నంబులపూలకుంట : మండలంలోని పెడబల్లికి చెందిన చిన్నరెడ్డమ్మ(15) అనే విద్యార్థిని అదృశ్యమైనట్లు సమాచారం. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతుండగా, చివరి రోజైన గురువారం ఉదయం 9 గంటలకు ఆమె ఇంటి నుంచి బయలుదేరింది. అయితే పరీక్ష కేంద్రానికి రాకపోవడంతో ఉపాధ్యాయులు వెంటనే ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపారు. కాగా విద్యార్థిని అదృశ్యంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రమేశ్బాబు తెలిపారు.