దంపతులు గుండెలవిసేలా రోదించారు. చదవండి: పెళ్లి సంబంధాలు రావడం లేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. -
పలమనేరు అసలు పేరు తెలుసా..?
సాక్షి, చిత్తూరు: ఈతరం పిల్లలకు ఉంటున్న ఊరు పేరెందుకొచ్చిందో తెలియని వారు చాలామంది ఉన్నారు. కనీసం ఊరి పేరు ఎందుకొచ్చిందో గూగూల్ తల్లిని అడిగినా పెద్దక్లారిటీ ఉండదు. అందుకే పలమనేరుకు ఆపేరెలా వచ్చిందో తెలిపే ప్రయత్నం చేద్దాం. పూర్వం పలమనేరు ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించే వారు. పట్టణానికి పడమటి వైపు ఓ చెరువును తవ్వించి దానికి పల్లవన్ ఏరి అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. పల్లవన్ ఏరి అంటే చెరువు వద్ద ఉన్న గ్రామమని అర్ధం. ఈ పల్లవనేరే కాలక్రమేణ పల్నేరు ఆపై పలమనేరుగా రూపాంతరం చెందింది. పలమనేరు పట్టణ వ్యూ ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2244 అడుగుల ఎత్తున ఉండడంతో ఇక్కడ వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఈ పట్టణాన్ని పేదవాని ఊటిగా పిలుస్తారు. పలమనేరు పట్టణం మూడు రాష్ట్రాల కూడలిగా ఉండడంతో ఇక్కడ తెలుగు,తమిళం, కన్నడ భాషలను మాట్లాడుతారు. ఇప్పటికీ ఈ మూడు సాంప్రదాయలు, సంస్కృతులు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి నుంచి గుడియాత్తం, క్రిష్ణగిరి, మదనపల్లె, కుప్పం, బెంగుళూరులకు రోడ్డు మార్గాలున్నాయి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణానికి పులకించిన అప్పటి యూరోపియన్, బ్రిటిష్ అధికారులు దీన్ని వారి వేసవి విడిదిగా ఉపయోగించారు. పలమనేరులోని నాటి బ్రిటీష్భవనాలు దానికి సంబంధించిన విడిది గృహము ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. (ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం). వీటితో పాటు పీర్ల రహదారి, సర్కెట్ హౌస్, వైట్ సైడ్ అతిథి గృహాల పేర్లు ఉన్నాయి. దీంతో పాటు అమెరికన్ ఆర్కాడ్ మిషన్చే ఓ అతిథి గృహం 1932లోనే నిర్మితమైంది. అప్పట్లోనే నెలకు దీని అద్దె రూ.40గా వసూలు చేసేవారట. ఇక ఫారెస్ట్ గెస్ట్ హౌస్తో పాటు క్రిస్టియన్లకు సంబంధించిన పలు సుందరమైన పురాతన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. పలమనేరులోని నాటి బ్రిటీష్భవనాలు ఇక్కడి సీఎస్ఐ ప్రాంగణంలో గాంధీ మహాత్ముడు సేద తీరిన మర్రి చెట్టు ఉంది. ప్రతి శుక్రవారం పట్టణంలో జరిగే వారపు సంత, పశువుల సంత అనాదిగా జరుగుతోంది. పలమనేరు టమోటా, పట్టు, చింతపండు, పాలుకు ప్రసిద్ది చెందింది. జిల్లాలోనే టమోట, పట్టు సాగులో పలమనేరు ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువ. దీన్ని మిల్క్ సిటీగా కూడా పిలుస్తారు. చదవండి: అంతరిస్తున్న ఆదిమానవుడు -
నిశ్చితార్థం అయింది.. పెళ్లికి అబ్బాయి నో అన్నాడని..
భువనగిరి: మనస్తాపానికి గురై చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండల పరిధిలోని రాయగిరి చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్లోని లాలాపేటకు చెందిన బసవరాజు, భారతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో గీతారాణి (34) ఎంబీఏ పూర్తిచేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. చదవండి: ‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యింది.. మీరు కూడా రండి’ వరంగల్ కాజీపేటకు చెందిన టి. విజయ్కుమార్తో గీతారాణికి గతంలో నిశ్చితార్ధం అయ్యింది. డిసెంబర్ 9, 2020న పెళ్లి తేదీ నిర్ణయించారు. కాగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి అబ్బాయి వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అప్పటి నుంచి గీతారాణి డిప్రెషన్లోకి వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం బ్యాంక్కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుల్దేరిన గీతారాణి సాయంత్రం 4 గంటల తర్వాత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. చదవండి: రూ.70 కోసం వాగ్వాదం: గొడ్డలితో దాడి కాగా రాత్రి భువనగిరిలోని రాయగిరి చెరువు కట్ట మీద యువతి చెప్పులు, ఆధార్కార్డు పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధార్కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. గురువారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టగా, చివరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహయంతో మధ్యాహ్నం చెరువులో నుంచి గీతారాణి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సైదులు తెలిపారు. -
స్నానానికి వెళ్లి.. శవమై తేలాడు
సాక్షి, విజయనగరం: ఇటీవల కురిసిన వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ ఓ గిరిజన బాలుడిని బలి తీసుకుంది. సీతంపేట పరిధిలోని బర్నగూడ గ్రామానికి చెందిన ఆరిక సుధీర్ కుమార్ (8) బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలో ఉన్న గెడ్డలోకి స్నానానికి వెళ్లి అందులో మునిగి చనిపోయాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మన్యంలోని గెడ్డలన్నీ పొంగిపొర్లుతున్నాయి. బర్నగూడకు సమీపంలో ఉన్న గెడ్డ కూడా పోటు మీద ఉంది. గ్రామంలోని చిన్నారులు స్నానం కోసం బుధవారం గెడ్డలోకి దిగారు. వారిలో సుధీర్ కాస్త లోపలకు వెళ్లడంతో ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకునిపోయాడు. దీంతో చిన్నారులంతా భయపడి ఊరిలోకి వచ్చి విషయం చెప్పారు. గిరిజనులు వెళ్లి వెతకగా అరకిలోమీటరు దూరంలో బాలుడు దొరికాడు. వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి సపర్యలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బాలుడి తండ్రి శీతంనాయుడు హైదరాబాద్ వలస వెళ్లి అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి ఆరిక సంతోషమ్మ కూలి పనులు చేస్తుంటారు. సుధీర్ స్థానికంగా ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. చలాకీ ఉండే కుర్రాడు ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: ఆరేళ్ల సహజీవనం చేసి.. ఆందోళనకు గురై జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
పొంగిపొర్లుతున్న రాజేంద్రనగర్ అప్ప చెరువు
-
‘నిమజ్జనం’లో ఏడుగురు బాలికలు మృత్యువాత
లతేహార్: పండుగ వేళ ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ‘కరం దాలి’ నిమజ్జనానికి చెరువులోకి దిగిన ఏడుగురు బాలికలు నీట మునిగి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్లోని బక్రు గ్రామంలో శనివారం జరిగింది. జార్ఖండ్ ముఖ్య పండుగల్లో ఒకటైన కర్మపూజ సందర్భంగా 10 మంది బాలికలు చెరువు వద్దకు వెళ్లారు. కదంబ కొమ్మ(కరం దాలి)ను నిమజ్జనం చేసే సమయంలో ఒక బాలిక నీటిలో పడిపోయింది. ఆమెను రక్షించే క్రమంలో ఈతరాని మిగతా బాలికలు ఒకరి తర్వాత ఒకరు అందరూ మునిగిపోయారు. వారి కేకలు విని గ్రామస్తులు పరుగెత్తుకుని వచ్చి అందరినీ వెలికితీశారు. వారిలో అప్పటికే నలుగురు చనిపోగా బాలూమఠ్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ముగ్గురు తుదిశ్వాస విడిచారు. బాధితులంతా స్థానిక స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్న 12 నుంచి 20 ఏళ్లలోపు వారే. ఘటనకు నిరసనగా స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు అధికారులు ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు. -
Telangana: నిండుకుండలా చెరువులు
సాక్షి, హైదరాబాద్: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలన్నీ నిండుగా ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని సగానికి పైగా చెరువులు పూర్తిగా నిండి అలుగు దుంకుతున్నాయి. మొత్తం 43,870 చెరువులకు గాను 27 వేల చెరువులు పూర్తిగా నిండి మత్తడి పోస్తున్నాయి. మరో 6,243 వేలకు పైగా ఏ క్షణమైనా నిండి పొంగిపొర్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లంతా స్థానికంగానే ఉండి ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలుగు దుంకుతున్నాయి.. ప్రస్తుతం కరీంనగర్, గజ్వేల్, ఖమ్మం, వరంగల్ డివిజన్ల పరిధిలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. కరీంనగర్ డివిజన్లో 2,889 చెరువులకు గానూ 1,500, వరంగల్ జిల్లాలో 2,946 చెరువులకు 1,720 చెరువులు నిండిపోయాయి. ఖమ్మంలో 1,409 చెరువులకు గానూ ఏకంగా 1,400 చెరువులు అలుగు దుంకుతున్నాయి. గజ్వేల్ డివిజన్లోని 6,308 చెరువుల్లో 4 వేల చెరువులు నిండాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 1,246 చెరువుల్లో మూడు, నాలుగు చెరువులు మినహా మిగతా చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయి. కృష్ణా బేసిన్లో సూర్యాపేట జిల్లాలో 1,314 చెరువుల్లో 985 చెరువులు, నల్లగొండలోని 1,927 చెరువుల్లో 800 చెరువులు నిండినట్లు సాగునీటి శాఖ రికార్డులు చెబుతున్నాయి. చెరువుల కట్టలు తెగకుండా రెవెన్యూ, మున్సిపల్, వాతావరణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం 12 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం నిండేందుకు సిద్ధంగా నిజాంసాగర్, సింగూరు ప్రస్తుత వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండుకోగా, సింగూరు, నిజాంసాగర్లు కూడా నిండే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిజాంసాగర్కు స్థానిక వాగుల నుంచి 26,823 క్యూసెక్కుల మేర వరద కొనసాగుతుండగా, పూర్తిస్థాయి నిల్వ 17.80 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 12.93 టీఎంసీలకు చేరింది. ఇక సింగూరుకు 23,646 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 29.91 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 25.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో ఈ ప్రవాహాలు మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. శ్రీరాంసాగర్కు 24,510 క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదవుతుండగా, 44,940 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీనితో ఎల్లంపల్లికి 86 వేల క్యూసెక్కులు, లోయర్ మానేరుకు 58 వేల క్యూసెక్కుల మేర వరద నమోదవుతోంది. -
విషాదం: పుట్టింటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుని..
యశవంతపుర(కర్ణాటక): ప్రమాదశాత్తు చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి చెందిన విషాద ఘటన దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా నెల్లూరు కేమ్రాజీ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు... మైల్కా ర్ నివాసి సంగీత (30), కుమారుడు అభిమన్య (4) రెండు రోజుల క్రితం మాపలకజెలోని పుట్టింటికి వచ్చారు. ఉదయం మెల్కార్కు వెళ్లాల్సి ఉండగా తల్లి కొడుకు విహారానికి చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారి కాలుజారి చెరువులో పడ్డాడు. కొడుకును రక్షించే క్రమంలో సంగీత కూడా నీటిలో దిగి మునిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పుట్టింటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
తల్లిని కాపాడేందుకు చెరువులో ఐదేళ్ల చిన్నారి సాహసం
పలమనేరు: బట్టలు ఉతుకుతూ కాలుజారి చెరువులో పడి తల్లి మునకలేసింది. తల్లిని చూసి కాపాడేందుకు ధైర్యం చేసి చెరువులోకి దిగిన చిన్నారి తానూ మునిగిపోతూ కేకలేసింది. ఇది విన్న స్థానికులు పరుగున అక్కడికి చేరుకుని చిన్నారిని రక్షించారు. తల్లి మాత్రం తిరిగిరాని లోకాలకు చేరుకుంది. శుక్రవారం ఈ సంఘటన మండలంలో పకీరుపల్లె వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మొగిలప్ప కుమార్తె సుజాత (40) తన తండ్రి వద్దే ఉంటోంది. ఆమె తన కుమార్తె లక్ష్మి (5)తో కలసి గ్రామ సమీపంలోని కూర్మాయిచెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. దుస్తులు ఉతుకుతుండగా కాలుజారి చెరువులో పడి మునిగిపోయింది. ఇది చూసి లక్ష్మి గట్టిగా కేకలు వేసినా ఎవరూ రాకపోయేసరికి తల్లిని కాపాడేందుకు తానే చెరువులోకి దిగడంతో బాలిక సైతం మునిగింది. ఆ బాలిక కేకలు విన్న సమీపంలోని రైతులు అక్కడికి చేరుకుని కాపాడారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. సుజాత కోసం గాలించినా ఫలితం లభించలేదు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారి బాబు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గంటపాటు గాలించి సుజాత మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
11 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసిన తామరపూలు
సదుం: నీటికుంటలో పడి బాలిక మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సదుం మండలంలో చోటుచేసుకుంది. కేవీపల్లె మండలం గర్నిమిట్టకు చెందిన గంగాదేవి, రెడ్డెప్ప కుమార్తె మల్లీశ్వరి (11) మండలంలో తుమ్మగుంటపల్లెలోని అమ్మమ్మ కృష్ణమ్మ వద్ద ఉంటోంది. శుక్రవారం ఉదయం కట్టెల కోసం స్నేహితులతో కలిసి వెళ్లి ఆ బాలిక గ్రామ సమీపంలోని గునానికుంటలో ఉన్న తామర పూలను చూసి ముచ్చటపడింది. వాటిని కోసేందుకు కుంటలోకి దిగింది. పూలవద్దకు వెళ్తూ కుంట లోతుగా ఉండడంతో మునిగిపోయింది. స్నేహితులు ఇది చూసి గ్రామంలోకి పరుగులు తీసి సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు కుంట వద్దకు చేరుకుని గాలించారు. అప్పటి మల్లీశ్వరి మృతి చెందింది. మృతదేహాన్ని వెలికితీశారు. -
చెరువులో పడి చిరుత మృతి
చిన్నశంకరంపేట (మెదక్): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఓ చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖాజాపూర్ అటవీ ప్రాంతంలోని పటేల్ చెరువులో రెండు మూడు రోజుల కిందటే ఏడేళ్ల వయసు గల చిరుత చెరువులో పడి మృతి చెందగా, మంగళవారం కళేబరం చెరువులో తేలింది. ఉదయం అక్కడికి వెళ్లిన స్థానిక రైతులు చిరుత కళేబరాన్ని గమ నించి సర్పంచ్కు సమాచారం అందించారు. సర్పంచ్.. అటవీ శాఖ, రెవెన్యూ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణాగౌడ్, రామాయంపేట ఫారెస్ట్ రేంజర్ నజియాతబుసం, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత కళేబరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ముళ్ల పంది దాడి చేసినట్టు భావిస్తున్నారు. పొట్టభాగంలో గాయమైనట్లు గుర్తించారు. చిరుత అవయవ భాగాలను సేకరించి సంగారెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ అనుమా నాస్పద స్థితిలో చెరువులో పడి చిరుత మృతి చెందిందని, పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. -
విషాదం: మనవడిని కాపాడబోయి..
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మనవడు పడిపోగా కాపాడబోయి తాత కూడా మృతి చెందిన ఘటన మహా ముత్తరాం మండలం బోర్లగూడెం నర్సింగాపూర్ శివారులో జరిగింది. స్థానికుల కథనం.. ప్రకారం మృతులు భీముని భూమయ్య (58), భీముని రిషీ (10) నర్సింగాపూర్ కు వెళ్లి వస్తుండగా చెరువు వెనుక ఉన్న వారి పొలానికి వెళ్తూ నీటిలో నుంచి చెరువు దాటే ప్రయత్నం లో మనువడు ఒక్కసారిగా నీట మునిగిపోయాడు. దీంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో భూమయ్య కూడా నీటమునిగి మృత్యువాత పడ్డాడు. చెరువు మరమ్మతులో భాగంగా గత నెలలో జేసీబీలతో మట్టిని తవ్వడం వల్ల లోతైన గుంటలు ఏర్పడంతో నే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం అదే చెరువులో చేపలు పడుతూ గత 25 సంవత్సరాలుగా చెరువు కట్టపైనే మంచెవేసుకుని ఉండే భూమయ్య కు ఆ చెరువులో ఎక్కడ లోతు ఉందో ఎక్కడ ఏముందో తెలిసిన అతను నీటిలో మునిగి మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూమయ్య కొడుకు రవి గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చదవండి: 16 ఏళ్ల నిర్లక్ష్యం.. పోయిన ప్రాణం -
వైద్యుడి కుటుంబంలో ఊహించని విషాదం
మదనపల్లె: వృత్తిబాధ్యతల్లో తలమునకలైన వైద్యులు కొందరు ఆదివారం సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పట్ట ణానికి సమీపంలోని రామిరెడ్డిగారిపల్లె చెరువుకు విహారయాత్రగా వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు నిండుకుండలా ఉన్న చెరువులో కేరింతలు కొడుతూ పిల్లలతో ఆడుతూ ఉత్సాహంగా ఉన్నారు. ఇంతలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ వైద్యులు ఇందుకూరి అనిల్రెడ్డి, కవిత దంపతుల ఏకైక కుమారుడు ఇందుకూరి పునీత్రెడ్డి(12) చెరువులో ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. అప్పటి దాకా అరుపులు, కేకలతో సరదాగా గడుపుతున్న కొడుకు క్షణాల వ్యవధిలో మృత్యువాత పడడంతో రోదనలు మిన్నంటాయి. వాహనాలు తెచ్చేందుకు వెళ్లి.. సొసైటీ కాలనీలో దంతవైద్యులు అనిల్కుమార్రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కవిత అంజన క్లినిక్ నిర్వహిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు ఇందుకూరి పునీత్రెడ్డి(12) వశిష్ట స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. నెలలో ఒక ఆదివారం పట్టణంలోని కొందరు వైద్యులు కుటుంబసభ్యులతో కలిసి సమీప ప్రాంతాలకు పిక్నిక్కు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా మండలంలోని రామిరెడ్డిగారిపల్లె పిచ్చలవాండ్లపల్లె చెరువులో పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఈత కొడుతూ చాలాసేపు సంతోషంగా గడిపారు. ఇళ్లకు బయలుదేరే ముందు కాసేపు గడిపి వస్తామని పిల్లలు చెప్పడంతో వాళ్లను చెరువులో వదిలి వాహనాలు తెచ్చేందుకు పెద్దవాళ్లు బయటకు వచ్చారు. బాలుడు పునీత్రెడ్డి ఈత కొడుతూ చెరువులో కొంత ముందుకు వెళ్లి గుండుపై కూర్చునేందుకు ప్రయత్నించాడు. అది పాచిపట్టి ఉండడంతో కాలుజారి లోతులోకి పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు, వైద్యులు హుటాహుటిన చెరువులోకి దిగి బాలుడిని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. భయంతో నీళ్లు మింగడం, ఊపిరాడకపోవడంతో చెరువులోనే బాలుడు చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ఎదుటే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల శోకానికి అంతులేకుండా పోయింది. బాలుడి తాత ఈశ్వర్రెడ్డి జనతాక్లినిక్ పేరుతో తక్కువ ఫీజుతో సేవలందించిన డాక్టర్గా గుర్తింపు పొందారు. మృతి చెందిన బాలుడిని అంత్యక్రియల నిమిత్తం డాక్టర్ అనిల్కుమార్రెడ్డి స్వస్థలం తంబళ్లపల్లె నియోజకవర్గం చౌడసముద్రంకు తరలించారు. డాక్టర్ అనిల్కు పలువురి పరామర్శ.. పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్కుమార్రెడ్డి కుమారుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడన్న విషయం దావానంలా వ్యాపించింది. విషయం తెలిసి పలువురు పీఅండ్టీ కాలనీలోని డాక్టర్ అనిల్కుమార్రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. విషాదంలో మునిగిపోయిన బాలుడి తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే నవాజ్బాషా, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు తట్టి శ్రీనివాసులురెడ్డి, జబ్బల శ్రీనివాసులు, గోల్డెన్వ్యాలీ రమణారెడ్డి, బోర్వెల్ వెంకటేష్, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, డిష్ రామకృష్ణారెడ్డి, బాలగంగాధరరెడ్డి, ఎల్ఐసీ సుధాకర్, దేవతాసతీష్, రెడ్డి జనసంక్షేమ సంఘం సభ్యులు రోజానాగభూషణరెడ్డి, సాంబశివారెడ్డి, అంకిరెడ్డి, సుధాకర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్టాక్ స్టార్ -
చెరువులో విషప్రయోగం.. లక్షల్లో చేపలు మృత్యువాత
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని వెల్ది బుడమాయి చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారు. దీంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ముదిరాజ్ కులస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ చెరువులో ముదిరాజ్ కులస్తులు చేపలు పడుతూ జీవనం సాగిస్తుండగా, శుక్రవారం ఉదయాన్నే వందలాదిగా చేపలు చనిపోయి ఒడ్డుకు వస్తుండడాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కుల పెద్ద ఆళ్ల కొమురయ్య మాట్లాడుతూ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చెరువు చైర్మన్ ఆళ్ల గట్టయ్యతో పాటు కావాటి దానయ్య, కావాటి నాగరాజు, రాజు, లింగరాజు, బోయిని కృష్ణ పాల్గొన్నారు. -
అయ్యో పాపం..మండు వేసవిలో కూడా ఇలా..
యాదాద్రి భువనగిరి జిల్లా జగ్గన్న చెరువు కింద గల మాదాపురం ఆయకట్టు రైతులు ఏటా యాసంగి పంటనే సాగుచేస్తారు. వానాకాలం సాగుచేస్తే చెరువు నిండి పంట మునుగుతుందనేది వారి భయం. కానీ వారి అంచనాలు తప్పాయి. మండు వేసవిలోనూ పంటలు నీటమునిగాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి చెరువులను నింపేందుకు తుర్కపల్లి మండలం గోపాలపురం చెరువులోకి నీటిని వదలడంతో సోమవారం చెరువు అలుగుపోసింది. అక్కడి నుంచి జగ్గన్న చెరువులోకి నీళ్లు చేరాలి. కానీ ఈ నీళ్లు వరి పంటలను ముంచెత్తుతూ చెరువులోకి వెళ్లాయి. వేసేదే ఒక్క పంట.. అదీ అనుకోని కాలంలో నీటి పాలైందని రైతులువాపోతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి నీటిపాలైన వరి చేనును చూపుతున్న ఓ రైతు -
నాన్నా..లేరా.. నాన్నను చూడరా
కళ్యాణదుర్గం రూరల్: తన ప్రతిరూపం.. ఇంటికి పెద్దకొడుకు.. కళ్లముందే చెరువులోకి దిగి కళ్లు తేలేశాడు. ఊపిరిలేదని పక్కనున్న వాళ్లంతా వారిస్తున్నా.. కుమారుడిని బతికించుకునేందుకు ఆ తండ్రి పడిన ప్రయాస.. వేదన అక్కడున్న వాళ్లను కలచివేసింది. పరుగున వెళ్లి బిడ్డను గుండెలకు హత్తుకున్న తండ్రి.. ‘‘నాన్నా లేరా.. నాన్నను చూడరా’’ అంటూనే బైక్పై బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు పడరానిపాట్లు పడ్డాడు. తన ఇంటిదీపం ఆరిపోగా.. ఆ కన్నతండ్రి శోకం మిన్నంటింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన ఓబులేసు, గంగమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు హనుమేష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం తండ్రితో పాటు కట్టెల కోసం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లిన హనుమేష్ ఇంకుడు గుంతల్లో నీరు ఉండటంతో తన తండ్రికి తెలియకుండా ఈతకు వెళ్లాడు. అయితే ఈత రాకపోవడంతో గుంతలోని బురదలో చిక్కుకుని మృత్యువాత పడ్డాడు. కుమారుడిని వెంటనే గమనించిన ఓబులేసు రక్షించుకోవడానికి పడిన ప్రయాస అందరినీ కంటతడి పెట్టించింది. చదవండి: హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య -
ఈ చెరువుల్లో నీరు యమ డేంజర్, అస్సలు తాకొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లోని చెరువుల్లో ప్రమాదకరమైన కొత్తరకం బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి. సిటీ వ్యాప్తంగా చెరువులు, కుంటల నుంచి నీటి శాంపిల్స్ తీసుకుని పరీక్షించామని.. ఇందులో చాలావరకు జలాశయాల్లో ‘మెటలో బీటా లాక్టమస్–1’అనే జన్యువు ఉన్న బ్యాక్టీరియాను గుర్తించామని హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు చెప్తున్నారు. గృహ, పారిశ్రామిక కాలుష్యమే ఈ తరహా బ్యాక్టీరియా పెరగడానికి కారణమని వారు అంటున్నారు. మురుగు వ్యర్థాలు, భార లోహాలు అధికంగా ఉన్న నీటిలోనే ఈ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుందని, ఇది యాంటీ బయాటిక్స్కు సైతం లొంగని మొండిరకమని పరిశోధకులు తమ నివేదికలో తెలిపారు. ఆయా చెరువులు, కుంటల్లో నీటిని తాగినా, ఇతర ఏ అవసరాలకు వినియోగించినా కూడా.. డయేరియా, అంటు వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియా భూగర్భజలాల్లో కలిసే అవకాశం లేదన్నారు. అయితే చెరువులు, కుంటల నుంచి వివిధ మార్గాల్లో చుట్టూ రెండు కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆయా జలాశయాల్లో నీటిని ఎట్టి పరిస్థితుల్లో తాకవద్దని పేర్కొన్నారు. కాలుష్యం కాటు.. బ్యాక్టీరియా వేటు ►గ్రేటర్ పరిధిలో సుమారు 185 చెరువులు ఉండగా.. వాటిలో సగం చెరువుల్లోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వ్యర్థ జలాలు వచ్చి కలుస్తున్నాయి. ►ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల బృందం సిటీలోని అంబర్పేట ఎస్టీపీ, దుర్గం చెరువు, అమీన్పూర్, అల్వాల్, హుస్సేన్సాగర్, మోమిన్పేట్, సరూర్నగర్, ఫాక్స్ సాగర్, కంది, మీరాలం, నాగోల్, ఉప్పల్ నల్లచెర్వు, సఫిల్గూడ చెరువుల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షించింది. ►ఈ చెరువులన్నింటి నీళ్లలో ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1’జన్యువు కలిగిన కొత్త రకం బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించింది. ►మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తదితర మంచినీటి జలాశయాల్లో నమూనాలను కూడా పరీక్షించారు. వాటిలో ఈ బ్యాక్టీరియా ఉనికి బయటపడలేదు. ►కొన్నేళ్లుగా చెరువులు కబ్జాకు గురవడం, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోనే భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపాలుగా మారుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. చెరువుల ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యతమిస్తోందని, మురుగు చేరకుండా గట్టి చర్యలు తీసుకోవడంలో విఫలమౌతోందని ఆరోపిస్తున్నారు. ►రోజువారీగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వెలువడుతున్న 1,400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మేర మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. ఆ చెరువుల ప్రక్షాళనకు చర్యలివే.. ►గ్రేటర్ పరిధిలోని చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. అడుగున పేరుకున్న ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలి. ►జలాశయాల ఉపరితలంపై పెరిగిన గుర్రపు డెక్కను తొలగించాలి. ►చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ►గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలు చేరకుండా చర్యలు తీసుకోవాలి. మురుగునీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేశాకే.. నాలాల్లోకి వదలాలి. ఈ బ్యాక్టీరియాతో రోగాల ముప్పు తథ్యం సిటీలోని పలు చెరువులు, కుంటల్లో ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1’బ్యాక్టీరియా బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ల తరహాలో ఈ బ్యాక్టీరియా సుదూర ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేదు. సమీపంలో సుమారు 2 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించే అవకాశముంది. ఆయా చెరువుల నీటిని తాకినా, బట్టలు ఉతికినా, అందులోని చేపలు పట్టుకొని తిన్నా, అధిక సమయం ఈ చెరువుల పరిసరాల్లో గడిపినా ఈ బ్యాక్టీరియా మనుషుల్లో ప్రవేశించి శ్వాసకోశ వ్యాధులు, డయేరియా, చర్మ వ్యాధులు, అంటురోగాలకు కారణమౌతుంది. ఈ బ్యాక్టీరియా భూగర్భ జలాల్లో చేరే అవకాశం లేదు. – ప్రొఫెసర్ శశిధర్, ఐఐటీ హైదరాబాద్ తాగునీటి నాణ్యతకు ఢోకా లేదు మంజీరా, సింగూరు, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, గోదావరి (ఎల్లంపల్లి), కృష్ణా మూడుదశల ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్న నీటిని 3 దశ ల్లో శుద్ధి చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు క్లోరినేషన్, బూస్టర్ క్లోరినేషన్ నిర్వహణతో ఇక్కడి తాగునీటి నాణ్యతపై జలమండలికి ఐఎస్వో ధ్రువీకరణ లభించింది. నగరవ్యాప్తంగా సరఫరా చేస్తు న్న తాగునీటికి సంబంధించి ఐదువేలకు పైగా నమూనాలను పరీక్షిస్తున్నాం. ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించలేదు. తాగునీటి నాణ్యతపై అనుమానాలు, అపోహలకు తావులేదు. – జలమండలి ఎండీ దానకిశోర్ యాంటీ బయాటిక్స్కు లొంగదు! ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1’జన్యువు ఉన్న బ్యాక్టీరియా చాలా మొండిదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియాతో చర్మ, శ్వాసకోశ వ్యాధులు వచ్చిన వారికి సాధారణంగా వైద్యులు ఇచ్చే యాంటీ బయాటిక్స్ పనిచేయవని చెప్తున్నారు. కలుషిత జలాలు చేరిన చెరువుల నీటిని తాకడం, బట్టలు ఉతకడం, స్నానం చేయడం, ఆ జలాశయాల్లోని చేపలను తినడం, ఈ నీటిని ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల బ్యాక్టీరియా సోకుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం ఆయా జలాశయాల వద్ద గడపవద్దని కూడా సూచిస్తున్నారు. మురుగు నీరు చేరికతోనే.. సిటీ పరిధిలోని చెరువుల్లోకి గృహ, పారిశ్రామిక వ్యర్థాలు చేర డంతో కాలుష్యం బారినపడుతున్నాయి. నీటిలోని భార లోహా లు, రసాయనాలతో చెరువుల్లో కొత్తరకం బ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. జలాశయాలను ప్రక్షాళన చేయడంలో బల్దియా విఫలమవుతోంది. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణవేత్త -
తెలంగాణ: వేసవిలోనూ చెరువులకు జలకళ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ఆరంభమైన నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ఆయకట్టు పంటలకు ఎలాంటి నీటి కొరత లేకుండా చెరువులు, చెక్డ్యామ్ల్లో నీటి నిల్వలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎల్లంపల్లి దిగువ నుంచి కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులను వంద శాతం నీటితో నింపాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచనల మేరకు ఇరిగేషన్ శాఖ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇప్పటికే చెరువుల్లో నీటిని నింపే ప్రక్రియ మొదలవగా, మొత్తంగా 2,074 చెరువులకు నింపేలా ప్రణాళిక రచించింది. ఈ చెరువుల ద్వారా 1.20 లక్షల ఎకరాల మేర నీరందించనుంది. చదవండి: (ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్) ఎస్సారెస్పీ కింద చెరువులకు జలకళ... ముఖ్యంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వ పుష్కలంగా ఉండటంతో ఆ నీటి ద్వారా లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకు కాల్వల ద్వారా పంటలకు నీరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ఉంచడం మేలనే ఉద్దేశంతో ఎల్ఎండీ దిగువన కాళేశ్వరం ఎత్తిపోతల నీటిని వాడుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద సుమారు మరో 3.50 లక్షల ఎకరాలకు నీరందించేలా ఇప్పటికే కాల్వల ద్వారా నీటి విడుదల జరగ్గా, దీని కింద 942 చెరువులున్నాయి. ఈ చెరువులకు నీటిని అందించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తూ నీటి విడుదల కొనసాగుతోంది. ఇప్పటికే చాలా చెరువులకు నీరందించేలా తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, వాటి ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఈ చెరువులను నింపడం ద్వారా వాటికింద ఉన్న సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండగా, 10 టీఎంసీల మేర నిల్వలు సాధ్యపడనున్నాయి. ఇక ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద మొత్తంగా 3.52 లక్షల ఎకరాలకు నీరందించనుండగా, 866 చెరువుల పరిధిలో కనీసంగా 30 వేల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ చెరువులన్నింటినీ ముందుగా నింపేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవలే నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు చేశారు. చదవండి: (ప్రధాని మాటలు ఆచరణలోకి రావాలి: కేటీఆర్) మిడ్మానేరు దిగువన... ఇక మిడ్మానేరు దిగువన అనంతగిరి రిజర్వాయర్ మొదలు కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్కు పుష్కలంగా నీటి లభ్యత ఉంది. ఈ నీటితో మొత్తంగా 266 చెక్డ్యామ్లు, చెరువుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని చెరువులను నీటితో నింపుతున్నారు. ఈ మొత్తం చెరువులు, చెక్డ్యామ్ల కింద 18 వేలకు పైగా ఎకరాలకు నీరందే అవకాశం ఉండగా, 8.60 టీఎంసీల మేర నీటి నిల్వలకు అవకాశం ఉంది. ఇందులో అనంతగిరి కింద బెజ్జంకి మండల పరిధిలో 16, ఇల్లంతకుంటలో 9, రంగనాయక్సాగర్ కింద చిన్నకోడూరు మండలంలో 23, నంగనూర్–49, నారాయణ్పేట–22, సిద్దిపేట–4, ఇల్లంతకుంట–3, తంగనపల్లి–10, ముస్తాబాద్–5 చెరువులు, వీటితో పాటు మరో 35 చెక్డ్యామ్లు ఉన్నాయి. మల్లన్నసాగర్లో తవ్విన ఫీడర్ చానల్ ద్వారా తొగుట–6, దుబ్బాక–సిద్దిపేట–25, ముస్తాబాద్–6, కొండపోచమ్మసాగర్ పరిధిలో జగదేవ్పూర్ కెనాల్ ద్వారా మర్కూక్–23, జగదేవ్పూర్–5, తుర్కపల్లి కెనాల్ ద్వారా మర్కూక్–5, ఎం.తుర్కపల్లి–9, బొమ్మలరామారం–5. గజ్వేల్ కెనాల్ ద్వారా మర్కూక్–3, గజ్వేల్–1 చెరువులను నింపుతున్నారు. -
మృత్యు దారం!
ఇదే పొజిషన్లో మనం ఉంటే. తినలేక.. తీయడానికి రాక.. రోజురోజుకీ కృశించిపోయి.. నరకయాతన పడుతూ.. చనిపోవడం ఖాయం. ఎంత దారుణం ఇది.. ఈ పాపం ఎవరిది? అచ్చంగా మనదే.. మన నిర్లక్ష్యానిదే.. సాక్షి, హైదరాబాద్: బీహెచ్ఈఎల్ సమీపంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితి ఇదీ.. పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ జీవవైవిధ్య వారసత్వ జలాశయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి చెరువు ఇది.. ఎందుకంటే అక్కడ 364 రకాల జాతుల ప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. అందులో 166 రకాల పక్షులున్నాయి. ఇటు ఏటా 60 జాతుల వరకు విదేశీ పక్షులు వలస వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఇక 16 రకాల పాములు, 10 రకాల చేపలు, 10 రకాల బల్లి, తొండ జాతులు, మూడు రకాల ఊసరవెల్లులు, 41 రకాల సీతాకోకచిలుకలు, 7 రకాల తూనీగలు, 26 రకాల కీటకాలు.. ఒకటేమిటి అదో అద్భుత జీవవైవిధ్యం.. చుట్టూ జనావాసాలే.. అయినా ఆకట్టుకునే జీవవైవిధ్యం దాని సొంతం.. దేశంలోనే అలాంటి ప్రత్యేకత పొందిన ఆ అద్భుతాన్ని మనమెలా చూసుకోవాలి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ భావితరాలకు దాన్ని అందించాలి.. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రజలైనా పరిరక్షిస్తున్నారా అంటే అదీ లేదు.. ఏంటా ప్రమాదం.. అమీన్పూర్ చెరువుకు ఏటా ఫ్లెమింగో లు, స్పాట్ బిల్డ్ పెలికాన్స్, గ్రే హెరాన్స్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్స్, కింగ్ ఫిషర్, ఆ్రస్పే.. ఇలా దాదాపు 60 రకాల జాతుల వరకు విదేశీ వలస పక్షులు వస్తుంటాయి. ప్రాణాధారమై న ఆ చెరువే ఇప్పుడు పక్షుల మరణ శాసనం లిఖిస్తోంది. దారాల రూపంలో ఉరితాళ్లు చెరువులోని పక్షులను కబలిస్తున్నాయి. ఇళ్లల్లో పూజలు చేసిన తర్వాత దేవుడికి సమరి్పంచిన పూలను చాలామంది నీటిలో వేస్తుంటారు. చాలా చెరువుల్లో డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో వాటిలో వేయటాన్ని అపవిత్రంగా భావిస్తున్నారు. దీంతో వారి దృష్టి అమీన్పూర్ చెరువుపై పడింది. చాలా ప్రాంతాల నుంచి జనం పూలమాలలను తెచ్చి ఈ చెరువులో వేస్తున్నారు. కొంతకాలానికి పూలు కుళ్లి నీటిలో కలిసి వాటి దారాలు మాత్రం తేలుతున్నాయి. ఆహార వేటలో భాగంగా తలభాగాన్ని నీటిలో ముంచిన సమయంలో ఆ దారాలు పక్షుల ముక్కులకు చుట్టుకుంటున్నాయి. కొన్నింటికి రెక్కలు, కాళ్లకు చిక్కుకుంటున్నాయి. దీంతో వాటిని విడిపించుకోలేక క్రమంగా నీరసించి అవి చనిపోతున్నాయి. గతంలో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లలో పాత వలల భాగాలు పక్షుల ముక్కులకు చుట్టుకుని మృత్యువాత పడుతుండేవి. తాజాగా యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టారు. అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపడుతున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు కొత్తగా మాస్కులు.. ప్రస్తుతం కరోనా భయంతో వాడిన మాస్కులు కూడా పెద్ద మొత్తంలో చెరువు తీరంలో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వాడిన మాస్కుల వల్ల ఇక్కడి జీవజాతులకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ లేదా ఇతర పెద్ద సంస్థలు తమ అ«దీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో సరిదిద్దాల్సిన అవసరముందని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఇదీ చరిత్ర ఈ చెరువును ఇబ్రహీం కుతుబ్షా హయాంలో 1560 ప్రాంతంలో నిర్మించారు. దివానంలో నవాబు సలహాదారుగా ఉన్న ఖాదిర్ అమీన్ ఖాన్ పటాన్చెరు ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూములకు సాగునీటి కోసం దీన్ని నిర్మించారట.. 300 ఎకరాల్లో ఉన్న చెరువు కాస్తా రానురాను 93 ఎకరాలకు కుంచించుకుపోయింది. అద్భుతాన్ని పాడుచేస్తున్నారు.. ‘నగరంలో ఇలా గొప్ప జీవవైవిధ్య జలాశయం ఉండటం అరుదు. ఇప్పుడు వలస పక్షుల రాక మొదలైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు అవి కనువిందు చేస్తాయి. అలాంటి అద్భుత వనరును ప్రజలే పాడుచేస్తుండటం దారుణం. ప్రజల్లో అవగాహన తేవటంతోపాటు దాని పరిరక్షణకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది’ – సంజీవ్వర్మ, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ గతేడాది కొత్త అతిథి ఆస్ప్రే.. అంతెత్తు నుంచి వేగంగా నీటి మీదకు దూసుకొచ్చి రెండు కాళ్లతో చేపను ఒడిసిపట్టుకుని రివ్వున ఎగిరిపోయే తెలుపు–గోధుమ వర్ణం గద్ద గతేడాది ఇక్కడ కనిపించింది. ఆ్రస్పేగా పిలిచే ఈ పక్షి మనదేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. మనవద్ద కనిపించదు. గతేడాది వలస పక్షిగా అది ఇక్కడ కనిపించినట్టు బర్డ్ వాచర్స్ చెబుతున్నారు. -
ఒక్కడు.. గ్రామాన్ని మార్చాడు!
కంచన లోకేష్ చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళెం మండలం చింతకుంట గ్రామవాసి. 2013లో పండుగకు తన గ్రామానికి వచ్చారు. గ్రామంలో ఎప్పటిలాగే స్నేహితులు కన్పించలేదు. కరువు కారణంగా గ్రామంలోని రైతులకు పండుగ పట్ల అనాసక్తి పేరుకుపోయింది. ఎక్కువ మంది జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. వలస జీవుల కుటుంబాలను పలకరించారు. అంతదూరం వెళ్లి మనవాళ్లు ఎంత సంపాదిస్తున్నారని వాకబు చేశారు, అరకొర ఆదాయమే పొందుతున్న పరిస్థితిని గ్రహించారు. ఆ మాత్రం ఆదాయం స్వగ్రామంలోనే ఉంటూ పొందవచ్చు అని గ్రామస్తులతో చర్చ పెట్టారు. లోకేష్ మాటలు వారిని ఆలోచింపజేశాయి. ఒకరు ఇద్దరై, ఇద్దరు నలుగురై గ్రామస్తులంతా చైతన్య వంతులై ఆయనతో కలసి వెలుగు వైపు నడిచారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, ఆదాయ వనరులుగా మలిచేందుకు లోకేష్ అడుగులు వేశారు. గ్రామీణులకు అవగాహన కల్పించారు. చేతికి పని, పనికి తగ్గట్లు కూలీ, ఆ పనులు ద్వారా సత్ఫలితాలు చేకూరే ఆలోచనలు చేశారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ఒప్పించి ఉద్యోగం మానేశారు లోకేష్. గ్రామస్తులతో కలసి పొలం బాట పట్టారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకునే విధానాన్ని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిపొందే పనులను గుర్తించారు. ఒక్కొక్కటిగా క్రమం తప్పకుండా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్లారు. రైతుల పంట పొలాల్లోనే 150 నీటి కుంటలు తవ్వించగలిగారు. పంట పొలాలకు వెళ్లేందుకు వీలుగా ఉపాధి హామీ పథకం ద్వారా 22 రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. బీడు భూముల్లో 150 ఎకరాల్లో ఉద్యాన పంటలకు ఉపాధి పథకం అనుసంధానం ప్రక్రియ ద్వారా అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీలకు పాడి ఆవులు లభించేలా చర్యలు చేపట్టారు. గ్రామంలో సీసీ రోడ్లు ఉపాధి హామీ పథకం ద్వారానే వేయించారు. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు వరుసగా చేస్తుండడంతో గ్రామస్థుల కొనుగోలు శక్తి పెరిగింది. బీడు భూములు జలసిరులతో తులతూగుతూ పంటలతో కళకళలాడుతూ ఉండటంతో వలస నివారణకు మార్గమేర్పడింది. గతంలో 300 మందికి పైగా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు. విదేశాల నుంచి తిరిగి స్వగ్రామం చేరిన వారు మరోమారు గ్రామాన్ని విడిచి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. వనరులు పెరగడంలో ఉపాధి ఇక్కడే ఉందని భావిస్తూ, ఎవరికి వారు ఆదాయ వనరులపై దృష్టి సారించారు. గ్రామాభివృద్ధికి పాటు పడుతున్న లోకేష్కు గ్రామస్తులు సైతం అండగా నిలిచారు. ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తూ ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేందుకు తోడ్పడిన లోకేష్ను సర్పంచ్గా ఎన్నుకుంటే మరింత ప్రయోజనం లభిస్తుందని భావించారు. 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ అయ్యింది మొదలు గ్రామంలో లోకేష్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రైతులు తమ పొలాల్లో బోర్లు వేసుకునేందుకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున 40 మందికి మంజూరు చేయించారు. గ్రామంలోని చెరువులకు అనుసంధానంగా ఉన్న సప్లయి ఛానల్ పునరుద్ధరణ పనులు ఉపాధి పథకంలో మంజూరు చేయించి, కూలీలకు పనులు కల్పించి అభివృద్ధికి తోడ్పడ్డారు. ఫలితంగా ఆ చెరువులు నిండాయి. నేడు ఆయకట్టుదారుల పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతున్నది. వ్యవసాయంపై ఆధారపడిన వారితో పాటు, కూలీలకు కూడా చేతి నిండా పని దక్కుతోంది. గ్రామస్థులు కలిసికట్టుగా వ్యవహరించడంతో 2,400 మంది జనాభా ఉన్న చింతకుంట పంచాయితీకి ఉత్తమ పంచాయితీగా రెండుసార్లు అవార్డు దక్కింది. – మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి -
ఇదీ చెరువుల ‘రియాల్టీ’!
ఒకప్పుడు సాహెబ్నగర్ పంచాయతీ పరిధిలో ఆరుతడి పంటలకు నీరందించిన కప్రాయి చెరువు (కప్పల చెరువు) మొత్తం 71 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు మిగిలింది 18 ఎకరాలు మాత్రమే. ఫలితంగా ఇటీవలి వర్షాలకు కట్ట తెగుతుందని ఎల్బీనగర్ ఏరియా గజగజ వణికింది. 1996లో హుడా అనుమతితో ఓ స్టార్ హోటల్ అధినేత చెరువు శిఖం భూమిలోనే వెంచర్ వేసి... హరిహరాపురం కాలనీ పేరుతో 627 ప్లాట్లు విక్రయించారు. ఇటీవల కురిసిన వర్షంతో హరిహరాపురం మొత్తం ఫస్ట్ఫ్లోర్ వరకు మునిగి పది రోజులు వరద నీటిలో విలవిలలాడింది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్... ఒకప్పుడు బాగ్లు (వనాలు), తలాబ్(చెరువులు)లతో అలరారిన మహానగరం. కానీ ఇప్పుడు చెరువు శిఖం భూము లతో పాటు తూములు, అలుగులు, నాలాలపై భారీ నిర్మాణాలతో వరదనీరు పోయే దారిలేక... చేజేతులా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఒకటా రెండా... జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా ఎనభై ఏడు చెరువులకు అధికార యంత్రాంగం కను సన్నల్లో రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉరిపోసి.. ఉసురు తీశారు. చెరువు లను చెరపట్టి... ఐదువందల కాలనీలు ఏర్పాటు చేసి అమాయకంగా కొనుగోలు చేసిన జనాన్ని, ఇటు నగరాన్ని నిండా ముంచేశారు. నగరానికి తలాపున ఉన్న శాతంచెరువు 70 ఎకరాలకు గానూ ఇప్పుడు మిగిలింది కేవలం పది ఎకరాలే. ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా వచ్చే వరదతో నిండే, రామంతాపూర్ ప్రగతినగర్లో పంటలకు నీళ్లందించిన 26 ఎకరాల పెద్దచెరువు కుత్తుక వరకు నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులిచ్చేసింది. ఫలితంగా ఇటీవలి భారీ వర్షాలకు ఐదు కాలనీలను 12 ఫీట్ల వరద ముంచెత్తి... వాస్తవ ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) హద్దులు ఏవో తేల్చిచెప్పింది. మిషన్ కాకతీయ పేరుతో నిర్ణయించిన పూర్తి జలాశయ హద్దులు (ఎఫ్టీఎల్) కూడా సరి కావని ప్రకృతి నిర్ధారించినట్లయింది. రెండు దశాబ్దాలుగా కాలయాపన హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ –మల్కాజిగిరి పరిధిలో 1,728 చెరువులను గుర్తించిన యంత్రాంగం పూర్తి హద్దులు నిర్ణయించేందుకు రెండు దశాబ్దాలుగా కాలయాపన చేస్తూనే ఉంది. ఇప్పటివరకు కేవలం 192 చెరువులనే నోటిఫై చేసి చేతులు దులుపుకుంది. మిషన్ కాకతీయతో మళ్లీ నగర చెరువులకు ప్రాణం పోయాలన్న సర్కారు ప్రయత్నం ఆరేళ్లుగా కార్యరూపం దాల్చనే లేదు. మూసాపేట మైసమ్మ చెరువు భూముల్లో ఏకంగా ఆకాశహర్మ్యాలే లేచాయి. శేరిలింగంపల్లిలోని దేవునికుంట, సున్నంచెరువు, మంగలికుంటలు సైతం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఒకప్పుడు గోల్కొండ రాజులకు మంచినీరందించిన దుర్గంచెరువు సైతం అన్యాక్రాంతం నుండి తప్పించుకోలేకపోయింది. 125 ఎకరాల విస్తీర్ణంలో 25 ఎకరాల్లో గార్డెన్లు వెలిశాయి. దుర్గుం చెరువు నుండి కఠోరాహౌజ్కు నీరందించే గొట్టపుమార్గంపైన కూడా అక్రమ నిర్మాణాలు వచ్చేశాయి. నిధులు, నివేదికలు... బుట్టదాఖలు 2000 సంవత్సరంలో హైదరాబాద్ను వరదలు ముంచెత్తిన తర్వాత... కారణాలు, నివారణ మార్గాల కోసం 2003లో ప్రభుత్వం కిర్లోస్కర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో సర్వే చేయించింది. తొలుత ఓల్డ్ ఎంసీహెచ్ (హైదరాబాద్ జిల్లా), రెండవ దఫాలో జీహెచ్ఎంసీలో వరద నీటి పారుదల, కాలువల ఆధునీకరణ ప్రాజెక్ట్ను కిర్లోస్కర్ కమిటీ రూపొందించింది. దీనికి కోసం 6,247 కోట్ల నిధులు అవసరమవుతాయని నిర్ధారించారు. అయితే అత్యవసరంగా మేజర్ నాలాలను విస్తరించేందుకు 2008లో జేఎన్యూఆర్ఎం కింద రూ.300 కోట్ల నిధులు మంజూరు కాగా వాటిలో కేవలం రూ.120 కోట్లనే ఖర్చు చేశారు. మిగిలిన రూ.180 కోట్లు సకాలంలో ఖర్చు చేయక మురగబెట్టారు. రామంతాపూర్లో..పెద్ద విషాదం రామంతాపూర్ పెద్ద చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా..ఇప్పుడు మిగిలింది కేవలం 12 ఎకరాలే. అలుగు, తూము ఆనవాళ్లే లేకుండా నిండా నిర్మాణాలు వచ్చేశాయి. అధికారులే ఆక్రమణలు నిజమేనని సమాచారహక్కు చట్టం కింద తేల్చేసి చేతులు దులుపుకున్న ఫలితంగా ఇటీవలి వరదతో సాయిచిత్రనగర్, మహేశ్వరినగర్, రవీంద్రనగర్ నిండా మునిగాయి. మునుగుతాయని తెలిసినా... పేదలకు పట్టాలు 472 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫాక్స్సాగర్లో 120 ఎకరాలు.. అన్యాక్రాంతమైపోయింది. ఇక్కడ ఒక ఎకరం ఖరీదు రూ.3 కోట్ల పైమాటే.. ఎఫ్టీఎల్లోనే భారీ నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రసాయన గోదాములున్నాయి. 2003లో అప్పటి ప్రభుత్వం సైతం 11 ఎకరాల్లో 642 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చింది. అక్కడ ఉమామహేశ్వరినగర్ వెలిసింది. ఫాక్స్సాగర్కు వరద వచ్చిన ప్రతిసారీ ఉమామహేశ్వరి నగర్ నిండా మునగటం పరిపాటి అయింది. ఆపద తొలగని అంబీర్చెరువు ఇక ప్రగతినగర్, శంశీగూడల మధ్య ఒకప్పుడు పంటపొలాలకు నీరందించిన అంబీర్చెరువు సర్వేనెంబర్ 103లో 154.34 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు కాగితాల్లో చూపుతున్నా... అక్కడ 54 ఎకరాలకు పైగా నిర్మాణాలు వచ్చేశాయి. ప్రగతినగర్–శంశీగూడల సర్వేనెంబర్ల ఓవర్ల్యాపింగ్ను ఆసరాగా చేసుకున్న నాయకులు, వ్యాపారులు ఏకంగా జీహెచ్ఎంసీ అనుమతితోనే భారీ నిర్మాణాలు చేశారు. హైటెక్ సిటీకి చేరువగా ఉండటంతో కోట్లు గడించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి సాహీ ఎన్జీఓ సంస్థ కొండాపూర్ మజీద్బండలో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని కుడికుంటకు మూడేళ్లలో కొత్త ఊపిరి పోసింది. ఆక్రమణలు లేకుండా చెత్త, డ్రైనేజీ నీటిని డైవర్ట్ చేసి వందేళ్ల క్రితం నాటి వైభవాన్ని తెచ్చింది. ఈ కుంటపై తీసిన ‘లాస్ట్ మైల్ ఫర్ వాటర్’అనే షార్ట్ ఫిలిం ఐక్యరాజ్య సమితి బెస్ట్ సిటీస్పై నిర్వహించిన కాంపిటీషన్లో స్థానం సంపాదించింది. ఈ విషయమై సాహి సభ్యురాలు కల్పనా రమేష్ మాట్లాడుతూ వ్యక్తులుగానే మేం కుడికుంటకు పునర్జీవం పోశాం. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నగరమంతటా చేయవచ్చని పేర్కొన్నారు. 2000 శాతం చెరువు పరిస్థితి ఇదీ.. 2020 ఈ పాపం అందరిదీ: లుబ్మా సర్వత్, సేవ్ అవర్ లేక్ సొసైటీ నగరంలో చెరువు, కుంటలు మాయమై వరద నీటిలో బతికే దుస్థితికి అన్ని వ్యవస్థలూ కారణమే. ఇది వ్యవస్థీకృత నేరంగా చెప్పొచ్చు. రాజకీయనాయకులు, అధికారులు, ఇతర రాజ్యాంగ వ్యవస్థలు బాధ్యతతో వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. హైదరాబాద్ మహానగరం వాస్తవ పరిస్థితి ఏమిటో ఇటీవలి వరదలు చూపెట్టాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన నిర్ణయాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. -
నాలాల దురాక్రమణపై హైకోర్టుకు వెళ్లండి..
సాక్షి, చెన్నై: హైదరాబాద్లో వరదలకు కారణమైన చెరువులు, నాలాల దురాక్రమణపై ఎన్జీటీ చెన్నై బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. నాలాలు, చెరువుల దూరాక్రమణల విషయంలో కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలు చెయాలని తాము చెప్పలేమని ఎన్జీటీ స్పష్టం చేసింది. హైదరాబాద్లో భారీ వరదలకు కారణమైన చెరువులు, నాలాల దురాక్రమణకు సంబంధించి జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆక్రమణలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కిర్లాస్కర్ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే కమిటీ ప్రతిపాదనలు అమలు కావడం లేదని ఎన్జీటీకి విన్నవించారు. ఈ విషయంలో కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి తాము చెప్పలేమని ఎన్జీటీ స్పష్టం చేసింది. హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. దాంతో పిటిషన్ని ఉపసంహరించుకున్నారు. (చదవండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్కు ఎన్జీటీ షాక్) -
చెరువులు ఎప్పడు తెగుతాయోననే భయం
జీవన గమనానికి కల్పతరువులుగా ఉండాల్సిన చెరువు లు వరదనీటితో వణికిస్తు న్నాయి. బతుకుదెరువుకు బాటలు వేయాల్సిన తటాకాలు ప్రజలు తల్లడిల్లేలా పరిణమిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో నిండుకుండల్ని తలపిస్తున్నాయి. కట్టలు తెంచుకుంటున్నాయి. ముంపు ప్రాంతాల కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో నిండిన మహానగర పరిధిలోని పలు చెరువులు ఎప్పడు తెగుతాయోననే భయంతో సిటీజనులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఇప్పటికే కొన్ని చెరువులు తెగి బస్తీలను, కాలనీలను వరద ముంచెత్తాయి. ఆ భయానక పరిస్థితి నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరోసారి భారీ వర్షా లు కురిస్తే మాత్రం చాలా చెరువులు తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా చెరువుల పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్. మూసీతో.. ముప్పే ఇరువైపులా గోడల నిర్మించాలి సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ప్రమాదకర స్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జనావాసాల మధ్య ప్రవహించే మూసీ ప్రదేశాల్లో ఎత్తయిన గోడలు లేకపోవడంతో నీటిలో మునుగుతున్నాయి. 1908లో వచ్చిన వరదల అనంతరం నీటిలో మునిగిన, కొట్టుకుపోయిన బస్తీల వద్ద మూసీ ఇరువైపులా ఎత్తయిన గోడలు నిర్మించారు. అప్పటి వరదలకు పూరానాపూల్ నుంచి చాదర్ఘాట్ వరకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో మూసీ ప్రవహించే ఈ ప్రదేశంలో దాదాపు 60– 70 అడుగులో ఎత్తులో రెండువైపులా గోడలు నిర్మించారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కొన్ని బస్తీలు సేఫ్గా ఉన్నాయి. అదే మూసీ ప్రహించే ప్రదేశాల్లో పురానాపూల్కు అటు వైపు. చాదర్ఘాట్కు ఇటువైపు ఉన్న బస్తీలన్నీ నీటిలో మునిగాయి. మరోవైపు ఈ ప్రాంతాల వద్ద గోడలు లేకపోవడంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో ఎక్కువ నష్టం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. మొదటి వంతెన పురానాపూల్. ఇక్కడి నుంచి మూసీ ఉగ్రరూపం దాలుస్తోంది. చాదర్ఘాట్ దాటే వరకు ఇలాగే కొనసాగుతోంది. నిజాం హయాలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మూసీ నిర్వహణ చేసేవారు. 1963 వరకు మూసీ నీరు చాలా పరిశుభ్రంగా ఉండేది. అప్పట్లో వేసవి కాంలో మూసీలో పూడిక తీసేవారు. నీటి ప్రవాహంతో కొట్టుకువచ్చిన ఇసుకను తీసేవారు. మూసీ శుద్ధీకరణ కోసం ప్రత్యేక ప్రతి ఏటా నిజాం హయాంలో బడ్జెట్ కేటాయింపులు ఉండేవి. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లోని మురికివాడల్లో సుమారు 20 వేల మందికిపైగా ప్రజలు నివసిస్తున్నారని అంచనా. బిక్కుబిక్కున.. 15 కాలనీలు దిల్సుఖ్నగర్: మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ మండల పరిధిలో సుమారు 20 వరకు చెరువులు, కుంటలు నీటితో నిండి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మంత్రాల చెరువు,పెద్ద చెరువు, సందె చెరువుల నుంచి టీఎస్ఆర్ నగర్, జనప్రియ మహానగర్, ఎంఎల్ఆర్ కాలనీ, లక్ష్మీనర్సింహపురి కాలనీ, మిథిలానగర్, సత్యసాయినగర్, వివేక్నగర్ పరిసర 15 కాలనీలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఎల్బీనగర్ పరిధిలో.. చంపాపేట: ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్గూడ, సరూర్నగర్ చెరువు, నాగోల్ డివిజన్లోని బండ్లగూడ చెరువు, నాగోల్ చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువు మన్సురాబాద్ పెద్ద చెరువు, హయత్నగర్ డివిజన్లోని కుమ్మరికుంట చెరువు, బీఎన్రెడ్డి డివిజన్లోని కప్పల చెరువు, బతుకమ్మకుంట చెరువు నిండు కుండలను తలపిస్తున్నాయి. వీటి కట్టలు తెగిపోతే దిగువనున్న కాలనీలు నీటమునిగే ప్రమాదం ఉంది. పొంగిపొర్లితే ప్రమాదకరమే.. గోల్కొండ: భారీ వర్షాలతో గోల్కొండ కోట ప్రహరీని ఆనుకుని ఉన్న శాతం చెరువు ప్రమాదకరంగా మారింది. ఈ చెరువు కట్ట తెగితే సుమారు 15 కాలనీలు నీట మునుగుతాయి. షేక్పేట్ అంబేడ్కర్ నగర్లోని కొత్త చెరువు సైతం వర్షాలకు నిండుకుండలా మారింది. ఈ చెరువు కట్ట నుంచి నీరు పొంగిపొర్లితే సుమారు 10 బస్తీలు నీట మునుగుతాయి. మారుతీనగర్లోని ఎర్రకుంట చెరువులో వరద నీరు నిండుతోంది. దీని కట్ట తెగితే లేదా పొంగిపొర్లితే దీని దిగువన ఉన్న 5 కాలనీలు నీట మునిగే పరిస్థితి. కుత్బుల్లాపూర్లో నిండుకుండలు.. కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నిజాంపేట్లోని తుర్క చెరువు, బాచుపల్లిలోని భైరవుని చెరువు, మేడికుంట, మద్దెల కుంటలు పూర్థిస్థాయిలో నిండాయి. ప్రగతినగర్లోని అంభీర్ చెరువులో సగం మేర నీళ్లు ఉన్నాయి. సూరారంలోని కట్టమైసమ్మ చెరువులో పూర్తిస్థాయిలో నీటి మట్టం చేరుకుంది. ఫాక్స్ సాగర్ చెరువు ఇప్పటికే నిండిపోగా నీటిని బయటకు వదులుతున్నారు. కేవలం నిజాంపేట్లోని తుర్క చెరువు నిండితేనే బండారి లేఅవుట్లోని మొత్తం ప్రాంతం నీట మునుగుతోంది. జీడిమెట్ల ఫాక్స్ సాగర్ తూము తెరిస్తే సుభాష్నగర్ నుంచి పాపయ్య యాదవ్నగర్ దాకా నాలాకు ఇరువైపులా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పల్లె చెరువు మళ్లీ తెగితే ప్రమాదమే.. చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పరిధిలో ఇప్పటికే రెండు చెరువులు తెగి బస్తీలను ముంచెత్తాయి. గత వారం తెగిన పల్లె చెరువు కట్టను అధికారులు పూడ్చివేశారు. ఈ చెరువు మళ్లీ తెగితే దిగువన ఉన్న అలీ నగర్, హాషామాబాద్, అల్జుబేల్ కాలనీ, జీఎం కాలనీ, జీఎం చావునీ, ఉప్పుగూడ నీట మునిగే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం తెగిన గుర్రం చెరువు కట్టను ఇంకా పూడ్చలేదు. ప్రస్తుతం వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు వెళుతోంది. ఈ చెరువుకు ఎగువన ఉన్న బురాన్ఖాన్ చెరువు తెగితే పాతబస్తీని ముంచెత్తే ప్రమాదం ఉంది. హిమాయత్సాగర్కు కొనసాగుతున్న వరద సాక్షి, హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు హిమాయత్సాగర్ జలాశయంలోనికి 1,300 క్యూసెక్కుల వరద నీరు చేరిందని.. రెండు గేట్లు ఎత్తి మూసీలోకి 1372 క్యూసెక్కుల నీటిని వదిలి పెట్టినట్లు జలమండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ జలాశయం పూర్తిస్థాయిలో 1763.5 అడుగుల నీటి నిల్వ ఉంది. ఉస్మాన్సాగర్ జలాశయంలోనికి 833 క్యూసెక్కుల వరద నీరు చేరిందన్నారు. ఈ జలాశయం గరిష్టమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.848 అడుగుల మేర నిల్వలున్నాయన్నారు. భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాలు.. కంటోన్మెంట్: కంటోన్మెంట్ పరిధిలోని, ఎగువన ఉన్న చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువుల్లోకి కొత్తగా ఏమాత్రం వరద వచ్చినా లోతట్టు ప్రాంతాలు మళ్లీ మునిగే ప్రమాదం ఉంది. బోయిన్ చెరువు అలుగు (హస్మత్పేట నాలా) ఉప్పొంగితే బోయిన్పల్లి పరిధిలోని 40కి పైగా కాలనీలు మళ్లీ నీటమునిగే ప్రమాదముంది. రామన్నకుంట చెరువులో వరద నీరు ఎక్కువైతే బ్యాక్ వాటర్ వల్ల సీతారాంపూర్ పరిధిలోని ఐదారు కాలనీలు నీట మునిగి ఇళ్లలోకి నీరు చేరుతుంది. హస్మత్పేట నాలా, పికెట్ నాలాలు కలిసి ప్రవహించే రసూల్పురా ప్రాంతంలో వందలాది నివాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. వరదలా.. మొయిన్ చెరువు అంబర్పేట: ఉస్మానియా యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో ఉన్న మొయిన్ చెరువు అంబర్పేట నియోజకవర్గాన్ని వరద ప్రవాహంతో ముంచెత్తుతుంది. ఈ చెరువు నుంచి వచ్చే వరద ప్రవాహంతో పరీవాహక ప్రాంతాలకు సమస్య లేకుండా ఉండాలంటే నాలాల విస్తరణే పరిష్కారం. అనూహ్యమైతే.. భారీ నష్టమే.. ఉప్పల్: ఉప్పల్ జోన్ పరిధిలో దాదాపు చెరువులు, కుంటలు కలిపి మొత్తం 14 ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి, రామంతాపూర్ పెద్ద చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, నాచారం హెచ్ఎంటీ చెరువు, ఎర్రకుంట చెరువు, కాప్రా చెరువులు ముఖ్యమైనవి. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులన్నీ నిండు కుండల్లా ఉన్నాయి. ఏదైనా అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉంది. రామంతాపూర్ పెద్ద చెరువు: ఈ చెరువుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం నుంచి నీరు వస్తుంది. చెరువు స్థలం కోర్టు వివాదంలో ఉంది. దీంతో ఎఫ్టీఎల్ పరిధిలో సైతం అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చెరువు తెగే పరిస్థితి లేకపోయినప్పటికీ అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటే ఈ చెరువు కిందే ఉన్న చిన్న చెరువుపై కూడా ఆ ప్రభావం పడుతుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రామంతాపూర్ చిన్న చెరువు: విస్తీర్ణం 19.9 ఎకరాలు. ప్రస్తుతం ఉన్నది 11 ఎకరాలు. రామంతాపూర్ పెద్ద చెరువు నుంచి వరద నీరు చిన్న చెరువులోకి వెళ్తుంటాయి. అనుకోని సంఘటనలు జరిగితే చెరువు దిగువ భాగంలో ఉన్న దాదాపు 20 బస్తీలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. వరద వస్తే ముప్పే.. నాచారం హెచ్ఎంటీ నగర్ చెరువు: నాలాలతో పాటు నాచారం ఎర్రకుంట చెరువులోని నీరు ఇందులోకి వస్తోంది. చెరువు నాచారంలో ఉన్నా.. చెరువు కింది భాగం చెరువు కట్టగాని, మత్తడిగాని పూర్తిగా ఉప్పల్ వైపు ఉంటుంది. భారీగా వరద వస్తే చెరువు వు కింది 20 కాలనీలు ముంపునకు గురవుతాయని అంచనా. అలుగు లేక నాలాలోకి.. నాచారం పటేల్ కుంట చెరువు: ఈ చెరువుకు ఎలాంటి అలుగు లేదు. నీరు అధికంగా వస్తే అలుగు ప్రాంతంలో నిర్మించిన వంతెనపై నుంచి నీరు పారుతూ నాలాలోకి వెళ్తుంది. అనుకోని సంఘటనలు జరిగితే 10 కాలనీలు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం పోలీస్ స్టేషన్ పూర్తిగా నీటి మునుగుతాయి. కట్ట తెగితే ఇక్కట్లే.. కాప్రా చెరువు: దీనికి రెండు తూములు ఉన్నా యి. వర్షాలకు వరద నీరు ఎక్కువగా వస్తే చెరువు ఒక వైపు మత్తడి పోస్తుంది. మత్తడి నీరు పోవడానికి నాలా ఉంది. చెరువుకట్ట తెగితే దీనికింద ఉన్న 8 కాలనీలు ముంపునకు గురవుతాయి. ముంచెత్తిన వరద నీరు ఉప్పల్ నల్ల చెరువు: ఒక వైపు పూర్తిగా వరద నీరు వెళ్లేందుకు గండి కొట్టి ఉంది. ప్రస్తుతం వచ్చిన వరద నీరు సైతం వెళ్లిపోతోంది. చెరువు మధ్యలో బండ్ ఏర్పాటు చేయడం వల్ల వరద నీరు డైవర్ట్ అయి కాలనీలను ముంచెత్తింది. ప్రమాదకరంగా పరికి చెరువు కూకట్పల్లి: కూకట్పల్లి జంట సర్కిళ్లు, బాలానగర్, కూకట్పల్లి మండలాల పరిధిలో 14 చెరువులు ఉన్నాయి. వీటిలో 5 చెరువులు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. పరికి చెరువుకు భారీ స్థాయిలో నీరు చేరింది. రంగధాముని చెరువు మత్తడి పడుతోంది. మూసాపేటలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులు ప్రమాదకర స్థాయిలో నిండిపోయాయి. -
మొసళ్లతో మోసం..!
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు పాల్వంచ కిన్నెరసాని డ్యామ్ గేట్లను ఎత్తడంతో నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీంతో కొందరు యువకులు రాజాపురం– ఉల్వనూరు మధ్యలో ఉన్న లో లెవెల్ వంతెన వద్ద నీటి ప్రవాహంలో దోమల తెరల ద్వారా చేపల వేట సాగిస్తున్నారు. గతంలో గేట్లు తెరిచిన కొన్ని సందర్భాలలో కిన్నెరసాని డ్యామ్లో ఉన్న మొసళ్లు నీటి ప్రవాహానికి బయటకు కొట్టుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదకరమైన ప్రాంతం అయినప్పటికీ ఎటువంటి హెచ్చరికలు బోర్డులు లేకపోవడంతో ఇలా కొందరు యువకులు గురువారం చేపల వేట సాగిస్తు్తండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది.– సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
చెరువుల నిండా.. ఈ.కోలి!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాల్సిన పలు చెరువులు కాలుష్య కాసారమౌతుండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి చేరుతున్న వ్యర్థజలాలతో చెరువులు దుర్గందభరితంగా మారుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా పరిశీలనలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఆయా చెరువుల్లో ఈ. కోలిఫాం, హానికారక బ్యాక్టీరియా ఉనికి అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దోమల లార్వా భారీగా వృద్ధి చెందేందుకు అనుకూలంగా ఉండటంతో మహానగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ దుస్థితి కారణంగా సిటీజన్లకు మలేరియా, డెంగీ వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిలువెల్లా కాలుష్యమే.. నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారంగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలం కావడం శాపంగా పరిణమిస్తోంది. సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండటంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గందభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్ కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది. దీంతో ఆయా చెరువుల్లో హానికారక షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఈ.కోలి వంటి బ్యాక్టీరియా ఉనికి పెరిగినట్లు స్పష్టమైంది. దీనికి తోడు ప్రస్తుతం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతుండటంతో పలు చెరువుల్లో దోమల లార్వా అధికంగా వృద్ధి చెందుతోంది. దీంతో దోమలు ఆయా ప్రాంతాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ దుస్థితికి కారణాలివే.. ♦ కూకట్పల్లి ప్రగతి నగర్ చెరువులో 2019తో పోలిస్తే 2020 సంవత్సరంలో ప్రతి వంద మి.లీ లీటరు నీటిలో 406 మైక్రో గ్రాముల మేర కోలిఫాం ఉనికి పెరిగింది. ♦ సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరకుండా మినీ మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించడంలో జీహెచ్ఎంసీ విఫలం కావడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. ♦ గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడటంతో మురుగు కూపమౌతున్నాయి. ♦ పలు చెరువులు వాటి ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయి కుంచించుకుపోతున్నాయి. ♦ చెరువుల ప్రక్షాళనకు జీహెచ్ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యతనిస్తోంది. ఉదాహరణకు కూకట్పల్లి అంబర్ చెరువులోకి సమీప ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు నేరుగా వచ్చి చేరుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఈ ప్రాంతాల్లో దోమల దండయాత్ర... నగరంలోని అంబర్ చెర్వు, ప్రగతినగర్, కాప్రా, పెద్ద చెర్వు, సాయిచెర్వు, దుర్గంచెర్వు, నల్లచెర్వు, లక్ష్మీనారాయణ చెర్వులకు సమీపంలో ఉన్న కట్పల్లి, కేపీహెచ్బీ, మూసాపేట్, బాలానగర్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలోని మెహిదీపట్నం, మసాబ్ట్యాంక్, చాదర్ఘాట్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్నగర్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మూసీలోకి శుద్ధి చేయని వ్యర్థజాలాలు... మరోవైపు రోజువారీగా గ్రేటర్వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. మూసీ ప్రక్షాళన రెండోదశ పథకం కింద 10 చోట్ల ఎస్టీపీలు, మరో రెండు చోట్ల రీసైక్లింగ్ యూనిట్ల నిర్మాణానికి అవసరమైన రూ.1200 కోట్లు నిధులు విడుదల చేయడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం శాపంగా పరిణమిస్తోంది. మలేరియా, డెంగీలతో తస్మాత్ జాగ్రత్త... ♦ప్రస్తుత సీజన్లో దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో డెంగీ, మలేరియా వ్యాధుల ముప్పు పొంచి ఉంది. ♦గర్భిణులు, చిన్నారులు దోమలబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గాలిలో వైరస్, బ్యాక్టిరియా వృద్ధికి దోహదం చేస్తున్నాయి. ♦ప్రభుత్వ యంత్రాంగం యాంటీ లార్వా ఆపరేషన్స్ను మరింత పెంచాలి. -
‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడి పేరు నిన్న దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. తన ప్రాంతంలో నీటి ఎద్దడి తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించిన ఆ వృద్ధుడిని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో అభినందించారు. ఆ వివరాలు.. మాండ్య, దసనదొడ్డి ప్రాంతానికి చెందిన కామె గౌడ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమ ప్రాంతంలో నీటి ఎద్దడిని తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించి పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ సామన్య గొర్రెల కాపరికి ఇది చాలా పెద్ద విషయమే. దాంతో ఇది కాస్తా ప్రధాని దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో నిన్నటి ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో నరేంద్ర మోదీ కామె గౌడను ప్రశంసించారు. దీనిపై సదరు వృద్ధుడు స్పందిస్తూ.. ‘నిన్నటి కార్యక్రమంలో ప్రధాని కరోనా వైరస్ గురించి జనాలను హెచ్చరించారు.. సరిహద్దు వివాదం గురించి మాట్లాడారు. ఇన్ని ముఖ్యమైన అంశాల మధ్య ఆయన నా పేరును ప్రస్తావించి.. అభినందించారు. నా జీవితానికి ఇంతకంటే పెద్ద సంతోషం ఏం ఉంటుంది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రాంతంలో చెరువులు తవ్వించి.. నీటి సమస్యను తీర్చడంతో ఆ ప్రాంత ప్రజలు కామె గౌడను ‘కేరె’(చెరువుల)గౌడ అని గౌరవంగా పిల్చుకుంటున్నారు. (స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి) నిన్నటి ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్ తగిన సమాధానం చెప్పిందని తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
చెరువులో పడి అక్కాతమ్ముడి మృతి
చాంద్రాయణగుట్ట: బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బండ్లగూడ సాదత్నగర్కు చెందిన సయ్యద్ కాజీం హుస్సేన్, సబియా ఖాన్ దంపతులకు ముగ్గురు సంతానం. బుధవారం వారి పెద్ద కుమారుడు మహ్మద్ నవాజ్ (17) బట్టలు ఉతుక్కునేందుకు పక్కనే ఉన్న ఉందాసాగర్కు వెళుతుండగా అతని చెల్లెలు ఖుల్సుం ఫాతీమా (6), తమ్ముడు మహ్మద్ కరీం అలియాస్ అబ్బాస్ (4)లు కూడా అతడితో పాటు వెళ్లారు. చెరువు వద్దకు వెళ్లిన తర్వాత సబ్బు కొనుక్కుని వస్తానని నవాజ్ చిన్నారులిద్దరినీ చెరువు గట్టున ఉన్న రాయిపై కూర్చోబెట్టి వెళ్లాడు. అయితే అతను తిరిగివచ్చేసరికి చిన్నారులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. స్థానికులు చెరువులోకి దిగి వారికి కోసం గాలించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. చిన్నారుల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువు మింగింది..
బూర్గంపాడు: ఒకరిని కాపాడేందుకు ఒకరు చెరువులోకి దిగి వరుసగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ఇంట తీరని శోకం మిగిలింది. కళ్లెదుటే కొడుకు, ఇద్దరు మనవళ్లు మునిగిపోతుంటే వారిని కాపాడేందుకు ఓ వృద్ధుడు నరకయాతన అనుభవించాడు. ఈ విషాద ఘటన బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లమోతు కృష్ణయ్య తన కుమారుడు అప్పారావు(40), మనవడు తేజశ్(20), మరో మనవడు(కూతురు కుమారుడు) జాగర్లమూడి వినయ్కుమార్(17)తో కలిసి పొలం పనులకు వెళ్లాడు. కాసేపు పని చేసిన తర్వాత తిరిగి ఇంటికి బయలుదేరారు. ఒళ్లంతా చెమట పట్టడంతో కడుక్కునేందుకు వినయ్కుమార్ సమీపంలోని రేపాక చెరువులోకి దిగాడు. అక్కడ నీరు లోతుగా ఉండడంతో అందులోనే మునిగిపోయాడు. గమనించిన అప్పారావు అల్లుడిని కాపాడేందుకు చెరువులోకి దిగి, అతడు కూడా అందులోకే జారిపోతూ కేకలు వేశాడు. ఇది విన్న తేజశ్.. తండ్రిని కాపాడేందుకు చెరువులోకి దిగి అతడు కూడా అందులోనే మునిగిపోయాడు. గమనించిన తాత కృష్ణయ్య చెరువులోకి వెళ్లి మనవడిని కాపాడేప్రయత్నం చేశాడు. అప్పటికే నీళ్లలో లోతుకు వెళ్లిన తేజశ్ కృష్ణయ్యను పట్టుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కృష్ణయ్య కూడా లోపలికి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. ఇంతలో పొరుగు రైతులు వారిని గమనించి లుంగీ విసిరి కృష్ణయ్యను కాపాడారు. మిగతా ముగ్గురు అప్పటికే నీళ్లలో మునిగి విగతజీవులుగా మారారు. కళ్లెదుటే కొడుకు, ఇద్దరు మనవళ్లు నీళ్లలో మునిగిపోవటంతో కృష్ణయ్య అక్కడే కుప్పకూలాడు. పొరుగు రైతులు అతనిని చెరువుకట్ట వద్దకు తీసుకొచ్చి ఓదార్చారు. ఈ సమాచారం తెలిసిన గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకున్నారు. ఈతగాళ్లు చెరువులో గాలించి మృతదేహాలను వెలికితీశారు. పాల్వంచ డీఎస్పీ కేఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ నరేష్, ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో తీరని విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. మృతుడు నల్లమోతు అప్పారావు ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తనకున్న మూడెకరాల భూమిని తండ్రి కృష్ణయ్యతో కలసి సాగు చేస్తున్నాడు. అప్పారావు కుమారుడు తేజశ్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అప్పారావుకు భార్య కరుణ, తేజశ్తో పాటు కుమార్తె చందన ఉన్నారు. భర్త, కొడుకు ఒకేసారి ప్రాణాలు కొల్పోవడంతో కరుణను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. మరో మృతుడు వినయ్కుమార్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, ఉమారాణి దంపతుల కుమారుడైన వినయ్కుమార్.. ప్రస్తుతం లాక్డౌన్తో పరీక్షలు వాయిదా పడడంతో ఇటీవలే తాతయ్య, అమ్మమ్మను చూసేందుకు లక్ష్మీపురం వచ్చి ఇక్కడే మృత్యువాత పడ్డాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మీపురం వచ్చి గుండెలవిసేలా రోదించారు. మృతదేహాలను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు తదితరులు సందర్శించి సంతాపాన్ని తెలిపారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. -
పండుగ పూట విషాదం
సంగెం/భూపాలపల్లి అర్బన్/మల్హర్: హోలీ వేడుకలు ముగించుకుని స్నానాలకు వెళ్లిన నలుగురు విద్యార్థులు చెరువులో మునిగి మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసు కున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా కాపులకనిపర్తికి చెందిన కందికట్ల యశ్వంత్ (13) బర్ల రాజ్కుమార్ (13), సదిరం రాకేష్ (12), దౌడు రాకేష్ (9) స్నే హితులతో కలసి హోలీ ఆడారు. అనంతరం పాయచెరువులో స్నానానికి దిగా రు. యశ్వంత్, దౌడు రాకేష్ మొరం కోసం తీసిన గోతిలో పడి చనిపోయారు. వారి వెనుక వెళ్లిన సదిరం రాకేష్ తృటిలో బయటపడ్డాడు. అలాగే.. భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ చెందిన మాచర్ల కల్యాణ్S(16) మల్హర్ మండలం తాడ్వాయి గ్రామ సమీప చెరువుకు వెళ్లాడు. అందులో స్నానం చేసేందుకు దిగి.. ఈత రాకపోవడంతో నీట మునిగాడు. గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. హసన్పర్తి మండలం నిరూప్నగర్ తండాకు చెందిన భూక్య తిరుపతి (16) గ్రామంలోని దామోదర చెరువులోకి ఈతకు వెళ్లి.. లోతైన గుంతలో పడి నీట మునిగి చనిపోయాడు. -
హైదరాబాద్ షార్ట్ఫిల్మ్కు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, మణికొండ: చెరువులు తమ ఆవేదనను ఓ మూగ బాలికతో పంచుకునే ఇతివృత్తంతో తీసిన షార్ట్ఫిల్్మకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. అమెరికాలోని న్యూయార్క్లో అక్కడి కాలమానం ప్రకారం గురువారం జరిగిన అంతర్జాతీయ లాంపా ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటి బహుమతి దక్కించుకుంది. గత డిసెంబర్లో హైదరాబాద్ ఫోయనెక్స్ అరేనాలో జరిగిన జాతీయ షార్ట్ఫిల్మ్ విభాగంలోనూ మొదటి స్థానాన్ని దక్కించుకున్న వీడియో శనివారం అంతర్జాతీయ వేదికపైనా అదే స్థానాన్ని దక్కించుకుంది. ఓ చెరువు తన గోడును ఓ మూగ బాలికతో పంచుకోవటం ఇతివృత్తంగా మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ పెద్ద చెరువు వద్ద ఈ వీడియోను చెరువు పరిరక్షణ కమిటీ సభ్యుడు సునీల్ సత్యవోలు నిరి్మంచగా అన్షుల్ దర్శకత్వం వహించారు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ప్రస్తుతం పర్యావరణ, చెరువుల పరిరక్షణ, వాతావరణ సమతుల్యత వాస్తవాలను చెరువు ఓ పదేళ్ల మూగ బాలికకు చెప్పుకోవటం, ఆ బాలిక చెరువును ఊరడించటం అనే ఇతివృత్తంతో ‘సైలెంట్ వాయిస్’ అనే పేరుతో తీసినట్టు నిర్మాత తెలిపారు. మనుషులు తమ జీవనానికి ఉపయోగపడే చెరువులు, పర్యావరణం, వాతావరణ సమతుల్యతలను ఎలా దెబ్బ తీస్తున్నారనే అనే అంశం అందరి గుండెలకు హత్తుకునేలా ఉండటంతో అంతర్జాతీయ షార్ట్ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్వాహకులను కదలించిందని ఆయన పేర్కొన్నారు. కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సంస్థ ప్రతి ఏటా ఇలాంటి షార్ట్ఫిల్మ్ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇతర షార్ట్ఫిల్్మల కన్నా అధికంగా 17 గోల్స్ సాధించటంతో తమ ఫిల్మ్కు ప్రథమ బహుమతి దక్కిందని ఆయన వివరించారు. అవార్డును లంప ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చైర్పర్సన్ ఓల్గా జుబ్కొవా, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, సోషల్ అఫైర్స్ సెక్రటరీ జనరల్ లియూ జెన్మిన్, రష్యా మొదటి డిప్యూటీ శాశ్వత ప్రతినిధి డ్మిట్రై పోల్యానస్కై చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్టు సునీల్ వివరించారు. -
విద్యార్థి ఉసురు తీసిన ఈత సరదా
ప్రకాశం, ఉలవపాడు: సరదాగా మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండల పరిధిలోని భీమవరం ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గౌడపేరు ఇమ్మానియేలు (19) ఒంగోలులోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడే డీఏ పాలిటెక్నిక్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. సెలవులకు స్వగ్రామం భీమవరం వచ్చాడు. ఆదివారం చర్చికి వెళ్లి వచ్చి 10 మంది మిత్రులతో కలిసి భీమవరంలోని చెరువుకు ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ లోతుకు వెళ్లాడు. చెరువులో జేసీబీతో గతంలో తీసిన గుంతలు ఉన్నాయి. ఆ గుంతల్లోకి వెళ్లిపోయాడు. తోటి మిత్రులు వెళ్లి పక్కనే ఉన్న గ్రామస్తులను తీసుకొచ్చేలోపు మృతి చెందాడు. చేతికి అందివచ్చే సమయంలో కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి గౌడపేరు శేషయ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఈతకు వెళ్లి మృతి చెందడంతో బంధువుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. -
400 చెరువుల్లో... గోదావరి గలగలలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలతో రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపిన ప్రభుత్వం చెరువులను నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యామ్ కింద చెరువులను నింపించిన ప్రభుత్వం..వందకు వంద శాతం చెరువులను నింపే పనిలో పడింది. వీటితో పాటే మిడ్మానేరు పరిధిలోని చెరువులతో పాటే, మిడ్మానేరు దిగువన కొండపోచమ్మసాగర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులకు నీళ్లందించి, వాటి కింది ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఎస్సారెస్పీ స్టేజ్–2 చెరువులకు జలకళ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అటునుంచి మిడ్మానేరు వరకు ఎత్తిపోసిన విషయం తెలిసిందే. దీంతో మేడిగడ్డ మొదలు మిడ్మానేరు వరకు గోదావరి అంతా జలకళను సంతరించుకుంది. మిడ్మానేరులోకి ఈ సీజన్లో మొత్తంగా 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులోంచి 30 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యామ్కు తరలించారు. ఆ నీటిని వదిలి తొలిసారిగా ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న చెరువులను నింపే ప్రక్రియ గడిచిన రెండు నెలలుగా సాగుతోంది. స్టేజ్–2లో మొత్తంగా 681 చెరువులు నింపాల్సి ఉండగా, ఇప్పటికే 586 పూర్తయ్యాయి. మరో 78 చెరువులను ప్రస్తుతం నింపే ప్రక్రియ కొనసాగుతుండగా, మరో 17 నింపాల్సి ఉంది. వీటి నీటి నిల్వ సామర్థ్యం 8.63 టీఎంసీలుగా కాగా, ఇప్పటికే నిండిన చెరువులతో వాటి నిల్వ 8.10 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత యాసంగిలో స్టేజ్–2 కింద ఉన్న 3.97 లక్షల ఎకరాల్లో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం మిడ్మానేరు, లోయర్ మానేరులు నిండుగా ఉండటంతో నిర్దేశించిన ఆయకట్టుకు నీరందించడం పెద్ద కష్టం కాదని ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. ఇక మిడ్మానేరు సైతం పూర్తి సామర్థ్యంతో నిండి ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిర్దేశించిన 80 వేల ఎకరాల ఆయకట్టులో 25 వేల ఎకరాలకు ఈ సీజన్లో నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు నీరిస్తూనే మరో 50 చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని సీఎం కేసీఆర్ సోమవారం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా అధికారులను ఆదేశించారు. అనంతగిరి ఖాళీ అయితే... ఇక దీంతో పాటే మిడ్మానేరు కింద ఉన్న అనంతగిరి గ్రామాన్ని త్వరగా ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ గ్రామం ఖాళీ అయితే అనంతగిరి, రంగనాయక్సాగర్ రిజర్వాయర్లను నింపడంతో పాటు కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించవచ్చు. ఇలా నీటిని తరలించే క్రమంలో రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపుతూ, కొండపోచమ్మ వరకు మొత్తంగా 400 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో నింపే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటికే నింపిన చెరువులు, కొత్తగా నింపేవి కలిపి మొత్తం వెయ్యికి పైగా చెరువులను గోదావరి జలాలతో నింపే కసరత్తు వేగంగా జరుగుతోంది. -
పరీక్షలు.. పక్కాగా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటల్లో నీటి నాణ్యతాపరీక్షలు నిర్వహించేందుకు పీసీబీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సరికొత్తవిధానాన్ని అవలంభించనుంది. ప్రస్తుతం సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ హుస్సేన్సాగర్, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ సహా మరో 19 జలాశయాల్లో మాత్రమే ప్రతినెలా విధిగా నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే అక్టోబర్ నుంచి అన్ని జలాశయాల్లోనూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో జేఎన్టీయూ, ఓయూ పరిధి కళాశాలల్లో ఇంజినీరింగ్, ఫార్మా, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో పీజీ, పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కిట్లను సిద్ధం చేస్తున్నట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతం 22 జలాశయాల్లోనే... హెచ్ఎండీఏ పరిధిలో 3,132.. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కేవలం 22 చెరువుల్లోనే పీసీబీ నెలనెలా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. మిగతా చెరువుల్లో కాలుష్యం స్థాయి తెలుసుకోకుండా... సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్నారు. ప్రస్తుతానికి పెద్దచెరువు, బంజారా చెరువు, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, హుస్సేన్సాగర్, శామీర్పేట్, ప్రగతినగర్, సరూర్నగర్, ఉమ్దాసాగర్, కాముని చెరువు, ఇబ్రహీం చెరువు, మల్లాపూర్, ఫాక్స్సాగర్, నూర్మహ్మద్కుంట, దుర్గం చెరువు, నల్ల చెరువు, కాప్రా, అంబర్ చెరువు, హస్మత్పేట్ చెరువు, రంగధాముని చెరువు, సఫిల్గూడ, మీరాలం, లంగర్హౌస్ చెరువుల్లో నీటి నాణ్యత పరీక్షిస్తున్నారు. ఇక నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో నీటి నమూనాలు సేకరించి విద్యార్థులతో పరీక్షలు చేయించేందుకు ప్రత్యేక కిట్లను తయారు చేస్తున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి ఈ విధానం అమలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. ప్రధానంగా నీటిలో గాఢత, కరిగిన ఘన పదార్థాలు, కోలీఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లు, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, కరిగిన ఆక్సిజన్ శాతం తదితరాలను ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. కాలుష్య కాసారాలు... నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకుకాలుష్యకాసారంగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలమవుతోంది. పలు చెరువుల్లో ఇటీవల కాలంలో గుర్రపుడెక్క అనూహ్యంగా పెరిగింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి వదులుతున్నారు. దీంతో జలాశయాలు దుర్గంధభరితంగా మారుతున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్ కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతో పాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది. మురుగుతోనే అనర్థాలు... చెరువులు కబ్జాలకు గురవడం, ఎఫ్టీఎల్ పరిధిలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో ఆయా జలాశయాలు మురికి కూపాలవుతున్నాయి. పలు చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయాయి. చెరువుల ప్రక్షాళన విషయంలో జీహెచ్ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తోంది. మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్ వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధి లేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. చెరువులు ఇలా.. హెచ్ఎండీఏ పరిధిలో 3,132 జీహెచ్ఎంసీ పరిధిలో 185 -
నగరంలో ఫ్లెమింగోల సందడి
అందమైన ఆ పక్షులు సరస్సుల సౌందర్యానికి అలంకారాలుగా అమరిపోతాయి.నగరానికి వాటి రాక... ప్రకృతి ప్రేమికులను.. మరీ ముఖ్యంగా పక్షి ప్రేమికులనుఒక్కసారిగా అటెన్షన్లోకి తెస్తుంది. సిటీలోని లేక్స్వైపు పరుగులు తీయిస్తుంది. కెమెరాలకు పనిచెబుతుంది. నగరంలో వానలతో పాటు ఫ్లెమింగో పక్షుల సందడి కూడామళ్లీ మొదలైంది. సాక్షి, సిటీబ్యూరో: దక్షిణాఫ్రికా నుంచి వస్తాయీ ఫ్లెమింగో పక్షులు. చల్లని వాతావరణంలోనే ఉంటాయి కాబట్టి వానాకాలం వచ్చి మే వరకూ మన నగరంలో ఉంటాయి. చిరు ప్రాయంలో ఉండగా లేత రంగులో కనిపిస్తూ పెద్దవి అవుతుండగా పింక్ కలర్లోకి మారే వీటి అందం పర్యాటకుల్ని పక్షి ప్రేమికుల చూపులను కట్టి పడేస్తుంది. ఆహారం... విహారం... నీళ్లు పుష్కలంగా ఉన్న చోట ఇవి మకాంఏర్పరచుకుంటాయి. చేపల్ని, పురుగుల్ని ఆహారంగా మార్చుకుంటాయి. ఒకవేళ అక్కడ నీరు సరిగా లేకపోతే అప్పుడు ఇవి నీటిలోని మట్టి అడుగున ఉన్న పాకుడు (అల్గే)ని ఆహారంగా తీసుకుంటాయి. అందుకే ఇవి ఎక్కువగా సరస్సుల చుట్టూ తారాడుతుంటాయి. అయితే నీటి బయట ఉన్న పాకుడును ఇవి ముట్టుకోవు. వాటి శరీరపు వర్ణం అలా రావడానికి కూడా ఆ నీటి అడుగున ఉండే పాకుడు తినడమే కారణం అంటారు. సిటీని వదలక.. ఈ ఫ్లెమింగో పక్షులు ఒకప్పుడు కేవలంవలసపక్షులుగా మాత్రమే ఉండేవి. కాని ప్రస్తుతం సెటిలర్స్గా మారినట్టు కనిపిస్తోందని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. నగరంలోని అమీన్పూర్ లేక్, ఉస్మాన్ సాగర్లతో పాటు మంజీరా సాంక్చ్యురి, అన్నాసాగర్ (మెదక్)... వంటి చోట్ల ఇవిరుతువులకు అతీతంగా తరచుగా దర్శనమిస్తున్నాయని చెప్పారు. బహుశా ఇక్కడ వాతావరణ పరిస్థితులు వాటికి అనువుగా ఉండడం వల్లనే అవి అవి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండొచ్చునన్నారు. అయితే కొందరు చెబుతున్న ప్రకారం... ఇక్కడ సరైన ఆహారం దొరకకపోవడం తద్వారా అవి అంత దూరం ఎగిరి వెళ్లడానికి అవసరమైన శక్తిని సంతరించుకోలేకపోవడం కూడా కారణం కావచ్చునని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా... ప్రస్తుతానికి నగరంలోని పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్న ఈ ఫ్లెమింగో గెస్టులను కలిసి తనివితీరా పలకరించి పులకరించిపోదాం... పదండి. -
నిమజ్జనానికి 26 స్పెషల్ చెరువులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకంగా 26 చెరువులు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 12న జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నగరంలోని ప్రధాన చెరువుల్లో నిర్మించిన 23 ప్రత్యేక నిమజ్జన కొలనులను శుభ్రపర్చడంతో పాటు నిర్మాణంలో ఉన్న మరో మూడు నిమజ్జన చెరువులను పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. లేక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు మరింత కాలుష్యం బారిన పడకుండా ఉంచడంతో పాటు శుభ్రమైన నీటిలో నిమజ్జనాలు నిర్వహించడానికి ఇప్పటికే 23 వినాయక నిమజ్జన కొలనుల నిర్మాణాలను చేపట్టింది. ఈ చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర ప్రమాదకర రసాయన పదార్థాలతో తయారుచేసిన వినాయక, ఇతర విగ్రహాల నిమజ్జనాన్ని చేయడం ద్వారా కాలుష్యానికి గురవుతున్నాయి. ఈ కాలుష్య నివారణకు చెరువుల్లో ప్రత్యేకంగా వినాయక నిమజ్జన కొలనుల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీచేపట్టింది. బెంగళూరు మాదిరిగా... బెంగళూరు నగరంలో నిర్మించిన వినాయక నిమజ్జన కొలనులు మాదిరిగా నగరంలోని 26 ప్రాంతాల్లో నిమజ్జన కొలనుల నిర్మాణాలను చేపట్టింది. మొదటి దశలో రూ.6.95 కోట్ల వ్యయంతో పది నిమజ్జన కొలనులను, రెండో దశలో రూ. 14.94 కోట్ల వ్యయంతో 15 ఎమర్షన్ ట్యాంక్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ రెండో దశలో చేపట్టిన 15 ట్యాంక్లలో 13 పూర్తికాగా మరో రెండింటి నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మూడో దశలో కోటి రూపాయల వ్యయంతో మల్కాజ్ గిరి బండ చెరువులో నిమజ్జన కొలను నిర్మాణాన్ని చేపట్టగా పనులు పురోగతిలో ఉన్నాయి. ఒక్కో నిమజ్జన కొలనులో 5 వేల విగ్రహాలు నిమజ్జనం చేసేవిధంగా నిర్మించారు. సఫిల్ గూడలో ఏర్పాట్లను పరిశీలించిన దానకిషోర్ మల్కాజ్ గిరి సర్కిల్ లోని సఫిల్ గూడ చెరువును జీహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ సందర్శించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి గాను గ్రేటర్ పరిధిలో చెరువుల వద్ద లైటింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, చెరువుల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన నిమజ్జన కొలనులను శుభ్రం చేసి వాటిలో మంచి నీటిని నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని కమిషనర్ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆయా చెరువులకు దారితీసే మార్గాలన్నింటికీ మరమ్మత్తులు చేపట్టడం, మౌలిక సదుపాయాల కల్పన, తాత్కాలిక టాయిలెట్లను, టెంటు సౌకర్యం, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటుకు నిబంధనలను అనుసరించి టెండర్లను పిలువాలని జీహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు. సఫిల్గూడ చెరువును పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పూర్తి అయిన నిమజ్జన కొలనులు ఇవే.. ♦ ఊరచెరువు, కాప్రా ♦ చర్లపల్లి ట్యాంక్ – చర్లపల్లి ♦ అంబీర్ చెరువు – కూకట్పల్లి ♦ పెద్ద చెరువు– గంగారం, శేరిలింగంపల్లి ♦ వెన్నల చెరువు – జీడిమెట్ల ♦ రంగధాముని కుంట – కూకట్పల్లి ♦ మల్క చెరువు – రాయదుర్గ్ ♦ నలగండ్ల చెరువు – నలగండ్ల ♦ పెద్ద చెరువు –మన్సూరాబాద్ సరూర్నగర్ ♦ హుస్సేన్సాగర్ లేక్, సికింద్రాబాద్ ♦ పెద్దచెరువు–నెక్నాంపూర్ ♦ లింగంచెరువు–సూరారం ♦ ముళ్లకత్వచెరువు–మూసాపేట్ ♦ నాగోల్చెరువు ♦ అల్వాల్–కొత్తచెరువు ♦ నల్లచెరువు– ఉప్పల్ ♦ పత్తికుంట–రాజేంద్రనగర్ ♦ బోయిన్చెరువు–హస్మత్పేట్ ♦ మియాపూర్–గురునాథ్చెరువు ♦ లింగంపల్లి– గోపిచెరువు ♦ రాయసముద్రం చెరువు– రామచంద్రాపురం ♦ హఫీజ్పేట్–కైదమ్మకుంట ♦ రాయదుర్గ్ – దుర్గంచెరువు పురోగతిలో ఉన్న నిమజ్జన కొలనులు ♦ పటాన్ చెరు లోని సాకి చెరువు ♦ హుస్సేన్ సాగర్లో అంబేడ్కర్ నగర్ వద్ద ♦ మల్కాజ్ గిరిలోని బండ చెరువు -
చెరువు ఎండిపాయే..
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు ఓవైపు వరద ఉధృతితో జలకళను సంతరించుకుంటే... గ్రామీణ వ్యవసాయానికి పట్టుగొమ్మల్లాంటి చెరువులు మాత్రం చిన్నబోతున్నాయి. ఏటా ఈ సమ యానికల్లా నీటితో కళకళలాడాల్సిన చెరువులన్నీ తీవ్ర వర్షాభావంతో వట్టిపోతున్నాయి. రాష్ట్రంలో 44 వేలకుపైగా ఉన్న చెరువుల్లో ఏకంగా 26 వేల పైచిలుకు చెరువుల్లో నీటి జాడ కానరావడం లేదు. కృష్ణాబేసిన్లోని పూర్వ మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనే 21వేలకు పైగా చెరువులు నీటి కరువుతో అల్లాడుతున్నాయి. కృష్ణా బేసిన్లో గుండె చెరువు.. ఎగువ నుంచి భారీ వరదల కారణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు 15 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నిండాయి. అయితే పరీవాహకంలో వర్షాలు లేకపోవడంతో కృష్ణా బేసిన్ పరిధిలోని చెరువుల పరిస్థితి దారుణంగా ఉంది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, గద్వాల్, మహబూబ్నగర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మొత్తంగా 23,608 చెరువులు ఉండగా ఇందులో 21,133 చెరువుల్లో 25% కన్నా తక్కువ నీరే చేరింది. 25 నుంచి 50% మాత్రమే నీరు చేరిన చెరు వులు 1,656 వరకున్నాయి. 524 చెరువుల్లో 50 నుంచి 75% నీరుండగా, కేవలం 295 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు చేరింది. గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలో 85% చెరువులు చుక్కనీటికి నోచుకోలేకపోయాయి. పూర్వ రంగారెడ్డి జిల్లా పరిధిలో 3,791 చెరువులకు గానూ 3,611 చెరువులు ఖాళీగానే ఉన్నా యి. చెరువుల్లోకి నీరు చేరకపోవడంతో కృష్ణా బేసిన్ పరిధిలో మొత్తంగా 11 లక్షల ఎకరాలపై ప్రభావం పడుతోంది. కృష్ణా బేసిన్తో పోలిస్తే గోదావరిలో కొద్దిగా మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బేసిన్లో 20వేలకుపైగా ఉన్న చెరువుల్లో 9వేలకు పైగా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరిం ది. ఎగువన ప్రాజెక్టుల గేట్లు మూసివేయడంతో దిగువకు వరద ప్రవాహం తగ్గుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో గోదావరి ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ ప్రకటించింది. నది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. -
దేశాయ్ చెరువులో మట్టి దొంగలు
ఎమ్మిగనూరు: మట్టి రుచి ఎరిగిన అక్రమార్కులు చెరువులను చెరబడుతున్నారు. యథేచ్ఛగా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అధికారుల అండదండలతో మట్టి దొంగలు రూ. కోట్లకు పడిగలెత్తుతున్నారు. నందవరం మండలం హాలహర్వి రెవెన్యూ పరిధిలోని దేశాయ్ చెరువు ఉంది. దశాబ్దాల కాలంగా ఈ చెరువుకింద వందలమంది రైతులు తమ పంటలను పండించుకొంటున్నారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో ఉన్న ఈ చెరువు అధికారులకు, రాజకీయ దళారులకు ఆదాయవనరుగా మారింది. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఐదేళ్లపాటు యథేచ్ఛగా కొనసాగిన మట్టిదోపిడీ ఇప్పుడు కూడా కొనసాగుతోంది. చెరువులో మట్టిని తవ్వేందుకు ఎమ్మిగనూరు పరిసరప్రాంతంలోని ఇటుకల బట్టీల యజమానులు ఏకంగా ప్రొక్లెయినర్లను, జేసీబీలను వాడుతున్నారు. ప్రతి రోజు 60 నుంచి 90 ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించేందుకు వినియోగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ కనీసం ఆరు ట్రిప్పుల మట్టిని రోజూ తరలిస్తోంది. ఒక్క ట్రాక్టర్ మట్టిని తరలించేందుకు ఇటుకల బట్టీల యజమానులు రూ.650 చెల్లిస్తారు. ఐదేళ్లూ దోపిడీ.. తెలుగుదేశంపార్టీ్ట అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు మట్టిని యథేచ్చగా దోచేశారు. చెరువులో సారవంతమైన జిగుట మట్టి కావటంతో ఇటుకల తయారికీ అనుకూలంగా ఉంది. దాదాపు 8 ఇటుకల బట్టీలకు ఈ ఒక్క చెరువుమట్టినే తరలిస్తున్నారంటే ఈ మట్టి ప్రాధాన్యతేమిటో తెలుస్తోంది. చెరువు మట్టితో ఇటుకల బట్టీ యజమానులు కోట్లకు పడగలెత్తారు. చెరువులో మట్టిని తరలించిన తరువాత నీరు–చెట్టు కింద అధికారులు బిల్లులు చేయటం, వాటిని దిగమింగటంలో అప్పటి టీడీపీ నేతలూ సిద్ధహస్తులే. అధికారం మారినా దేశాయి చెరువులో మట్టిదోపిడీ మాత్రం ఆగటం లేదు. ఇక్కడ దోపిడీ ‘అధికారిక’ పేటెంట్గా మారింది. సమన్వయంతో ప్రకృతి సంపదను పరిరక్షించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మాత్రం కళ్లకు గంతలు కట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పొలాలకు ఉపయోగపడాల్సిన సారవంతమైన ఒండ్రుమట్టి నేడు వ్యాపారవస్తువుగా మారింది. ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించి ఇటుక బట్టీల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు హాలహర్వి దేశాయ్ చెరువులో మట్టి తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని, ప్రస్తుతం తాము ఎవరికి అనుమతులివ్వలేదని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మట్టి అక్రమ తరలింపును అడ్డుకొనేందుకు రెవెన్యూ,పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టాలన్నారు. –వెంకటేశ్వర్లు, ఎల్లెల్సీ డీఈ -
డేంజర్ చెరువులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని ఆరు చెరువులు డేంజర్జోన్లోకి చేరాయి. ప్రాణవాయువైన ఆక్సిజన్ మోతాదు అనూహ్యంగా పడిపోవడంతోపాటు హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందడంతో ఈ చెరువుల నీళ్లు ప్రమాదకరంగా మారాయి. దీంతో స్థానికులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు సెంటర్ఫర్ క్లైమేట్ ఛేంజ్ అనే సంస్థ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో కూకట్పల్లి పరికిచెర్వు, ఆర్కెపురం ముకిడిచెర్వు, నాచారం చెర్వు, ఉప్పల్ నల్లచెర్వు, మియాపూర్ పటేల్చెర్వు, గోల్కొండ ఇబ్రహీం చెరువులు ఉన్నాయి. ఆయా చెరువుల్లోకి సమీప గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి భారీగా మురుగునీరు చేరడంతో ప్రమాదకర బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు ఈ సంస్థ స్పష్టం చేసింది. ఆరు చెరువుల దుస్థితి ఇదీ.. ఈ ఆరు చెరువుల్లోకి అత్యంత వేగంగా మురుగు నీరు వచ్చి చేరుతుండడంతోపాటు ఆయా నీటిలో హైడ్రోకార్బన్ మిశ్రమాలు అత్యధికంగా ఉండడం, సల్ఫేక్టెంట్ రసాయనాలు అధికంగా ఉండడంతో ఫిలమెంటస్ బ్యాక్టీరియా భారీగా వృద్ధి చెందుతోంది. దీంతో ఆయా చెరువుల్లో తరచూ మురుగునీరు తెల్లటినురగలు కక్కుతోంది. ఈ నీటిని తాకినవారికి చర్మ, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. సాధారణంగా చెరువుల నీటిలో సల్ఫెక్టెంట్ రసాయనం ఒక శాతానికి మించరాదు. కానీ ఆయా చెరువుల్లో 34 శాతంగా ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ చెరువుల్లో చేరే మురుగునీటిలో సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు అధికంగా ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఆక్సిజన్ భారీగా పడిపోయింది.. ఇక మహానగరం పరిధిలో మొత్తం 185 చెరువులుండగా..ఇందులో 17 చెరువుల్లో కరిగిన ఆక్సిజన్ శాతం దారుణంగా పడిపోయినట్లు పీసీబీ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న ఘన, ద్రవ వ్యర్థాలతోపాటు, బల్క్డ్రగ్, ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతోన్న విషరసాయనాలు ఆయా చెరువుల్లోకి నేరుగా చేరడంతో పలు చెరువులు విషం చిమ్ముతున్నాయి. పీసీబీ ప్రమాణాల ప్రకారం ఆయా చెరువుల్లోని నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం ప్రతి లీటరు నీటిలో 4 మిల్లీగ్రాముల మేర ఉండాలి. కానీ పలు చెరువుల్లో 2 మిల్లీగ్రాముల కంటే తక్కువగా నమోదవడం గమనార్హం. మురుగుతోనే అవస్థలు.. సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం..చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపమౌతున్నాయి. చెరువుల ప్రక్షాళనకు జీహెచ్ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యతనిస్తోంది. మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమౌతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ పరిధిలో కాలుష్యకాసారంగా మారిన ఇతర చెరువులివే.. నల్లచెరువు, నూర్మహ్మద్కుంట, మల్లాపూర్, బంజారాలేక్, ప్రేమాజీపేట్, సరూర్నగర్, లంగర్హౌజ్, సఫిల్గూడా, హస్మత్పేట్ చెర్వు, హుస్సేన్సాగర్, మీరాలం చెర్వు, అంబీర్చెర్వు, కాప్రా చెర్వు, రంగధాముని చెర్వు, ప్రగతినగర్, ఫాక్స్సాగర్.్ట -
చెరువులు వెలవెల.. రైతులు విలవిల
సాక్షి, మెంటాడ (విజయనగరం): వరుణుడు ముఖం చాటేయడంతో మండలంలోని చెరువులు చుక్కనీరు లేక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ వరిసాగుకు సిద్ధపడే రైతులను వర్షాభావ పరిస్థితి సందిగ్ధంలోకి నెట్టేసింది. ఇటీవల అడపా, దడపా వర్షాలు కురిసినా చెరువుల్లోకి నీరు చేరే స్థాయిలో కురవకపోవడంతో రైతన్నలు దిగులుచెందుతున్నారు. వరినార్లు పోసేం దుకు సాహించడం లేదు. దమ్ముల సంగతి పక్కనపెడితే నారుమడులకు కూడా నీరందుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేపట్టి చెరువులను లోతు చేయిస్తున్నా వర్షాలు లేకపోవడంతో ఆ పనులవల్ల ఎటువంటి ఫలితం దక్కడం లేదని రైతులు అంటున్నారు. మండలంలో చిన్న పెద్ద చెరువులు, బందలు కలిపి సుమారు 400 వరకు ఉన్నాయి. వీటి కింద సుమారు 3,600 ఎకరాల వరకు ఖరీఫ్ వరి సాగు చేసేవారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆసన్నమవుతున్నా నేటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో వరి విత్తనాలు రైతుల వద్ద సిద్ధంగా ఉన్నప్పటికీ చల్లేందుకు సాహసించలేకపోతున్నారు. గోపీ పట్నాయిక్ చెరువు మండలంలోని గోపీ పట్నాయిక్ చెరువు పరిధిలో సుమారు 500 ఎకరాల ఆయకట్టు ఉంది. బడేవలస, మీసాలపేట, కొంపంగి, ఇద్దనవలస రాబం ద గ్రామాలకు చెందిన భూములను ఈ చెరువు ఆధారంగానే సాగుచేస్తుంటారు. ప్రస్తుతం ఈ చెరువులో చుక్క నీరు లేకపోవడం ఆయకట్టు రైతులను ఆందోళనలోకి నెట్టింది. పొట్టి బంద చెరువు అమరాయివలస,కైలాం గ్రామాల పొలాలకు పొట్టి బంద చెరువు ద్వారానే నీరు అందుతుంది. ఈ చెరువు కింద సుమారు 250 ఎకరాలు సాగవుతోంది. ప్రస్తుతం ఈ చెరు వు ఎడారిని తలపిస్తోంది. ఆయకట్టు రైతులు కనీసం నారు మడులు కూడా తయారు చేయలేదు. గండివాని, పినా చెరువులు కైలాం గ్రామ రైతులు గండివాని చెరువు ఆధారంగానే వరి సాగు చేస్తుంటారు. సుమారు 400 ఎకరాల ఆయకట్టు ఈ చెరువు కింద సాగువుతోంది. ఈ ఏడాది నేటికీ చెరువులోకి చుక్క నీరు చేరలేదు. చింతలవలస రెవెన్యూ పరిధిలో ఉన్న పినా చెరువు కింద సుమారు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరవు పరిస్థితి కూడా అలాగే ఉంది. విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఈ ఏడాది ఉభాలు జరిగేలా లేవని రైతులు అంటున్నారు. -
శిఖం చుట్టు కుట్ర
సాక్షి, జగిత్యాల: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మోతె చెరువు శిఖం, ఎఫ్టీఎల్ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. పదేళ్ల క్రితం వరకు నిండుకుండలా, వెడల్పాటి కాలువలతో చూడముచ్చటగా ఉన్న ఈ చెరువు క్రమంగా ఆనవాళ్లు కోల్పోతోంది. పెద్దకాలువలు పిల్లకాలువల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. కబ్జాలతో చెరువులో నీటి నిలువసామర్థ్యం తగ్గుతోంది. ఒకప్పుడు 8వేల ఎకరాలకు సాగునీరందించిన చెరువు ప్రస్తుతం 3వేల ఎకరాలకు నీరందించలేదని దైన్యస్థితికి చేరింది. అంతేకాదు.. జగిత్యాల మండ ల పరిధిలోని ముప్పాల, తిమ్మాపూర్, జాబితాపూర్, పొలాస తాళ్ల చెరువులకు ఏకైక నీటి వనరు ఈ చెరువే. చెరువు భూముల్లో కొనసాగుతున్న కబ్జాలతో భవిష్యత్లో నీరందించడం అనుమానమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటికే మూడు వందలకు పైగా ఇండ్ల నిర్మాణాలు చెరువును కప్పేశాయి. వాగుతో పాటు ముంపు ప్రాంతాలూ కబ్జా మోతె చెరువుకు ప్రవాహం వచ్చే వాగు అంతర్గాం శివారు నుంచి ధరూర్, నర్సింగాపూర్ మీదుగా మోతెచెరువులో కలుస్తుంది. ఈ ప్రాంతాలను కూడా ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి వాగుతో పాటు ముంపు ప్రాంతాలను చదునుచేశారు. దీంతో వర్షాకాలంలో నీరు వాగునుంచి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో పాటు చెరువు నీటిమట్టం తగ్గడంతో ముంపు ప్రాంతాల్లో ఉన్న భూముల్లో రియల్ఎస్టేట్ వ్యాపారులు చదునుచేసి ప్లాట్లు సిద్ధంచేశారు. కబ్జా వంద ఎకరాలపైనే... మోతె గ్రామంతో పాటు మున్సిపల్ పరిధిలోని 10, 16 వార్డులకు ఆనుకుని చెరువు ఉంది. సర్వే నంబరు 406లో ఉన్న చెరువు మొత్తం విస్తీర్ణం 90.23 ఎకరాలు. గత పదేళ్లకాలంలో 40ఎకరాలు కబ్జాకు గురైంది. ప్రస్తుతం 50ఎకరాలకు మించి చెరువు విస్తీర్ణంలేదు. 269 నుంచి 319 సర్వే నంబర్లకు వరకు 790 ఎకరాల శిఖం భూమి, మరో 50ఎకరాల్లో ఎఫ్టీఎల్ (ఫుల్ బ్యాంక్ లెవల్) భూములున్నాయి. ఇందులో 50 ఎకరాల శిఖం, 20 ఎకరాల ఎఫ్టీఎల్ భూములు కబ్జాకు గురయ్యాయి. ఆక్రమిత భూముల్లో 300లకు పైగా నివాస గృహాల నిర్మాణాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా జిల్లా ఏర్పాటుకు ముందు అప్పటి సబ్కలెక్టర్ శశాంక ఈ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. శిఖం భూముల్లోని అక్రమాణాలను తొలగించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఆయన బదిలీ అయ్యారు. దీంతో అప్పటి వరకు వేచి ఉన్న ఆక్రమణాదారులు శశాంక బదిలీ అయిన వెంటనే మళ్లీ ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలు ప్రారంభించారు. కనీసం ఇప్పటికైనా అధికారులు సంప్రదించి చెరువు భూములను స్వాదీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతోనే... జిల్లా ఏర్పాటు ప్రకటనతోనే జగిత్యాల, పరిసర ప్రాంతాల్లో భూములకు భలే డిమాండ్ పెరిగింది. భూముల ధరలు ఒకేసారి 10 రేట్లు పెరిగాయి. దీంతో సామాన్యులు భూములు కొనలేని స్థితిలో చేరుకున్నారు. ఇదే క్రమంలో చెరువులు, కుంటలపై కన్నేసిన పలువురు వాటిని కబ్జా చేయడం మొదలుపెట్టారు. కబ్జాల పరంపర గత ఐదేళ్లలో నుంచే ఎక్కువైంది. ఇదే క్రమంలో పలువురు చెరువు భూములు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. సీఎం ఆదేశాలు బేఖాతరు చెరువులు, వాటి భూముల ఆక్రమణల అంశాన్ని సీరియస్గా పరిగణించాలని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యల విషయంలో రాజీపడొద్దని, ఆక్రమిత చెరువు భూములను స్వాధీనం చేసుకుని పునరుద్ధరించాలని గతంలో కలెక్టర్ల సదస్సులో సూచించారు. అయినా జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న పెద్ద చెరువే కబ్జా కోరల్లో చిక్కుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపడుతుంటే మరో పక్క క్షేత్రస్థాయిలో చెరువుల కబ్జా పరంపర కొనసాగుతుండటం గమనార్హం. చెరువును కాపాడాలి మోతె గ్రామ జగిత్యాల పట్టణానికి ఆనుకునే ఉంది. అయినా మోతె చెరువు భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. కాలువలు సైతం కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుంట్నురు. దీంతో నీరుపారని పరిస్థితి ఉంది. చెరువు భూములు కబ్జాపై అప్పటి సబ్కలెక్టర్ శశాంక స్పందించి ఆక్రమణలను తొలగించారు. ఆయన బదిలీ తర్వాత మళ్లీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోతె చెరువు, దాని పరిధిలోన భూములను కాపాడాలి. – మునీందర్రెడ్డి, రైతు, తిమ్మాపూర్ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తాం మోతె చెరువు పరిధి భూములను ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో జాయింట్గా సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటుచేస్తాం. ఎవరైనా ఆక్రమించినట్లుగా గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో, జగిత్యాల అర్బన్ -
గుండె చెరువు
నీరు–చెట్టు పనుల్లో అధికారులు, టీడీపీ నాయకుల చిత్తశుద్ధి మరోసారి బయటపడింది. రూ.లక్షలు వెచ్చించి చేపట్టిన పనుల్లో డొల్ల వెలుగుచూసింది. దీర్ఘకాలం పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి, ప్రజలకు మరోసారి రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. కరువుతో నీటి కోసం ప్రజలు, రైతులు అల్లాడుతున్న తరుణంలో అనుకోని అతిథిగా వచ్చిన వర్షం నీరు చెరువుకు చేరినా ఫలితం లేకపోయింది. చెరువు కట్ట మరమ్మతులకు గత ఏడాది మంజూరైన నిధులతో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో వర్షంనీటి ఉధృతికి రింగ్బండ్ తెగి పంటపొలాలపై నీరు ప్రవహించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాక్షి, మార్కాపురం : వర్షాకాల మొచ్చినా చెరువుల అభివృద్ధి, వాటి పనులను పట్టించుకోని అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని బొందలపాడు చెరువు కింద 80 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ చెరువుకు నీరు వచ్చిన ప్రతిసారీ కట్ట తెగిపోవటం సర్వసాధారణమైంది. ఇరిగేషన్ అధికారులు ఏటా నీరు చెట్టు కింది కట్ట మరమ్మతుల పేరిట రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నా కూడా చెరువుకు వచ్చిన నీరు వృథాగా పోతోంది. నీరు చెట్టు కింద 2017–18 సంవత్సరంలో నూతన తూము ఏర్పాటు చేయటానికి రూ. 8 లక్షలు నిధులు ఖర్చు చేశారు. ఇదే చెరువుకు గత ఏడాది కూడా మళ్లీ రూ. 8 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఆ నిధులతో తూము ఏర్పాటు చేయటంలో అధికారులు, కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఎట్టకేలకు ఇటీవల నెల కిందట నూతన తూమును ఏర్పాటు చేయటానికి పాత తూమును తొలగించారు. ఆ తూము ముందు రింగ్ బండ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ రింగ్ బండ్లో నాణ్యతో లోపించటంతో శనివారం రాత్రి కురిసిన వర్షానికి చెరువుకు నీరు రావటంతో రింగ్ బండ్ తెగిపోయింది. అలాగే దీంతో పాటు చెరువు కట్టకు రంధ్రం పడి నీరంతా పంట పొలాలపై ప్రవహించింది. దీంతో ఐదెకరాల పత్తి పంట దెబ్బతింది. తనకు దాదాపు రూ. 1.5 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు లబోదిబో అంటున్నారు. ప్రతి ఏటా నీరు చెట్టు కింద టీడీపీ నాయకులు పనులు చేపట్టడం. అవి నాణ్యత లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షానికి తెగిన బొందలపాడు చెరువుకట్ట ఎగువ ప్రాంతంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని బొందలపాడు చెరువుకు నీరు చేరింది. అయితే ఆ చెరువుకు కొంతమేర నీరు రావటం రింగ్ బండ్ తెగిపోయి అదంతా బయటకు వెళ్లిపోయింది. చెరువు కట్ట నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే రింగు బండ్ కొట్టుకు పోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువు నుంచి దిగువ ప్రాంతానికి నీరు వృథాగా పోవటంతో దిగువన ఉన్న ఐదెకరాలు పత్తి పంట నష్టం వాటిల్లింది. దీంతో ఆ రైతు లబోదిబో మంటూ రూరల్ పోలీస్ స్టేషన్లో కారకులపై ఫిర్యాదు చేయటం జరిగింది. రాకరాక వచ్చిన నీరు పోవడంతో పాటు, చెరువుకట్టకు రంధ్రం పడటం, రింగ్బండ్ తెగిపోవడం మళ్లీ నిర్మాణం చేపట్టాల్సి రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లోపించే చెరువు రింగ్బండ్ తెగింది అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రింగ్ బండ్ నిర్మాణంలో నాణ్యతో లోపించటం వల్లనే తెగింది. ప్రతి ఏటా నీరు చెట్టు కింద రూ. లక్షోల్లో నిధులు మంజూరు చేస్తున్నారు. అయితే నాణ్యత లేకుండా జరిగే పనులు వల్ల ఆతర్వాత వచ్చే వర్షానికి చెరువు కట్ట తెగిపోవటం పరిపాటి అయింది. అధికారులు పచ్చచొక్కాదారులకు కొమ్ముకాయడం వల్లే రైతులు నష్టపోతున్నారు. ఈ చెరువు నిండుతే నాలుగు గ్రామాలకు నీరు వస్తుంది. ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించి సదరు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయింలి. తుమ్మా వెకంటేశ్వర రెడ్డి, బొందలపాడు నీరు ఉధృతంగా రావటంతో రింగ్బండ్ తెగింది ఎగువ ప్రాంతంలో భారీ వర్షం పడి చెరువుకు ఉధృతంగా నీరు రావటం వల్లే ఆ రింగ్ బండ్ తెగింది. నాణ్యతాప్రమాణాలను తప్పక పాటించి పనులు సదరు కాంట్రాక్టర్తో చేయించటం జరుగుతుంది. మరళా వర్షాలు పడేలోపే చెరువు రంధ్రానికి, తూము ఏర్పాటు చేసి ఇలా మరలా అలా జరకుండా చర్యలు తీసుకుంటాం. ఇరిగేషన్ ఏఈ రమణి -
సరదా.. విషాదమాయె!
ఆ నలుగురు విద్యార్థులు వేసవి సెలవుల్లో తమకు నచ్చిన ఆటలు ఆడారు.. సమీపంలోని చెరువులో సరదాగా చేపలుపడదామని వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి వారిలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో బాలుడిని స్థానికులు గమనించి రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. మృతుల్లో అన్న, చెల్లెలు ఉండటం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కందనూలు (నాగర్కర్నూల్): బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్కు చెందిన బొక్కి శైలజ (12), మండల స్వాతి (9), అనిల్ (10), గణేష్ సమీపంలోని సూరయ్యకుంట చెరువులో చేపలు పట్టేందుకు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్లారు. ఈ క్రమంలోనే గణేష్ తప్పా మిగతా ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడటం గ్రామస్తులను కలచివేసింది. అనంతరం ముగ్గురి మృతదేహాలను స్థానికులు గాలించి వెలికితీశారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఇదే గ్రామానికి చెందిన మండల అంజనమ్మ, చంద్రయ్య దంపతులకు ఇద్దరు సంతానం. అందులో అనిల్, స్వాతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. తమకున్న ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలు కావడంతో తల్లిదండ్రుల రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. ఇక బొక్కి చెన్నమ్మ నాగయ్య, దంపతుల నాలుగో సంతా నమే శైలజ. ఈ బాలిక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు మృతి చెందడంతో తల్లి దండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాధిత కుటుంబాలను సర్పంచ్ వంగా సుదర్శన్గౌడ్ పరామర్శించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ లక్ష్మీనర్సింహ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు -
అయ్యో.. వినాయకా!
బ్రహ్మ చేసిన బొమ్మలు బాలలైతే..బాలలు చేసిన బొమ్మ దేవుడుకాలేకపోయాడా..వేసవి సెలవుల్లో సంబరంగా గడపాల్సిన చిన్నారులు..నాలుగు నెలల ముందే చవితి సంబరం చేద్దామని..ముద్దు ముద్దుగా మట్టి ముద్దను పితికిబొజ్జ గణపయ్య ప్రతిమ చేసి..భక్తిభావంతో ముచ్చటగా పూజచేసి..నీట ముంచి నిమజ్జనం చేయబోతే.. ఆ నీటిలోనే మునిగి నిండు ప్రాణాలు వదిలి.. కన్నశోకం మిగిల్చి.. కడుపుకోత నింపిరి..కళ్లముందు చెంగుచెంగుమని గెంతాల్సిన తనయులుకట్టిలా నిర్జీవమై పడి ఉన్న బిడ్డలను చూసి..తల్లిదండ్రుల గుండె ‘చెరువు’ అయ్యిందిఅమడగూరు ఎస్సీ కాలనీ శోకసంద్రమైంది.. అమడగూరు: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు ఆడుకునేందుకని వెళ్లి జలసమాధి అయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన అమడగూరు ఎస్సీ కాలనీకి చెందిన పులగల్లు రామాంజినేయులు, నరసమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు సుమంత్ (10), సునీత్ (8). రామాంజనేయులు పెయింటర్గా పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో సుమంత్ ఐదో తరగతి, సునీత్ మూడో తరగతి పూర్తి చేశారు. వేసవి సెలవులు కావడంతో ప్రతి రోజూ స్నేహితులతో కలిసి ఆడుకునేవారు. ఆదివారం రాత్రి కురిసిన వానకు దేవగుడి చెరువులోని పెద్ద, చిన్న గుంతల్లో నీరు చేరింది. పక్కనే ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన పిల్లలంతా చెరువులో ఆడుకోవడానికి వెళ్లారు. వినాయక నిమజ్జనం కోసం వెళ్లి.. చెరువులో ఎక్కడ చూసినా బంకమట్టి ఉండటంతో పిల్లలు తమ చిట్టిచేతులతో వినాయకుడి బొమ్మలను తయారు చేశారు. అక్కడే కాసేపు ఆడుకున్న తర్వాత బొజ్జ గణపయ్యలను నిమజ్జనం చేయడానికి ఉపక్రమించారు. సునీత్ తన వినాయకుడి బొమ్మను తీసుకుని నీటిగుంతలోకి దిగాడు. అలా కొద్దికొద్దిగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో లోతైన ప్రదేశంలోకి చేరుకున్నాడు. మునిగిపోతున్న తమ్ముడిని చూసి కాపాడేందుకు ప్రయత్నించిన సుమంత్ కూడా మునిగిపోయాడు. తోటి స్నేహితులు గమనించి కాలనీలోకి పరుగులు తీసి జరిగిన విషయాన్ని చెప్పారు. వెంటనే కాలనీవాసులు చెరువు వద్ద నీటి గుంతలోకి దిగి వెతకడం ప్రారంభించారు. గంటపాటు వెతికి అన్నదమ్ముల (సుమంత్, సునీత్ల)ను బయటకు తీయగా.. అప్పటికే వారు విగత జీవులుగా మారిపోయారు. తల్లిదండ్రుల అరణ్యరోదనలు ఉన్న ఇద్దరు కుమారులు జలసమాధి కావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు ఆసరా ఎవరు స్వామీ, మీరు లేకుంటే ఇక మేమెందుకంటూ పేగు బంధం తెంచి జన్మనిచ్చిన ఆ తల్లితండ్రులు విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ప్రతి ఒక్కరి కళ్లూ నీటితో నిండిపోయాయి. ఎస్ఐ రాఘవయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గాజుల రామారంలో విషాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గాజుల రామారం ఏరియాలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంటలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు.. ఐలమ్మ (65), అనిత (30), యశ్వంత్ (10) గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు : ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు వాగులో పడి మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలం చిరుమామిళ్ళలో విషాదాన్ని మిగిల్చింది. మృతులు.. జస్వంత్ (4), మణికంఠ(7)గా గుర్తించారు. -
ప్రాణం తీసిన తగాదాలు
భాగ్యనగర్కాలనీ: కుటుంబ తగాదాల కారణంగా చెరువులో దూకి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తులసీవనం ప్రాంతంలోని ఎల్లమ్మ చెరువు సమీపంలో నివాసం ఉంటున్న మెదక్ జిల్లా, పాపన్న పేటకు చెందిన ఉప్పు రాజు(26), రేణుక దంపతులు కూలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వరుసకు అల్లుడైన పల్లపు ప్రసాద్(14) వారి వద్దే ఉంటూ అదే ప్రాంతంలోని చికెన్షాపులో పనిచేస్తున్నాడు. అల్లుడు తమ వద్ద ఉండటం ఇష్టం లేకపోవడంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కూడా వారి మధ్య ఘర్షణ జరగడంతో జీవితంపై విరక్తి చెందిన వారు ఆత్మహత్య చేసుకునేందుకు ఎల్లమ్మ చెరువు వద్దకు వచ్చారు. మొదట అల్లుడు ప్రసాద్ నీటిలో దూకగా, రేణుక చెరువులో దూకే క్రమంలో రాజు ఆమెను వెనక్కు లాగి తాను చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెçస్క్యూ టీమ్ సహాయంతో రాజు మృతదేహాన్ని వెలికితీశారు. ప్రసాద్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అదే నిర్లక్ష్యం..!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో చెరువుల ప్రక్షాళనపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడటంలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులకుగాను..ప్రస్తుతానికి 19 చెరువుల ప్రక్షాళన, సుందరీకరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మిగతా చెరువులను పట్టించుకోకపోవడంతో ఆయా చెరువులు కబ్జాలపాలై కుంచించుకుపోతున్నాయి. ఘన, ద్రవ వ్యర్థాల చేరికతో కాలుస్య కాసారాలుగా మారుతున్నాయి. సమీప ప్రాంతాల ప్రజలు దోమలతో అవస్థలు పడుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని 2357 చెరువుల పరిస్థితీ ఇదే తరహాలో ఉంది. ఐదేళ్లుగా ఎఫ్టీఎల్ సరిహద్దులు గుర్తించడంలోనూ యంత్రాంగం విఫలమౌతోంది. గుర్తింపుపైనా నిర్లక్ష్యమే.. ఒకప్పుడు చెరువులు, కుంటలతో అలరారిన భాగ్య నగరిలో వాటి పరిరక్షణ గాలిలో దీపంలా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మొత్తం 2357 చెరువులకుగాను..ఐదేళ్లుగా ఎఫ్టీఎల్ సరిహద్దులు గుర్తించి తుది నోటిఫికేషన్ జారీచేసింది కేవలం 165 చెరువులకే కావడం గమనార్హం. మిగతా చెరువుల బౌండరీలు, ఎఫ్టీఎల్ గుర్తింపు పనులు నీటిపారుదల, హెచ్ఎండీఏ, రెవెన్యూ విభాగాల వద్ద వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉండడం ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఆయా చెరువుల ఎఫ్టీఎల్(నీటి నిల్వసామర్థ్యం)సరిహద్దులను గుర్తించే పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగుతుండడం గమనార్హం. చేయాల్సింది ఇలా.. ప్రధానంగా ప్రైవేటు కన్సల్టెన్సీల సాయంతో సంబంధిత చెరువు లేదా కుంటను హెచ్ఎండీఏ సర్వే చేసి ప్రాథమిక నివేదికను నీటిపారుదల శాఖకు సమర్పించాలి. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మ్యాప్ను సిద్ధంచేసి తిరిగి హెచ్ఎండీఏకు అప్పగించాలి. ఆతరువాత హెచ్ఎండీఏ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరవాత రెవెన్యూ యంత్రాంగానికి పంపిస్తారు. అక్కడ ఆమోద ముద్ర పడగానే తుది నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మొత్తం 2357 చెరువులకుగాను ఐదేళ్లుగా ఎఫ్టీఎల్ సరిహద్దులు గుర్తించి తుది నోటిఫికేషన్ జారీచేసింది 165 చెరువులకు మాత్రమే కావడం గమనార్హం. మిగతా చెరువుల బౌండరీలు, ఎఫ్టీఎల్ గుర్తింపు పనులు నీటిపారుదల, హెచ్ఎండీఏ, రెవెన్యూ విభాగాల వద్ద వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. 80 శాతం తగ్గిన విస్తీర్ణం..! ఔటర్కు లోపల చిన్న, పెద్ద చెరువులు, కుంటల విస్తీర్ణం 2005లో సుమారు 30,978 ఎకరాలుగా ఉండేది. ఆ తరవాత శివార్లలో రియల్ రంగం ఊపందుకోవడంతో అక్రమార్కుల కన్ను విలువైన జలాశయాలపై పడింది. జి.ఓ.111 పరిధిలో ఉన్న గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు, రియల్వెంచర్లు, వాణిజ్యస్థలాలు, బహుళఅంతస్థుల భవంతులు వెలిసి ఒకప్పుడు పచ్చటి పంటపొలాలు, నిండుకుండలను తలపించే చెరువులు, కుంటలతో కళకళలాడిన ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్ మహారణ్యంగా మారాయి. దీంతో ఆయా జలవనరుల విస్తీర్ణంగణనీయంగా తగ్గుముఖం పట్టి 5641 ఎకరాలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. గత 13 ఏళ్ల కాలంలో సుమారు 80 శాతం మేర వీటి విస్తీర్ణం తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇందుకు పట్టణీకరణ ప్రభావం ఒక కారణమైతే, రెవెన్యూ, పంచాయతీరాజ్, చిన్ననీటిపారుదల శాఖల నిర్లక్ష్యం మరో కారణంగా పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ బాధ్యతలు ఇవీ.. ♦ చెరువులు, కుంటలను కబ్జాచేస్తున్న అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ♦ ప్రతీ జలాశయానికి ఎఫ్టీఎల్ పరిధిని గుర్తించి పటిష్ట రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. ఆయా జలాశయాల చుట్టూ పటిష్టమైన కట్టలు ఏర్పాటు చేయాలి. ♦ జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి. ♦ ప్రతి జలాశయం పరిరక్షణకు స్థానికులతో కమిటీ ఏర్పాటు చేయాలి. ♦ ఇప్పటికే అక్రమార్కుల చెరువులో ఉన్న భూములను రెవెన్యూ యంత్రాంగం స్వాధీనం చేసుకోవాలి. ♦ ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో స్థానిక ప్రజ లు, రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలి. ♦ స్టార్మ్ వాటర్ డ్రైనేజి (వరదనీటి కాలువల) మాస్టర్ప్లాన్ను పరిగణనలోకి తీసుకొని టౌన్ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. ♦ మిషన్ కాకతీయ పథకంలో భాగంగా అన్ని చెరువులు, కుంటల పునరుద్ధరణ జరగాలి. తద్వారా వర్షపునీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి. ♦ చెరువుల్లోకి వర్షపునీటిని చేర్చే ఇన్ఫ్లో ఛానల్స్ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. -
ఆరిన ఇంటి దీపాలు
వేసవి సెలవులు సరదాగా గడుపుతున్న ఆ చిన్నారుల జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. ఈత కొడతామంటూ వెళ్లిన పిల్లలు ఇక తిరిగిరారు అని తెలిసిన ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. నా బిడ్డల నవ్వులు ఇక చూడలేనా అంటూ ఆ తల్లి పెట్టిన ఆక్రందనలు అందరి గుండెలను కలచి వేశాయి. ఈత కోసం వెళ్లి మృత్యువాత పడ్డ అన్నదమ్ములను చూసి గ్రామస్తులు కన్నీటి çపర్యంత మయ్యారు. సిద్దిపేటకమాన్: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన సిద్దిపేట కొమటి చెరువులో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ సీఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్కు చెందిన బదనపురం కిషన్, కనకవ్వ దంపతులకు నలుగురు కుమారులు సంతానం ఉన్నారు. వీరిలో మూడవ కుమారుడైన లక్ష్మణ్ (15), నాల్గవ కుమారుడైన గణేష్ (12) లు ఇద్దరు స్థానిక హనుమాన్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ మధ్యనే లక్ష్మణ్ 5వ తరగతిని, గణేష్ మూడవ తరగతిని పూర్తి చేశారు. పాఠశాలకు వేసలవులు కావడంతో మంగళవారం లక్ష్మణ్, గణేశ్ వీరి మిత్రుడైన రాకేశ్తో కలిసి ముగ్గురు కొమటి చెరువులో ఈత నేర్చుకోవడానికి వెళ్లారు. ఈత రాకుండానే చెరువులోకి.. ఈ క్రమంలో లక్ష్మణ్, గణేష్లు చెరువులోకి దిగారు. వీరు చెరువులోకి దిగిన ప్రాంతం లోతుగా ఉంది. వీరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి పోయారు. ఇది గమనించిన రాకేశ్ ఈ విషయం స్థానికులకు తెలియచేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు కొమటి చెరువు వద్దకు చేరుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న సిద్దిపేట వన్ టౌన్ సీఐ నందీశ్వర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్లు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గజ ఈత గాళ్లను పిలిపించి చెరువులో మునిగిపోయిన విద్యార్థుల మృతహాలను గంటపాటు కష్టపడి వెలికి తీశారు. మృతిచెందిన పిల్లల మృతదేహలను పోలీసులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ గదికి తరలించారు. ఘటనపై మృతిచెందిన పిల్లల తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మిన్నంటిన రోదనలు.. చెరువు నుంచి యటకు తీసిన ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలపైన వారి తల్లిదండ్రులు పడి రోదించిన తీరు అక్కడ ఉన్న వారందరిని కలిచివేసింది. చెరువులో మునిగి ఇద్దరు పిల్లలు చనిపోయారని విషయం తెలుసుకున్న స్థానికులు మృతిచెందిన చిన్నారులను చూడడానికి భారీగా ఆ ప్రాంతానికి వచ్చారు. రక్షణ చర్యలు లేవు.. స్థానిక కొమటి చెరువు వద్ద ఏలాంటి ఈత రాని వారు, చిన్న పిల్లలు కొమటి చెరువులోకి దిగకుండా ఏలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని స్థానికులు వాపోయారు. రక్షణ ఏర్పాట్లు ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని గ్రామస్తులు పేర్కొన్నారు. స్థానిక చెరువు వద్ద చిన్న పిల్లలు చెరువులోకి దిగకుండా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
చెరువులకు నీరు చేరేలా..!
గుర్రంపోడు : ఏఎమ్మార్పీ పరిధిలో ఉండి.. ఇప్పటి వరకు నీరందని చెరువులను నింపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాల్వకు నీటిని విడుదల చేసిన సమయంలో వంద కిలోమీటర్ల ప్రధానకాల్వ పొడవునా గల 129 చెరువుల్లో వంద చెరువులకు ఏదో విధంగా ఎంతోకొంత నీరు చేరుతోంది. కాగా అసలే నీరు చేరని 29 చెరువులను గుర్తించి వాటికి మేజర్, మైనర్ కాల్వలపై తూములు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఏఎమ్మార్పీ డివిజన్ పరిధిలో 29 చెరువులు నింపేలా తూములకు 13 పనులకుగాను రూ.74 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచారు. 45 రోజుల్లో పనులు పూర్తి చేసి ఖరీఫ్ నాటికి తూములు సిద్ధం చేయనున్నారు. తూముల నిర్మాణాలతో రైతుల ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. గతంలో ఇలా.. ఏఎమ్మార్పీ ద్వారా పంటలకు నీరందక.. ఇటు చెరువులూ నిండక వదిలిన నీరెటుపోతుందో అర్థంగాక రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడేవారు. దీన్ని అధిగమించేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఏఎమ్మార్పీ కాల్వలను ఆరుతడికి పంటలకు మాత్రమే డిజైన్ చేసి తవ్వారు. ఏఎమ్మార్పీకి నీటి కేటాయింపులు సరిపడా లేనందున పూర్తి ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందించడం కష్టసాధ్యమవుతుంది. కనీసం చెరువులైనా నింపాలని ప్రజాప్రతినిధులు, రైతుల డిమాండ్ మేరకు అధికారులు నెల రోజులుగా ఆయకట్టు చెరువులన్నింటినీ పరిశీలించారు. ఏఎమ్మార్పీ కాల్వల నుంచి నీరు చేరని చెరువులను గుర్తించి ప్రత్యేకంగా తూముల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొత్తగా తూములు నిర్మించనున్న ప్రాంతాలు ఇవే.. ఏఎమ్మార్పీ పరిధిలోని డి–23 కాల్వపైన చెరువులకు నీటి విడుదలకుగాను కొత్తగా తూములు నిర్మించి చామలోనిబావి, పెద్దబావి కుంట, తాటి చెరువు, డి–25 మేజర్పై ఆప్టేక్ గేట్ నిర్మించి కొప్పోలులోని చింతలచెరువు, కొత్తకుంట, నడికూడ చెరువులను నింపనున్నారు. డి–22 కాల్వలో కొత్తగా నిర్మించే తూము వల్ల పిట్టలగూడెం వద్ద గల బలుచకుంట, చవుటకుంట నింపడానికి వీలుంటుంది. ఇదే మేజర్పై మరో రెండు చోట్ల తూములు నిర్మించి ఆమలూరు, బొల్లారం, గుర్రంపోడు గ్రామాల కుంటలను నింపనున్నారు. డి–37లో 23వ కిలోమీటరు వద్ద తూము నిర్మాణంతో మావిండ్ల వారికుంట, మోదుగులకుంట, వేములచెరువు, ఇదే కాల్వపై 8వ కిలోమీటరు వద్ద తూముతో మంచినీళ్ల బావి, పెద్ద చెరువు, 11వ కిలోమీటరు వద్ద తూముతో తిమ్మరాజుకుంట, కొండయ్యకుంట, అన్నయ్యకుంట, ఊరకుంటలకు నీరు చేరనుంది. 3వ కిలోమీటరు వద్ద తూముతో ముత్యాలమ్మ కుంట, యాదయ్య చెరువులకు నీరు చేరునుంది. ఒక చెరువు కింద గల మిగతా చెరువులు కూడా ఈ తూముల వల్ల నిండి ప్రయెజనం చేకూరుతుంది. భూసేకరణ సమస్య లేని చోటే తూములు మొదటి దశలో ఎలాంటి సమస్య లేకుండా చెరువులకు నీరు చేరే వీలున్న ప్రాంతాలను గుర్తించి కాల్వలపై తూము ఏర్పాట్లకు టెండర్లు పిలిచాం. 45రోజుల్లో పనులు పూర్తి చేయించి ఈ సారి నీటిని విడుదల చేయగానే చెరువులకు నీరు చేరేలా సిద్ధం చేస్తాం. ఏఎమ్మార్పీ ఆయకట్టులో నీరు చేరని చెరువులను పరిశీలించి ఎలాంటి వివాదాలు, భూసేకరణ సమస్య లేకుండా తాము ఇక్కడి నుంచి నీటిని చెరువులకు, కుంటలకు మళ్లించుకుంటామని రైతులు కోరిన చోట్ల తూములు ఏర్పాటు చేస్తున్నాం. మిగతా విడతల్లో మరికొన్నింటిని పరిశీలిస్తాం. – అజయ్కుమార్, డివిజన్ ఈఈ -
గన్నవరం చెరువులో పడి ఇద్దరి మృతి
-
గన్నవరంలో విషాదం..!
సాక్షి, కృష్ణా : గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఒకరు మృతి చెందగా.. అతడ్ని కాపాడే క్రమంలో మరో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇరువురి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. సింగరాయకొండకు చెందిన షేక్ మస్తాన్ భాషా(20), కావలికి చెందిన షేక్ కరీం భాషా(19)లు వేసవి సెలవులు కావడంతో గన్నవరంలోని బాబాయి ఇంటికి వచ్చారు. ప్రమాదవశాత్తు కరీం భాషా చెరువులో పడిపోగా.. అతన్ని కాపాడేందుకు మస్తాన్ భాషా ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. -
టార్గెట్ 4 వేల చెరువులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జూలై, ఆగస్టు నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్న ప్రభుత్వం... తొలి ప్రాధాన్యం కింద చెరువులన్నింటినీ నింపేలా ప్రణాళిక వేస్తోంది. ఈ వర్షాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనన్ని ఎక్కువ చెరువులను నింపాలని, దీనికోసం కాలువలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి పనులు చేపట్టాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఇంజనీర్లు ప్రణాళికలు వేస్తున్నారు. ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే నీరు, వరదనీరు, పడబాటు నీళ్లు చెరువులకు మళ్లాలన్న సూచనల మేరకు ఎక్కడెక్కడ గరిష్ట చెరువులను నింపే అవకాశాలపై దృష్టి పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 4 వేల చెరువులకు నీరందించాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఈ ఏడాది ఖరీఫ్లో 500 చెరువులనైనా నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. చెరువులకు జలకళే లక్ష్యం.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్హౌస్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నారం, సుందిళ్లలో గేట్లు అమ ర్చే ప్రక్రియ పూర్తవగా మేడిగడ్డలో ఈ ప్రక్రియ కొన సాగుతోంది. పంప్హౌస్లో మోటార్ల ఏర్పాటు కొన సాగుతుండగా జూన్, జూలై నాటికి ఇవి పూర్తికాను న్నాయి. ఇక ఎల్లంపల్లి దిగువన ఇప్పటికే ప్యాకేజీ– 6లో ట్రయల్ రన్ కొనసాగుతోంది. సర్జ్పూల్లో లీకేజీల గుర్తింపు ప్రక్రియ కొనసాగు తుండగా ఈ నెల 24న 129 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్లకు వెట్ రన్ నిర్వహించనున్నారు. అనంతరం ప్యాకేజీ– 7లోని టన్నెళ్ల ద్వారా నీటిని విడుదల చేసి ప్యాకేజీ–8 పంప్హౌస్లో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మే నెలాఖరుకు పూర్తి కానుంది. ఇక మిడ్ మానేరుకు వచ్చే నీటిని మల్లన్నసాగర్కు తరలించే పనులను ప్యాకేజీ 10, 11, 12గా విడగొట్టగా అనంతగిరి, రంగనాయక సాగర్ రిజర్వాయర్ల పను లు జూన్ నాటికి పూర్తి కానున్నాయి. వాటి పరిధిలో పంపుల బిగింపు ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తంగా జూన్ నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం కాలు వలను సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్ నాటికి పనులు పూర్తవనున్న దృష్ట్యా కాళేశ్వరం ద్వారా వచ్చే గోదా వరి జలాలతో తొలి ప్రాధాన్యంగా చెరువులు నింప నున్నారు. ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే నీరు, వరదనీరు, పడబాటు నీళ్లు అన్ని చెరువులకు మళ్లేలా పనులు చేస్తున్నారు. మేడిగడ్డ మొదలు బస్వాపూర్ వరకు గరిష్టంగా 4 వేల చెరువులు నింపే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో మిడ్మానేరు దిగువన బస్వాపూర్ వరకు 2,200 చెరువులు నింపే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇక ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజీ–2 కింద 500–600 చెరువులు, కడెం కింద 50 చెరువులు, వరద కాల్వ కింద 60 చెరువులు నింపవచ్చని గుర్తించారు. ఇందులో ఈ ఖరీఫ్ సీజన్లోనే ఎస్సారెస్పీ కింద 200 చెరువులు, అనంతగిరి కింద సిరిసిల్ల జిల్లాలో 30 చెరువులు నింపి 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపనున్నారు. ఈ రిజర్వాయర్ల పనుల అనంతరం మల్లన్నసాగర్కు చేరే నీటిని ఫీడర్ చానల్ తవ్వి గంధమల, బస్వాపూర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల కింది కాలువలకు అనుసంధానించి కనిష్టంగా 150 చెరువులు నింపేలా పనులు చేస్తున్నారు. మరిన్ని చెరువులను నింపేందుకు కాలువలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి పనులు చేపట్టనున్నారు. సామర్థ్యాల లెక్క తీయండి.. మేడిగడ్డ నుంచి బస్వాపూర్ వరకు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద, ప్యాకేజీ–21, ప్యాకేజీ–22ల కింద ఎన్ని చెరువులు నింపగలు గుతారు? వాటి సామర్థ్యం, ఆయకట్టు ఎంత? వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని అధికారులతో గత వారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడెక్కడ తూములు, చెక్డ్యామ్ల నిర్మాణం చేయవచ్చో తేల్చాలన్నారు. ఇప్పటికే మిడ్మానేరు దిగువన 2,200 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ చెరువుల్లో 25 టీఎంసీల మేర నీటి నిల్వకు అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇదే మాదిరి అన్ని చెరువుల కింద సామర్థ్యాలను తేల్చాలని సూచించారు. -
చెరువులో నిర్మాణాలు!
రాజేంద్రనగర్ : దశాబ్దాల కాలంపాటు సాగు, తాగునీరందించిన చెరువు ఇప్పుడు కబ్జాలతో కుచించుకుపోతోంది. చెరువులోకి వరదనీరు రాకుండా కాలువలను దారి మళ్లించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయలోపంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పీరం చెరువు ప్రాంతంలోని సర్వేనెంబర్ 27లో 4.25 ఎకరాల విస్తీర్ణంలో కోమటికుంట చెరువు విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో చెరువుతో పాటు ఎఫ్టీఎల్ను నిర్థారించి హద్దులను ఏర్పాటు చేశారు. గతంలో ఈ ప్రాంతమంతా పచ్చటి పొలాలతో కళకళలాడేది. చెరువు పక్కనే ఉన్న వ్యవసాయ భూములకు ఈ నీరే ఉపయోగపడేది. ఈ చెరువులోనే వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుంచి నీరు చేరేది. సంవత్సరం పొడవునా నీటితో వెంకన్నకుంట కళకళలాడేది. చుట్టుపక్కల వారు తాగేందుకు దీని నీటిని ఉపయోగించేవారు. అయితే, ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారి నిర్మాణాలు వెలిశాయి. దీంతో ఈ ప్రాంతంలో భూమికి విలువ పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం స్థలం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. ఈ చెరువులోకి కొందరు వర్షపు నీరు రాకుండా కాలువలను మూసివేశారు. తమ పంట పొలాలను ప్లాట్లుగా చేసిన సమయంలో చెరువుకు వచ్చే కాలువలు, తూములను తొలగించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రస్తుతం వరదనీరు చేరడం లేదు. చెరువు భూమిని కబ్జా చేసేందుకు కొందరు ముందస్తు ప్రణాళికతో నిర్మాణాలను ప్రారంభించారు. తమ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నామంటూ.. ఎఫ్టీఎల్ భూముల్లో మొదటగా నిర్మాణాలు పూర్తి చేశారు. దీనిని ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ప్రశ్నించకపోవడంతో ఏకంగా చెరువు స్థలంలోనే నిర్మాణాలు వెలిశాయి. కొన్ని రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో అదనుగా భావించి జోరుగా నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమై స్థానికులు ఫిర్యాదు చేసినా పని ఒత్తిడిలో అధికారులు చర్యలు చేపట్టలేదు. ఇదే అదునుగా భావించి కబ్జాదారులు ప్రçహారీ నిర్మాణాలను చేపడుతున్నారు. స్థానికంగా ఈ చెరువును ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నిధులు కేటాయించింది. రూ.3 లక్షలతో చెరువు కట్ట ఎత్తును పెంచారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులను నిర్వహించాల్సి ఉండగా.. నిర్మాణాలు జరుగుతుండడంతో ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కబ్జాదారులకు పనులు మరింత సులభం అయ్యాయి. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువు స్థలాన్ని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
పెద్ద చెరువు ధ్వంసం
వేల ఎకరాలకు నీరందించే చెరువును అక్రమార్కులు చెర పట్టారు. హార్డ్వేర్ పార్క్, ఫ్యాబ్సిటీకి సమీపంలో విస్తరించిన ఈ చెరువును గుట్టుగా ధ్వంసంచేస్తున్నారు. ఆరు నెలల నుంచి విచ్చిలవిడిగా మట్టి తవ్వి ఫిల్టర్ ఇసుక తయారీ చేస్తున్నారు. అంతేకాకుండా మట్టిని వెంచర్లకు, ఇటుక బట్టీలకుతరలిస్తున్నా ఎవ్వరూ నోరు మెదపడం లేదు. యథేచ్ఛగా వాల్టా చట్టాన్నితుంగలో తొక్కుతున్నా ప్రభుత్వ విభాగాల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఇదే తరహా తవ్వకాలు ఇంకొన్నాళ్లు కొనసాగితే చెరువు నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం మండలం రావిర్యాల రెవెన్యూ పరిధిలోని పెద్దచెరువు ఆ నియోజకవర్గంలోనే అతిపెద్ద నీటి వనరు. సుమారు 230 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ చెరువు నీటితో గతంలో రెండున్నర వేల ఎకరాల భూమి సాగయ్యేది. చుట్టుపక్కల గ్రామాలకు నీటి ఎద్దడి దరిచేరేది కాదు. ప్రస్తుతం ఈ చెరువు అస్తిత్వం కోల్పోతోంది. కొందరు అక్రమార్కులు నామరూపాలు లేకుండా చేస్తున్నారు. పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరిపి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. ఉదయమైతే అందరి కంట పడుతుందన్న ఉద్దేశంతో.. రాత్రి వేళలో ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. చెరువులో మట్టి తవ్వి శిఖం భూముల్లో డంప్ చేస్తున్నారు. సమీప రైతుల నుంచి నీటిని అద్దెకు తీసుకుని ఇక్కడ రాత్రివేళల్లో మట్టిని ఫిల్టర్ చేసి కృత్రిమ ఇసుకను జోరుగా తయారు చేస్తున్నారు. ఒక్కో లారీ ట్రిప్పు ఇసుకను బహిరంగ మార్కెట్లో రూ.20 వేల నుంచి రూ.23 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందాకు కర్త, కర్మ, క్రియ.. స్థానిక ప్రజాప్రతినిదే కావడం గమనార్హం. దాదాపు ఆరు నెలల నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. ఇటీవల కొన్ని రోజులపాటు నిలివేయగా.. తాజాగా మళ్లీ తయారు చేస్తున్నారు. ఒక్కో రాత్రి పదుల సంఖ్యలో ట్రిప్పుల ఇసుక తయారీ చేస్తూ చెరువును ధ్వంసం చేస్తున్నారు. కాసులు కురిపిస్తున్న మట్టి మరికొందరు చెరువు మట్టితో వ్యాపారం చేస్తున్నారు. స్థానిక జేసీబీ, ట్రాక్టర్లు, ట్రిప్పర్ల యజమానులు అంతా రింగ్గా ఏర్పడ్డారు. 625 ఎకరాల్లో విస్తరించిన శిఖం భూముల్లో, చెరువులో మట్టి తవ్వి ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులకు విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్ ఎర్రమట్టి రూ.4,500 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే రావిర్యాల చుట్టూ సుమారు 30 వరకు ఇటుక బట్టీలు ఉంటాయి. చెరువులో లభిస్తున్న నల్ల మట్టిని ఈ బట్టీలకు యజమానులకు అమ్ముతున్నారు. ఈ చెరువు మట్టి మీద ఆధారపడే ఈ బట్టీలు కొనసాగుతున్నాయి. ఇందుకుకోసం నిత్యం 30 వరకు టిప్పర్లు, 20 వరకు ట్రాక్టర్లు, ఏడెనిమిది జేసీబీలు నడుస్తున్నాయి. వీటి సహాయంతో ప్రతిరోజు 300కుపైగా ట్రిప్పుల మట్టిని చెరువు నుంచి తరలిస్తుండటం గమనార్హం. అధికారులే అండగా.. చెరువులో విచ్చిలవిడిగా మట్టి తవ్వకాలకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు, పోలీసులు అండదండలు అందిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రతిఫలంగా వారికి భారీగానే ముడుపులు అందుతున్నట్లు సమాచారం. పోలీసులు ఎస్కార్ట్గా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రిప్పు లెక్కన ఖాకీలకు మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. చెరువు దయనీయ స్థితిపై స్థానికులు కొందరు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తీవిస్తోంది. పైగా ఫిర్యాదుదారుల విషయంలో గోప్యత పాటించడం లేదు. సమాచారమిచ్చిన విషయంతో పాటు ఆ వ్యక్తి పేరును వెంటనే మట్టి తవ్వకందారులకు చెప్పేస్తున్నారు. దీనిని బట్టి వారిద్దరి మధ్య ఉన్న పరస్పర సహకారం ఏపాటితో అర్థమవుతోంది. ముప్పు ముంగిట.. మహేశ్వరం మండలం ఇప్పటికే డేంజర్ జోన్లో ఉంది. ఇక్కడ తీవ్ర కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఈ ప్రాంతంలో 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. మరోపక్క చెరువుల్లో మట్టి తవ్వకాలతో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. ఈ మండలంలో ప్రస్తుతం 22.76 మీటర్ల లోతుకు భూగర్భ నీటి మట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు చెరువు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ బోరు తవ్వించినా పుష్కలంగా నీరు వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్న బోర్లలో నీరు కూడా నానాటికీ పాతాళానికి చేరుతోంది. ఇటువంటి సమయంలో చెరువుల్లో తవ్వకాలకు చెక్ పెట్టాల్సిన అధికారులు చేతులెత్తారు. వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే ఈ స్థాయిలో ప్రమాదకర ఘంటికలు మోగేవి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెరువులో మట్టి తవ్వకాలు, కృత్రిమ ఇసుక తయారీ విషయాన్ని జాయింట్ కలెక్టర్ హరీష్ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా.. ‘చెరువులో తవ్వకాలు వాల్టా చట్టానికి విరుద్ధం. దీనిపై విచారణ చేస్తాం’ అని చెప్పారు. -
మురికిగుంట ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ: ‘మీరు మాకు ఓటేయండి.. మేము మీకు మలేరియా, డెంగ్యూ లాంటివి ఇస్తాం’ ఇదీ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల పేరిట వెలిసిన పోస్టర్లు. నడివీధిని మురుగు నీరు ముంచెత్తి, బహిరంగ చెరువును తలపిస్తున్న దృశ్యాన్ని నిరసిస్తూ ఓ రొబోటిక్ ఇంజినీర్ తన నిరసనను ఇలా వ్యక్తం చేశారు. ‘ఓపెన్ ఎయిర్ సీవేజ్ లేక్’ ప్రారంభోత్సవం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎంపీ మీనాక్షి లేఖి, ఎమ్మెల్యే శివచరణ్లను ఆయన ఆహ్వానించారు. ముందుగా చెప్పుకున్న పోస్టర్లలో వీరిద్దరి ఫొటోలు చేర్చారు. అసలే ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతున్న కార్యక్రమమంటే మాటలా? దీంతో దుర్గంధభరిత పరిసరాల్ని శుభ్రం చేసే పని మొదలైంది. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు ప్రజాపనుల విభాగం ట్రక్కులు ఒక దాని వెనక మరొకటి వచ్చి మురుగు నీటిని తొలగించి అక్కడి డ్రైనేజీ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టారు. ఎన్నికల సమయం కూడా కావడంతో సమస్య త్వరగా పరిష్కారమైందని అంటున్నారు ఆ ఇంజినీర్ తరుణ్ భల్లా. ఈ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ‘హింసాత్మక మార్గంపై నాకు ఆసక్తి లేదు. అలాగే, మునిసిపల్ అధికారుల చేతికి గ్రీజు అంటించాలని కూడా అనుకోలేదు. ఓ సామాన్యుడిగా ఇతరుల మద్దతు కూడగట్టడమే నా బలం’ అని సమస్య పరిష్కారం సందర్భంగా తరుణ్ వ్యాఖ్యానించారు. శుభ్రంగా మారిన రోడ్డు -
చెరువులపై పచ్చపడగ
సాక్షి, తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో 567 చిన్న, పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల ఆయకట్టు కింద దాదాపు 15,200 ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో 146 చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలకు గురైన చెరువుల విలువ దాదాపు రూ.208 కోట్లకు పైమాటేనని రెవెన్యూ సిబ్బందే ఆఫ్ ది రికార్డుగా చెపుతున్నారు. ఆక్రమణల్లో తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం టాప్. తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం మండలాల్లో చెరువుల ఆక్రమణలు ఎక్కువగా జరిగాయి. రెండు మండలాల్లో 195 చెరువులు ఉంటే , అందులో 86కు పైగా చెరువులు ఇప్పటికే కబ్జాల పాలయ్యాయి. ∙తిరుపతి రూరల్ మండలం ఓటేరులోని చెరువును సైతం కొందరు ఆక్రమించి చెరువును మట్టితో నింపారు. చెరువులో ఇంటి పట్టాలను సైతం సృష్టించారు. జాతీయ రహదారికి ఆనుకొని 19 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు విలువ దాదాపు రూ.80 కోట్లకు పైమాటే. ∙ఎర్రావారిపాళెం: మండలం కమళ్లయ్యగారిపల్లిలో 13.25 ఎకరాల్లో విస్తరించి ఉన్న గంగినేని చెరువులో రూ.18 లక్షలు విలువ చేసే 6 ఎకరాలను టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ముగ్గురు ఆక్రమించారు. ∙ఇదే మండలంలో 25.25 ఎకరాల్లో విస్తరించి ఉన్న బడగానిపల్లి చెరువులో రూ.15 లక్షలు విలువ చేసే 10 ఎకరాలను బడంపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడు. ∙కమల్లయ్యగారిపల్లిలో రూ.10 లక్షల విలువైన చెరువుతో పాటు శ్మశానాన్ని సైతం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ∙తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువులో రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇంటి పట్టాలు ఇప్పించారు. పచ్చనేతలు లక్షలు లక్షలు వసూలు చేసుకోని చెరువులో ఫ్లాట్లు వేసి అమ్మేశారు. పేదలు ఇళ్లు కట్టుకోని నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం కురిసిన వర్షాలకు చెరువు నిండిపోవడంతో దాదాపు 90 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ∙దుర్గసముద్రం–అడపారెడ్డిపల్లె గ్రామాల మధ్య ఉన్న చెరువును కొందరు రాజకీయ అండతో అక్రమించి మామిడి తోటలను పెంచుతున్నారు. ∙రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లిలోని తాతిరెడ్డిచెరువులో రూ.1.20 కోట్ల విలువైన 10 ఎకరాలను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆక్రమించాడు. చెరువు తనదేనని యథేచ్ఛగా వ్యవసాయం మొదలు పెట్టాడు. ∙తమకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా 9.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనుప్పల్లి చెరువులో 4 ఎకరాలను రైతులు అక్రమించారు. అలాగే కుప్పంబాదూరు, అన్నసానిగండి చెరువు, పిళ్లారికోన, బొప్పరాజుపల్లి చెరువుల్లోనూ అక్రమణలు జరిగిపోయాయి.శెట్టిపల్లి పంచాయతీ పరిధిలో పెద్ద చెరువును ఆక్రమించి జోరుగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు.తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం చెరువును ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. దాదాపు 22 ఎకరాల చెరువు భూమి ఆక్రమణకు గురైంది. చెరువులను చెరపట్టారు చంద్రబాబు ప్రభుత్వంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ స్థలాలు, పోరంబోకులను మింగిన భూబ కాసురులు చెరువులను సైతం చెరబట్టారు. ప్రభుత్వ రికార్డుల్లో చెరువుగా ఉన్న రూ.100 కోట్ల విలువైన ఓటేరు చెరువును అధికార పార్టీ అండతో ఓ మాజీ ఎమ్మెల్యే కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వ రికార్డులను మా ర్చేందుకు తెగబడ్డాడు. వారికి రెవెన్యూ అధి కారులు వత్తాసు పలకడంతో ఓ దశలో పట్టా భూమిగా మార్చారు. నిజాయితీపరుడైన తహసీల్దార్ వచ్చి న్యాయ పోరాటం చేయడంతో తిరిగి చెరువుగా నిలిచింది. – రమణ, ఓటేరు -
అడుగంటిపోతున్నాయి
సాక్షి,మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ మహానగరంలో భాగమైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది ఫిబ్రవరి‡లో జిల్లాలో సగటున భూగర్భ జలమట్టం 9.88 కాగా, ఈ ఏడాది భూగర్భ జల మట్టంతో పోలిస్తే 4.44 మీటర్ల మేర నీటి మట్టం తగ్గింది. ఈ సారి పాతాళ గంగ 14.32 మీటర్లు లోతుకు పడిపోయింది. నగరానికి నీటిని అందించే జలశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవటంతో తాగునీటికి ఇబ్బందులు తçప్పక పోవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే శివారు ప్రాంతాల్లో ఉండే ప్రైవేట్ నీటి సరఫరాదారులు, ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లకు చెందిన కొందరు అక్రమదారులు భూగర్భ జలమట్టాలను విచక్షణ రహితంగా తోడి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందన్న అందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని భావిస్తున్న పలు ప్రాంతాలను గుర్తించిన అధికార యంత్రాంగం అవసరమైన ప్రాంతాలకు వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో 104 గ్రామాలకు గోదావరి జలాలను అందించే మిషన్ భగీరథ పనులు పూర్తవటంతో ఆయా గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి సమస్యలకు ఇబ్బందులు ఉండకపోవచ్చునని జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. రోజూ భారీగా తాగునీటి ఖర్చు మేడిపల్లి మండలంలో గత ఫిబ్రవరితో పోల్చితే ఈ ఫిబ్రవరిలో భూగర్భ జలమట్టం 6.48 మీటర్ల లోతుకు పడిపోగా, మల్కాజిగిరిలో 7.15 మీటర్ల లోతుకు పడిపోయింది. అలాగే, కుత్బుల్లాపూర్లో 9.08 మీటర్లు, కాప్రాలో 6.76 మీటర్లు, దుండిగల్లో 8.22 మీటర్లు, మేడ్చల్లో 3.88 మీటర్లు, కీసరలో 3.87 మీటర్లు, అల్వాల్లో 3.65 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో జిల్లాలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లా పరిధిలో ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాలకు తాగునీరందించే మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి కాకపోవటంతో ఆయా ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల్లోని పలు కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లలో నివసిస్తున్న కుటుంబాలు రోజు వారీ అవసరాలకు వినియోగించే వాటర్ను కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో 120 అపార్టుమెంట్లు ఉండగా, ఒక్కొక్క అపార్టుమెంట్కు రోజుకు రెండు ట్యాంకర్ల చొప్పున నీటి వినియోగం అవసరం. ఈ లెక్కన ఒక ట్యాంకర్ నీటికి రూ.500 చొప్పున రెండు ట్యాంకర్లకు రూ.1,000 ప్రతి రోజు ఒక అపార్టు మెంట్ వాసులు వెచ్చిస్తున్నారు. 120 అపార్టుమెంట్స్ వారు తాగునీరు కాకుండానే ఇతర అవసరాల కోసం వినియోగించే నీటి కోసం రోజుకు రూ.1.20 లక్షల చొప్పున నెలకు రూ.36 లక్షలు వెచ్చిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన నాగారం, జవహర్నగర్, దమ్మాయిగూడ, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో కూడా నీటి సమస్య తీవ్రంగా ఉంది. -
బాబూ.. గుర్తుందా?!
1999 జూన్ 25.. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కోడుమూరు నియోజకవర్గంలో పర్యటించారు. అప్పుడు కూడా ఎన్నికల సమయం కావడంతో హడావుడిగా పలు శంకుస్థాపనలు చేశారు. అందులో సి.బెళగల్ చెరువు ఎత్తిపోతల పథకం కూడా ఒకటి. దీని నిర్మాణం కోసం సి.బెళగల్ ఎంపీడీఓ కార్యాలయం పక్కనే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించి, ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ పథకాన్ని చేపట్టలేదు. ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. శిలాఫలకం మాత్రం చంద్రబాబు ‘20 ఏళ్ల’ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. నేడు వేదవతి, ఆర్డీఎస్ కుడికాలువ, గుండ్రేవుల అంటూ వస్తున్న ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. కోడుమూరు: సి.బెళగల్ చెరువుకు తుంగభద్ర నీళ్లు కలగానే మిగిలాయి. ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరైపోయాయి. చంద్రబాబు ఇరవై ఏళ్ల నాడు సీఎం హోదాలోనే ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చలేదు. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీ గురురాఘవేంద్ర మళ్లింపు పథకంలో భాగంగా కోడుమూరు నియోజకవర్గంలోనిసి.బెళగల్ చెరువును కూడా తుంగభద్ర నది నీటితో నింపుతామని చంద్రబాబు అప్పట్లో చెప్పారు. ఇందుకోసం రూ.200 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 1999 జూన్ 25న శంకుస్థాపన చేశారు. అప్పట్లోనూ రెండు నెలల్లో ఎన్నికలు ఉండడంతో సి.బెళగల్ ఎంపీడీఓ కార్యాలయం పక్కనే హడావుడిగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 1999లో టీడీపీ అధికారంలోకొచ్చి.. చంద్రబాబు మరోసారి సీఎం అయ్యారు. అయినప్పటికీ ఈ ఎత్తిపోతల పథకం ఊసే లేదు. శిలాఫలకం వేసి ఇప్పటికి 20 ఏళ్లు అవుతోంది. పథకం పనులు మాత్రం అడుగు కూడా ముందుకు కదల్లేదు. పాదయాత్రలో చూసి.. మరోసారి మాట తప్పి 2012 అక్టోబర్ 25న ప్రతిపక్ష నేత హోదాలో ‘మీకోసం వస్తున్నా’ అంటూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని ప్రజలు చూపించారు. తనను ముఖ్యమంత్రిగా ఆశీర్వదిస్తే ఈ పథకాన్ని పూర్తి చేస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. అయితే..ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఐదేళ్లు అవుతున్నా నేటికీ పథకాన్ని పట్టించుకోలేదు. స్థానిక నేతలు ఈ విషయాన్ని చంద్రబాబుకు కొన్ని సందర్భాల్లో గుర్తు చేసినప్పటికీ నిధుల కొరత సాకుగా చూపి దాటవేసినట్లు తెలిసింది. ఈ పథకం ఏర్పాటు చేసివుంటే పదివేల ఎకరాలకు సాగు నీరు అందడమే కాకుండా.. 24 గ్రామాల్లో తాగునీటి కొరత తీరేది. సి.బెళగల్ చెరువు జిల్లాలోనే అతిపెద్దది. దాదాపు 1,722 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని అభివృద్ధి చేస్తే ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఆరుతడి పంటలు పండించుకోవచ్చు. కరువు కాటకాలతో అల్లాడిపోతున్న సి.బెళగల్ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం వస్తోందని రైతులు ఎంతగానో ఆశ పడ్డారు. కానీ 20 ఏళ్లుగా ఆ ఆశ నెరవేరలేదు. స్వయాన చంద్రబాబు శిలాఫలకం వేసినా..ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. పిచ్చిమొక్కలు పెరిగి.. చెరువులో నీళ్లు లేక ఒండ్రు మట్టి పేరుకుపోయింది. ఎటుచూసినా పిచ్చి మొక్కలు పెరిగాయి. ఉనికి కోల్పోయే ప్రమాదం దాపురిస్తోంది. సి.బెళగల్ మండల సరిహద్దులోనే తుంగభద్ర నది ప్రవహిస్తోంది. ఏటా లక్షలాది క్యూసెక్కుల నీరు కింది ప్రాంతాలకు తరలిపోతోంది. బెళగల్ మండల వాసులు మాత్రం సాగు, తాగునీటి కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. మరో మోసానికి తెర ప్రస్తుతం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు మరో మోసానికి తెర లేపారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఐదేళ్ల పాటు గుండ్రేవుల రిజర్వాయర్ గురించి పట్టించుకోని ఆయన.. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ పథకానికి శంకుస్థాపన చేసేందుకు శనివారం కోడుమూరులో పర్యటిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అటకెక్కిన చెరువుల సుందరీకరణ
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని చెరువుల సుందరీకరణ అటకెక్కింది. ప్రస్తుతం ఉన్న దాదాపు 170 చెరువుల్లో 20 తటాకాలను ప్రక్షాళన చేసి, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి ఏడాదైనా ఇంతవరకు కార్యరూపం దాల్చనేలేదు. ఇప్పట్లో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మిషన్ కాకతీయ నిధులతో నగరంలోని 20 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించి ఆ మేరకు గతేడాది మార్చిలో ప్రభుత్వం అనుమతించింది. ఏడాది కాలం గడిచి.. మళ్లీ మార్చి నెల వచ్చినా ఇంతవరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు.. ఒక్క చెరువూ ప్రక్షాళన కాలేదు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీయగా.. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాకపోవడమేనని తేలింది. దాదాపు ఐదారు పర్యాయాలు ఈ పనుల కోసం టెండర్లు పిలిచినా నాలుగైదు పనులకు తప్ప మిగతా వాటిని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వ్యయ ప్రయాసలకోర్చి పనులు చేసినా సకాలంలో బిల్లులు అందుతాయో లేదో అనే సంశయంతోనే కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాలేదని సమాచారం. దీంతోపాటు గతేడాది ఎన్నికల కారణంగానూ కొన్ని నెలలపాటు అధికారులు కూడా వీటిపై శ్రద్ధ చూపలేదు. దీంతోపాటు ఎన్నికల కోడ్తోనూ టెండరు అగ్రిమెంట్లకు అవకాశం లేకపోవడం తదితరమైనవి మరికొన్ని కారణాలుగా ఉన్నాయి. అయితే, అన్నీ చక్కబడ్డాక.. ఇప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం కనిపించడం లేదు. కేవలం చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లిచరనే కాంట్రాక్టర్లు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అమలుకు నోచని హామీ.. గత సంవత్సరం నగరంలోని సరూర్ చెరువు దుస్థితిని వివరిస్తూ నగర పౌరుడొకరు అప్పటి మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. దాంతో సహా నగరంలోని 20 చెరువుల్ని ప్రక్షాళన చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ ప్రకటించడమేగాక.. సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే అధికారులు పనుల కుపక్రమించి.. ఈ పనులకు రూ.287.93 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇవన్నీ పరిశీలించిన ప్రభుత్వం మిషన్ కాకతీయ నాలుగో దశ కింద రూ.282.63 కోట్లు విడుదల చేస్తూ పరిపాలన పర అనుమతులు జారీ చేసి టెండర్లు ఆహ్వానించారు. కానీ.. పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలింది. ♦ వీటిలో మూడు చెరువుల అభివృద్ధికి సీఎస్సార్ కింద నిధులిచ్చేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు దచ్చాయి. దీంతో వాటి స్థానే ఇతర చెరువులను అభివృద్ధి చేయాలని భావించారు. అందుకు అనుగుణంగా అంచనాలు రూ.279.78 కోట్లకు తగ్గాయి. ♦ కార్యరూపం దాల్చని ‘ప్రైవేట్’ ప్రతిపాదన నగరంలోని మిగతా చెరువులను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ నిధులతో అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. చెరువుల ప్రక్షాళన పూర్తయ్యాక, తిరిగి మురుగునీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు దిగువన సదుపాయాలు కల్పించడం ఇందులోని ప్రధాన లక్ష్యం. 1. చెరువు/సరస్సు స్థలం మేర ప్రహరీ/ఫెన్సింగ్ ఏర్పాటు 2. ప్రహరీ లోపల చెరువు ఒడ్డున అందమైన పచ్చిక, ఫౌంటెన్లు వంటి సుందరీకరణ పనులు 3. నడక మార్గాల ఏర్పాటు 4. వివిధ రకాల మొక్కలతో పచ్చదనం 5. కూర్చునేందుకు బెంచీలు, కుర్చీల వంటి ఏర్పాట్లు 6. వాహన పార్కింగ్ సదుపాయం 7. రాత్రివేళల్లో అందమైన లైటింగ్ 8. స్నాక్స్, టీ/కాఫీల కేఫటేరియా 9. వాననీరు వెళ్లేందుకు బైపాస్ డ్రెయిన్లు 10. టాయిలెట్లు తదితర సదుపాయాలు ♦ చెరువుల వద్ద జలక్రీడలు, బోటింగ్ వంటి వినోద కార్యక్రమాలతో వచ్చే ఆదాయన్ని చెరువు పనులు చేసిన ప్రైవేట్ సంస్థకు కొన్నేళ్ల పాటు ఇవ్వాలనేది లక్ష్యం. తర్వాత సదరు చెరువులు జీహెచ్ఎంసీ అజమాయిషీలోకే వస్తాయని పేర్కొన్నారు. కానీ ఆ దిశగానూ ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగలేదు. -
చెరువులకు మహర్దశ
సాక్షి, సిటీబ్యూరో: కలుషిత జలాలు, ఆక్రమణలతో చిన్నబోతున్న గ్రేటర్ చెరువులను పరిరక్షించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మహానగరం పరిధిలోని సుమారు 185 చెరువులను ఆక్రమణలు, కలుషిత జలాల బారి నుంచి రక్షించేందుకు బల్దియాలోని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ఆధ్వర్యంలో ఆయా జలాశయాల వద్ద సీసీ టీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ కెమెరాలను నిరంతరం ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో పర్యవేక్షించేందుకు ఎల్బీనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఆయా చెరువుల్లోకి నిర్మాణ వ్యర్థాలను వదులుతున్న అక్రమార్కులు, కబ్జాలకు పాల్పడే వారిని అడ్డుకునేందుకు వీలుంటుంది. చెరువుల్లోకి నిర్మాణ వ్యర్థాలు వదిలిపెట్టే వారిపై నిరంతర నిఘా పెట్టడంతో పాటు వారి ఆగడాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. నిలువెల్లా కాలుష్యం... నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారంగా మారుతున్నాయి. పలు చెరువుల్లో ఇటీవల కాలంలో గుర్రపుడెక్క విస్తృతంగా విస్తరించింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి వదులుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గందభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థజలాల్లో ఉండే ఫేకల్కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతో పాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది. ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. మురుగుతో అవస్థలు... ♦ సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. ♦ గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం, చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో చెరువులు మురుగు కూపాలవుతున్నాయి. ♦ పలు చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయి చిక్కి శల్యమైకనిపిస్తున్నాయి. ♦ రోజువారీగా గ్రేటర్వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధి లేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. ప్రక్షాళన చర్యలివీ... ♦ చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సి న చర్యలపై ‘సేవ్ అవర్ అర్బన్ లేక్స్’ సంస్థ నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలివీ... ♦ గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. ఆయా చెరువుల్లో అట్టడుగున పేరుకుపోయిన ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. ♦ జలాశయాల ఉపరితలంపై ఉధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. ♦ చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ♦ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ♦ ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. ♦ చెరువులు అన్యాక్రాంతం కాకుండా ఎఫ్టీఎల్ బౌండరీలు, రక్షణ కంచె ఏర్పాటు చేయాలి. నిరంతరం నిఘా పెట్టాలి. ♦ జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తునహరితహారం చేపట్టాలి. ♦ వర్షపు నీరు చేరే ఇన్ఫ్లో చానల్స్ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ♦ జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలి. ♦ కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. -
ఒకరికి ఒకరు.. మరణంలోనూ వీడని స్నేహం
తరగతులు వేరైనా తరగని బంధం వారిది.. ఎక్కడికి వెళ్లినా ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సిందే.. ఆ అనుబంధమే ఇద్దరు బాలలను ఒకేసారి మృత్యు కోరల్లోకి నెట్టివేసింది.. ఈ దుర్ఘటనతో తల్లిదండ్రుల గుండె చెరువైంది. శ్రీకాకుళం, కాశీబుగ్గ: ఇద్దరూ ఒక తరగతి కాదు.. ఒక వయసు వారు కాదు.. కానీ మనసు ఒకటే. బడికి వెళ్లినా.. ఆటపాటలకు వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అదే అనుబంధం మృత్యువులోనూ కొనసాగడం వారి కన్నవారికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కాశీబుగ్గ–మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు రాజపురం గ్రామంలోని గండుగోపాల సాగరం(చెరువు)లో పడి ఆదివారం ఇద్దరు బాలలు మృతి చెందిన ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. బమ్మిడి బాలరాజు కుమారుడు బమ్మిడి మనోజ్ కుమార్ (13), శాసనపురి శ్యాంసుందర్ కుమారుడు శాసనపురి చరణ్ (జితేంద్ర)(10) చినబడం మారుతీనగర్లో పక్క పక్క ఇళ్లలో నివసిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో గ్రామంలో ఆడుకుంటూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి కూడా చేరకుండా ఈత కొట్టడానికి సైకిల్పైచెరువు వద్దకు చేరుకున్నారు. ఎండలో ఆటలేమిటని స్థానికులు కొందరు వారించినా నీటిలోకి దిగి ఈతనేర్చుకుంటూ ఒకరిని ఒకరు పట్టుకుని చనిపోయారని పోలీసులకు స్థానికులు తెలిపారు. వారి దుస్తులను బట్టి స్థానికులు వెదకడంతో ఒకరి కాలు దొరకగా బయటకు తీశారు. మరో బాలుడు కూడా కొద్దిసేపటికి దొరికాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఇద్దరి చిన్నారుల మృతదేహాలను చూసి బోరుమని విలపించారు. సంఘటన స్థలానికి నందిగాం సీఐ మల్లా శేషు చేరుకొని కాశీబుగ్గ పోలీసు సిబ్బందితో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పలాస సామాజిక ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న బమ్మిడి మనోజ్కుమార్కు అమ్మా నాన్న, చెల్లి ఉన్నారు. శాశనపురి చరణ్ (జితేంద్ర) తండ్రి విశ్వబ్రాహ్మణ పనులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. విషాద వదనంతో మనోజ్ సోదరి మనోజ్కుమార్, అతని సోదరి బమ్మిడి మౌనిక కవల పిల్లలు. ఇద్దరూ 14 ఏళ్ల క్రితం బమ్మిడి బాలరాజు దంపతులకు జన్మించారు. ఇద్దరి పుట్టిన నక్షత్రాలు ఒక్కటే కావడంతో ఇద్దరికి మ అక్షరంతో పేర్లు పెట్టుకున్నారు. మనోజ్ మరణించడంతో దిక్కుతోచని స్థితికి మౌనిక చేరుకుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. రియల్ ఎస్టేట్కు మట్టి తరలించడమే కారణం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం ఇటీవల అర్ధరాత్రి మట్టి తవ్వి తరలించుకుపోతున్నారు. ఈ తవ్వకాల వల్ల చెరువు మరీ లోతుగా మారింది. ఈ విషయాన్ని ఊహించని చిన్నారులిద్దరూ మృత్యువాత పడ్డారు. -
చెరువులో పడవ బోల్తా
పశ్చిమగోదావరి, నల్లజర్ల (ద్వారకాతిరుమల): చెరువులో చేపలకు మేత వేస్తున్న సమయంలో పడవ బోల్తాపడి ఇద్దరు యువకులు నీటమునిగి దుర్మరణం పాలయ్యారు. దీంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. ఈ ఘటన నల్లజర్ల మండలం దూబచర్ల శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అనంతపల్లికి చెందిన కనుమూరి కిషోర్ (23) తండ్రి రాజు ఏడాది క్రితం చనిపోయారు. దీంతో తల్లి అమ్మాజీతో కలసి దూబచర్ల గాంధీ కాలనీలోని తాత తాడిగడప కృష్ణ వద్ద ఐదేళ్ల నుంచి ఉంటున్నాడు. రోజూ కిషోర్ అదే కాలనీకి చెందిన స్నేహితుడు తాడిగడప రమేష్ (33)తో కలసి కూలీ పనులకు వెళుతున్నాడు. వీరిద్దరు ఎక్కువగా ఆయిల్పామ్ తోటల్లో గెలలు కోస్తుంటారు. ఇదిలా ఉంటే కిషోర్ మేనమామ తాడిగడప నాగు గాంధీకాలనీ సమీపంలోని వడ్డోడి కుంట పంచాయతీ చెరువును లీజుకు తీసుకుని చేపలు పెంచుతున్నాడు. చెరువులో రోజూ ఉదయం, సాయంత్రం కూలీలు చేపలకు మేత వేస్తుంటారు. అయితే గురువారం ఉదయం కూలీలు ఎవరూ లేకపోవడంతో కిషోర్, రమేష్ రేకు పడవపై చెరువులోకి వెళ్లి మేత వేస్తున్నారు. ఈ సమయంలో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో వారిద్దరూ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన నల్లజర్ల పోలీస్టేషన్, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. నల్లజర్ల పోలీసులు, భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యేక బోటు ద్వారా చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కిషోర్, రమేష్ను బయటకు తీయగా అప్పటికే రమేష్ మృతిచెందాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కిషోర్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు రమేష్కు భార్య సత్యవతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కిషోర్కు ఇంకా వివాహం కాలేదు. అక్రమ తవ్వకాలే ప్రాణాలు తీశాయి స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలే కిషోర్, రమేష్ను బలిగొన్నాయని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి చెరువులో మట్టిని ఇష్టానుసారం తవ్వేయడం వల్ల లోతు పెరిగిపోయిందని, అందువల్లే వారిద్దరు ప్రాణాలను కోల్పోయారని అంటున్నారు. ఈ చెరువు సమీపంలో ఉన్న ఆర్సీఎం పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కిషోర్, రమేష్ల అకాల మరణంతో దూబచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
పండగవేళ విషాదం
ఖమ్మంక్రైం: సూర్యాపేట జిల్లా మోతె మండలంలో చెరువులో మునిగి ఇద్దరు ఖమ్మం వాసులు మృతి చెందిన విషాద సంఘటన ఆదివారం చోటు చేసుకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని తిరుమల థియేటర్ ప్రాంతానికి చెందిన పులిరాజుల నరసింహారావు(45) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ దినపత్రికలో పనిచేస్తున్నాడు. మోతె మండలం నామారంలో తమ దగ్గర బంధువు మృతి చెందటంతో కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అంత్యక్రియలకు వెళ్లారు. ఆదివారం కుటుంబ సభ్యులంతా కలిసి అక్కడే ఉన్న చెరువు గట్టు వద్దకు వెళ్లారు. చెరువులో దిగి అందరూ ఈత కొడుతున్నారు. ఇటీవలే చెరువులో పూడిక తీయటంతో వారికి లోతు అర్థంకాలేదు. నలుగురు చెరువులో దిగగా ఒక్కసారిగా వారు లోతుకు వెళ్లిపోయారు. ప్రమాదం నుంచి ఇద్దరిని రక్షించగా నరసింహారావు సోదరుడి కుమారుడైన పులిరాజుల నీరజ్(20) చెరువులో మునిగి పోతుండగా కాపాడటానికి వెళ్లిన నరసింహారావు కూడా మునిగిపోయాడు. నరసింహారావుకు ఈత వచ్చినా కూడా నీరజ్ను బయటకు తీసుకురాలేక ఇద్దరూ నీటిలో మునిగి మృతిచెందారు. వీరి మృతదేహాలను సూర్యాపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా పంచనామా నిర్వహించారు. ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం.. చెరువులో పడి మృతిచెందిన ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. నరసింహారావు కూతురు రెండు సంవత్సరాల క్రితమే ఇంటి గోడకూలి మృతిచెందగా.. ఇప్పటివరకు ఆ షాక్ నుంచి కుటుంబం కోలుకోలేదు. ఇప్పుడు కళ్లముందే నరసింహారావు చెరువులో మునిగి చనిపోవడంతో భార్య, ధనలక్ష్మి, కుమారుడు భరత్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుటుంబ పెద్దను కోల్పోవటంతో వారు దిక్కులేని వారుగా మిగిలిపోయారు. అదేవిధంగా మృతిచెం దిన మరో యువకుడు పులిరాజుల నీరజ్ ఖమ్మం లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. అతని తండ్రి పులిరాజుల వెంకటేశ్వర్లు మిర్చివ్యాపారి. వీరి కుటుంబం త్రీటౌన్ ప్రాంతం లోని సుగ్గలవారి తోటలో ఉంటున్నారు. ఒక్కగానొక్క కుమారుడు నీరజ్ మృతి చెందటంతో వెంకటేశ్వర్లు, అతని భార్య రమాదేవి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు కుమారుడి మృతితో మరింత కుంగిపోయాడు. సంక్రాంతి పండగ రెండు రోజుల్లో ఉండగా ఇద్దరి మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. ఇద్దరూ రక్తసంబదీకులు కావటంతో కుటుంబ సభ్యులను ఓదార్చటం ఎవరితరం కావటంలేదు. వారి మృతదేహాలు సోమవారం ఖమ్మం రానున్నాయి. -
అనగనగా ఓ చెరువు కాదు.. అసలు రూపంతో చూడాలి
సాక్షి, హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో ఉన్న చెరువులను పరిరక్షించి తీరాల్సిందేనని, దీనిపై ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న విధంగా చెరువులను వదిలిస్తే.. అనగనగా ఒకప్పుడు ఫలానా చోట ఓ చెరువుండేది.. అని భవిష్యత్ తరాలకు చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందంది. తమకు చెరువుల సుందరీకరణ ముఖ్యం కాదని, వాటిని పూర్వస్థితికి తీసుకురావడమే ముఖ్యమని తేల్చి చెప్పింది. ఆయా విభాగాలు చట్టం నిర్దేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే చెరువులకు ఈ దుస్థితి పట్టిందని, దీనిని తాము ఇకపై అనుమతించే ప్రసక్తే లేదంది. మొదటి దశ కింద ఏవైనా పది చెరువులను ఎంపిక చేసుకుని, వాటిని పూర్వస్థితికి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లతో కలసి పనిచేయాలంది. ఇందుకు ఏం చేయబోతున్నారో వివరిస్తూ తమకు వేర్వేరుగా నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, హెచ్ఎండీఏ, పీసీబీలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనంఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్లు కూడా వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిని మరోసారి విచారించింది. -
మా ఊరు పాలమూరు గావాలే
‘నిండిన చెరువుతో బతుకు మారిన పల్లె ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన దృశ్యం’పై ఓ జర్నలిస్టు మిత్రుడు పరిశోధనాత్మక గ్రంథం రాస్తున్నాడు. ఈ ఏడాది జూలై 12న పాలమూరు జిల్లా గ్రామాల పరిశీలనకు వెళ్తుంటే నేనూ తోడు వెళ్లాను. భీమా ప్రాజెక్టు గ్రామాల్లో తిరిగాం. భీమా ఫేజ్–1తో భూత్పూరు, సంగంబండ రెండు రిజర్వాయర్ల కింద మక్తల్, నర్వ, అమరచింత, మాగనూరు, కృష్ణా మండలాలకు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఫేజ్–2 కింద శంకరస ముద్రం, రంగసముద్రం, ఏనుకుంట రిజర్వాయర్ల కింద మరో లక్ష ఎకరాలు సాగులోకి వచ్చింది. ఏగిలువారక ముందే నర్వ మండలం లక్కెర్ దొడ్డి గ్రామం చేరినం. ఈ పల్లె మీదుగా యాంకీ వైపు వెళ్లాం. కంది, ఆముదం, వరి, మొక్కజొన్న చేలతో భూమికి రంగే సినట్లు పచ్చగా పరుచుకు న్నాయి. అమరచింత, నర్వ మండలాల్లో 25 గ్రామాలు తిరిగి చీకటి పడే వేళకు నర్వ గ్రామం వచ్చాం. ఇక్కడే నా జర్నలిస్టు మిత్రునికి ఓ బీడీ కార్మికురాలితో పరిచయం ఉంది. పేరు రాజేశ్వరి. ‘రాజేశ్వరి యవ్వనం అంతా బీడీలు చుట్టటంతోనే గడిచిపోయిందని, నెత్తురు సచ్చి, బొక్కలు తేలి, చావుకు దగ్గరైన మనిషని, ఇప్పుడు బతికి ఉందో లేదో’ అనే అనుమానం వ్యక్తంచేస్తూ మార్గమధ్యం లోనే చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్లాం. రాజేశ్వరి ఉంది. కానీ జర్నలిస్టు మిత్రుడు చెప్పిన ఛాయలు ఒక్కటీ ఆమెలో కనిపించలేదు. సంపూర్ణ ఆరో గ్యంగా ఉంది. రాజేశ్వరిని కదిలిస్తే‘ఇప్పుడు బీడీలు సుడతలేను. పోయిన ఏడాదే భీమా కాల్వ నీళ్లు ఒది లిండ్రు. సెర్లళ్లకు నీళ్లిడిసిండ్రు. ఎకరన్నర భూమి ఉంటే సాగు జేసుకున్నం. వడ్లు నాగుకు తెచ్చి మొలక అలికినం. తొలి ఏడాది 46 క్వింటాళ్ల దిగు బడి వచ్చింది. అప్పు సప్పులు పోనూ రూ. 36 వేలు మిగిలినయి. ఆసుపత్రికి పోతే టీబీ లేదన్నరు. తిండి బాగా తినమన్నరు. బలం మందులు రాసిండ్రు’ ఆమె చెప్పుకుంటూ పోతూనే ఉంది. కరువు జిల్లా పాలమూరు ప్రాజెక్టులు తెచ్చిన మార్పులు ఒక్కొక్కటి నెమరేసుకుంటుంటే నీటిపా రుదల శాఖ మంత్రి హరీశ్రావు కష్టం గుర్తొచ్చింది. 2015 అక్టోబర్ 1న నీటి పారుదల శాఖ అధికా రులతో మంత్రి హరీశ్రావు సమావేశం అయ్యారు. అనుకోకుండా ఆ సమావేశానికి నేనూ వెళ్లాను. పాల మూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల మీద సమీక్ష అది. ‘వచ్చే ఏడాది జూన్ నాటికి కృష్ణమ్మ జలాలు పంట పొలాలను తడపాలి.æమీకేం కావాలో చెప్పండి’ అని ఇంజనీర్లను అడిగారు. ఇంజనీర్లు గుక్కతిప్పుకో కుండా చిట్టా చదివారు. వేల కోట్ల ఖర్చు, పైగా అనుమతులు అంటే చిన్న మాటలా? ఆస్థానంలో మరో వ్యక్తి ఉంటే చేతులు ఎత్తేసేవాడే. కానీ హరీశ్ రావు ‘ఓకే డన్.. ఇక మీ పనుల్లో ఉండండి’ అని చెప్పాడు. ‘వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు జిల్లా రైతాంగానికి 5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అంది స్తాం’ అని ప్రకటన చేశారు. ఆయనతో కలిసి నేను ఉద్యమంలో పని చేసిన. పట్టుపడితే వదలడు. ఏదో ఒక మూల అనుమానం ఉన్నప్పటికీ కాళ్లకు చక్రాలు కట్టుకొని కాలచక్రంతో పోటీపడుతూ గిర్రున తిరు గుతూ కల్వకుర్తి, కోయిల్సాగర్, జూరాల, భీమా ప్రాజెక్టులను పూర్తి చేశారు. నిత్య ప్రయాణంతో అటు కాళే శ్వరానికి.. ఇటు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల మధ్య బాటపడ్డది. పెద్ద మేస్త్రీ అవతార మెత్తి ప్రాజెక్టుల వద్ద ఎన్ని నిద్రలేని రాత్రులు గడి పారో చెప్పటం కష్టం. ఎట్టకేలకు కల్వకుర్తి ఎత్తిపో తల ద్వారా 1.6 లక్షలు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షలు, భీమా ద్వారా 1.4 లక్షలు, కోయిల్ సాగర్ కింద 8 వేల ఎకరాల కొత్త ఆయకట్టుతో చెప్పినట్టు గానే 5 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు.2017–18లో ఈ విస్తీర్ణం 6.5 లక్షలకు పెరిగింది. జూరాల కింద ఆయకట్టుతో కలిపితే అది 7.5 లక్ష లకు చేరింది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునః నిర్మాణం చేసి నది నీళ్లతో నింపితే ఇంకో 2.68 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది.పాలమూరు పల్లెల్లో ఇంతకాలం కరువెందుకు రాజ్యమేలింది? కళ్ల ముందు నీళ్లున్నా... కంటి నిండా నీళ్లతో వలసెందుకు పోయిండ్రు? పనిగట్టుకొని పాలమూరును ఎండబెట్టింది ఎవడు’? ఇలా ఎన్నోప్రశ్నలు,ఇంకెన్నో ఆలోచనలు మెదడును మెలిపెడు తుంటే చీకట్లోనే తిరుగుబాట పట్టాం. పొలంలో పొద్దంతా కాయకష్టం చేసుకొని ఇంటికి చేరిన పల్లె జనం రేపటి సూర్యోదయం కోసం మెల్లగా నులక మంచాల మీద వాలిపోతున్నారు. మా కారు వేగం అందుకుంది... మల్లన్న సాగర్ నీళ్లతో రేపటి మా దుబ్బాక పల్లెల్లో కూడా కాల్వ కింది భూములు, ధాన్యం రాశుల మీద ఓ పుస్తకం రాయగలననే భరోసాతో... సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే ‘ 94403 80141 -
వడివడిగా చెరువుల అనుసంధానం..
సాక్షి, హైదరాబాద్: భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానించే ప్రక్రియను నీటి పారుదల శాఖ వేగిరం చేసింది. ఏడాదంతా చెరువులు నీటితో కళకళలాడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఎక్కడెక్కడ అనుసంధానం చేయవచ్చన్న దానిపై శాఖ తీవ్ర కసరత్తులు చేస్తోంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాల్వల నుంచి వచ్చే నీరు, వర్షం నీరు, రీజనరేటెడ్ నీళ్ల ద్వారా చెరువులను నింపేలా వ్యూహం ఖరారు చేస్తోంది. మొత్తంగా 44 వేలకు పైగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించి సాగునీటి వసతిని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తూ మండలాల వారీగా ఇరిగేషన్ మ్యాపులను సిద్ధం చేస్తోంది. ‘భారీ, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల ద్వారా గొలుసుకట్టు చెరువుల అనుసంధానం’పై ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇస్రో ద్వారా చేయించిన గొలుసుకట్టు చెరువుల మ్యాపింగ్పై నీటి పారుదల శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణలోని చెరువులకు ఇచ్చిన 265 టీఎంసీల కేటాయింపులను సద్వినియోగం చేయాలని సూచించారు. ఈ సూచనలకు అనుగుణంగా నెల రోజులుగా కసరత్తు చేస్తున్న అధికారులు, రాష్ట్రంలో మొత్తం 3,488 క్లస్టర్లలో గొలుసుకట్టు చెరువులున్నా యని గుర్తించారు. దాదాపు 10 వేల చెరువులు గొలు సుకట్టుకు అనుగుణంగా ఉన్నాయి. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులున్నాయి. ఈ గొలుసుకట్టులో ఉన్న మొదటి చెరువును గుర్తించి, దాన్ని ప్రాజెక్టు కాలువకు అనుసంధానం చేసేలా ప్రస్తుతం మ్యాపింగ్ ప్రక్రియ చేస్తున్నారు. ప్రాజెక్టుల కింద ఏ కాల్వ నుంచి ఏయే చెరువులను నింపవచ్చన్నది ఖరారు చేస్తున్నారు. రాబోయే రెండు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపేలా వ్యూహం ఖరారు చేస్తున్నారు. మొత్తంగా 44,955 చెరువులను రాష్ట్రంలోని 58 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో నింపేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. త్వరలో సీఎం సమావేశం.. ఒక్కో మండల పరిధిలో గరిష్టంగా 46 చెరువులను అనుసంధానించే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న 23 వేల కిలోమీటర్ల కాల్వల నెట్వర్క్ నుంచి అన్ని చెరువులు నింపేలా ప్రస్తుతం కార్యాచరణ సిద్ధమవుతోంది. చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటి పారుదల ఇంజనీర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. -
స్వయంకృషి
మోర్తాడ్ (నిజామాబాద్): మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన రైతులు స్వయం కృషితో సాగునీటి కష్టాలను గట్టెక్కుతున్నారు. గ్రామానికి చెందిన బూరుగు చెరువు కింద దాదాపు 250 ఎకరాల వరి సాగవుతోంది. ఇటీవల భారీ వర్షాలు కురిసినా చెరువులోకి నీరు చేరలేదు. వరద కాలువ నిర్మాణం వల్ల చెరువులోకి నీరు రావడానికి ఉన్న అన్ని దారులు మూసుకు పోయాయి. పెద్దవాగులోని ఎత్తిపోతల పథకమూ పనిచేయడం లేదు. చెరువు నిండటానికి వరద కాలువ ద్వారా వచ్చే నీరు ఒక్కటే దిక్కయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరిన తర్వాత గోదావరి నదిలోకి నీటిని మళ్లించే పరిస్థితి వస్తేనే వరద కాలువకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం వరద కాలువకు నీటిని మళ్లించే పరిస్థితి లేదు. దీంతో వర్షాలకు వరద కాలువలో నిలువ ఉన్న నీటిని వినియోగించుకోవాలని రైతులు సంకల్పించారు. చెరువు కింద ఉన్న ఆయకట్టు భూముల రైతులు ఒక్కటై ఎకరానికి రూ.4 వేల చొప్పున జమ చేసి రూ.10 లక్షల ఖర్చుతో నీటి మళ్లింపునకు ఏర్పాట్లు చేసుకున్నారు. వరద కాలువలో పంపుసెట్లను అమర్చి వాటి ద్వారా నీటిని వరద కాలువ తూముకు, అక్కడి నుంచి బూరుగు చెరువుకు మళ్లిస్తున్నారు. చెరువులో పూర్తి స్థాయి నీరు నిండితే ఖరీఫ్, రబీ పంటలను గట్టెక్కించవచ్చని రైతులు భావిస్తున్నారు. అంతేగాక చెరువులో నీరు సమృద్ధిగా ఉంటే బోరుబావులకు భూగర్భ జలాలు అందుతాయని, బోరుబావులు ఎత్తిపోకుండా ఉంటాయని రైతులు చెబుతున్నారు. ఏది ఏమైనా వరద కాలువలోని నీటిని మళ్లించడానికి పాలెం రైతులు చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు. పంటలకు ఇబ్బంది లేదు వరద కాలువలోని నిలువ ఉన్న నీటిని మళ్లించుకోవడం వల్ల పంటలకు ఇబ్బంది లేదు. వర్షాలు కురిసినా బూరుగు చెరువులోకి నీరు రాలేదు. కాని మా ప్రయత్నంతో మాత్రం నీరు వస్తోంది. రైతులు ఏకం కావడం వల్ల సాధ్యం కాదనుకున్నది సుసాధ్యం అయ్యింది. అందరి కృషి ఫలితమే ఇది. – జగురంపల్లి వెంకన్న, రైతు, పాలెం -
పండుగ ముందు విషాదం
సాగర్నగర్(విశాఖ తూర్పు): పండుగ ముందు రోజు విషాదం నెలకొంది. బక్రీద్ సందర్భంగా ఫొటోలు తీసుకునేందుకు వెళ్లిన వారిలో ఓ యుకుడు గల్లంతవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జోడుగుళ్లపాలెం సీతకొండ దిగువన గల నాచురాళ్లుపై సెల్ఫోన్తో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి 16 ఏళ్ల యువకుడు జయూద్ గల్లంతయ్యాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదర్శనగర్ పరిధి రవీంద్రనగర్కు చెందిన అన్నదమ్ములు జయూద్, జయాన్, వారి స్నేహితుడు మాజీన్ కలసి మంగళవారం సాయంత్రం సముద్ర తీరంలో ఫొటోలు తీసుకోవడానికి వెళ్లారు. సీతకొండ వ్యూ ఫాయింట్ కిందన నాచురాళ్లపై నిల్చొని కొన్ని ఫొటోలు తీసుకున్నారు. వీరిలో జయూద్ కాస్త ముందుకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపోయి సముద్రంలో పడిపోయాడు. వెంటనే అలల తాకిడికి లోనికి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని గమనించిన జయాన్, మాజీన్ ఆందోళనకు గురై ఏడుస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు వెంటనే పోలీసులకు తెలియజేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. దీంతో ఆరిలోవ సీఐ తిరుపతిరావు, ఎస్ఐ అప్పారావు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి గల్లంతైన జయూద్ కన్పించలేదని పోలీసులు పేర్కొన్నారు. స్థానికంగా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న మహ్మద్ జబీర్కు జయూద్, జయాన్ కుమారులు. జయూద్ బాసర జూనియర్ కాలేజీలో ఇంటర్ తొలి సంవత్సరంగా చదువుతుండగా జయాన్ శ్రీనిధి మోడల్ స్కూళ్లో టెన్త్ క్లాస్ చదువుతున్నారు. వీళ్ల స్నేహితుడైన మరో విద్యార్థి మాజీన్ శ్రీనిధి స్కూల్లోనే తొమ్మిదో తరగతి చదువుతున్నట్టు పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఇలాంటి విషాదం జరగడంతో జయూద్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో ఇదే స్థలంలో సెల్ఫీలు తీసుకుంటూ ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు ఇక్కడ ముగ్గురు యువకులు గల్లంతుయ్యారు. అయినా పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడం విచారకరమని స్థానికులు ఆరోపిస్తున్నారు. యువతిని కాపాడిన లైఫ్ గార్డ్స్ బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): సముద్ర అలల తాకిడికి ప్రమాదానికి గురైన యువతిని లైఫ్గార్డ్స్ కాపాడారు. మెరైన్ సీఐ వి.శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన బి.మీనాక్షి తీరంలో అలల తాకిడికి లోనికి వెళ్లిపోయింది. వెంటనే గుర్తించిన లైఫ్గార్డ్స్ రంగంలోకి దిగి ఆమెను సురక్షితంగా రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం మీనాక్షిని ఆమె తండ్రికి అప్పగించారు. మెరైన్ ఏఎస్ఐ కుమార్, పోలీసులు కనకరాజు, లైఫ్ గార్డ్స్ లక్ష్మణ్ ఆమెను రక్షించారు. -
కడుపుకోత మిగిల్చిన ఈత సరదా
కేసముద్రం వరంగల్: ఈత సరదా ఓ తల్లికి కడుపుకోతను మిగిల్చింది. బడి నుంచి ఇంటికి వచ్చిన కొడుకు తోటి మిత్రులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి నీటిమునిగి మృత్యుఒడిలోకి చేరిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెపాక సుమలత, కృష్ణ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. చిన్నకుమారు రోహిత్(9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుకుంటున్నాడు. ఈ మేరకు ఎప్పటిలాగే శుక్రవారం పాఠశాలకు వెళ్లి, తిరిగి సాయంత్రం బడి వదిలిపెట్టడంతో ఇంటికి వచ్చి పుస్తకాల బ్యాగ్ ఇంటి వద్ద పెట్టి, బయటకు వచ్చాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ.. ఊరి చివరన ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక రోహిత్ చెరువులోకి దిగాడు. చెరువు అంచున వేసవికాలంలో చేపల కోసం తీసిన పెద్ద గుంతలో రోహిత్ మునిగిపోయాడు. బయట ఉన్న స్నేహితులు భయంతో ఇంటికి పరుగుతీశారు. సాయంత్రం వరకూ రోహిత్ ఇంటికి చేరకపోవడంతో తల్లి చుట్టుప్రక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. గ్రామస్తులు తోటి స్నేహితులను అడుగగా జరిగిన విషయం వెలిపారు. రాత్రి సమయంలో చెరువులోకి కొందరు వ్యక్తులు దిగి గాలించగా మృతదేహం లభ్యమైంది. కొడుకు శవాన్ని చూసిన తల్లి ఒక్కసారిగా కుప్పకూలింది. శనివారం తల్లి సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా రోహిత్ మృతి చెందడంతో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు కన్నీళ్లు పెట్టుకున్నారు. నాడు భర్త.. నేడు కుమారుడు.. కూలీనాలి పనిచేసుకుంటూ జీవనం సాగించే కృష్ణ పాఠశాల ఎస్ఎంసీ వైస్ చైర్మన్గా పనిచేశాడు. ఈక్రమంలో గత ఏడాది క్రితం కృష్ణ మృతిచెందడంతో, కుటుంబ భారమంతా భార్య సుమలతపై పడింది. కాగా ఎస్ఎంసీ కమిటీ వైస్చైర్మన్గా సుమలతను ఎంపిక చేశారు. ఒకవైపు కూలీ పనిచేస్తూ ముగ్గురు పిల్లలను సాకుతూ వస్తుంది. బడిలో చదువుతున్న రోహిత్తో ఉపాధ్యాయులు స్నేహభావంతో మెదిలేవారు. రోహిత్ క్రీడల్లో, చదువులో రాణిస్తుండటంతో అతడికి మంచి ప్రోత్సాహన్ని ఇచ్చేవారు. అలాంటి విద్యార్థి మృతిచెందడంతో, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బాధను మిగిల్చింది. ఇంటిపెద్ద దిక్కును కోల్పోయిన బాధను మరువకముందే కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. -
శెభాష్ కామేగౌడ : వి.వి.ఎస్. లక్ష్మణ్
కర్ణాటక, మండ్య: ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కాలం వృథా చేయకుండా ఆ సన్నకారు రైతు నడుంబిగించి జల సిరులను సృష్టించారు. సొంత డబ్బులతో నీటి నిల్వ కోసం సుమారు 14 చెరువులను తవ్వించిన మండ్య జిల్లాలోని మళవళ్లి తాలుకాలో ఉన్నదాసనగొడ్డి గ్రామానికి చెందిన రైతు కామేగౌడ సేవను తెలుసుకున్న బారత మాజీ క్రికెట్ దిగ్గజం వి.వి.ఎస్. లక్ష్మణ్ అభినందిస్తు ట్వీట్ చేశారు. రైతు కామేగౌడ వేసవి కాలంలోప్రజలకు, జంతువులకు తాగునీటి కొరత ఉండకూడదనే ఆశయంతో దాసనదొడ్డి గ్రామంలో సుమారు 14 నీటి కుంటలను తవ్వించాడు. దాంతో ఎప్పడు ఈ నీటి చెరువుల్లో నీరు నిల్వ ఉంటుంది. వీటిని తవ్వడానికి ఈ రైతు సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న లక్ష్మణ్... కామేగౌడను ట్విట్టర్లో ప్రశంసించారు. వి.వి.ఎస్. లక్ష్మణ్ చేసిన ట్వీట్ -
చినుకు పడలే.. చెరువు నిండలే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టు పరిధిలోని పెద్ద ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుంటే.. చిన్న నీటివనరులైన చెరువులు మాత్రం నీటి కొరతతో అల్లల్లాడుతున్నాయి. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో దిగువ ప్రాజెక్టులకు ఊహించని రీతి లో వరద కొనసాగుతుండగా, సరైన వర్షాలు లేక చెరువులు ఓటికుండల్లా దర్శనమిస్తున్నాయి. బేసిన్ పరిధిలోని 23,700కు పైగా చెరువుల్లో 21,900 ఖాళీగానే ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తేగానీ నిండే అవకాశం లేదు. వర్షపాతం తక్కువే.. కృష్ణా బేసిన్లోని నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదైంది. గతేడాదితో పోలిస్తే 30 నుంచి 50% తక్కువ వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో 50% తక్కువ వర్షపాతం నమోదవగా.. రంగారెడ్డిలో 39, జోగుళాంబ గద్వాల, సంగారెడ్డిలో 23, సూర్యాపేటలో 26, యాదాద్రి, మేడ్చల్లో 33% తక్కువ వర్షపాతం రికార్డయింది. దీంతో ఈ జిల్లాల పరిధిలోని చెరువుల్లో పెద్దగా నీరు చేరలేదు. ఖాళీగా 21,909 చెరువులు నిజానికి కృష్ణా బేసిన్లో ఉన్న 23,704 చెరువులకు 89 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నాయి. కానీ ఇప్పటివరకు 21,909 చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కేవలం 1,339 చెరువుల్లో 25 నుంచి 50 శాతం మేర నీరు చేరగా 214 చెరువుల్లో 50 నుంచి 70 శాతం, 201 చెరువుల్లో 75 శాతానికి మించి లభ్యత ఉంది. 41 చెరువులే అలుగు పారుతున్నాయి. కృష్ణా బేసిన్లో ప్రధానంగా సిద్ధిపేట జిల్లాలో 3,256 చెరువుల్లో 3,222 చెరువుల్లో చుక్క నీరు లేదు. మహ బూబ్నగర్ జిల్లాలోనూ 2,461 చెరువుల్లో ఒక్క చెరువులోకి నీరు చేరలేదు. మిగతా జిల్లాలోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్తులో కురిసే వర్షాలపైనే ఈ చెరువులన్నీ ఆధారపడి ఉన్నాయి. గోదావరి పరిధిలో 20,121 చెరువుల్లో 8 వేల చెరువులు ఖాళీగా ఉన్నాయి. మిగ తా చెరువుల్లో 40 శాతం నీటి లభ్యత ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ రెండ్రోజుల్లోనే శ్రీశైలానికి 30 టీఎంసీల మేర నీరు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 10 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. -
గర్రెపల్లి చెరువుకు మంత్రి భరోసా
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోనే అతిపెద్దదైన గర్రెపల్లి చెరువు అభివృద్ధికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు భరోసా ఇచ్చారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి పెద్ద చెరువు దుస్థితిని వివరిస్తూ ‘పెద్ద చెరువుపై చిన్న చూపు’ శీర్షికన ఈ నెల 20న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉండి, పది గ్రామాల్లో భూగర్భజల మట్టాన్ని పెంచే పెద్దచెరువు దుస్థితికి అద్దం పట్టడంతో ‘సాక్షి’ కథనం జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావును సర్పంచ్ పడాల అజయ్గౌడ్ కలిసి వినతిపత్రం అందజేశారు. గర్రెపల్లి పెద్ద చెరువుకు వరదకాలువ నుంచి నీళ్లివ్వాలని మంత్రిని కోరారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు చెరువుల అభివృద్ధికి వెచ్చిస్తున్నా.. గర్రెపల్లి చెరువు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రికి సర్పంచ్ ఫిర్యాదు చేశారు. రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువులో నీళ్లు నింపితే, పదిగ్రామాల్లో భూగర్భ జల మట్టం పెరుగుతుందని, 300కుపైగా మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని తెలియజేశారు. ఇందుకు మంత్రి హరీష్రావు సానుకూలంగా స్పందించారు. చెరువులో నీళ్లు నింపేందుకు అవసరమైన మార్గాలను అధికారుల నుంచి తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. కాగా... మంత్రిని కలిసి వారిలో బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తంగెళ్లపల్లి రాజ్కుమార్, గ్రామస్తులు ఉన్నారు. నీళ్లు నింపేందుకు మంత్రి హామీ జిల్లాలోనే అతిపెద్దదైన గర్రెపల్లి చెరువును నీటితో నింపేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు హామీ ఇచ్చారు. చెరువులో సరిపడా నీళ్లు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా, పట్టించుకోవడం లేదు. దీనితో మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. రామడుగు మండలం చిప్పకుర్తి దగ్గర వరదకాలువ 99వ కిలోమీటర్ వద్ద, ఎస్ఆర్ఎస్పీ మెయిన్ కెనాల్ (96వ కిలోమీటర్ వద్ద)ను కలిపితే, దీని ద్వారా డీ–86 నుంచి 11ఆర్తో గర్రెపల్లి చెరువును నింపాలని కోరాం. మంత్రి ఆదేశంతో త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం. పడాల అజయ్గౌడ్, సర్పంచ్, గర్రెపల్లి -
పరుగెత్తే నీటికి నడక నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా ఎక్కడికక్కడ ఒడిసిపట్టుకొని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువుపట్టుగా మార్చుకొని సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాల్వలతో, వర్షాలతో, పడబాటు (రీ జనరేటెడ్)తో వచ్చే నీటితో చెరువులను నింపే వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. పరుగెత్తే నీటికి నడక నేర్పాలని సూచించారు. ఏడాదంతా తెలంగాణలోని అన్ని చెరువులూ నిండుకుండల్లా కళకళలాడాలని ఆకాంక్షించారు. కాల్వలను చెరువులకు అనుసంధానిస్తూ మండలాలవారీగా ఇరిగేషన్ మ్యాపులను సిద్ధం చేయాలని ఆదేశించారు. భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల కాలువలతో గొలుసుకట్టు చెరువుల అనుసంధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రి టి. హరీశ్రావు, ఎంపీలు కె.కేశవరావు, బి. వినోద్కుమార్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, దివాకర్రావు, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధర్, సీఈలు, ఎస్ఈలు పాల్గొన్నారు. గొలుసుకట్టు చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇస్రో రూపొందించిన మ్యాపింగ్పై ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కాడా) కమిషనర్ మల్సూర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలోని వేలాది చెరువులను ఉపయోగించుకుని వ్యవసాయానికి సాగునీరు అందించే అవకాశాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. చెరువులు మన వారసత్వ సంపద... ‘మనకు వారసత్వంగా వచ్చిన వేలాది చెరువులు ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ 1974లోనే తెలంగాణలోని చెరువులకు 265 టీఎంసీల నీటిని కేటాయించింది. అంటే అంత భారీగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యంగల గొప్ప సంపద మనకు చెరువుల రూపంలో ఉంది. సమైక్యపాలనలో చెరువులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మనం మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభించి చెరువులను పునరుద్ధరించుకుంటున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. అలా నిర్మించుకున్న ప్రాజెక్టులతో పొందే నీటిలో ఒక్క చుక్క కూడా వృథా కాకుండా చెరువులకు మళ్లించాలి. గొలుసుకట్టు చెరువులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులు ఉన్నాయి. గొలుసుకట్టులో మొదటి చెరువును గుర్తించి ప్రాజెక్టు కాలువకు అనుసంధానించాలి. దాన్ని నింపుకుంటూ వెళ్తే కింద ఉన్న చెరువులూ నిండుతాయి. దీనికోసం కట్టు కాలువ (ఫీడర్ చానల్), పంట కాలువ (క్రాప్ కెనాల్)లను సిద్ధం చేయాలి. ప్రతి మండల అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర ఆ మండలంలోని చెరువుల మ్యాపులు ఉండాలి. ఏ కాలువతో ఏ చెరువును నింపాలనే దానిపై వ్యూహం ఖరారు చేయాలి. ఏ చెరువు అలుగు పోస్తే ఏ చెరువుకు నీరు పారుతుందో తెలిసుండాలి. ప్రాజెక్టుల కాల్వల నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న వేలాది చెక్ డ్యాములతోపాటు పడబాటు, వానలతో వచ్చే ప్రతి నీటి బొట్టునూ చెరువులకు మళ్లించాలి. తెలంగాణలో నీళ్లు పరిగెత్త కూడదు. అవి మెల్లగా నడిచి వెళ్లాలి. అప్పుడే నీటిని సమర్థంగా, సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతాం. నదులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, చెరువుల నిండా నీళ్లుంటే తెలంగాణ వాతావరణమే మారిపోతుంది. వర్షాలూ బాగా కురుస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి’అని ముఖ్యమంత్రి వివరించారు. రెండు నెలల్లో వ్యూహం... రాబోయే రెండు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపే వ్యూహం ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా అన్ని చెరువులూ నింపేందుకు అవసరమైన కాల్వల నిర్మాణం చేపట్టాలని, దీనికోసం నిధులు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ‘వచ్చే ఏడాది జూన్ నుంచి కాళేశ్వరం నుంచి పుష్కలంగా నీళ్లు వస్తాయి. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే చెరువుల అనుసంధానం పూర్తి కావాలి. దీన్ని అత్యంత ప్రాధాన్యతా అంశంగా నీటిపారుదలశాఖ గుర్తించాలి. చెరువులు, కట్టు కాలువలు, పంట కాల్వలను పునరుద్ధరించాలి. అవి ఎప్పటికీ బాగుండేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ఆయకట్టుదారులే కాల్వలు, తూములను మరమ్మతు చేసుకునే వారు. ఎండాకాలంలో చెరువుల్లోని మట్టిని పూడిక తీసేవారు. మళ్లీ ఆ రోజులు రావాలి. గ్రామీణ ప్రజలకు దీనిపై అవగాహన, చైతన్యం కలిగించాలి. చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటిపారుదల ఇంజనీర్లతో సమావేశం నిర్వహిస్తాం. నీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చడానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదుల్లో మనకున్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకొవడానికి వీలుగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉందో గుర్తించాలి. అక్కడ అవసరమైన ఎత్తిపోతలు, కాలువలు, రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి. కడెంకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉండే కుఫ్టి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలి. దీంతో కుంటాల జలపాతానికీ నీటి వనరు ఏర్పడుతుంది. కృష్ణా నదిలోనూ కావాల్సినంత నీరు ఉంది. ఈ నీటినీ సమర్థంగా వినియోగించుకునేలా వ్యూహం అమలు చేయాలి’అని సీఎం చెప్పారు. ‘రైతు బంధు’కు దేశవ్యాప్తంగా ప్రశంసలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘తెలంగాణలో 65 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నా ఇంతవరకు వ్యవసాయాన్ని అప్రాధాన్యతా రంగంగా చూశారు. అది దురదృష్టకరం. యూరప్, అమెరికాలలో రైతులతోపాటు పంట ఉత్పత్తులు, ఉత్పాదకత పెంచేందుకు అక్కడి ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత ఇస్తాయి. కానీ మన దగ్గర సమైక్య పాలనలో రైతులు వంచనకు గురయ్యారు. తెలంగాణ వచ్చాక రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవిక దృక్పథంతో ఆలోచించబట్టే ఇంత మంచి పథకాల రూపకల్పన జరిగింది. రైతు బంధు పథకాన్ని ఆర్థికవేత్తలు అభినందిస్తున్నారు. ఈ పథకాన్ని ఒక మార్గదర్శకంగా కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభివర్ణించారు’అని కేసీఆర్ చెప్పారు. -
ప్రాజెక్టులు, చెరువుల అనుసంధానం
-
చెరువులతో ప్రాజెక్టుల చెలిమి!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు భారీ సాగునీటి ప్రాజెక్టుల రూప కల్పన, మరోవైపు చిన్న నీటి వనరులను పునరుద్ధరిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఈ రెండింటినీ అనుసంధానం చేసే ప్రణాళికకు పురుడు పోసింది. మిషన్ కాకతీయలో గుర్తించిన ప్రతి చెరువునూ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింది కాల్వలతో అనుసంధానం చేసి బీడు భూముల న్నింటికీ నీరు పారించే కార్యాచరణను రూపొందిం చింది. వచ్చే ఏడాది ఖరీఫ్కు ముందే వీలైనన్ని ఎక్కువ చెరువులను ఈ విధానం ద్వారా నింపాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి విడతగా ఇప్పటికే గుర్తించిన 7,500 గొలుసుకట్టు చెరువులను నింపి మిగతా వాటికి గల అవకాశాలను ‘టోపోషీట్’ల ద్వారా అధ్యయనం చేయనుంది. గరిష్ట వినియోగం.. గరిష్ట ఆయకట్టు నిజానికి చిన్న నీటివనరుల కింద భారీ నీటి కేటాయింపులు ఉన్నాయి. గోదావరి బేసిన్లో 165 టీఎంసీలు, కృష్ణాలో 89 టీఎంసీలు కలిపి మొత్తంగా 254 టీఎంసీల కేటాయింపులున్నా వినియోగం మాత్రం 100 నుంచి 130 టీఎంసీలకు మించడం లేదు. వీటి కింద 24.50 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నా మిషన్ కాకతీయకు ముందువరకు 10 లక్షల ఎకరాల్లోపే సాగు జరిగేది. కాకతీయ ఆ తర్వాత అది 15 లక్షలకు చేరినా మరో 10 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. ఈ దృష్ట్యా మరింతగా నీటిని వినియోగించుకోవడంతో పాటు గరిష్ట ఆయకట్టుకి నీరు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే మిషన్ కాకతీయ కింద 44,928 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా నాలుగు విడతల్లో కలిపి 29 వేల చెరువుల పునరుద్ధరణకు అనుమతులొచ్చాయి. ఇందులో 20 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఈ డిసెంబర్ నాటికే మిగతా చెరువుల పనులు పూర్తి చేయనున్నారు. మిగిలిన వాటిని ఐదో విడతలో చేపట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయనున్నారు. ఖరీఫ్ను త్వరగా మొదలుపెట్టొచ్చని.. పునరుద్ధరించిన చెరువులను నిత్యం నీటితో నింపడంపై దృష్టి సారించిన సర్కారు.. భారీ, మధ్యతరహా, ఎత్తిపోతల పథకాలతో వాటిని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణం పూర్తి చేసుకున్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖను ఇటీవల సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల కాల్వలు పారుతున్న ప్రాంతాలను టోఫోషీట్లపై మొదట గుర్తించాలని.. తర్వాత వాటికి దగ్గరలోని చెరువులను మార్కింగ్ చేసి కాల్వల ద్వారా నింపే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. మొత్తం ఎన్ని గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు ద్వారా వాటిని నింపే అవకాశం ఉందో నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. చెరువుల్లో నీటి లభ్యత పెరిగితే జూన్లో వర్షాలకు ముందే చెరువు నీటితో నార్లు పూర్తవుతాయని, వర్షాలు కురిసే సమయానికి నాట్లకు వీలవుతుందని, తద్వారా ఖరీఫ్ను త్వరగా చేపట్టొచ్చని సీఎం భావిస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 7,500 గొలుసుకట్టు చెరువులను గుర్తించామని, మిగతా వాటిని గొలుసుకట్టుగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని నీటి పారుదల శాఖ వెల్లడించింది. కరువును జయించవచ్చు: హరీశ్ రాష్ట్రంలోని చెరువులను, కుంటలను నీటితో నింపితే కరువు పరిస్థితులను పారదోలవచ్చని మంత్రి హరీశ్రావు అన్నారు. ‘చెరువుల్లో నీరు ఉండే ప్రాంతాల్లో సైక్లింగ్ విధానం వల్ల తిరిగి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు నీటితో నిండితే కరువును జయించడమే కాకుండా అకాల వర్షాలు, వడగండ్ల వానలను నివారించవచ్చు. పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. భూగర్భజలాలు పెరిగి ఫ్లోరైడ్ సమస్య తగ్గుతుంది. రాష్ట్రానికి పూర్థి స్థాయిలో నీటి భద్రత లభిస్తుంది’ అని హరీశ్రావు వివరించారు. -
ఒక్క చెరువూ నింపలేకపోయారు
సాక్షి, పరిగి : ‘ఒక్క చెరువునూ నీటితో నింప లేకపోయారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన టీడీపీని బంగాళాఖాతంలో కలిపేయండి’ అంటూ ప్రజలకు వైఎస్సార్సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తలు తలారి రంగయ్య, నదీం అహమ్మద్, పెనుకొండ సమన్వయకర్త ఎం.శంకరనారాయణ పిలుపునిచ్చారు. పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి మండలంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.శంకరనారాయణ నేతృత్వంలో చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర ప్రారంభత్సోవానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మండలంలోని కొడిగెనహళ్లి శ్రీఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర శాసనకోట, నేతులపల్లి, సంగమేశ్వరంపల్లి, ఊటుకూరు, యర్రగుంట, తిరుమలదేవరపల్లి, విట్టాపల్లి వరకూ 16 కిలోమీటర్ల మేర సాగింది. పరిగి మండలంలోని అన్ని చెరువులకూ నీరందించాలని, రైతులకు పంట వేయక మందే ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించాలనే డిమాండ్లపై ప్రజలను చైతన్య పరుస్తూ చేపట్టిన పాదయాత్రకు అన్ని గ్రామాల్లో ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఊటుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నదీం అహమ్మద్, రంగయ్య మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతుంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుందని విమర్శించారు. మోసపూరిత వాగ్ధానాలతో మరోసారి ముందుకు వస్తారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ కూడగట్టుకున్న అవినీతి సొమ్మంతా ప్రజలదేనని ఎన్నికల్లో ఎంత డబ్బిచ్చినా తీసుకుని విలువైన ఓటు హక్కుతో సీఎం చంద్రబాబును సాగనంపాలని కోరారు. ఇసుక దగ్గర నుంచి ఇండస్ట్రీస్ వరకూ అన్నింటా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. శంకరనారాయణ మాట్లాడుతూ... నియోజకవర్గంలోని ప్రతి చెరువుకూ హంద్రీనీవా కాలువ ద్వారా నీరందిస్తామన్న ఎమ్మెల్యే బీకే పార్థసారథి.. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క చెరువునూ నింపలేకపోయారని అన్నారు. హంద్రీ–నీవా పనుల్లో కమీషన్ల కోసం కక్కుర్తిపడి టీడీపీని ఓ దొంగల పార్టీగా మార్చేశారన్నారు. కనీసం రేషన్కార్డుల మంజూరులో కూడా నిబద్ధత చూపలేకపోయారన్నారు. చెరువులకు నీరిమ్మంటే అవే చెరువులను పెత్తందార్లకు అమ్మేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చేపలు పెరగనంటున్నాయ్ !
సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ : మత్స్యకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పెంపకం కార్యక్రమం జిల్లాలో విజయవంతం కాలేకపోయింది. చెరువులు, కుంటల్లో సరిపడా నీరు లేకపోవడంతో చేపల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ప్రభుత్వం చేపపిల్లలను మత్స్యసహకార సంఘాలకు ఇస్తున్నప్పటికీ.. చెరువుల్లో నీళ్లు లేక ఎండాకాలంలో ఆక్సిజన్ అందక చాలామటుకు చనిపోతున్నాయి. ఉన్న వాటిని సైతం కొన్ని ప్రాంతాల్లో మత్స్యకారులు నేరుగా అమ్ముకోలేకపోతున్నారు. చెరువులను కాంట్రాక్టర్లకు లీజుకు ఇస్తూ అంతంతే ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో 611 చెరువులు జిల్లాలో 1,227 చెరువులు, కుంటలు ఉన్నప్పటికీ 611 చెరువులు మాత్రమే గ్రామపంచాయతీ కింద ఉన్నాయి. 175 చెరువులు మత్స్యసహకారశాఖ పరిధిలో ఉన్నాయి. దాదాపు 274 చెరువుల్లో పరిస్థితులు చేపల పెంపకానికి అనువుగా లేవు. ఎంపిక చేసిన చెరువుల్లో మత్స్యశాఖ తరఫున ప్రభుత్వం చేపల పిల్లలను పంపిణీ చేస్తుంది. జిల్లాలో 184 మత్స్యసహకార సంఘాలు ఉండ గా, అందులో 10,187 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 26 మహిళా సంఘాలు ఉండగా 800 మంది సభ్యులు, 158 పురుషుల సంఘాలు ఉం డగా 9,387 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది 1.12 కోట్ల చేపపిల్లల పెంపే లక్ష్యం ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురుస్తాయనే అంచనాతో 1.12కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదలాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈమేరకు టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గతేడాది 258 చెరువుల్లో 65.91 లక్షల చేపపిల్లలను వదిలారు. జిల్లాలోని కథలాపూర్, మల్యాల, కొడిమ్యాల వంటి మండలాల్లోని చెరువుల్లో నీళ్లు లేక చేపలు పెంచలేకపోయారు. అయితే వర్షాలు ఆలస్యమవుతుండడంతో చేపపిల్లలను చెరువుల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వేయనున్నారు. ఇలా వేసిన చేపపిల్లల్లో కొన్ని నీళ్లు లేక, మరికొన్ని చెరువుల్లోని చెత్తతో ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో చెరువుల్లో నీరు తగ్గుతుండడం.. ఆ సమయంలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎక్కువ మొత్తంలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. లక్ష్యం భారీగానే జిల్లాలోని చెరువుల్లో వేసిన చేపపిల్లలకుగాను 3,200 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా వేసినప్పటికీ 2,048 మెట్రిక్టన్నుల చేపల ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఉత్పత్తి తగ్గడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయంటున్నారు అధికారులు. చెరువుల్లో రవు, కట్ల, మృగ, బంగారుతీగలను వదిలారు. 8–9 నెలల్లోనే దాదాపు ముప్పావు కిలో నుంచి కిలో వరకు పెరిగాయి. ప్రస్తుతానికి జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో చేపల మార్కెట్లు ఉండగా, ధర్మపురి, కోరుట్ల మండలం అయిలాపూర్లో చేపల మార్కెట్ల పనులు సాగుతున్నాయి. రాయికల్, జగిత్యాల మండలం మోతె, కొండగట్టు కింద ముత్యంపేట వంటి చోట్ల చేపల మార్కెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటికితోడు గోదావరి తీర ప్రాంతం వెంబడి చేపలను విక్రయిస్తున్నారు. కొన్ని ప్రధాన చెరువుల వద్ద కూడా మత్స్యకారులే స్వయంగా చేపల మార్కెట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఉపాధి అంతంతే.. ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలను వదులుతున్నప్పటికీ చాలా చోట్ల మత్స్యసహకార సంఘాలు మళ్లీ బడా వ్యక్తులకే లీజుకు ఇస్తున్నాయి. సహకార సంఘం సభ్యులే చేపలను పట్టి లీజుదారులకు కిలోకు కొంత చొప్పున తీసుకొని విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చేపలు పెరిగిన తర్వాత లీజుదారులతో సంఘాలు ఒప్పందం చేసుకుంటున్నాయి. నేరుగా మత్స్యకారులు చెరువుల్లో చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు శిక్షణ సదస్సులు పెట్టి మత్స్యకార సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ఉపాధి పొందలేకపోతున్నారు. ముందుగా సరఫరా చేయాలి చేప పిల్లలను వర్షాలు రాగానే సరఫరా చేస్తే బాగుంటుంది. కొన్ని చోట్ల సంఘాలు కొని తె చ్చి వేసిన తర్వాత ప్రభుత్వం సరఫరా చేస్తుంది. దీనివల్ల కొన్ని చేపలు పెద్దగా, మరికొన్ని చిన్నవిగా ఉంటున్నాయి. ఇలా ఉండడంతో చేపలు విక్రయించే సమయంలో ఇబ్బందులు పడుతున్నాం. – గంగారాం, మత్స్యకారుడు -
ఒకరిని కాపాడబోతే.. 6గురు చిన్నారుల మృతి
పట్నా : బిహార్లోని అరారియా జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసిన కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారిని రక్షించే క్రమంలో అదుపు తప్పిన కారు దగ్గర్లోని చెట్టును బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. బాధితులు ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 6గురు చిన్నారులతో పాటు మరో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందగా, ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతులు చిన్నపిల్లలు కావడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. -
ఆదుకుంటావనుకుంటే.. శవమయ్యావా బిడ్డా..!
బొంరాస్పేట : ‘మీ నాన్న సచ్చినప్పుడు మూడేండ్లోడవుంటివి కొడుకా.. ఉడుకు నీళ్లంటేనే నీకు భయం.. చేతులార పెంచి పెద్ద చేస్తే ఇట్లా చెరువులో పడి శవమయ్యావా బిడ్డా’.. అంటూ ఓ తల్లి కొడుకు శవం వద్ద రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లి గళ్లంతైన యువకుడి శవం శనివారం మధ్యాహ్నం లభ్యమైంది. బొంరాస్పేట మండల పరిధిలోని తుంకిమెట్లకు చెందిన లావ నర్సింలు, జయమ్మ దంపతుల కుమారుడు రాజు(20). మహబూబ్నగర్ జిల్లా కోస్గిలో ఐటీఐ చదువుతున్నాడు. స్నేహితులతో విందుకని ఏర్పుమళ్లకు వెళ్లాడు. శుక్రవారం నలుగురు స్నేహితులతో కలిసి ఏర్పుమళ్ల కాకర్వాణీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లి గల్లంతైన సంఘటన శుక్రవారం చోటు చేసుకున్న విషయం విధితమే. కాగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకొని శనివారం మధ్యాహ్నం గల్లంతైన యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. చేతికొందొచ్చిన కొడుకు శవమై కనిపించడంతో ఆ తల్లి రోదన అంతాఇంతా కాదు.. తండ్రి చనిపోయినా.. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని జయమ్మ ఏడ్చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. స్నేహితులపై అనుమానం ఉంది.. శుక్రవారం రాత్రి తన కొడుకు లావ రాజును ఇంట్లో నుంచి పిలుచుకొని వెళ్లి ఇలా శవమై చేతికిచ్చారని మృతుడి తల్లి జయమ్మ గుండెలు బాదుకుంటూ విలపించింది. ఏర్పుమళ్లకు చెందిన స్నేహితులు విందుకు తీసుకువెళ్లి చెరువులో గల్లంతయ్యాడని చెప్పి శవంగా మార్చారని ఆరోపించింది. తన కొడుకు నీటిలో శవంగా కనిపించడంలో అనుమానం ఉందని, స్నేహితులే బాధ్యులని ఫిర్యాదు చేసింది. తన కొడుకు రాజు స్నేహితులు ఏర్పుమళ్లకు చెందిన సందారం ప్రవీణ్కుమార్, ఈడ్గి శ్రీకాంత్, బాబర్లపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. గజ ఈతగాళ్లతో గాలింపు ప్రాజెక్టు నీటిలో గల్లంతైన లావరాజు కోసం శనివారం మధ్యాహ్నం వరకు ముమ్మరంగా గాలింపు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. శనివారం కోట్పల్లి ప్రాజెక్టు నుంచి నలుగురు గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చేయగా మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి కొడంగల్ సీఐ శంకర్ ఆరా తీశారు. మృతుడి తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. -
ఆ కుటుంబంపై విధి పంజా
ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. వారి సంతోషాన్ని చిదిమేసింది. ఏడాది క్రితం కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలకూ తల్లే దిక్కయింది. ఇంతలో మరో విషాదం ఆ కుటుంబాన్ని కుదిపేసింది. శుక్రవారం ఉదయం ఇద్దరు పిల్లల ప్రాణాలను మాయదారి గుంత పొట్టన బెట్టుకుంది. దీంతో కన్నతల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమెకొచ్చిన కొండంత కష్టం చూసి గ్రామం గుండె బరువెక్కింది. యాదమరి: మరో నాలుగు రోజులు గడిస్తే వేసవి సెలవులు ముగిసేవి. ఆ పిల్లలు ఎంచక్కా పాఠశాలకు వెళ్లేవారు. సెలవులయిపోతున్నాయని ఐదుగురు పిల్లలు కల్వర్టు గుంత వద్దకు వెళ్లారు. లోతును అంచనా వేయలేని వయస్సు..చూస్తుండగానే ఇద్దరు పిల్లలు మునిగిపోయారు. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.. యాదమరి మండలం బొమ్మన్ చేనులో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దొరస్వామి, లతలకు ముగ్గురు సంతానం. వీరిలో ఇందు(13)యాదమరి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి, హరీష్ అతికారపల్లెలో ఐదో తరగతి, మోనిషా(7) మూడో తరగతి చదువుతున్నారు. బంధువు ఒకరు మృతి చెందడంతో శుక్రవారం ఉదయం లత బిడ్డలను ఇంట్లో ఉంచి తమిళనాడు వెళ్లింది. తల్లి లేదు కదా అని ముగ్గురు పిల్లలు, తమ మేనత్త పిల్లలిద్దరితో కలసి పంటపొలం సమీపాన కల్వర్టు గుంత వద్దకు వెళ్లారు. నీవానదిలో ఇటీవల వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో గుంతలో నీరు ఎక్కువగా చేరింది. హరీష్, మరో పిల్లలు గట్టుపై నిల్చోని నీటిలో చేపలున్నాయోమోనని చూస్తున్నారు. ఇంతలో ఇందు..మోనిషా నీటి కుంటలో దిగారు. లోతుగా ఉండడంతో ఈత రాక మునిగిపోయారు. గట్టుపై ఉన్న పిల్లలు పైకి వస్తారని చూస్తున్నారు. వారెం తకూ రాకపోవడంతో వెంటనే కేకలు వేశారు. దగ్గర్లోని తెలిసిన వాళ్లకు, పశువుల కాపర్లకు విషయం చెప్పారు. వారు నీటిలోకి దిగి కొన ఊపిరితో ఉన్న చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఇందు మృతి చెందగా కాసేపటికీ ఆమె చెల్లెలు మోనిషా కూడా ప్రాణం విడిచింది. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది. ఏడాదిలోనే రెండు దారుణాలు.. గతేడాది ఈ ఇంట ఓ విషాదం చోటుచేసుకుంది. దొరస్వామి తన తల్లి ఆరోగ్యం కోసం అప్పులు చేశారు. వ్యవసాయం కలిసిరాలేదు. చేసిన అప్పు తీరలేదు. తల్లి మరణించింది. మనోవేదన చెందిన దొరస్వామి గతేడాది మేలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది తిరిగిన కొద్ది రోజులకే ఇద్దరు బిడ్డలు చనిపోవడం గ్రామస్తుల గుండెలను పిండేసింది. దొరస్వామి భార్యను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ‘మూడు రోజుల్లో స్కూళ్లు తెరుస్తారని పుస్తకాలు కూడా తెచ్చాను. వాటిని చూసి ఎంతో సరదా పడ్డారు.. ఇంతలోనే శవాలయ్యారు’ అంటూ తల్లి కన్నీరుమున్నీరయింది. తహసీల్దార్ రెడ్డప్ప, ఎంఈ ఓ జయప్రకాష్, ఎంపీడీఓ గిరధర్ రెడ్డి సాయంత్రం గ్రామానికి వెళ్లి మృతుల తల్లిని ఓదార్చారు. -
‘పెద్ద చెరువు’ను చూసి పిల్లనిచ్చేటోళ్లు
సాక్షి, హైదరాబాద్: పెళ్లీడొచ్చిన పోతారెడ్డిపేట పోరగాడుంటే ఆడపిల్లల తల్లిదండ్రులు అటు వైపే మొగ్గు చూపేటోళ్లు. పోతారెడ్డిపేట రైతంటే షావుకార్లు తాకట్టు లేకుండా కాయితం మీదనే అప్పులిచ్చేటోళ్లు. ఎందుకంటే ఆ ఊరు వెనుక ఓ చెరువు ఉంది. ఆ చెరువును చూసి ఊరికి పిల్లనిచ్చేటోళ్లు. అప్పులిచ్చేటోళ్లు. అంత నమ్మకం ఆ చెరువంటే. ఒక్కసారి చెరువు నిండితే ఐదేళ్ల వరకు ముక్కారు పంటలకు ఢోకా ఉండదు. ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందెలు మోస్తూ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఊరు బతుకుదెరువంతా ఆ చెరువు మీదే. ఇదంతా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామంలో ఉన్న పెద్ద చెరువు గురించే. అయితే ఇదంతా గతం. ఏళ్లకేళ్ల నిర్లక్ష్యంతో చెరువు రూపం కోల్పోయింది. 25 ఏళ్లుగా చెరువు నిండక వరుస కరువుతో పల్లె అల్లాడింది. ఎండిన చెరువు నిండేలా మంత్రి హరీశ్రావు పునరుజ్జీవం పోశారు. ‘మిషన్ కాకతీయ’కింద రూ.3.79 కోట్లు ఖర్చు చేసి పూర్వ వైభవాన్ని తెచ్చారు. ఇప్పుడా చెరువు కళకళలాడుతోంది. ఒక్కసారి నిండితే.. సిద్దిపేట జిల్లాలోనే రెండో ‘పెద్ద చెరువు’. పోతారెడ్డిపేట గ్రామంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఫీడర్ చానల్ లేని ఏకైక చెరువు. చుట్టూత 12 గ్రామాల నుంచి దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్ల పరిధిలో క్యాచ్మెంటు ఏరియా ఉంది. చెరువు పరిసర గ్రామాలైన పోతారెడ్డిపేట, తాళ్లపల్లి, నగరం, చిన్ననిజాంపేట, రామేశ్వరంపల్లి, మిరుదొడ్డి మండలం, మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని ఏ గ్రామంలో పెద్ద వర్షం కురిసినా.. నీళ్లు పెద్ద చెరువులోకే జారేవి. చెరువు కింద 862 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక్కసారి చెరువు నిండితే ఐదేళ్ల వరకు భూగర్భ జలాలకు ఢోకా ఉండదు. సమీప గ్రామా ల్లోని బావులు, బోరు బావుల్లోకి నీళ్లు దిగుతాయి. ఒక్క చెరువు నీళ్ల మీద ఆధారపడి చుట్టూ గ్రామాల్లో 2,500 ఎకరాలకు పైగా పంట సాగయ్యేది. ‘ఉమ్మడి’ నిర్లక్ష్యం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెరువు నిర్లక్ష్యానికి గురైంది. విశాలమైన చెరువు క్యాచ్మెంటు ఏరియాను కబ్జాదారులు చెరబట్టారు. నీటి ప్రవాహపు దారులన్నీ మూసుకునిపోవటంతో చెరువు జలకళ కోల్పోయింది. 1989 తర్వాత చెరువు ఒక్కసారి కూడా నిండలేదు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల తర్వాత పెద్ద చెరువుకు మళ్లీ జలకళ వచ్చింది. మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం పెద్ద చెరువు పునరుద్ధరణ కోసం రూ.3.79 కోట్లు ఖర్చు చేస్తోంది. చెరువులో పూడిక తీశారు. క్యాచ్మెంటు ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఫీడర్ చానల్ నిర్మాణం చేసి కల్వకుంట చిన్న వాగుతో అనుసంధానం చేస్తున్నారు. చెరువు పునరుద్ధరణ పనులను రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. క్యాచ్మెంట్ ఏరియా పునరుద్ధరణతో గతేడాది చెరువు నిండి మత్తడి పోసింది. పొలాలు పచ్చబడ్డాయి. చెరువు నిండితేనే.. పెండ్లీడొచ్చిన యువకులకు బయటి గ్రామాల నుంచి ఆడ పిల్లలను ఇవ్వాలంటే ముందు పెద్ద చెరువు నిండిందా లేదా అని అడిగేటోళ్లు. చెరువు నిండితే కనీసం ఐదేళ్ల వరకు కరువు, కాటకాలు ఉండవని వేరే గ్రామాల ప్రజలకు నమ్మకం. – పేరుడి దయాకర్రెడ్డి, రైతు, పోతారెడ్డిపేట 2,500 ఎకరాలకు నీళ్లు ఫీడర్ చానల్ లేని ఏకైక చెరువు ఇది. ఇప్పుడు ఫీడర్ చానల్ కడుతున్నాం. దాన్ని చిన్నవాగుతో అనుసంధానం చేసి మల్లన్న సాగర్ కాల్వలకు కలిపి వర్షంతో సంబంధం లేకుండా గోదావరి నీళ్లతో నింపే ప్రయత్నం జరుగుతుంది. దసరాకు చెరువు కింద 2,500 ఎకరాలను సాగులోకి తెస్తాం. – సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యే -
పాపం..పావురం..!
సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ :ప్రచండ భానుడి ప్రతాపానికి సకల జీవరాశులు అల్లాడుతున్నాయి. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో పావురాలు ఇలా ప్లాస్టిక్ టబ్లో నీటితో దాహార్తి తీర్చుకున్నాయి. చెరువుల్లో నీరు అడుగంటడంతో ప్రజలంతా డాబాలపై పక్షుల కోసం చిన్న చిన్న టబ్బుల్లో నీరు పోసి పెడితే బాగుంటుంది కదూ..విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ ఆవరణలో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది. -
చెరువును లూటీ చేశారు..
కురవి : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని వలల సాయంతో చేపలను పట్టుకెళ్లారు. అయితే మత్స్యకారులు చేపలు పట్టడం పూర్తయిందనే దష్ప్రచారంతోనే జనం తమ చెరువును లూటీ చేసినట్లు కార్మికులు ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవిలోని పెద్ద చెరువులో మత్స్యకార్మికులు కొన్నేళ్లుగా చేపలను పెంచుకుంటున్నారు. అయితే మత్స్యకార్మికులు చేపలు పట్టడం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో చెరువు వద్ద కాపలాగా ఉన్న కార్మికులపై వందలాది మంది దాడి చేసి చెరువులోకి దిగి చేపలను పట్టుకున్నారని మత్స్యకార్మికులు లింగరబోయిన శ్రీను, రేషబోయిన నారాయణ, కొణతం పెంటయ్య, మామిడి యాకన్న, వెంకన్న, వీరన్న, రాజు, కృష్ణ, వీరేందర్ తెలిపారు. చెరువులో చేపలు పుష్కలంగా ఉన్నాయని చెరువును వదిలిపెట్టలేదని వారు తెలిపారు. కురవికి చెందిన కొందరు వ్యక్తులు కుట్ర చేసి చెరువులో చేపలు పట్టడం పూర్తయిందని దుష్ప్రచారం చేశారని, దీంతో కురవి గ్రామస్తులు, తండా గిరిజనులతోపాటు సమీప గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వలలతో చేపలను పట్టుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయమై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశామని కార్మికులు తెలిపారు. చేపలు అయిపోయాయనే.. చెరువులో చేపలు పట్టడం పూర్తయిందనే సమాచారంతో కురవితో పాటు చుట్టుపక్కల తండాలకు చెందిన గిరిజనులు, పలు గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని చెరువులో చేపలు పట్టుకున్నారు. దీంతో చెరువులో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. -
ఇది ‘చెరువూరు’
సాక్షి, హైదరాబాద్: ఊరికి ఉత్తరాన కర్విరాల చెరువు. తూర్పున కొత్త కుంట. రెండు చెరువుల్లోంచి పునాదులు వేసుకున్న ఊరే కర్విరాల కొత్తగూడెం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని ఓ చిన్న గ్రామమిది. పల్లె తలాపున చిన్న గుట్ట. పొలిమేరలోని చెరువులే జీవనాధారం. ఈడొచ్చిన ఒడ్డోళ్ల పోరగాళ్లు చిన్నగుట్టను పగులగొట్టి కంకర చేసి పొట్టపోసుకుంటారు. ఇతర జాతుల వారికి చెరువుపై ఆధారపడి కుల వృత్తులు, చేతి వృత్తులతో జీవనం. ఊరు పుట్టిన 200 ఏళ్ల చరిత్రలో చెరువులు నిండిన సందర్భాలు చాలా తక్కువే. కాలం కలిసిరానప్పుడు ఒడ్డెర్లు వలసలతో, మిగతా కులాల నాటు సారా పెట్టి కాలం గడిపేవాళ్లట. అలాంటి ఊరు ఇప్పుడు వలసలను, గుడంబాను జయించింది. మిషన్ కాకతీయ కింద నీటి పారుదల మంత్రి హరీశ్రావు ఈ చెరువులను పునరుద్దరించారు. వానలతో పని లేకుండా గోదావరి జలాలతో నింపారు. దాంతో వలస పోయిన వాళ్లతో పాటు సుదూరంలోని సైబీరియా నుంచి కూడా పక్షులు వచ్చి కొత్తగూడెంలో సందడి చేస్తున్నాయిప్పుడు. చెరువే ఆదరువు కర్విరాల చెరువుకు ఎగువన, కొత్తకుంటకు దిగువన లింగమంతుల గుట్ట, చిన్నగుట్ట, వడ్లు దంచే బండ... ఇవన్నీ నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్నాయి. పరీవాహక ప్రాంతం ఎక్కువగా లేక చెరువులు నిండవు. ఆయకట్టు తక్కువే ఉన్నా చెరువు నీళ్లపై ఆధారపడి బోరు, బావుల కింద సాగు సాగేది. చేతి వృత్తులు బలపడేవి. మిషన్ కాకతీయ తొలి దశలో కొత్తకుంటకు రూ.26 లక్షలు, రెండో దశలో కర్విరాల చెరువుకు రూ.22 లక్షలు ఖర్చు చేసి పూడిక తీశారు. ఉపాధి హామీ పనులతో గ్రామస్థులంతా ఏకమై చెరువు క్యాచ్మెంటు ఏరియాను పునరుద్ధరించారు. హరీశ్ చొరవ చూపి శ్రీరాంసాగర్ కాల్వ నుంచి గోదావరి జలాలు తెచ్చి చెరువులు నింపారు. నిండిన చెరువుల్లో చేపలు పెంచారు. భూగర్భ జలాలు పెరిగి కర్విరాల చెరువు కింద 600 ఎకరాలకు, కొత్తకుంట కింద 300 ఎకరాలకు సాగునీరందుతోంది. చెరువులకు జలకళ రావడంతో వలస పోయిన గ్రామస్థులు తిరిగొచ్చారు. చేతి వృత్తులు పూర్తిగా అంతరించాయి గానీ కుల వృత్తులు ఇప్పుడిప్పుడే కొత్త జీవం పోసుకుంటున్నాయి. నాటుసారా పెట్టొద్దని ఊరు తీర్మానం చేసుకుంది. శీతాకాలంలో సైబీరియా నుంచి కొంగ జాతులొచ్చి వేసవి ముగిసే దాకా చెరువు మీదే గడిపి వర్షాకాలం ప్రారంభంలో తిరిగి వెళ్లిపోతున్నాయి. బోర్లకు నీళ్లు మళ్లినయి నాకు రెండు ఎకరాలుంది. బోరు నీళ్లే దిక్కు. చెరువుల పూడిక తీసి గోదావరి నీళ్లతో నింపినంక బోర్లళ్లకు నీళ్లు మళ్లినయి. రెండు కార్ల పంట వచ్చింది. కానీ ఈ ఏడాది చెరువుకు గోదావరి నీళ్లు రాలేదు. బోర్లు మళ్లీ మొదటికొచ్చినై. ప్రభుత్వం మళ్లీ గోదావరి నీళ్లొదిలి మా చెరువులు నింపాలె. – పేర్ల ప్రహ్లాద చెరువు నిండితే చుట్టాలొస్తరు చెరువుల్ల నీళ్లున్నప్పుడు మా ఊరికి సైబీరియా కొంగలొస్తయి. ఈ పక్షులు ఒక రకంగా మా చుట్టాలు. ఆర్నెల్ల పాటు చేప పిల్లల తిని బతుకుతై. గట్టు మీద సవారు చింతల తోపు చెట్ల మీద ఉంటై. –బండి అంతయ్య -
విషాదాంతం
బుక్కపట్నం: తల్లీకుమారుల అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. అనుమానించినట్లుగానే తల్లీకుమారులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరోజు తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. బుక్కపట్నంలోని ఎస్సీ కాలనీకి చెందిన రమాదేవి (28), పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన కృష్ణ దంపతులు. వీరికి బబ్లూ (6), జోసియో (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ కుటుంబం బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవించేది. ఇటీవల రమాదేవి పిల్లలిద్దరినీ తీసుకుని పుట్టింటికి వచ్చింది. సోమవారం ఉదయం ఏడు గంటలకు బెంగళూరుకు వెళ్లేందుకని ఇంటి నుంచి లగేజీ సర్దుకుని పిల్లలతో కలిసి బయల్దేరింది. ఇంతలో బుక్కపట్నం చెరువు వద్ద వీరి లగేజీ బ్యాగు, పిల్లల దుస్తులు కనిపించడం, తల్లీకుమారులు అదృశ్యమవడం కలకలం రేపింది. ఎస్ఐ రాజేష్, సిబ్బంది చెరువు వద్దకెళ్లి వస్తువులను పరిశీలించి, ఆరా తీశారు. వారి కోసం గాలింపు చేపట్టారు. ఆత్మహత్య చేసుకుని ఉందేమోనన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేశారు. మంగళవారం చెరువులో తల్లీ కుమారుల మృతదేహాలను గుర్తించారు. ఊరికని బయల్దేరిన కూతురు, మనవళ్లు మృత్యువాత పడ్డారని తెలుసుకున్న రమాదేవి తల్లి గంగమ్మ బోరున విలపించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
బుక్కపట్నంలో కలకలం
బెంగళూరుకు వెళ్లేందుకు ఇంటినుంచి బయల్దేరిన తల్లీ కూతుళ్లు కనిపించడం లేదు. బ్యాగు, పిల్లల దుస్తులు చెరువు వద్ద పడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తల్లీపిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా.. లేక ఇంకేమైనా జరిగిందా.. అనేది తెలియడం లేదు. వారి జాడ కోసం గాలిస్తున్నారు. బుక్కపట్నం: మండల కేంద్రం బుక్కపట్నంలో బైపాస్ సమీపాన ఎస్సీ కాలనీకి చెందిన గంగమ్మ కుమార్తె రమాదేవి (28)కి పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన కృష్ణతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి బబ్లూ (6), జోసియో (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల రమాదేవి పిల్లలతో కలిసి పుట్టినిల్లు అయిన బుక్కపట్నం వచ్చింది. సోమవారం ఉదయం ఏడు గంటలకు బెంగళూరు వెళ్లేందుకుని ఇంటి నుంచి బయల్దేరారు. చెరువు వద్ద కలకలం బుక్కపట్నం చెరువు తూము వద్ద ఒక బ్యాగ్, సెల్ ఫోన్, ఇద్దరు చిన్నారుల దుస్తులను అటువైపు వచ్చిన వారు గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే కొత్తచెరువు ఎస్ఐ రాజేష్, సిబ్బంది చెరువు వద్దకు చేరుకుని దుస్తులు, బ్యాగ్ ఎవరివని ఆరా తీయగా గంగమ్మ తన కుమార్తె రమాదేవి, మనవళ్లవని తెలిపింది. -
చెరువు నిండుగా.. పల్లె పచ్చగా...
సాక్షి, హైదరాబాద్: ఒక్కొక్క వర్షపు చినుకును పోగేసి చెరువులోకి మళ్లిస్తే... నిండిన చెరువు నీళ్లను పంట పొలానికి మళ్లిస్తే...! పల్లె చిగురిస్తుంది. ఊరు ఊరంతా పచ్చబడుతుంది. అప్పుడెప్పుడో ఎగిరిపోయిన పక్షులు తిరిగొస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగభూపాలెం చెరువులో ఇప్పుడదే ప్రయోగం జరుగుతోంది. ప్రతాపరుద్రుని జమానాలో పది గ్రామాలకు తాగునీరు, వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఈ చెరువు కాల గమనంలో విధ్వంసమైంది. ఒకవైపు శిఖం భూమి కబ్జాలు, మరోవైపు పూడికలతో చెరువు ఉనికినే కోల్పోయింది. పశుపక్ష్యాదులకూ నీళ్లు దొరకని దైన్యం వచ్చింది. అడుగంటిన చెరువు మీద బతకలేక జాలర్లు పట్నం బాట పట్టారు. రైతన్నలు వరిసాగు మానేసి పునాస పంట మీద కాలం నెట్టుకొచ్చారు. జవసత్వాలన్నీ ఉడిగి అంపశయ్య మీదున్న చెరువుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మొగ్గలు తొడిగింది. నీటిపారుదల మంత్రి హరీశ్రావు పట్టుదలతో చెరువుకు మళ్లీ జలకళ వచ్చింది. ఎండిన బీడు భూములు పచ్చబడ్డాయి. పక్షులు, ప్రాణులు తిరిగొచ్చాయి. చేప పిల్లలు మళ్లీ జీవం పోసుకొని నీళ్లలో ఎగిరి దుంకుతున్న సింగభూపాలెం చెరువుపై ‘సాక్షి’ప్రత్యేక కథనం... రెవెన్యూ, నీటిపారుదల శాఖ రికార్డుల ప్రకారం జూలూరుపాడు, సుజాతనగర్ మండలాల పరిధిలో ఈ చెరువు విస్త రించి ఉంది. దీని పరిధిలో 2,450 ఎకరాల ఆయకట్టుంది. కానీ తరతరాలుగా చెరువు పూడిపోయి ఉండటంతో 500 ఎకరాలు కూడ పారలేదు. ఈ నేపథ్యంలో నీటిపారుదల మంత్రి హరీశ్రావు చెరువు మరమ్మతుల కోసం మిషన్ కాకతీయ ఫేజ్–1లో రూ.9.26 కోట్లు, 2వ ఫేజ్లో రూ.24 కోట్లు కేటాయించారు. కట్ట బలోపేతం చేసి అలుగులు, తూము పునర్నిర్మించారు. కుడి, ఎడమ కాల్వలను ఆధునీకరిస్తున్నారు. ఎడమ కాల్వ: సుజాతనగర్, సింగభూపాలెం రహదారిలో అంజనాపురం వద్ద మొదలై నర్సింహసాగర్ దాకా పారుతుంది. దీనికింద 11 తూములున్నాయి. 5.1 కిలోమీటర్ల పొడవైన ఈ కాల్వ ఆధునీకరణతో 973 ఎకరాలకు నీరందుతుందని అంచనా. కుడి కాల్వ: సుజాతనగర్, గొల్లగూడెం, సిరిపురం, వేపలగడ్డ, మంగపేట, చుంచు పల్లి, బృందావనం మీదుగా 1.9 కిలో మీటర్లుంది. 1,630 ఎకరాలకు సాగు నీరందిస్తోంది. హరీశ్ సరికొత్త ఆలోచన 1,000 ఎకరాల్లో ఉన్న సింగభూపాలెం చెరువును సీతారామ ప్రాజెక్టుతో అనుసంధానించి నింపే ప్రయత్నం చేస్తున్నారు. కట్ట ఎత్తును 1.5 మీటర్లు పెంచుతున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లోగా నీళ్లందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. 2,450 ఎకరాల ఆయకట్టును 5,000 ఎకరాలకు పెంచుతామని హరీశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తోగువాగు వద్ద చెక్డ్యాం నిర్మించి కాల్వ ద్వారా ఆ నీటిని చెరువులోకి పంపేలా పను లు జరుగుతున్నాయి. సీతారామ ప్రాజెక్టు నీటినీ చెరువుకు అనుసంధానిస్తారు గనుక రెండు పంటలు పండే అవకాశముంది. ఈ ఏడాది 7.2 లక్షల చేప పిల్లలు, 1.8 లక్షల రొయ్య పిల్లలను చెరువులో వేశారు. పునరుద్ధరణకు నోచుకోవడం అదృష్టం గతంలో చెరువును పట్టించుకున్న నాథులే లేరు. కాల్వలు పూడుకుపోయి పొలాలకు నీరందేది కాదు. హరీశ్రావు మరమ్మతులు చేపట్టి చెరువును బాగు చేయిస్తున్నారు. ఇప్పుడు రెండు పంటలు పండించవచ్చు. – కాలంగి పుల్లయ్య, రైతు, సింగభూపాలెం -
వలసలు ఆగినయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ ప్రజోద్యమంగా సాగిందని.. దాని ద్వారా హరిత తెలంగాణ సాధ్యమైందని నీటి పారుదల శాఖమంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకురాగలిగామని, రైతుల ఆదాయాన్ని పెంచగలిగామని చెప్పారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణ చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ‘మిషన్ కాకతీయ’అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 2017 ఏడాదికి సంబంధించి మిషన్ కాకతీయపై ఉత్తమ కథనాలు రాసిన జర్నలిస్టులకు మంత్రి హరీశ్రావు అవార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయపై సానుకూలంగా రాసిన కథనాలకే కాకుండా, తప్పులు ఎత్తి చూపుతూ రాసిన వార్తలనూ పరిగణనలోకి తీసుకుని అవార్డులు ప్రకటించినట్టు చెప్పారు. పారదర్శకంగా మిషన్ కాకతీయ పనులు జరగాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అదనంగా పది లక్షల ఎకరాలకు నీరు.. మిషన్ కాకతీయ ద్వారా కాకతీయుల కాలం నాటి చెరువులకు జల కళ వచ్చిందని, పక్షుల కిలకిలలతో చెరువులు చూడచక్కగా ఉన్నాయని, చెరువుల పునరుజ్జీవం ద్వారా రైతుల ఉత్పాదకత పెరిగిందని, వలసలు తగ్గాయని.. ఇలా ఎన్నో కథనాలు వెలువడటంపై హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ వంటి జిల్లాల నుంచి వలస వెళ్లినవారు తిరిగి వెనక్కి వస్తుండటం మిషన్ కాకతీయ విజయానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘మిషన్ కాకతీయ’ద్వారా మూడేళ్లలో 12 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని, పదిలక్షల ఆయకట్టుకు అదనంగా నీళ్లిచ్చామని చెప్పారు. ఇప్పటివరకు 18 వేల చెరువులను పునరుద్ధరించామని, ఈ ఏడాది ఐదో విడత పనులు చేపడతామన్నారు. కోటి ఎకరాల లక్ష్యంలో భాగస్వాములు కండి నీటి పారుదలశాఖలో కొత్తగా ఎంపికైన 298 మంది ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు ఈ కార్యక్రమంలోనే మంత్రి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. విధుల్లోకి వచ్చిన ఇంజనీర్లలో ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వారు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్ద పనిచేస్తామని కోరడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణ చేయాలన్న సీఎం కేసీఆర్ కల సాకారమయ్యేందుకు అందరం కలిసి పనిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘సాక్షి’ జర్నలిస్టులకు అవార్డులు ‘సాక్షి’పత్రిక, టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా మిషన్ కాకతీయ అవార్డులు అందుకున్నారు. సంగారెడ్డి జిల్లా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్గా ఉన్న కల్వల మల్లికార్జునరెడ్డికి ప్రింట్ మీడియా విభాగంలో, హైదరాబాద్ బ్యూరోలో సీనియర్ రిపోర్టర్గా పనిచేస్తున్న కొత్తకాపు విక్రమ్రెడ్డికి ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో అవార్డు వచ్చింది. పురస్కారం కింద ప్రత్యేక మెమెంటో, రూ.50 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. -
వమ్ముకాని విశ్వాసం
తాను చెరువులో విసిరేసిన ఉంగరాన్నిచేప మింగిందని, ఆ చేపనే తన స్నేహితుడుతనకు కానుకగా ఇచ్చాడని, దాన్నే బిస్మిల్లాహ్ అని చదివి కూతురు కోసి ఉంటుందని, ఇదంతా బిస్మిల్లాహ్పఠించడం వల్లనే జరిగిందని తండ్రికి బోధపడింది. ఏదైనా పని ప్రారంభించే ముందు ‘బిస్మిల్లాహ్’ అని పఠిస్తే మంచిదనే విషయాన్ని ఒక పండితుని దగ్గర నేర్చుకుందో అమ్మాయి. ఆ రోజు నుంచి ‘బిస్మిల్లాహ్ చదవందే ఏ పనీ మొదలెట్టేది కాదు. అయితే, అది ఆ అమ్మాయి తండ్రికి రుచించలేదు. తన కూతురి చేత ‘బిస్మిల్లాహ్’ అనడం, రాయడం మాన్పించాలని ఆ తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకరోజు అత్యంత ఖరీదైన ఒక ఉంగరాన్ని కూతురికిచ్చి దాన్ని భద్రంగా దాచి ఉంచమని చెప్పాడు. అమ్మాయి ‘బిస్మిల్లాహ్’ చదివి ఉంగరాన్ని తన జేబులో వేసుకుంది. రాత్రి అమ్మాయి నిద్రలోకి జారుకున్నాక ఆమె నుంచి ఉంగరాన్ని దొంగిలించి, దానిని ఒక చెరువులో విసిరేసి ఇంటికి వచ్చాడు. ఏమీ ఎరగనట్టుగా ఉంగరం ఏది? అని అడిగాడు. తాను దాచిన తావులో చూస్తే ఉంగరం కనిపించలేదు అమ్మాయికి. ‘సాయంత్రంలోగా తన ఉంగరాన్ని తనకు అప్పజెప్పకపోతే నా చేతిలో నీ చావు ఖాయం’ అని హెచ్చరికలు చేశాడు. తండ్రి బెదిరింపులకు కించిత్తు కూడా ఆందోళన చెందకుండా రోజంతా బిస్మిల్లాహ్ పఠించడంలోనే లీనమైపోయింది ఆ అమ్మాయి. ఇంతలో ఒక స్నేహితుడు ఒక చేపను ఆ అమ్మాయి తండ్రికి కానుకగా అందించాడు. ఆ చేపను పులుసు చేయమని పురమాయించాడు తండ్రి. బిస్మిల్లాహ్ చదివి చేపను కత్తితో కోయగా చేప కడుపులోంచి ఉంగరం బయటపడింది. ఆనందంగా ఆ ఉంగరాన్ని తీసి శుభ్రం చేసి, దాచి పెట్టింది. తండ్రి రాగానే ఆయన చేతికి అందించింది. అది చూసి తండ్రి విస్తుపోయాడు. తాను చెరువులో విసిరేసిన ఉంగరాన్ని చేప మింగిందని, ఆ చేపనే తన స్నేహితుడు తనకు కానుకగా ఇచ్చాడని, దాన్నే బిస్మిల్లాహ్ అని చదివి కూతురు కోసి ఉంటుందని, ఇదంతా బిస్మిల్లాహ్ పఠించడం వల్లనే జరిగిందని తండ్రికి బోధపడింది. కూతుర్ని మార్చే ఆలోచనను విరమించుకుని తానూ బిస్మిల్లాహ్ పఠించడం మొదలెట్టాడు. దైవవిశ్వాసులకు ఎప్పుడూ మేలే కలుగుతుంది. – జుబేదాబేగం