కృష్ణదేవరాయలు విగ్రహానికి క్షీరాభిషేకం
కృష్ణదేవరాయలు విగ్రహానికి క్షీరాభిషేకం
Published Mon, Dec 19 2016 12:44 AM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
అనంతపురం సప్తగిరి సర్కిల్: రెక్టార్ పదవిని రి జర్వేషన్ వర్గాల వారికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీలో ఆదివారం కృష్ణ దేవరాయలు విగ్రహానికి విద్యార్థి సం ఘాల నాయకులు క్షీరాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ రెక్టార్ పోస్టును రిజర్వేషన్వ వర్గాలకు కేటాయించకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నత పదవులను రిజర్వేషన్ వర్గాలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తప్పుడు సమాచారంతో యూజీ, పీజీ, డిస్టెన్సు విభాగాలను అస్తవ్యçస్తంగా మార్చినవారిని నుంచి తొలగించి రిజర్వేషన్ వర్గాలవారితో ఆ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ఎస్యూ నాయకులు క్రాంతికిరణ్, నాగార్జున, రాజు, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, బాబు, నరేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement