విషాదం: పుట్టింటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుని.. | Mother And Son Deceased After Falling Into Pond In Karnataka | Sakshi
Sakshi News home page

విషాదం: పుట్టింటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుని..

Published Mon, Aug 9 2021 7:10 AM | Last Updated on Mon, Aug 9 2021 7:13 AM

Mother And Son Deceased After Falling Into Pond In Karnataka - Sakshi

తల్లీ కొడుకు (ఫైల్‌)

యశవంతపుర(కర్ణాటక): ప్రమాదశాత్తు చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి చెందిన విషాద ఘటన  దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా నెల్లూరు కేమ్రాజీ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు...  మైల్కా ర్‌ నివాసి సంగీత (30), కుమారుడు అభిమన్య (4) రెండు రోజుల క్రితం  మాపలకజెలోని పుట్టింటికి వచ్చారు. ఉదయం మెల్కార్‌కు వెళ్లాల్సి ఉండగా తల్లి కొడుకు విహారానికి చెరువు వద్దకు వెళ్లారు.

ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారి కాలుజారి చెరువులో పడ్డాడు. కొడుకును రక్షించే క్రమంలో సంగీత కూడా నీటిలో దిగి మునిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పుట్టింటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుందని తల్లిదండ్రులు  కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement