నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత.. | Workers Attack On Security Officer In Nizamabad Market Yard | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత.. సెక్యూరిటీ అధికారిపై కార్మికుల దాడి

Published Sat, Feb 15 2025 2:53 PM | Last Updated on Sat, Feb 15 2025 3:14 PM

Workers Attack On Security Officer In Nizamabad Market Yard

సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికుల దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి దాడికి పాల్పడ్డ కార్మికులు.. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేశారు. ఆందోళనకు దిగిన కార్మికులు.. మార్కెట్‌ ఛైర్మన్‌ను నిలదీశారు. పసుపు మార్కెట్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.

నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో కార్మికులు సమ్మెకు దిగారు. ర్యాలీగా వచ్చిన కార్మిక సంఘాలు.. చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించాయి. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్మికుల సమ్మెతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి క్రయవిక్రయాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement