కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. విజయదశమి పర్వదినం పురష్కరించుకుని సోమవారం నుంచి బుధవారం వరకు మార్కెట్ బంద్ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు.
నేటి నుంచి మూడు రోజులు మార్కెట్ బంద్
Published Sun, Oct 9 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. విజయదశమి పర్వదినం పురష్కరించుకుని సోమవారం నుంచి బుధవారం వరకు మార్కెట్ బంద్ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు. ఈ మూడు రోజులు రైతులు మార్కెట్కు ఉల్లితో సహా ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురావద్దని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. గురువారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని తెలిపారు.
Advertisement
Advertisement