కొనసాగుతున్న గ్రీష్మతాపం | temperature details | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న గ్రీష్మతాపం

Mar 30 2017 11:09 PM | Updated on Sep 5 2017 7:30 AM

జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో గ్రీష్మతాపం కొనసాగుతోంది. ఉక్కపోత, వడగాల్పులతో చిన్నాపెద్ద అందరూ సతమతమవుతున్నారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో గ్రీష్మతాపం కొనసాగుతోంది. ఉక్కపోత, వడగాల్పులతో చిన్నాపెద్ద అందరూ సతమతమవుతున్నారు. పామిడిలో 43.5 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, శింగనమల మండలం తరిమెల 43.3 డిగ్రీలు, యల్లనూరు 42.5 డిగ్రీలు, యాడికి 42.4 డిగ్రీలు, బెళుగుప్ప 42.3 డిగ్రీలు, వజ్రకరూరు 42.3 డిగ్రీలు, చెన్నేకొత్తపల్లి 42.2 డిగ్రీలు, తనకల్లు, రాయదుర్గం 42 డిగ్రీలు, తాడిమర్రి 41.9 డిగ్రీలు, పుట్టపర్తి 40.8 డిగ్రీలు, కదిరి 40.6 డిగ్రీలు, గుత్తి 40.6 డిగ్రీలు, ధర్మవరం, ఉరవకొండ 40.4 డిగ్రీలు, పెనుకొండ 40.3 డిగ్రీలు, గుంతకల్లు 40.2 డిగ్రీలు, కళ్యాణదుర్గం 40 డిగ్రీలు.. ఇలా చాలా మండలాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదు కాగా మిగతా మండలాల్లో 38, 39 డిగ్రీలు కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 52 నుంచి 77, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement