officer
-
నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై కార్మికుల దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి దాడికి పాల్పడ్డ కార్మికులు.. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేశారు. ఆందోళనకు దిగిన కార్మికులు.. మార్కెట్ ఛైర్మన్ను నిలదీశారు. పసుపు మార్కెట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో కార్మికులు సమ్మెకు దిగారు. ర్యాలీగా వచ్చిన కార్మిక సంఘాలు.. చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించాయి. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్మికుల సమ్మెతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి క్రయవిక్రయాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి..
ఏలూరు టౌన్: నాణ్యత లేని గోలి సోడాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలతో యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన ఏలూరు ఫుడ్సేఫ్టీ అధికారి, ఆఫీస్ అటెండర్ను ఏలూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏలూరు అభివృద్ధి నిరోధక శాఖ డీఎస్పీ వి.సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కాట్లంపూడి గ్రామానికి చెందిన సాయి సుందర్ గోకుల్ అదే ప్రాంతంలో ఊప్స్ గోలీ సోడా కంపెనీ పేరుతో గోలీ సోడాను తయారు చేస్తున్నాడు. గోలి సోడా తయారీలో అధికంగా రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామనీ ఏలూరు ఫుడ్సేఫ్టీ అధికారి దొండపూడి కావ్యరెడ్డి, కార్యాలయ అటెండర్ పుల్లారావు గోకుల్కు ఫోన్ చేసి చెప్పారు. గోలీ సోడా విక్రయాలు సాఫీగా సాగాలంటే రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఫుడ్సేఫ్టీ అధికారికి రూ.20 వేలు, సహాయకుడికి రూ.2 వేలు ఇచ్చేందుకు గోకుల్ సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో ఫుడ్సేఫ్టీ అధికారులు డబ్బులు కోసం వేధించటంతో గోకుల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో లంచం సొమ్మును ఫుడ్సేఫ్టీ అధికారి డి.వెంకట కావ్య రెడ్డికి, అటెండర్ పులపా పుల్లారావుకు గోకుల్ కార్యాలయంలో అందించాడు. అప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని ఉండటంతో వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి, అటెండర్ పుల్లారావు నుంచి రూ.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్సేఫ్టీ అధికారి వినియోగిస్తున్న కారును తనిఖీ చేయగా లెక్కలు లేకుండా ఆరు కట్టలుగా కట్టి ఉన్న మరో రూ.87 వేల నగదును గుర్తించారు. మొత్తంగా రూ.లక్షా 9 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. అలాగే ఫుడ్సేఫ్టీ అధికారి, అటెండర్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వీ.సుబ్బరాజు, సీఐలు ఎన్.బాలకృష్ణ, కే.శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఏసీబీ అధికారి వాసుకృష్ణ ఉన్నారు. -
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula) కేసులో విద్యార్థుల, ఎన్నారైల పోరాటం ఫలించింది. ఆమె మృతికి కారణమైన అధికారిని విధుల్లోంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మరణం గురించి చులకనగా మాట్లాడిన అధికారిపై సైతం వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో న్యాయం జరిగినట్లైంది!.ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవి కందుల(23).. 2023,జనవరి 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి అతివేగంగా పాట్రోలింగ్ వాహనం నడుపుతూ వచ్చి రోడ్డు దాటుతున్న ఆమెను ఢీ కొట్టాడు. దీంతో.. ఆమె చాలాదూరం ఎగిరిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.అయితే విధి నిర్వహణలో భాగంగానే ఆయన అంత వేగంగా వెళ్లాల్సి వచ్చిందని.. కాబట్టి ఆయనపై ఎలాంటి చర్యలు అవసరం లేదని తొలుత పోలీస్ శాఖ భావించింది. అలాగే ఆమె మరణంపై చులకనగా మాట్లాడిన అధికారి విషయంలోనూ క్షమాగుణం ప్రదర్శించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించాయి. జస్టిస్ ఫర్ జాహ్నవి పేరుతో విద్యార్థులు ఫ్లకార్డులతో రోడ్డెక్కి నిరసనసలు చేపట్టారు. దీంతో సియాటెల్ పోలీస్ శాఖ దిగొచ్చింది. ఉన్నతస్థాయి దర్యాప్తుతో పాటు కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురు చూసింది. చివరకు చర్యలకు ఉపక్రమించింది. ఇదీ చదవండి: జాహ్నవికి మరణానంతర డిగ్రీ‘‘ఘటనలో ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యవహరించి ఉండకపోవచ్చు. డ్రగ్స్ ఓవర్డోస్ అయిన బాధితుడ్ని రక్షించాలని ఆయన తాపత్రయపడ్డారు. ఆ క్రమంలోనే తన వాహనంతో ఢీ కొట్టి ప్రాణం పోయేందుకు కారణం అయ్యారు. అయితే ఆయన తన వాహనాన్ని అత్యంత ప్రమాదకరంగా నడిపారు. సియాటెల్ పోలీస్ విభాగానికి చెడ్డ పేరు తెచ్చారు. డిపార్ట్మెంట్ పాలసీల్లో నాలుగింటిని ఆయన ఉల్లంఘించారు. అందుకే సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డేవ్ను తొలగించాం’’ అని సియాటెల్ తాత్కాలిక పోలీస్ చీఫ్ సూ రెహర్ ప్రకటించారు. ఆమె ప్రకటనను సియాటెల్ టైమ్స్ సోమవారం ప్రచురించింది. అంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మృతి పట్ల అనుచితంగా మాట్లాడిన అధికారి డేనియల్ అడెరెర్ను సైతం గతేడాది సెప్టెంబర్లో విధుల్లోంచి తొలగించారు.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా.. ఆమె ప్రాణం విలువ గురించి మరో అధికారి చులకనగా మాట్లాడారు. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఈ మరణానికి విలువలేదు. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నారైల నుంచి, విద్యార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో దర్యాప్తు అనంతరం అతన్ని విధుల్లోంచి తొలగించింది. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని డేనియల్ అడెరె వివరణ ఇచ్చినప్పటికీ వేటు మాత్రం తప్పలేదు. -
పాక్లో తొలి హిందూ పోలీసు అధికారిగా రాజేందర్ మేఘ్వార్
న్యూఢిల్లీ: మన దాయాది దేశం పాకిస్తాన్లో హిందువులపైన, హిందూ ఆలయాలపైన దశాబ్దాలుగా దాడులు జరుగుతున్న విషయం విదితమే. ఇటువంటి తరుణంలో హిందువులు అక్కడి ప్రభుత్వంలో, ఇతర హోదాల్లో ఉండటం అనేది గగనమే. అయితే పాక్లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అక్కడి పోలీస్ సర్వీసెస్కు రాజేందర్ మేఘ్వార్ అనే హిందువు ఎంపికయ్యారు.దీంతో పాకిస్తాన్లో తొలి హిందూ ఏఎస్పీగా రాజేందర్ మేఘ్వార్ చరిత్ర సృష్టించారు. ఈ నేపధ్యంలో రాజేందర్ మేఘ్వార్ భారత్లోనూ వార్తల్లో నిలిచారు. రాజేందర్ తాను పాక్లో మైనార్టీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ గుల్బర్గ్లోని ఫైసలాబాద్ పోలీస్శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రాజేందర్ నియమితులయ్యారు. సింధ్ ప్రావిన్స్ పరిధిలోని బాడిన్కు చెందిన రాజేందర్ మేఘ్వార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తన చిరకాల కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తేనే సమాజంలో అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలు సులభంగా తెలుస్తాయని, అప్పుడే వాటిని పరిష్కరించగలనని రాజేందర్ మేఘ్వార్ తెలిపారు.ఒక పోలీసు అధికారిగా తన పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజేందర్ పేర్కొన్నారు. రాజేందర్ మేఘ్వార్ రాకతో పాక్లోని మరికొందరు హిందూ యువకులు కూడా పోలీస్ సర్వీసుల్లో చేరే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. కాగా రాజేందర్ మేఘ్వార్తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే మహిళ కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. రహీమ్ యార్ ఖాన్కు చెందిన ఆమె తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరనున్నానని పేర్కొన్నారు. తాను పాకిస్తాన్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది? -
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్పాల్ అరెస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్పాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన కేసులో విజయ్పాల్ను ఈ రోజు కూడా పోలీసులు విచారించారు. రాజకీయ కక్షతోనే విజయ్పాల్ను అరెస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.ఈనెల 13న విజయ్పాల్ మొదటి సారి విచారణకు హాజరయ్యారు. రెండోసారి ఈ రోజు(మంగళవారం) విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. -
కాగ్ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.ఇక ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్మూర్తి అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి వరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగిసింది. దీంతో తదుపరి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ఈనెల 18న నియమించారు.కాగా అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్మూర్తి. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.ఇక 1964 డిసెంబరు 24న జన్మించిన ఆయన.. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. మూర్తి 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్కు ఎంపికయయారు. ఆయన ప్రస్తుతం కేంద్రంలో ఉన్నత విద్యా మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా ఆయన వచ్చే నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. -
ఐఏఎస్ టీనా దాబీ వైరల్ .. అధికార పార్టీ నేతకు వంగి వంగి దండాలు
జైపూర్ : ఒకటి,రెండు,మూడు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఓ జిల్లా ఐఏఎస్ అధికారిణి సదరు అధికార పార్టీ నేతకు వంగి వంగి పెట్టిన దండాలు. ఇప్పుడీ అంశంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారిణి టీనా దాబి గత నెలలో రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. నగరంలో పరిశుభ్రత, స్వచ్ఛత కోసం ‘నవో బార్మర్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నవో బార్మర్ కార్యక్రమానికి రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ పూనియాను ఆహ్వానించారు."दादागिरी करके सफाई करवा रहे हो, बाड़मेर भी इंदौर जैसा हो जाएगा। आप अच्छा काम कर रही हो।"#tinadabi @DrSatishPoonia pic.twitter.com/DDc16wrtcf— Mukesh Mathur (@mukesh1275) October 24, 2024 అయితే కార్యక్రమానికి వచ్చిన సతీష్ పూనియా కాన్వాయ్ నుంచి దిగి వస్తూనే ఫోన్లో బిజీ అయ్యారు. అదే సమయంలో సతీష్ పూనియాను ఆహ్వానించేందుకు వచ్చిన టీనా దాబి ఆయనకు వంగి వంగి దండాలు పెట్టింది. ఏడు సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు నమస్కరించారు. కొద్ది సేపటి తర్వాత టీనా దాబి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇండోర్ మాదిరిగా బార్మర్ కూడా మారుతుందని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సతీష్ పూనియాకు జిల్లా కలెక్టర్ టీనా దాబి వంగి వంగి దండాలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టీనా దాబిరాజస్థాన్కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్గా నిలిచిన ఫీట్ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్లో టాపర్. రెండో ర్యాంకర్ అథర్ అమీర్ ఖాన్. వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. 2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట..2021లో జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది.గతేడాది 2013 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్ బ్యాచ్. గ్లామర్ ఉన్న ఆఫీసర్గా ఇన్స్టాగ్రామ్లోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. టీనా దబీకి సుమారు మిలియన్న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. -
బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు
పట్నా: బీహార్లోని పూర్నియా జిల్లాలో 26 ఏళ్ల క్రితం జరిగిన బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఇద్దరు పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ఒక హత్యను ఎన్కౌంటర్గా చిత్రించిన నాటి పోలీస్స్టేషన్ ఇన్ఛార్జ్కి ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసు దర్యాప్తు సీఐడీకి, అనంతరం సీబీఐకి వెళ్లడంతో ఈ కేసులో చిక్కుముడి వీడింది.ఈ బూటకపు ఎన్కౌంటర్ కేసులో బర్హారా పోలీస్ స్టేషన్ మాజీ ఇన్ఛార్జికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయన ఇటీవలే ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఇదే కేసులో బీహారీగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ సబ్ ఇన్స్పెక్టర్కు ఐదేళ్ల శిక్ష పడింది. ఈ బూటకపు ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీస్ స్టేషన్ చీఫ్కు పట్నాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనితోపాటు రూ.3 లక్షల ఒక వేయి రూపాయల జరిమానా విధించింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అవినాష్ కుమార్ విచారణ అనంతరం పూర్నియా మాజీ పోలీస్ స్టేషన్ చీఫ్ ముఖ్లాల్ పాశ్వాన్ను ఐపీసీ సెక్షన్లు 302, 201, 193, 182 కింద దోషిగా పేర్కొంటూ ఈ శిక్షను విధించారు.జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు అదనంగా మరో ఏడాదిన్నర శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నాడు పోలీస్స్టేషన్ ఇన్ఛార్జ్గా ఉన్న ముఖ్లాల్ పాశ్వాన్ ఇటీవలే పదోన్నతి పొంది డీఎస్పీగా నియమితులయ్యారు. ఇదే కేసులో మరో నిందితుడైన బీహారీగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ ఝాకు ఐపీసీ సెక్షన్ 193 కింద కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు కోర్టు రూ.50,000 జరిమానా విధించింది. జరిమానా మొత్తం చెల్లించని పక్షంలో, ఇతను అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.ఈ కేసు 1998 నాటిదని సీబీఐకి చెందిన ఢిల్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్రేష్ కుమార్ తివారీ తెలిపారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం ఒక నేరస్తుడిని వెదికేందుకు పోలీసులు పూర్నియాలోని బిహారీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలోని జగదీష్ ఝా ఇంటిని చుట్టుముట్టి, సంతోష్ కుమార్ సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంతోష్ కుమార్ సింగ్ మృతిచెందాడు. అయితే ఈ ఘటనను పోలీసులు ఎన్కౌంటర్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీనిపై తొలుత స్థానిక పోలీసు అధికారుల స్థాయిలో విచారణ జరిగింది. అనంతరం దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. అక్కడి నుంచి కేసు సీబీఐకి చేరింది. ఈ కేసులో ఆరోపణలను రుజువు చేసేందుకు సీబీఐ కోర్టు 45 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది.ఇది కూడా చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరం -
మొత్తం చెరువులెన్ని.. ఎన్ని మిగిలాయి?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం పరిధిలో మొత్తంగా ఎన్ని చెరువులు ఉండేవి? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయి? అనే లెక్కలను శాస్త్రీయంగా తేల్చాలని ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’నిర్ణయించింది. దీని కోసం సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకోనుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర అధికారులు మంగళవారం హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లారు.సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే దేబబ్రత పాలిత్తోపాటు ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. సర్వే ఆఫ్ ఇండియా గతంలో రూపొందించిన మ్యాప్లను రంగనాథ్ పరిశీలించారు. 1971–72 నాటి సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? అప్పట్లో వాటి విస్తీర్ణం ఎంత? నాలాలు ఎక్కడెక్కడ, ఎంత విస్తీర్ణంలో ఉండేవి? తదితర విషయాలు పరిశీలించారు. తాజా మ్యాప్లతో వాటిని సరిపోల్చి చూశారు. ఈ అంశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైడ్రా బృందానికి వివరించారు. పూర్తి వివరాలతో నివేదిక రూపకల్పనపై దృష్టి చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్, మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియాలను గుర్తించడానికి, తాజాగా నిర్థారించడానికి ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీలతో కలిసి ముందుకు వెళ్తున్న హైడ్రా.. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి సమాచారం సేకరించింది. ఆ డేటాను సర్వే ఆఫ్ ఇండియా డేటాతో క్రోడీకరించనుంది. మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల పరిస్థితిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని నిర్ణయించింది. సర్వే ఆఫ్ ఇండియా డేటాను డిజిటలైజ్ చేయడంతోపాటు చెరువుల విస్తీర్ణం, నాలాల పొడవు, వెడల్పులను నిర్ధారించి ఈ నివేదికలో పొందుపర్చనుంది. నివేదికకు తుదిరూపు ఇచ్చాక తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ప్రాధాన్యత క్రమంలో చెరువులను గుర్తించి పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. -
ఫ్రెష్వర్క్స్ సాఫ్ట్వేర్ కంపెనీ సీపీవో రాజీనామా
నాస్డాక్-లిస్టెడ్ సాఫ్ట్వేర్ సంస్థ ఫ్రెష్వర్క్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (CPO) ప్రకాష్ శ్రీనివాసగోపాలన్ రామమూర్తి రాజీనామా చేశారు. ఆగస్టు 14నాటి ఎస్ఈసీ ఫైలింగ్ సమాచారం ప్రకారం.. కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెన్నిస్ వుడ్సైడ్కి అక్టోబర్ 1 వరకు రామమూర్తి సహకారంగా ఉంటూ సాఫీగా పరివర్తన జరిగేలా చూస్తారు.మరోవైపు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టైలర్ స్లోట్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా అదనపు పాత్రను పోషిస్తారని ఆగస్టు 6న ఎస్ఈసీ ఫైలింగ్లో సంస్థ ప్రకటించింది. అలాగే ఫిలిప్పా లారెన్స్ను చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్గా కంపెనీ నియమించింది. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా సంస్థలో మేనేజ్మెంట్ స్థాయిలో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయి.సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న గిరీష్ మాతృభూతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయ్యారు. డెన్నిస్ వుడ్సైడ్ సీఈవో అయ్యారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత సీపీవో రాజీనామా వ్యవహారం చోటు చేసుకుంది. ఫ్రెష్వర్క్స్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (CRO) ప్రదీప్ రథినం కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో సంస్థకు రాజీనామా చేశారు. -
జేకేలో ఎన్కౌంటర్.. అమరులైన ఐదుగురు జవాన్లు
జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లా అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదుల ఉనికిపై అందిన ఆధారాల దరిమిలా దోడాలోని ఉత్తర ప్రాంతంలో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సైనికులు సోమవారం రాత్రి 7.45కి దేశా అటవీ ప్రాంతంలో జాయింట్ కార్డన్, సెర్చ్ ఆపరేషన్ చేపట్టినప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ అధికారి, నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారని అధికారులు తెలిపారు. 20 నిమిషాలకు పైగా కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపామని, చివరి నివేదిక వచ్చే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. -
మహిళా డాక్టర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారి వేధింపులు
-
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకూ మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు ఎల్జీకి ఉన్నప్పటికీ, ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. ఆమె ఎంసీడీ సాధారణ సమావేశాలను నిర్వహించడాన్ని కొనసాగిస్తునే ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక, విధానపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. -
గన్ మిస్ఫైర్.. డీఎస్పీ మృతి
సాక్షి,భద్రాద్రికొత్తగూడెంజిల్లా: సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్ఫైర్ అయి డీఎస్పీస్థాయి అధికారి శేషగిరి మృతి చెందినట్లు తెలుస్తోంది. చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామంలోని క్యాంపులో బుధవారం(ఏప్రిల్24) ఈ ఘటన జరిగింది. పూసుగుప్ప సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ క్యాంపులో శేషగిరి విధులు నిర్వహిస్తున్నారు. ఛాతిలోకి బుల్లెట్ దూసుకెవెళ్లడంతో శేషగిరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇది మిస్ఫైరా లేక ఆత్మహత్యనా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు వివరాలు గోప్యంగా ఉంచడంతో ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఐదుగురు పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదుగురు పోలీసు అధికారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శౌర్య పతకాలను ప్రకటించింది. దాంతోపాటు ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలీస్, విపత్తుల స్పందన దళం విభాగాల అధికారులు, సిబ్బందికి 255 వివిధ సేవా పతకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి శౌర్య పతకాలు: కె.వాసు (సీఐ, మేడికొండూరు, గుంటూరు జిల్లా), బి.మధుసూదనరావు (ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె. వెంకట రమణ(రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె.సంపత్ రావు (ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.త్రిమూర్తులు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.భాస్కర రావు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో). పోలీసు శాఖలో: ఉత్తమ సేవా పతకాలు 35మందికి, కఠిన సేవా పతకాలు 30మందికి, సేవా పతకాలు 161మందికి విపత్తుల స్పందన విభాగంలో: ఉత్తమ సేవా పతకాలు నలుగురికి, సేవా పతకాలు 25మందికి. -
10 కోట్ల ఆస్తి.. 4 కేజీల బంగారం.. మైండ్ బ్లాక్ అయ్యేలా జ్యోతి ఆస్తులు
-
తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ..
పుట్టపర్తి: శివారులో ఇటీవల ప్రారంభమైన ఓ హోటల్కు 3 రోజుల క్రితం తమ చిన్నారి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు వెళ్లారు. పలు వంటకాలు ఆర్డర్ చేసి తిన్నారు. రుచికరంగా లేవని హోటల్ నిర్వాహకులకు చెబితే.. మాట్లాడే సమయం లేదు, బిల్లు కట్టి వెళ్లాలంటూ దబాయించారు. తీరా ఇంటికెళ్లిన తర్వాత అందరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. హిందూపురం: బస్టాండు పక్కనే ఉన్న హోటల్లో నాలుగు రోజుల క్రితం ఇద్దరు స్నేహితులు భోజనం చేశారు. అన్నం సరిగా ఉడకలేదని అక్కడికి సిబ్బందికి చెబితే... ఇప్పుడే చేశాం, అలాగే ఉంటుందని సమాధానమిచ్చారు. దీంతో చేసేదిలేక స్నేహితులు తిన్నారు. ఇంటికెళ్లాక విరేచనాలు ప్రారంభమయ్యాయి. సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికెళ్లి వైద్య చికిత్సలు పొందాక కాస్త ఉపశమనం లభించింది. సాక్షి, పుట్టపర్తి: చూడచక్కనైన బోర్డులు పెట్టి ఆకర్షిస్తారు. పసందైన వంటకాల మెనూతో నోరూరిస్తారు. లోపలికి వెళ్లగానే ఘుమఘుమలాడే వాసనలతో మైమరిపింపచేస్తారు. అన్నీ ఫ్రెష్వే అంటూ వడ్డించేస్తారు. కానీ, తిన్నాకే తెలుస్తుంది. మన కళ్లు మనల్ని ఎంతలా మోసం చేశాయో!. ఆస్పత్రికెళ్లి వైద్య చికిత్సలు పొందాకే అర్థం అవుతుంది.. ఆ హోటల్కి వెళ్లి ఎంతపెద్ద తప్పు చేశామో!. కల్తీతో కల్లోలం.. జిల్లా వ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కల్తీ ఆహారం వీరవిహారం చేస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. రుచికరంగా ఉండేందుకు ఏవి పడితే అవి కలిపేయడం తిన్న వారి ప్రాణాలమీదికొస్తోంది. మరోవైపు నిల్వ ఉంచి వడ్డిస్తున్న వంటకాల ప్రభావం తక్షణమే కనిపిస్తోంది. ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రులబాట పడుతున్న బాధితుల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ.. మారిన జీవనశైలిలో భాగంగా చాలామంది హోటళ్లలో తినడానికి అలవాటుపడ్డారు. దీంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు ఉదయంపూట ఒకేసారి వందల మందికి సరిపడా వంటకాలు తయారు చేసి ఉంచుతున్నారు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్ల ఆధారంగా అప్పటికప్పుడు మరోసారి వేడి చేసి ఇస్తున్నారు. అమ్ముడు పోకుండా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో ఉంచి మరుసటి రోజు అంటగడుతున్నారు. చుక్కలు చూపుతున్నారు. ప్రశ్నిస్తే దౌర్జన్యం.. చాలా హోటళ్లలో ఆహారం తిన్నాక బిల్లులు ఇవ్వడం లేదు. తెల్ల కాగితాలపై రాసి పంపిస్తున్నారు. మరుసటి రోజు కస్టమర్లు గొడవకు దిగినా.. మా హోటల్లో తినలేదంటూ దబాయిస్తున్నారు. తినే సమయంలోనూ ఆహారం బాగుండటం లేదని ప్రశ్నించినా హోటల్ నిర్వాహకులు తిరగబడు తున్నారు. బిల్లు ఇచ్చేది లేదు.. డబ్బు కట్టి వెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారు. తూతూమంత్రపు చర్యలతో సరి..! కల్తీ హోటళ్లపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. తూతూమంత్రపు తనిఖీలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సరిపెడుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా విఫలమవుతున్నారు. దీంతో చాలామంది ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలీక మిన్నకుండిపోతున్నారు. ఇదే అదనుగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు ఫిర్యాదు చేసుకోవాలంటూ రుబాబు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రతి నెలా మాకు విధించిన లక్ష్యం మేరకు తనిఖీలు చేస్తున్నాం. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. ఆయా ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేసి ళ్లు తీసుకుని ల్యాబ్కు పంపిస్తున్నాం. రిపోర్టులు వచ్చిన తర్వాత చర్యలకు ఆదేశిస్తున్నాం. కల్తీ ఆహారం, నిల్వ ఉంచిన ఆహారం వడ్డించే హోటళ్లపై ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – రామచంద్ర, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి -
సోరెన్ కోసం ఈడీ వెదుకులాట
న్యూఢిల్లీ/రాంచీ: భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇంట్లో లేరని, ఎక్కడున్నారో జాడ తెలియడం లేదని, సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని అధికారులు చెప్పారు. జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన సోరెన్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని నివాసంలో అందుబాటులో ఉంటానని ఆయన నుంచి మెయిల్ అందినట్లు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి దాకా ఢిల్లీ నివాసంలోనే పడిగాపులు కాశారు. సోరెన్ ఆచూకీ దొరికే దాకా అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన గురించి ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ అభివర్ణించారు. -
వాయుసేనలో శిక్షణాధికారిగా రైతు బిడ్డ
చోడవరం: రైతు బిడ్డ భారతదేశ యుద్ధ విమానాల్లో శిక్షణ ఇచ్చే అధికారిగా ఎదిగారు. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుమారుణ్ణి భారత సైన్యంలో చేర్పించగా.. తండ్రి కష్టానికి, ఆశయానికి అనుగుణంగా ఆ కుమారుడు 21 ఏళ్లప్రాయంలోనే ఉన్నత స్థానాన్ని అందిపుచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన సాధారణ రైతు మజ్జి గౌరీశంకర్, లక్ష్మి దంపతులకు వెంకటసాయి, దుర్గాప్రసాద్ ఇద్దరు కుమారులు. చిన్నతనం నుంచి ఇద్దరూ చదువులో ముందంజలో నిలిచారు. పెద్ద కుమారుడు ప్రాథమిక విద్య చోడవరంలో చదివి, 6వ తరగతిలో విజయనగరం సైనిక్ స్కూల్లో చేరారు. అక్కడ ఇంటర్మిడియెట్ చదువుతూ భారతదేశ సైనిక విభాగంలో చేరేందుకు శిక్షణ కూడా పొందారు. దేశ రక్షణ విభాగంలో అత్యంత కీలకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షల్లో 2019లో ఉత్తమ స్థానం సాధించి ఎన్డీఏలో చేరారు. మూడేళ్లపాటు పుణెలో, ఏడాదిపాటు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్పోర్టులో యుద్ధ విమానాల్లో శిక్షణ పొందారు. ఎన్డీఏతోపాటు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బీటెక్ ఇంజినీరింగ్ (ఈసీఈ) కూడా పూర్తిచేశారు. శిక్షణ అనంతరం దేశ రక్షణ విభాగంలో కీలకమైన ఇండియన్ ఎయిర్ఫోర్స్ యుద్ధ శిక్షణలో ఫ్లయింగ్ ఆఫీసర్గా భారత రక్షణ శాఖ నియమించింది. మజ్జి వెంకటసాయిని అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్శెట్టి మంగళవారం అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులకు వెంకటసాయి మంచి స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. దేశానికి సైన్యాన్ని అందిస్తున్న బెన్నవోలు మారుమూల గ్రామంగా పెద్దేరు నది ఒడ్డున ఉన్న బెన్నవోలు గ్రామం దేశానికి ఎందరో సైనికులను అందించింది. ఆరు దశాబ్దాలుగా గ్రామానికి చెందిన అనేక మంది యువకులు త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలందించారు. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామమైనప్పటికీ దేశ రక్షణకు ఈ గ్రామం చేస్తున్న సేవ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నా మొదటి ఆశయం ఇదే చిన్నప్పటి నుంచీ ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలట్గా చేరాలని అనుకునేవాణ్ణి. మా అమ్మ, నాన్న కష్టపడి పనిచేస్తూ నా చదువుకు కావలసినవన్నీ సమకూర్చారు. వారి సహకారంతో నా జీవితాశయాన్ని సాధించగలిగాను. దేశానికి సేవ చేయాలన్న నా ఆశయానికి ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టు మరింత దోహదపడుతుంది. – మజ్జి వెంకటసాయి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి
ఢిల్లీ: ఉగ్రదాడిలో గాయపడి ఎనిమిదేళ్లుగా కోమాలో ఉన్న ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ కరణ్బీర్ సింగ్ నట్ ప్రాణాలు కోల్పోయారు. టెరిటోరియల్ ఆర్మీ విభాగానికి చెందిన కరణ్బీర్ సింగ్ 2015లో చేపట్టిన ఆపరేషన్లో ఉగ్రవాద కాల్పుల్లో గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన కోమాలో ఉన్నారు. టెరిటోరియల్ విభాగాని కంటే ముందు ఆయన 160 ఇన్ఫెంట్రీ విభాగానికి సెకండ్ ఇన్ కమాండ్గా పనిచేశారు. అంతకుముందు ఆయన పద్నాలుగేళ్లు సైన్యంలో పనిచేశారు. Army Officer, Who Was In Coma For 8 Years After Gunshot Injuries, Dies https://t.co/9AaAfXz7Vy — NDTV (@ndtv) December 26, 2023 2015 నవంబర్ 17న 41 రాష్ట్రీయ రైఫిల్స్ కుప్వారాలోని కలరూస్ ప్రాంతంలో టెర్రర్ ఆపరేషన్ను చేపట్టింది. దీనికి నాయకత్వం వహించిన కల్నల్ సంతోష్ మహదిక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కరణ్బీర్ సింగ్ తలకు తూటా గాయం అయింది. అనంతరం ఆయన్ని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఇన్నేళ్ల చికిత్స తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
సియాచిన్లో ‘నారీ పర్వం’
లేహ్/జమ్మూ: ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్లో ప్రప్రథమ మహిళా వైద్యాధికారిగా కెప్టెన్ ఫాతిమా వసీమ్ రికార్డు సృష్టించనున్నారు. మొదటిసారిగా ఆపరేషనల్ పోస్టులో భారత ఆర్మీ ఈమెను నియమించింది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లోని సియాచిన్లో బాధ్యతలు చేపట్టనున్న రెండో వైద్యాధికారి ఫాతిమా అని భారత ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యురీ కార్ప్స్ మంగళవారం తెలిపింది. సైన్యంలో లింగసమానత్వం పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో కెప్టెన్ ఫాతిమా నియామకం ఒకటని తెలిపింది. సియాచిన్ బ్యాటిల్ స్కూల్లో కఠోర శిక్షణ పొందిన ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ పోస్టులో బాధ్యతలు చేపడతారని వివరించింది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఈమె బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కెప్టెన్ గీతికా కౌల్ను సియాచిన్లో మొదటి మహిళా వైద్యాధికారిగా నియమించినట్లు ఈ నెల మొదటి వారంలో ఆర్మీ ప్రకటించింది. -
TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో..
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ సెటిల్మెంట్లు, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్డ్ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం పబ్లిసిటీ సెల్లో దొంగ ప్రోటోకాల్ ఆఫీసర్గా అవతారం ఎత్తిన ప్రవీణ్ సాయి.. పలువురికీ సీఎం ప్రోటో కాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించాడు. హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు తెర తీశాడు. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న అత్తిలి ప్రవీణ్ సాయి.. 6 నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురికి శఠగోపం పెట్టాడు. అతని అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు.. ఇన్నోవా కార్, సెల్ ఫోన్ను సీజ్ చేశారు. ఇదీ చదవండి: ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్లో తీసుకువచ్చింది. విప్రో వెబ్సైట్లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
ఈడీకి స్టాలిన్ సర్కారు షాక్..!
చెన్నై: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. దిండిగల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ డాక్టర్ నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకున్నందుకు మధురై జోన్ ఈడీ అధికారి అంకిత్ తివారీని తమిళనాడు విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ అధికారి అరెస్టు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. డీఎంకే, బీజేపీ పరస్పర మాటల దాడికి దిగాయి. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదని ఎక్స్టార్షన్ డిపార్ట్మెంట్ అని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఈడీని బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఫైరయ్యారు. ఈడీపై ఎంపీ దయానిధి మారన్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఒక్క అధికారి తప్పు చేస్తే మొత్తం ఏజెన్సీనే తప్పు పట్టడం సరికాదని పేర్కొంది. ఈడీ అధికారి అమాయకుడైతే విజిలెన్స్ పోలీసులు వచ్చినప్పుడు ఎందుకు పారిపోయాడని స్టేట్ కాంగ్రెస్ చీఫ్ కె.ఎస్ అళగిరి ప్రశ్నించారు. The Directorate of Vigilance & Anti-Corruption police , Tamil Nadu have arrested an ED Officer for demanding and accepting a bribe of ₹20 Lakh in Dindigul. This shatters the faith citizens have in public institutions, making one wonder if ED stands for Extortion Department or… — Dayanidhi Maran தயாநிதி மாறன் (@Dayanidhi_Maran) December 2, 2023 ఇదీచదవండి..ఎంపీ మహువా లోక్సభ సభ్యత్వం రద్దుకు కేంద్రం చర్యలు! -
ఎస్కార్ట్ లేకుండానే ఈవీఎంల తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు
నాగారం: నాగారం మండలం పేరబోయినగూడెంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఎస్కార్ట్ లేకుండా ఈవీఎంలను తరలిస్తుండటంతో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.పేరబోయినగూడెం గ్రామంలో సాయంత్రం 5:10గంటలకు పోలింగ్ ముగిసింది. అధికారులు ఎస్కార్ట్ లేకుండానే ఈవీఎం బాక్సులను మినీ బస్సులో ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న నరసింహులగూడెం వరకు తరలించారు. అదే మాదిరిగా నరసింహులగూడెంలో ఉన్న ఈవీఎంను కూడా మినీ బస్సులో తరలించేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో సెక్టోరియల్ అధికారి అదనపు ఈవీఎంలను తన కారులో వేసుకుని నర్సింహులగూడేనికి చేరుకున్నాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు కారులో ఉన్న ఖాళీ ఈవీఎంలను గమనించి ఎక్కడివి అని ప్రశ్నించారు. ఈ క్రమంలో సెక్టోరియల్ అధికారి అదనపు ఖాళీ ఈవీఎంలు అని చెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఎస్కార్ట్ లేకుండా ఈవీఎం బాక్సులను తరలించవద్దని ఆందోళనకు దిగారు. కారులో ఉన్న ఖాళీ ఈవీఎంలు పోలింగ్ అయిన ఈవీఎంల స్థానంలో మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సెక్టోరియల్ అధికారి వెంట అదనపు ఏవీఎంలు ఉంటాయని గ్రామస్తులకు వివరించే ప్రయత్నిం చేశారు. అయినా ఆందోళన విరమించకుండా బాక్సులు తారుమారు చేసే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అక్కడి నుంచి ఎస్కార్ట్ వాహనం ఇచ్చి ఈవీఎంలను తరలించారు. గ్రామస్తులు అనుమానంతో ఈవీఎంలు తరలిస్తున్న వాహనాన్ని భద్రపరిచే స్థలం తుంగతుర్తి వరకు వెంబడించారు. సెక్టోరియల్ అధికారి కారు అద్దాలు ధ్వంసం తుంగతుర్తి గోదాం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు అధికసంఖ్యలో గుమిగూడి ఈవీఎంలు తరలిస్తున్న సెక్టోరియల్ అధికారి కారును అడ్డగించారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేశారు. తమ ఎదుట ఖాళీ ఈవీఎంలను ఓపెన్ చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అదుపుచేసి ఈవీఎంలను గోదాముకు తరలించారు. ఈ విషయంపై తమకు వివరణ ఇవ్వాలని కార్యకర్తలు ఆర్వో వెంకట్రెడ్డి, డీఎస్పీ రవిలను కోరారు. దీంతో వారు కాంగ్రెస్ నాయకులకు, ఏజెంట్ల ఎదుట ఖాళీ ఈవీఎంలను తెరిచి వారి అనుమానాన్ని నివృత్తి చేశారు. -
నకిలీ ఐటీ అధికారి అరెస్ట్
కొరుక్కుపేట: ఐటీ అధికారిగా నమ్మించి రూ.లక్ష దోపిడీ చేసిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా హొసూరు, పొదుగైనగర్కు చెందిన బాలాజి భార్య శ్రుతిలయ (29). గ్రాడ్యుయేట్ అయిన ఈమె రైల్వేస్టేషన్ ఎదురుగా ఆమె పేరుతో ఆడిటింగ్ కార్యాలయాన్ని నడపుతున్నారు. ఈక్రమంలో ఓ యువతి బుధవారం రాత్రి ఐటీ అధికారిగా దుస్తులు ధరించి అసోసియేట్స్ కార్యాలయానికి వచ్చింది. ఐటీ కార్యాలయం నుంచి వస్తున్నట్టు శ్రుతిలయకు చెప్పింది. రూ.లక్ష ఇవ్వాలని బెదిరించింది. దీంతో శ్రుతిలయ భయపడి, ఆఫీసులో ఉన్న డబ్బు తీసుకుని మహిళకు ఇచ్చింది. అయితే ఆమె తీరుపై అనుమానం వచ్చిన శ్రుతిలయ ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో హొసూర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే వచ్చిన పోలీసులు రంగంలోకి దిగి యువతిని విచారించారు. డిపార్టుమెంట్ కార్యాలయం నుంచి వస్తున్నానని చెప్పిన మహిళ హొసూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ–సేవా కేంద్రం నిర్వహిస్తున్న దీప (33)అని, ఐటీ అధికారిగా నటిస్తునట్టు తేలింది. పోలీసులు దీపను అరెస్ట్ చేశారు. -
వేటాడే సత్యభామ
‘సత్యా.. ఈ కేసు నీ చేతుల్లో లేదు (ప్రకాశ్రాజ్).. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ (కాజల్ అగర్వాల్)’ అనే డైలాగ్స్తో మొదలవుతుంది ‘సత్యభామ’ టీజర్. పోలీసాఫీసర్ సత్యభామ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ఇది. ప్రకాశ్రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ప్లే అందించారు. శుక్రవారం ‘సత్యభామ’ టీజర్ను రిలీజ్ చేశారు. ‘సార్.. ఆ గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంది. వేటాడాలి (కాజల్ అగర్వాల్)’, ‘ఆ అమ్మాయి చావుకు మీరే కారణం అంటున్నారు. ఈ కేసును మీరు వదిలేసినట్లేనా? (విలేకర్లు).. నెవర్ (కాజల్)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
ఆ కక్షతోనే మహిళా అధికారిని డ్రైవర్ హత్య చేశాడా..?
బెంగళూరు: కర్ణాటకా అధికారి కేఎస్ ప్రతిమ(43) హత్య కేసులో అమె వద్ద డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పనిలో నుంచి తీసేసిన కక్షతోనే నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు నేరాన్ని కూడా అంగీకరించినట్లు సమాచారం. నిందితుడు కిరణ్ గత ఐదేళ్లుగా గవర్నమెంట్ కాంటాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారి ప్రతిమ గత పది రోజుల క్రిందటే కిరణ్ను విధుల నుంచి తప్పించారని వెల్లడించారు. అతని స్థానంలో మరో ఉద్యోగిని నియమించుకున్నట్లు తెలిపిన పోలీసులు.. ఈ కక్షతోనే నిందితుడు ప్రతిమను హత్య చేశారని అనుమానిస్తున్నారు. హత్య అనంతరం బెంగళూరు నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్కు పారిపోయినట్లు గుర్తించారు. కర్ణాటకాలో గనులు, భూవిజ్ఞాన శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా సేవలు అందిస్తున్న కేఎస్ ప్రతిమ(43) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణ హత్య జరిగింది. శనివారం రాత్రి ఎనిమిది గంటలకు కార్యాలయం నుంచి ఇంటికి ప్రతిమను కారులో డ్రైవరు డ్రాప్ చేసి వెళ్లాడు. కాసేపటికే ప్రతిమపై దాడి చేసిన కొందరు వ్యక్తులు.. ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఇదీ చదవండి: కర్ణాటకలో కలకలం.. మహిళా అధికారి దారుణ హత్య -
ఐఏఎస్ వదిలి సీఎం అయ్యిందెవరు? ఎంపీలో ఏం జరుగుతోంది?
మధ్యప్రదేశ్లో ఎన్నికలకు ముందు బ్యూరోక్రాట్లు(పరిపాలనా విభాగంలోని ఉన్నతాధికారులు) రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి రాజీవ్ శర్మ రాజీనామా ఆమోదం పొందింది. రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు చెందిన నిషా బాంగ్రే రాజీనామా ఆమోదం పెండింగ్లో ఉంది. అయితే తాను ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రానని రాజీవ్ చెప్పగా, నిషా మాత్రం రాజకీయ రంగంలోకి దూకేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఐఏఎస్ సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన కొందరు అధికారులు రెండు నెలల క్రితమే బీజేపీలో చేరగా, మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు క్యూలో ఉన్నారు. కాగా ఒక ఉన్నతాధికారి రాజకీయాల్లో విజయవంతమయ్యారనే దానికి ఉదాహరణ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అజిత్ జోగి. ఈయన ఐఏఎస్ సర్వీస్ వదిలి కాంగ్రెస్లో చేరారు. తరువాతి కాలంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యప్రదేశ్కు చెందిన పలువురు ఉన్నతాధికారులు తమ పదవులను వదిలి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అజాతశత్రు: ఐఏఎస్ సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు. అజితా వాజ్పేయి పాండే: ఐఏఎస్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్లో చేరారు. జీఎస్ దామోర్: నీటి వనరులశాఖలో ఇంజనీర్ అయిన ఈయన బీజేపీ నుంచి పోటీ చేసి, రత్లాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హీరాలాల్ త్రివేది: ఐఏఎస్ సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక ‘స్పాక్స్’ పార్టీని స్థాపించారు. రుస్తమ్ సింగ్: ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి పదవీ విరమణ చేశాక బీజేపీలోకి వచ్చారు. మంత్రిగా కూడా అయ్యారు. ఎస్ ఎస్ ఉప్పల్ : ఐఏఎస్ నుంచి రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు. వరదమూర్తి మిశ్రా: ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి, ప్రత్యేక పార్టీని స్థాపించారు. వీణా ఘనేకర్: ఐఏఎస్ నుండి పదవీ విరమణ తర్వాత స్పాక్స్లో చేరారు. వీకే బాతం: ఐఏఎస్ నుండి పదవీ విరమణ చేశాక కాంగ్రెస్లో చేరారు. ఉన్నతాధికారులు రాజకీయాల్లో ప్రవేశించడం వెనుక ఒక కారణమందని విశ్లేషకులు అంటున్నారు. వీరు ఎమ్మెల్యేలను, మంత్రులను దగ్గరి నుంచి చూడటం వలన వారి హోదాకు ప్రభావితమవుతుంటారు. దీంతో రాజకీయాల్లో తాము కూడా రాణించగలమన్న భావన వారిలో కలుగుతుంది. ఈ నేపధ్యంలోనే వారు రాజకీయ నాయకులు, పార్టీలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని, రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది కూడా చదవండి: నాటి రాజీవ్ సభ చారిత్రకం.. సీటు మాత్రం బీజేపీ పరం! -
గాంధీ హత్యకు బ్రిటీష్ అధికారి కుట్ర? ఒక వంటవాడు ఎలా భగ్నం చేశాడు?
అది 1917.. బీహార్లోని బెట్టియా జిల్లా గౌనాహాలోని పర్సౌని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మహాత్మా గాంధీ ప్రాణాలను కాపాడాడు. ఈ విషయం చరిత్ర తెలిసిన చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహాత్ముని ప్రాణాలను కాపాడిన ఆ దేశభక్తుని పేరు బత్తక్ మియా. ఆయన బ్రిటీష్ వారి కుట్రను భగ్నం చేసి, జాతిపిత ప్రాణాలను కాపాడారు. నేడు ఆ దేశభక్తుని మూడవతరం వారు కటికపేదరికంలో జీవించవలసి వస్తున్నది. వారి కుటుంబం మరో రాష్ట్రానికి వెళ్లి కూలీ పనులు చేసుకునే దీనపరిస్థితి నెలకొంది. కాగా గాంధీజీ ప్రాణాలను కాపాడినందుకు గాను అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్.. బత్తక్ మియా పేరిట అందించిన రివార్డు కూడా వీరి కుటుంబానికి పూర్తిస్థాయిలో అందలేదు. 1917లో మోతీహరిలో ఉంటున్న బ్రిటిష్ ఇండిగో ఫ్యాక్టరీ మేనేజర్ ఇర్విన్.. మహాత్మా గాంధీ హత్యకు కుట్ర పన్నాడు. గాంధీజీని భోజనానికి ఆహ్వానించి, ఆయనకు అందించే పాలలో విషం కలపాలని ఇర్విన్ ప్లాన్ చేశాడు. ఆ సమయంలో బత్తక్ మియా.. ఇర్విన్ దగ్గర వంటవానిగా పనిచేసేవాడు. బత్తక్ మియా మనుమడు కలాం అన్సారీ తెలిపిన వివరాల ప్రకారం అతను తన తాతను చూడలేకపోయినప్పటికీ, అతని తండ్రి జాన్ అన్సారీ తెలిపిన వివరాలను గుర్తుచేసుకున్నాడు. గాంధీజీ 1917లో చంపారన్కు వచ్చినప్పుడు, ఒక బ్రిటిష్ అధికారి.. గాంధీజీకి పాలలో విషం ఇవ్వాలని బత్తక్ మియాను ఆదేశించాడు. అయితే ఆ అధికారి బెదిరింపులకు బత్తక్ మియా లొంగలేదు. అయినా ఆ అధికారి పట్టువీడక బత్తక్ మియాను విషం కలిపిన పాలతో గాంధీ వద్దకు పంపించాడు. బత్తక్ మియా.. మహాత్మాగాంధీకి పాలు ఇస్తూ.. అందులో విషం ఉందని చెప్పడంతో గాంధీజీ వాటిని తాగకుండా పారేశారు. ఆ తర్వాత ఒక పిల్లి ఆ పాలు తాగి చనిపోయింది.ఈ సంఘటనకు నాటి స్వాతంత్ర్య సమరయోధుడు రాజేంద్ర ప్రసాద్తో పాటు మరికొందరు సాక్షులగా నిలిచారు. ఈ సంఘటన తర్వాత బత్తక్ మియాను ఆ బ్రిటీష్ అధికారి జైలుకు పంపించాడు. దీనితోపాలు అతనికి చెందిన 5 గేదెలతో పాటు పలు భూములను వేలం వేసి విక్రయించాడు. దీంతో బత్తక్ మియా ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. 1950లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మోతీహరి వచ్చినప్పుడు బత్తక్ మియాకు 24 ఎకరాల భూమి అందిస్తామని ప్రకటించారు. అయితే ఇలా అతనికి కేటాయించిన భూమిని తదనంతర కాలంలో అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం బత్తక్ మియా వారసులు అత్యంత దీనస్థినతిలో బతుకువెళ్లదీస్తున్నారు. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
ఏఐ సాయంతో అశ్లీల వీడియోలు.. పోలీసు అధికారి కుమారులు అరెస్ట్!
మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ)ని వినియోగించిన తీరుచూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఈ ప్రాంతానికి చెందిన పోలీసు అధికారి కుమారులిద్దరు ఏఐ వినియోగించి, పలువురు యువతులు, మహిళల అశ్లీల వీడియోలను రూపొందించి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. యువతులు దీనిని వ్యతిరేకించడంతో వారిపై ఈ ఇద్దరు యువకులు దాడికి దిగారు. ఈ ఘటన అనంతరం ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పాల్ఘర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులిద్దరి వయసు 20 ఏళ్లు ఉంటుందని, వారి తండ్రి ముంబైలో పోలీసు అధికారి అని గుర్తించామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులిద్దరూ యువతుల, మహిళల ఫొటోలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వినియోగించి అశ్లీల వీడియోలు తయారు చేస్తున్నారు. వీరి బారినపడిన ఇద్దరు బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమొదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అది రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట! -
‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను
తమన్నా నటించిన తాజా వెబ్సిరీస్ ‘ఆఖరి సచ్’. 2018లో ఢిల్లీలో బూరారిప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండుమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలతో ‘ఆఖరి సచ్’ రూపొందింది. తమన్నా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, రాహుల్ బగ్గా లీడ్ రోల్స్లో రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఇందులో అన్య అనే ఇన్వేస్టిగేటివ్ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. ‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సిరీస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా కెరీర్లో తొలిసారిగా ఓ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. అలాగే నా కంఫర్ట్జోన్ దాటి చాలా ఎమోషన్స్తో కూడు కున్న అన్య పాత్రలో నటించాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
ఏంటి..? నిజాయితీగా పని చేస్తే ఇలా చేస్తారా..!?
కుమరం భీం: నిజాయతీగా పని చేసిన అధికారులకు వేధింపులు తప్పడం లేదు. కుమురంభీం జిల్లా రవాణా శాఖ అధికారిపై అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. జిల్లాలో ఇసుక, కంకర తదితర రవాణా చేసే టిప్పర్లు నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడ్తో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్నగర్, కౌటాల తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనిపై ‘సాక్షి’ గత నెల 24న ‘కిల్లింగ్.. ఓవర్ లోడ్’ శీర్షికన ఓ కథనం ప్రచురించింది. స్పందించిన జిల్లా రవాణా శాఖ అధికారి జి.లక్ష్మీ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదే రోజున ఐదు టిప్పర్లు అధిక లోడ్తో వెళ్తున్న వాటిని గుర్తించి సీజ్ చేశారు. వాటిని విడిచిపెట్టాలంటూ ఓ ప్రజాప్రతినిధి ఫోన్ చేసి అడిగారు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో తాము చెప్పినా వినిపించుకోకుండా, ఫైన్ వేస్తారా? అనే కోపంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, రవాణాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఆ ఫిర్యాదు ప్రభుత్వ పరి శీలనలో ఉంది. దీంతో ఆమెను ఇక్కడి నుంచి బదిలీ వేటు వేస్తారా? అని అధికారుల్లో చర్చ నడుస్తోంది. అయితే తన విధులు తాను నిర్వర్తించానని, ఇందులో రాజకీయం జోక్యం చేసుకున్నా తనకేం ఇబ్బంది లేదని, ఎక్కడైనా పని చేస్తామనే ధీమాతో ఉన్నట్లు తెలిసింది. -
తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం
ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి చెందిన వాసం శెట్టి రవితేజ పోలీసు విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ, అందరి మన్ననలు అందుకుంటున్నారు. గుజరాత్లోని జునాగఢ్లో ఎస్పీగా పనిచేసిన రవితేజ ఇటీవలే గాంధీనగర్కు బదిలీ అయ్యారు. పోలీసు అధికారి రవితేజకు జునాగఢ్ వాసులు ఎంతో భిన్నంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమం పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి ప్రారంభమైంది. ముందుగా పూలతో అలంకరించిన కారులో అధికారి రవితేజను కూర్చోబెట్టారు. పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి పోలీసు కాన్వాయ్ జునాగఢ్ వీధుల గుండా ముందుకు సాగింది. ఈ సమయంలో జునాగఢ్ ప్రజలు పోలీసు సూపరింటెండెంట్కు రహదారి మార్గంలో అపూర్వరీతిలో వీడ్కోలు పలికారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రవితేజ జునాగఢ్ ఎస్పీగా మూడేళ్లు సేవలు అందించారు. 2019లో జునాగఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. తాజాగా జునాగఢ్ నుంచి గుజరాత్లోని గాంధీనగర్ ఎస్పీగా బదిలీ అయ్యారు. గాంధీనగర్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఆయనపై స్థానికులు పూలవర్షం కురిపిస్తూ, అపూర్వ స్వాగతం పలికారు. రవితేజ పోలీసు విభాగంలో అందించిన సేవలకు గుర్తుగా అప్పటి డిప్యూటీ సీఎం నవీన్ పటేల్ చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి గుజరాత్లో ఇంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించడంపై కోనసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్ మరో వింత వ్యాఖ్యానం! -
వైట్హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం!
భారతీయ- అమెరికన్ ఆరోన్ 'రోనీ' ఛటర్జీ తాజాగా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ)లో వైట్ హౌస్ కోఆర్డినేటర్ పదవి నుండి వైదొలగారు. డ్యూక్ యూనివర్శిటీలో బిజినెస్ ప్రొఫెసర్గా తిరిగి తన పదవిలోకి వెళ్లనున్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలో చిప్స్, సైన్స్ చట్టానికి చెందిన $50 బిలియన్ల పెట్టుబడిని సెమీకండక్టర్స్ పరిశ్రమలో అమలు చేయడం కోసం గత ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో ఛటర్జీ ఈ పదవిలో నియమితులయ్యారు. “బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో రెండేళ్లు పనిచేసిన తర్వాత తిరిగి డ్యూక్ యూనివర్శిటీకి వెళ్లాలని భావిస్తున్నాను. వైట్హౌస్లోని నా సహోద్యోగులందరికీ, ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ కీలకమైన ఆర్థిక, జాతీయ భద్రతా సమస్యలపై పనిచేసినందుకు సంతోషిస్తున్నాను’అని ఛటర్జీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. వైట్ హౌస్లోని ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్కు కొంతకాలం సేవలు అందించిన ఆయన ఇప్పుడు రిలీవ్ అయ్యారు. గ్లోబల్ చిప్ల కొరతకు పరిష్కారం దిశగా.. చిప్స్ అండ్ సైన్స్ చట్టాన్ని సెమీకండక్టర్ల ఉత్పత్తిని పెంచడానికి, పరిశోధన, రూపకల్పనలో నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచ వేదికపై దేశానికి పోటీతత్వాన్ని అందించడానికి అమలు చేశారు. దీనిని విభిన్న సెమీకండక్టర్ వర్క్ఫోర్స్ను పెంచడానికి గత సంవత్సరం ఆమోదించారు. పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన సెమీకండక్టర్ వ్యూహం గ్లోబల్ చిప్ల కొరతకు పరిష్కారం చూపించనుంది. అలాగే యుఎస్ ఆధారిత తయారీ సౌకర్యాలపై దృష్టి సారించింది. ఇతర దేశాల సరఫరాదారులపై తక్కువ ఆధారపడే ప్రయత్నంలో భాగంగా ఈ చట్టం అమలు చేశారు. తైవాన్, చైనాలతో పెరుగుతున్న ఇబ్బందుల నుంచి పరిష్కారానికి అమెరికాకు ఈ చట్టం చేయడం బాధ్యతగా మారింది. పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తి కాగా ఛటర్జీ 2021 ఏప్రిల్ నుండి వాణిజ్య శాఖకు చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేశారు. అక్కడ చటర్జీ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ఈ రంగంలో అమెరికాలో పోటీతత్వం పెరిగేందుకు, కార్మిక మార్కెట్లు, సరఫరా గొలుసులు, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఆర్థిక వృద్ధికి సంబంధించిన విధానాన్ని అభివృద్ధి చేయడానికి సారధ్యం వహించారు. పొలిటికో ఒక ప్రకటనలో ఛటర్జీని పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తిగా అభివర్ణించింది. ఈ రంగంలో అమెరికాలో చైన్ సిస్టమ్ను బలోపేతం చేయడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం, అమెరికా అంతటా మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో అతని నైపుణ్యం, మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని పేర్కొంది. అత్యుత్తుమ సేవలకు అనేక అవార్డులు కాగా ఛటర్జీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలనలోనూ సేవలు అందించారు. వైట్ హౌస్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్లో సీనియర్ ఆర్థికవేత్తగా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విజిటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్లో టర్మ్ మెంబర్గా పనిచేసిన ఆయన గోల్డ్మన్ సాక్స్లో ఆర్థిక విశ్లేషకుడిగానూ సేవలు అందించారు. ఈ నేపధ్యంలో ఛటర్జీ అనేక అవార్డులు అందుకున్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్లో విశిష్ట పరిశోధన కోసం 2017 కౌఫ్ఫ్మన్ ప్రైజ్ మెడల్, ఆస్పెన్ ఇన్స్టిట్యూట్ నుండి రైజింగ్ స్టార్ అవార్డు, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సొసైటీ ఎమర్జింగ్ స్కాలర్ అవార్డును చటర్జీ అందుకున్నారు. చటర్జీ తన పీహెచ్డీని బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పూర్తిచేశారు. అంతకు ముందు ఆర్థిక శాస్త్రంలో బీఏ పట్టాను కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి అందుకున్నారు. ఇది కూడా చదవండి: ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి? -
రోడ్డు ప్రమాదంలో వైద్యాధికారిణి మృతి
శ్రీకాకుళం: మండలంలోని బట్టిగళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ భవ్యశ్రీ రహదారి ప్రమాదంలో గురువారం సాయంత్రం విశాఖలో మృతి చెందారు. బట్టిగళ్లూరు వైద్య సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. భవ్యశ్రీ గురువారం విశాఖపట్నంలో షీలానగర్లో జరిగిన డిపార్ట్మెంట్ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాశాక గాజువాకలో బంధువుల దగ్గరకు స్కూటీపై బయల్దేరారు. అయితే లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈవిడ స్వగ్రామం యానాం. భవ్యశ్రీ మృతి చెందడంతో జిల్లా వైద్యాధికారి బొడ్డేపల్లి మీనాక్షి, బట్టిగళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సంతాపం తెలిపారు. -
అమ్మ ప్రేమతో ‘గోరుముద్ద’
అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు నుంచి 10వ తరగతి వరకు 590 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకల్లా ఆన్లైన్లో విద్యార్థుల హాజరు పూర్తి చేశారు. ఆ వెంటనే అందుకు తగ్గ ట్టుగా నిర్దేశిత కొలత ప్రకారం మంగళవారం మెనూ అనుసరించి రాగి పిండి, చింతపండు పులిహోర కోసం బియ్యం, ఇతర సరుకులను వంట సిబ్బందికి అందజేశారు. ఉదయం 10.20 గంటలకు బెల్లంతో చేసిన రాగిజావ ఇచ్చారు. మధ్యాహ్నం 12.20కి పులిహోర, దొండకాయ చట్నీ, ఉడికించిన గుడ్డు అందించారు. ఆరోజు బడికి హాజరైన 500 మంది విద్యార్థులు బడిలో అందించిన ఆహారాన్నే తీసుకున్నారు. మండల విద్యాశాఖాధికారి అమృత కుమార్ పులిహోరను రుచి చూసి పిల్లల అభిప్రాయం తెలుసుకుని రిజిస్టర్లో నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ పాఠశాలల్లో ‘జగనన్న గోరుముద్ద’ కింద పోషక విలువలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థులు ఉదయం బడికి రాగానే హాజరు తీసుకుని అందుకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేసేందుకు మెనూ సరుకులు అందచేసు్తన్నారు. పిల్లల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ అందుకు తగ్గట్టు వంట చేస్తున్నారు. వివరాలను పారదర్శకంగా రిజిస్టర్లో నమోదు చేస్తూ పిల్లలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. వారంలో ఆరు రోజులు రోజుకో మెనూ చొప్పున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఉపాధ్యాయుల వద్దనున్న మొబైల్ యాప్లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ స్టిస్టమ్ ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్తో పాటు భోజనం వివరాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు కోసం ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.1,689 కోట్లు కేటాయించిందంటే పిల్లలకు పౌష్టికాహారం పంపిణీకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం.. పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడు రోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. సోమవారం వేడి పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావ్, గుడ్డు కూర, చిక్కీ, మంగళవారం ఉదయం 10.20కి రాగిజావ, మధ్యాహ్నం 12.20కి చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, బుధవారం వెజిటేబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ, గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్బాత్ లేదా నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ, శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ మెనూగా అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనతను నివారించేందుకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ సిబ్బంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్త హీనత నివారణ మాత్రలు అందించడంతోపాటు మోతాదు ప్రకారం తీసుకునేలా పర్యవేక్షిస్తున్నారు. రాగి జావ చాలా బాగుంటుంది వారంలో మూడురోజులు ఉదయం ఇంటర్వెల్ టైంలో బెల్లంతో చేసిన రాగిజావను వేడివేడిగా ఇస్తారు. బడిలో అందరం తీసుకుంటాం. చాలా బాగుంటుంది. ఎంత కావాలన్నా ఇస్తారు. మధ్యాహ్నం భోజనం కూడా వేడిగా కావాల్సినంత పెడతారు. మా బడిలో ఎవరూ ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకోరు. అందరూ ఇక్కడ వండిందే తింటారు. టీచర్లు కూడా ప్రతిరోజు మాతో కలిసి భోజనం చేస్తారు. – ఏ.కిరణ్కుమార్, రామ్ప్రసాద్, చిట్టినాయుడు (పదో తరగతి, సెక్షన్ ‘సి’), నాతవరం జెడ్పీహెచ్ఎస్ ఇంట్లో తిన్నట్టుగానే స్కూల్లో వండే ఆహారం ఇంట్లో ఉన్నట్టుగానే రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఇక్కడే తింటా. అన్నం తినేటప్పుడు ఎలా ఉందని మా మాస్టారు రోజు అడుగుతారు. బాగో లేకపోతే అదే విషయం చెబుతాం. దాన్ని రిజిస్టర్లో రాస్తారు. మాతో కూడా రాయిస్తారు. – వి.స్నేహశ్రీ, 9వ తరగతి బి–సెక్షన్, నాతవరం జెడ్పీహెచ్ఎస్ మా పిల్లలూ ఇక్కడే.. మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. మా బిడ్డలకు వండినట్లే అందరు పిల్లలకు వండి పెడుతున్నాం. గతంలోనూ మధ్యాహ్నం బడిలో భోజనం పెట్టినా ఇంత చక్కగా పెట్టడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. పిల్లలు ఇష్టంగా తినడం చూస్తుంటే మాకూ ఆనందం కలుగుతుంది. – దుర్గాభవాని, మిడ్ డే మీల్స్ తయారీదారు, నాతవరం జెడ్పీహెచ్ఎస్ టీచర్లకూ అదే భోజనం.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అద్భుతంగా ఉన్నాయి. సరిపడినంత మంది ఉపాధ్యాయులు, వసతులను ప్రభుత్వం కల్పించింది. నిజంగా ఇదో గొప్ప మార్పు. మా స్కూల్లో 590 మంది పిల్లలు, 21 మంది ఉపాధ్యాయులున్నారు. మా పర్యవేక్షణలోనే వంటలు చేస్తారు. ప్రతిరోజు ముగ్గురు టీచర్లు ఇక్కడ వండిన ఆహారమే తింటారు. ఏనాడూ బాగోలేదన్న ఫిర్యాదు రాలేదు. – ఎస్.శాంతికుమారి, నాతవరం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం నచ్చకపోతే ‘బ్యాడ్’ అని రాస్తాం స్కూల్లో వండిన ఆహారం ఎప్పుడూ బాగుంటుంది. మాకు నచ్చినట్టుగానే వంట చేస్తారు. తిన్న తర్వాత ఎలా ఉందో ప్రతి రోజు మా టీచర్లు అడుగుతారు. నిర్భయంగా చెప్పమంటారు. బాగుంటే ‘గుడ్’ అని బాగో లేకపోతే ‘బ్యాడ్’ అని రిజిస్టర్లో రాస్తాం. ఒకసారి అలా రాస్తే మెనూ మార్చారు. – కె.మహేశ్వరి, (పదో తరగతి), అల్లిపూడి జెడ్పీ హైస్కూల్ ప్రతి విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం పలు విద్యా సంస్కరణలు అమలు చేస్తోంది. ఉపాధ్యాయుల నుంచి పిల్లల చదువు, ఆహారం, ఆరోగ్యం వరకు అన్ని అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. నిజంగా ఇది ఓ విప్లవమనే చెప్పాలి. ప్రతిరోజు ఒక మెనూ అమలు చేస్తూ తిన్నాక అభిప్రాయాన్ని తెలుసుకోవడం గొప్ప విషయం. పిల్లల అభిప్రాయాల మేరకే గతంలో మెనూ మార్చారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో చెప్పడానికి ఇది చాలు. – ఎన్.వై.నాయుడు పీఎస్ టీచర్, అల్లిపూడి జెడ్పీహెచ్ఎస్ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 104 కాగా బుధవారం రోజు 86 మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం కూరగాయల అన్నం, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ విద్యార్థులకు ఇవ్వాలి. 10 గంటలకల్లా సరుకులు తీసుకున్న వంట సిబ్బంది పాఠశాల ప్రాంగణంలోని కిచెన్లో 12.15 గంటలకు భోజనాన్ని రెడీగా ఉంచారు. తెలుగు ఉపాధ్యాయుడు గోవిందు భోజనాన్ని రుచి చూసి విద్యార్థుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. వారు సంతృప్తి వ్యక్తం చేశాక మరో ఉపాధ్యాయుడు ఎన్వై నాయుడు వేడివేడి భోజనం ఫొటోను ఐఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేసి విద్యార్థుల సంఖ్యను కూడా నమోదు చేశారు. - అల్లిపూడి, నాతవరం నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి -
భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన!
ఇతర గ్రహాల నుండి వచ్చిన మనుషులు మన భూమిపై నివసిస్తున్నారా? గ్రహాంతరవాసుల ఉనికి గురించి ఎప్పటికప్పుడు అనేక వాదనలు వినిపిస్తుంటాయి. అమెరికాకు చెందిన కొందరితో గ్రహాంతరవాసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా అంటుంటారు. అయితే ఈ వాదనకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాలేదు. రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను దాచిపెట్టి.. తాజాగా అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి గ్రహాంతరవాసులకు సంబంధించిన మరో వాదన వినిపించారు. ఇది మరోసారి గ్రహాంతరవాసుల ఉనికికి ఆజ్యం పోస్తున్నది. రిటైర్డ్ మేజర్ డేవిడ్ గ్రుష్.. కాంగ్రెస్లో మాట్లాడుతూ ఎగిరే వస్తువులను కనుగొనడానికి రూపొందించిన రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారు. అయితే పెంటగాన్.. గ్రుష్ వాదనలను కొట్టివేసింది. కాగా ఎగిరే వస్తువుల విషయంలో అమెరికా అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమినా(యూఏపీ) అనే పదాన్ని ఉపయోగిస్తుందని గ్రుష్.. హౌస్ ఓవర్సైట్ సబ్కమిటీకి తెలిపారు. ఇది రహస్యమైన విమానాలు, వస్తువులు, చిన్న ఆకుపచ్చ మనుషుల అధ్యయనం గురించి తెలియజేస్తుంది. ‘అది జాతీయ భద్రతా అంశం’ ఇటీవల డెమొక్రాట్లు,రిపబ్లికన్లు యూఏపీని జాతీయ భద్రతా అంశంగా నొక్కిచెప్పారు. టాస్క్ఫోర్స్ మిషన్కు సంబంధించిన అన్ని అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్లను మూఏపీ సాయంతో గుర్తించాలని ప్రభుత్వ టాస్క్ఫోర్స్ అధిపతి తనను 2019లో కోరినట్లు గ్రుష్ వివరించారు. ఆ సమయంలో గ్రుష్ జాతీయ నిఘా కార్యాలయానికి పలు వివరాలు అందజేశారు. ఈ సమయంలో బహుళ-దశాబ్దాల యూఏపీ క్రాష్ ఆవిష్కరణ గురించి తనకు తెలియజేశారని, దానిపై రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను అమలు చేయడం గురించి కూడా సమాచారం ఉందని గ్రుష్ చెప్పారు. అయితే అప్పట్లో తాను దీని గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించాననన్నారు. ‘గ్రహాంతరవాసుల గురించి యూఎస్కు తెలుసు’ ఇతర గ్రహాలపై జీవం గురించి యూఎస్ ప్రభుత్వం దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని అడిగిన ప్రశ్నకు, 1930ల నుండి మానవేతర కార్యకలాపాలు లేదా గ్రహాంతరవాసుల గురించి యూఎస్కు తెలుసని ఆయన అన్నారు. అయితే గ్రుష్ చేసిన ఈ వాదనలను పెంటగాన్ ఖండించింది. డిఫెన్స్ డిపార్ట్మెంట్కు చెందిన స్యూ గోఫ్ ఒక ప్రకటనలో గ్రుష్ వాదనలు సరైనవని నిరూపించడానికి దర్యాప్తు సమయంలో ఎటువంటి సమాచారం లభ్యం కాలేదన్నారు. మరొక గ్రహంపై జీవి ఉనికి, రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నకు సంబంధించిన వివరాలు యూఎస్ దగ్గర లేవని పేర్కొంది. ఇది కూడా చదవండి: పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే -
లంచంతో పట్టుబడి.. అధికారుల్ని చూసి కంగారులో..
జబల్పూర్: అవినీతికి పాల్పడడంలో ఏమాత్రం జంకని అధికారులు.. పైఅధికారుల చర్యలకు ఎందుకనో వణికిపోతుంటారు. అయితే ఇక్కడో అధికారి భయపడలేదు.. ఏకంగా బెదిరిపోయాడు. ఆ కంగారులో కరెన్సీ నోట్లను మింగేశాడు. మధ్యప్రదేశ్ కత్నికి చెందిన రెవెన్యూ అధికారి(పట్వారి) గజేంద్ర సింగ్ బర్ఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడట. దీంతో బాధితుడు లోకాయుక్తకు చెందిన స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్(SPE) అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం గజేంద్ర కోరిన ఐదు వేల లంచంతో బాధితుడు కార్యాలయానికి చేరుకున్నాడు. గజేంద్ర లంచం తీసుకుంటున్న టైంలో ఎస్పీఈ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లను చూసి ఆందోళన చెందిన ఆ అధికారి తప్పించుకోవాలనే ఆలోచనతో ఆ నోట్లను కసాబిసా నమిలి మింగేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతన్ని పరిశీలించి క్షేమంగానే ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. A patwari in Katni in Madhya Pradesh was caught in a bribe-taking act by a team of the Lokayukta's Special Police Establishment. In a desperate attempt to escape, he allegedly swallowed the money he had accepted as a bribe. #AntiCorruption #BriberyCase #Lokayukta #Katni #MP pic.twitter.com/zgYXpbdYGv — The BothSide News (@TheBothSideNews) July 24, 2023 -
వయస్సు 28.. కేసులు 34.. నకిలీ ఏసీబీ అధికారి అరెస్ట్
శంషాబాద్: డిగ్రీ పూర్తి చేసిన ఓ యువకుడు విలాసవంతమైన జీవితం కోసం నేరాల బాట పట్టాడు.. చైన్స్నాచింగ్లతో మొదలు పెట్టి ప్రభుత్వాధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ నేరగాడిగా మరాడు.. కేవలం 28 ఏళ్ల వయస్సులోనే అతడిపై 34 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఓ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు నకిలీ ఏసీబీ అధికారి అవతారంలో తిరుగుతున్న అతడిని అరెస్ట్ చేశారు. గురువారం శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు... అనంతపురం జిల్లా, కోటలపల్లి గ్రామానికి చెందిన నూతేటి జయకృష్ణ(28) 2016లో బీకాం పూర్తి చేశాడు. అనంతరం ఓ టెక్స్టైల్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఎస్సై పరీక్షలకు సిద్ధమవుతున్న అతను అనంతపురం పట్టణంలో రెండు చైన్స్నాచింగ్లకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లిన అతడికి అక్కడ అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనిల్ ద్వారా బెంగళూరులోని శ్రీనాథ్రెడ్డి పరిచయమయ్యాడు. ‘గ్యాంగ్’ స్ఫూర్తిగా తీసుకుని .. తమిళ హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమాను చూసిన వీరు దానిని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వాధికారులను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ పక్క చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూనే మరోవైపు నకిలీ ఏసీబీ ప్రభుత్వాధికారులను బెదిరించి వసూళ్లు చేయడం మొదలుపెట్టారు. 2019లో నకిలీ ఏసీబీగా అవతారమెత్తిన జయకృష్ణ, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, అనంతపురం విశాఖపట్నం, విజయనగరం, తదితర ప్రాంతాల్లోని మున్సిపల్, రెవెన్యూ, రవాణా తదితర రంగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి మీపై ఆరోపణలున్నాయి సెటిల్ చేసుకోవాలంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. గత మార్చి, జూన్, జులైలో సిద్దిపేటలో ఇద్దరు ఉద్యోగులు, సైబరాబాద్ పరిధిలో ఒకరికి ఇదే తరహాలో ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసులు నమోదయ్యాయి. బస్సుల్లో తిరుగుతూనే.. గుగూల్ ద్వారా ప్రభుత్వ అధికారుల ఫోన్ నంబర్లు సేకరించడంతో పాటు విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల ఆధార్ కార్డుల ద్వారా సుమారు 200 నకిలీ సిమ్కార్డులు తీసుకుని వాడినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసుకున్న అనంతరం వారు పథకం ప్రకారం ఉదయం ఆర్టీసీ బస్సు ఎక్కేవారు. రాత్రి వరకు బస్సులో ప్రయాణం చేస్తూనే అధికారులకు ఫోన్ చేసి బెదిరించేవారు. పని పూర్తి కాగానే సిమ్ను అక్కడే పారేసేవారు. గత రెండేళ్లలో మొత్తం 9 బ్యాంకు ఖాతాల్లో రూ. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ.1.2 కోట్లు వేయించుకున్నట్లు గుర్తించారు. డబ్బులు వచ్చిన వెంటనే గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేయడం జయకృష్ణకు అలవాటు. వరస నేరాలతో అప్రమత్తమైన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు నకిలీ సిమ్కార్డుల ఆధారంగా బెంగళూరులో జయకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.85 వేల నగదు, ఖాతాల్లో ఉన్న రూ.2.24లక్షలు, 8 ఫోన్లు, 5 సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు ఎవరూ కూడా నేరుగా అధికారులకు ఫోన్లు చేయరని ప్రభుత్వాధికారులు దీనిని గుర్తించాలని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. విద్యార్థులు కూడా గుర్తుతెలియని వ్యక్తులకు ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వకూడదని సూచించారు. కేసును చేధించిన శంషాబాద్ ఎస్ఓటీ, శంషాబాద్ పోలీసులకు డీసీపీ అభినందించారు. -
‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించిన ఒక ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఒక వితంతు వృద్ధ మహిళ మృతిచెందినట్టు నిర్థారిస్తూ ఆమెకు రావాల్సిన పెన్షన్ నిలిపివేశారు. ఈ నేపధ్యంలో బాదామ్దేవి అనే ఆ వృద్ధురాలు తన సమస్య పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. పెన్షన్ నిలిపివేసి.. తాను బతికే ఉన్నానని, తనను గుర్తించి, తనకు తిరిగి పెన్షన్ ఇప్పించాలని వేడుకుంటోంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తనకు పెన్షన్ నిలిపివేశారని ఆమె ఆరోపించింది. ఇప్పుడు ఆమె తాను బతికే ఉన్నానని, అధికారులు నిర్థారించిన విధంగానైనా తనకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతోంది. 2023 జనవరి 20న తనకు పెన్షన్ నిలిపివేశారని, కారణం అడిగితే చనిపోయావని అన్నారని ఆమె తన వినతిపత్రంలో పేర్కొంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినా.. 20 ఏళ్లుగా తాను పెన్షన్ అందుకుంటున్నానని, అయితే ఈ ఏడాది దానిని నిలిపివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను ఈ ఏడాది జనవరి 6న లైఫ్ సర్టిఫికెట్ సమర్పించానని అయినా అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే తాను జీవించివున్నా ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశానన్నారు. కాగా ఆమె దరఖాస్తును చూసిన అధికారులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారి సుభమ్ గుప్త మాట్లాడుతూ ఈ విషయమై దర్యాప్తునకు ఆదేశించామన్నారు. ఇది కూడా చదవండి: 16 ఏళ్లకే చదువుకు టాటా.. నేడు ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తూ.. -
లఢక్ పర్యటకుని నిర్లక్ష్యం.. సోయగాల ఒడిలో కమ్ముకున్న దుమ్ము మేఘాలు..
లఢక్: భూతల స్వర్గం కశ్మీర్.. అక్కడి లఢక్ పీఠభూమి అందాలు ఎంత చూసిన తనివితీరనివి. అలాంటి ప్రాంతాలను పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగా మురికిగా మారుతున్నాయి. లఢక్ను పరిరక్షించుకోవాలని భావించి ఈ ప్రాంతాన్ని రామ్సర్ సైట్లో కూడా చేర్చారు. అయినప్పటికీ ఇటీవల ఓ యాత్రికుడు చేసిన పని చూస్తే చివాట్లు పెట్టకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన దృశ్యాలను అటవీ అధికారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రామ్సైట్ అయినటువంటి త్సో కర్, త్సో మోరిరి సరస్సుల ప్రాంగణం ప్రశాంతతకు పెట్టింది పేరు. వలస పక్షుల కిలకిలరావాలతో అలరారుతుంది. అలాంటి ప్రాంతంలో ఓ యాత్రికుడు ఎస్యూవీతో భీబత్సం సృష్టించాడు. వేగంగా చక్కర్లు కొడుతూ ఆ ప్రాంతాన్ని దుమ్ము మయం చేశాడు. ఎస్యూవీ టైర్ల నుంచి లేచే దమ్ము దృశ్యాలు అక్కడి మేఘాలను తలపిస్తున్నాయి. ఈ వీడియోను మోఫుసిల్_మెడిక్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్తా తెగ వైరల్ అయింది. Shared by a fellow birder from #Ladakh... this stupidity is getting out of hand. This seemingly "barren" landscape is teeming with #life- and the short summer is when that life is at its peak. That too at a Ramsar Site! These idiots need to be named, shamed and booked!… pic.twitter.com/wRpYkkYf6p — Mofussil_Medic (@Daak_Saab) July 9, 2023 ఈ వీడియోపై నెటిజన్లు ఫైరయ్యారు. పర్యటకుని నిర్లక్ష్యానికి తగిన బుద్ది చెప్పాలను సూచించారు. మూర్ఖత్వం తారాస్థాయికి చేరింది.. ఇలాంటి పర్యటకులను ఆ ప్రాంతంలోకి అనుమతించకూడదని మరో యూజర్ అన్నాడు. భూటాన్ లాగే లఢక్లో పర్యటకులకు భారీ ట్యాక్స్లను విధించాలని, ఇలాంటి ఘటనలపై భారీ జరిమానాలు వసూలు చేయాలని మరో వ్యక్తి కామెంట్ బాక్స్లో రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. 2024 జనవరి నుంచి రామ్లాలా దర్శనభాగ్యం! -
GST అధికారుల కిడ్నాప్ కేసులో కీలక విషయాలు
-
HYD: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కలకలం..
సాక్షి, సరూర్ నగర్: హైదరాబాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సరూర్ నగర్లో జీఎస్టీ సీనియర్ అధికారిపై దాడి పాల్పడి అతడిని కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు కిడ్నాప్ను చేధించారు. వివరాల ప్రకారం.. సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జీఎస్టీ సీనియర్ అధికారి మణిశర్మ కిడ్నాప్నకు గురయ్యారు. అయితే, దిల్షుక్నగర్లోని కృష్ణానగర్లో జీఎస్టీ కట్టని ఓ షాప్ను సీజ్ చేసేందుకు ఆఫీసర్ మణిశర్మ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్లను షాప్ ఓనర్, మరో ముగ్గురు కలిసి కిడ్నాప్ చేశారు. జీఎస్టీ ఆఫీసర్పై వారు దాడికి పాల్పడ్డారు. ఇక, కిడ్నాప్ సమయంలో నిందితులు వాడిన కారుపై టీడీపీ నేత ముజీబ్ పేరుతో స్టికర్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుల్లో టీడీపీ నేత ముజీబ్ అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. ముజీబ్ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి అధికారిని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సెల్ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కిడ్నాప్నకు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు. అనంతరం, నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. -
పాక్ ప్రధాని అనుచిత ప్రవర్తన.. మహిళ ఆఫీసర్ దగ్గర గొడుగు లాక్కుని.. వీడియో వైరల్..
ప్యారిస్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అనుచితంగా ప్రవర్తించారు. సమావేశానికి హాజరవ్వడానికి వెళ్లిన క్రమంలో ఆహ్వనానికి వచ్చిన మహిళ అధికారి వద్ద గొడుగు లాక్కున్నారు. పాపం.. వర్షం కారణంగా గొడుగు పట్టడానికి వచ్చిన ఆ మహిళ ఉద్యోగిని తడుస్తూనే ప్రధాని వెంట నడిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. Prime Minister Muhammad Shehbaz Sharif arrived at Palais Brogniart to attend the Summit for a New Global Financial Pact in Paris, France. #PMatIntFinanceMoot pic.twitter.com/DyV8kvXXqr — Prime Minister's Office (@PakPMO) June 22, 2023 సమావేశ భవనాన్ని చేరడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ కారు దిగారు. వర్షం కారణంగా ఆయనకు గొడుగు పట్టడానికి కారు డోర్ దగ్గరే ఓ మహిళ అధికారి రెడీగా ఉంది. ప్రధాని కారు దిగగానే తడవకుండా గొడుగు పట్టింది. అయితే.. ఆయన ఆ గొడుగును ఆమె నుంచి తీసుకునే ప్రయత్నం చేయగా.. అసౌకర్యం కలగకుండా తానే పడతానన్నట్లుగా గొడుగును ఎత్తే ప్రయత్నం చేసింది. కానీ షెహబాజ్ షరీఫ్ ఆమె నుంచి గొడుగును లాక్కున్నారు. తానే గొడుగు పట్టుకుని సమావేశ భవనానికి వెళ్లారు. ఏం చేయాలో తెలియక ఆ మహిళ ఉద్యోగిని అధ్యక్షుడి వెంటే వర్షంలో తడుస్తూ నడిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Why did he leave the woman in the rain? Shehbaz sharif is such an embarrassment. Yaaar kis cartoon ko PM bana diya hai inho ne. 😂 pic.twitter.com/kPzOmXSvQG — Saith Abdullah (@SaithAbdullah99) June 22, 2023 ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ప్రధాని అనుచిత ప్రవర్తనపై పాక్ సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహిళను వర్షంలోనే ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రధాని ఎలా అయ్యారని నెట్టింట విమర్శల వర్షం కురిపించారు. What a disgraceful embarrassment this man is! #Titanic #ShehbazSharif pic.twitter.com/91hpulmBkL — bushra (@Bushra2k7) June 22, 2023 ఇదీ చదవండి: యుద్ధానికి సై అంటారు, మమ్మల్ని పట్టించుకోరు.. ఆదుకోండి ప్లీజ్!: పాక్ ప్రధాని -
వీడియో: అవినీతి తిమింగలం.. కోటి విలువైన ఇళ్లు..
-
Gujarat: సీఎం ప్రసంగిస్తుండగా కునుకు తీశాడు.. సస్పెండ్ చేశారు
గాంధీనగర్: స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని, ప్రసంగిస్తున్న సభలో కునుకు తీశాడు ఆ అధికారి. అయితే మామూలుగా అయితే విషయం ఎవరూ పట్టించుకునేవాళ్లు కారేమో. పాపం.. కెమెరా కళ్లన్నీ ఆయన మీదే పడ్డాయి. లోకల్ మీడియాలో పదే పదే ఆ దృశ్యాలు టెలికాస్ట్ అయ్యాయి. ఫలితంగా.. ఆయనపై కమిట్మెంట్ను ప్రశ్నిస్తూ సస్పెన్షన్ వేటు వేసింది అక్కడి ప్రభుత్వం. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్ భూపేంద్ర పటేల్ పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీశారన్న కారణంగా ఓ అధికారి సస్పెన్షన్కు గురయ్యారు. శనివారం భుజ్లో ఈ ఘటన జరిగింది. ఆ అధికారిని భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్గా గుర్తించారు. కచ్ జిల్లాలో.. 2001 నాటి గుజరాత్ భూకంప బాధితులకు పునరావాసంలో భాగంగా 14 వేల ఇళ్ల పట్టాలను సీఎం భూపేంద్ర పటేల్ అందించారు. అయితే.. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా.. ముందు వరుసల్లో కూర్చున్న జిగర్ పటేల్ కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కారు. ఆ వీడియో విపరీతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది. దీంతో గంటల వ్యవధిలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ. విధి పట్ల నిబద్ధతా లోపం, పైగా ఆయన ప్రవర్తన నిర్లక్ష్యపూరితంగా ఉందన్న విషయం.. వీడియోల ఆధారంగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అందుకే గుజరాత్ సివిల్ సర్వీస్ రూల్స్ 1971, రూల్ 5(1)(a) ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మనీష్ షా. మరోవైపు వేటుపై ఆ అధికారి స్పందన కోసం మీడియా యత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. Kutch News: ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને સસ્પેન્ડ કરાયા, CMના કાર્યક્રમમાં ઉંઘતા હોવાથી કરાયા સસ્પેન્ડ #gujarat #kutch #bhuj #vtvgujarati pic.twitter.com/2nnJIv12no — VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 30, 2023 Video Credits: VtvGujarati ఇదీ చదవండి: అవును, శివుని కంఠంపై సర్పాన్ని: మోదీ -
సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?
ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే నైతికత, నిబద్ధత చాలా అసవరం. కానీ చాలా సంస్థలు దీన్ని పెద్దగా పట్టించుకోవు. కానీ రతన్ టాటా ఆధ్వర్యంలోని టాటా గ్రూప్, తమ కార్పొరేట్ పాలనలో, వ్యాపారం చేసే విధానంలో నైతికతను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తుంది. ఇటీవలికాలంలో కంపెనీ సుదీర్ఘ చరిత్రలో తొలిసారి చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ నియమించుకుంది. తాజాగా హెచ్డీఎఫ్సీ ఈ కోవలో చేరింది. కంపెనీ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్గా మాజీ ఈడీ అధికారి ప్రసూన్ సింగ్ను నియమించింది. అసలు ఏవరీ ప్రసూన్ సింగ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ పోస్టును సృష్టించి మరీ ప్రసూన్ సింగ్కు కీలక పోస్ట్ను ఇవ్వడం విశేషం. రూ. 9,24,235 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంకుకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న ప్రసూన్ సింగ్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్గా ఎలా ఎదిగారు. (సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్లో వీడియో హల్చల్) ప్రసూన్ సింగ్ ఎవరు? బిహార్లోని ముజఫర్ లోని సెయింట్ జేవియర్స్ స్కూల్ నుండి పాఠశాల విద్యను,. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఇక్కడ నుంచే బీఏ ఆనర్స్ చేశారు. నవీ ముంబైలోని సీఎస్ఎంయూలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అతను MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. (రోజుకు కేవలం రూ.73: యాపిల్ ఐఫోన్ 12మినీ మీ సొంతం!) ప్రసూన్ సింగ్ కరియర్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్ మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అతను ముంబైలో పోస్టింగ్ పొందారు. ఏడేళ్లు పనిచేసిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కి వెళ్లారు. ఆతరువాత ఏడేళ్లకు పైగా ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. జూలై 2013ల ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా చేరారు. నాలుగేళ్ల తర్వాత ప్రైవేట్ రంగంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా చేరారు. అక్కడ కూడా ఏడేళ్లపాటు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. దీని తర్వాత, అతను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీకి మారారు. అక్కడ కూడా సుమారు నాలుగేళ్లపాటు అధికారిగా పనిచేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సివో)గా, 9సంవత్సరాల 9 నెలలకు పైగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సేవలందించారు ప్రసూన్. తాజాగా బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్గా ఎంపియ్యారు. ♦ 2009, నవంబరు నుంచి జూలై 2013 మధ్య ఈడీ అధికారిగా ♦ 2002 జూలై - 2009 నవంబర్ మధ్య ఇంటెలిజెన్స్ అధికారి ♦ 1995 మే- 2002 జూలై మధ్య ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నైతికత గురించి రతన్ టాటా ఏమన్నారంటే కంపెనీలు లాభాలు ఆర్జించడం తప్పు కాదు, ఈ పనిని నైతికంగా చేయడం కూడా అవసరమని టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా నమ్ముతారు. లాభం పొందడానికి మీరు ఏమి చేస్తున్నారో ఈ ప్రశ్న చాలా ముఖ్యమనీ. లాభాలను ఆర్జిస్తున్నప్పుడు, కస్టమర్లు వాటాదారులకు ఎలాంటి ప్రయోజ నాందిస్తున్నామో కంపెనీలు గుర్తుంచు కోవడం కూడా ముఖ్యం. అలాగే ప్రస్తుత పరిస్థితిలో, నిర్వాహకులు తాము తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవా? కాదా? అని తమను తాము ప్రశ్నించు కోవాలి. కంపెనీ ఎక్కువ కాలం మనుగడ సాగించదని, అది ఉద్యోగుల పట్ల సున్నితంగా ఉండదని కూడా ఆయన అన్నారు. వ్యాపారం గురించి తన ఆలోచనను వివరిస్తూ, వ్యాపారం అంటే లాభాలు సంపాదించడం మాత్రమే కాదని అన్నారు. మీతో అనుబంధం ఉన్న వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగుల ప్రయోజనాలు చాలా ముఖ్యమని రతన్ టాటా చెబుతారు. (అమెరికా ఫైనాన్స్లో ఇండో-అమెరికన్ మహిళల సత్తా) -
మూడుసార్లు మొమో జారీ.. అయినా మారని బుద్ధి.. మహిళా కానిస్టేబుల్తో.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. న్యాయం చేయండయ్యా మహాప్రభో అని పోలీసు స్టేషన్ మెట్లెక్కిన పాపానికి అందినకాడికి దోచుకుంటున్నారు. దొంగల నుంచి సొత్తు రికవరీ చేసి చట్ట ప్రకారం బాధితులకు అందించాల్సిన వారే కొంత వాటా నొక్కేస్తున్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించిన వాళ్లపై చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఉల్టా(అక్రమ)కేసులు బనాయిస్తున్నారు. అంతేకాదు స్టేషన్లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్కు సైతం రక్షణ లేకుండా పోయింది. సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి డివిజన్లోని ఓ పోలీసు స్టేషన్ అధికారి తీరుకు ఇదీ నిదర్శనం. అక్రమ కేసులు బనాయిస్తూ.. సదరు స్టేషన్ అధికారి సివిల్ తగాదాల్లో తల దూర్చుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఠాణా పరిధిలోని ఓ గ్రామంలో కొన్నేళ్ల క్రితం కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఈ స్థలం వెనకాల ఉన్న వారికి రహదారి లేకపోవటంతో..స్థానిక పోలీసు అధికారిని సంప్రదించి విషయాన్ని వివరించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు పోలీసు..భూ యజమానిని పిలిపించి రోడ్డు ఇవ్వాలని ఆదేశించాడు. ససేమిరా అని చెప్పిన ఓనర్.. తన వద్ద అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయని, ప్రభుత్వ అధికారులు అందించిన సర్వే రిపోర్టును సైతం చూపించాడు. తన స్థలాన్ని ఆక్రమించకుండా రేకుల షెడ్డును నిర్మించుకున్నాడు. దీంతో కోపం తెచ్చుకున్న సదరు పోలీసు.. భూ యజమాని, అతని ముగ్గురు అనుచరులపై అక్ర మంగా కేసు నమోదు చేశాడు. బాధితులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గ్రామంలో చోటు చేసుకున్న ఓ చిన్నపాటి తగాదాలో పెద్ద మనిషిగా వెళ్లిన పాపానికి ఓ సర్పంచ్పై ఏకంగా మూడు కేసులు బనాయించడం గమనార్హం. రాజీకొస్తే కేసులు నమోదు ఇటీవల పక్క జిల్లాకు చెందిన కొందరు స్నేహితులు కలిసి మండలంలోని ఓ గ్రామంలో పార్టీ చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో వీరి కారు దోబిపేట వద్ద ప్రమాదానికి గురైంది. కేసు ఎందుకులే అని భావించిన ఇరు కార్ల యజమానులు రాజీ కుదుర్చుకొని వెళ్లిపోయారు. తన ప్రమేయం లేకుండా రాజీ కుదు ర్చుకుంటారా అని ఆగ్రహించిన సదరు పోలీసు..ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఇరువురి యజమానులను స్టేషన్కు పిలిపించి కేసు నమోదు చేయడం గమనార్హం. మరో ఘటనలో స్థానికంగా ఇద్దరు యువకుల మధ్య తగాదా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు జోక్యం చేసుకొని స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి సమక్షం లో రాజీ కుదిర్చారు. ఘటనతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి మాటలు విని ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు. దొరికింది ఎంతో.. ఇచ్చింది అంతంతే.. ఇటీవల ఓ కుటుంబం తిరుపతికి వెళ్లింది. తిరిగొచ్చేసరికి దొంగలుపడ్డారు. 20 తులాల బంగారం, నగదు చోరీ జరిగింది. పీఎస్లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని పూర్తిగా బాధితులకు అందించలేదనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇదే విషయమై బాధితుడిని వాకబు చేయగా.. సదరు స్టేషన్ అధికారి రికవరీ చేసిన సొత్తులో కొంత నొక్కేశారని, మిగిలిన అరకొర బంగారం తనకెందుకంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే రెండు గ్రామాల్లో గొర్రెలు, మేకలు దొంగతనానికి గురికాగా.. కొన్నాళ్లకు దొంగలు దొరికారు. ఈ కేసులోనూ పోలీసు అధికారి చేతివాటం ప్రదర్శించాడని తెలిసింది. పోలీస్ స్టేషన్లో కరెంట్ సమస్య ఉందని, జనరేటర్ ఏర్పాటు చేయాలని భావించిన పోలీసు.. స్థానిక స్థిరాస్తి వ్యాపారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసినట్టు సమాచారం. నేటికీ స్టేషన్లో జనరేటర్ మాత్రం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మహిళా కానిస్టేబుల్తో అసభ్య ప్రవర్తన స్టేషన్లోని మహిళా కానిస్టేబుళ్లతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం క్రితం అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో స్టేషన్కు వచ్చిన సదరు పోలీసు.. అప్పుడే డ్యూటీ ముగించుకొని బయటకు వచ్చిన ఓ లేడీ కానిస్టేబుల్ను తన వాహనంలో ఎక్కాలంటూ ఆదేశించాడు. తాను వెళ్లిపోతానని, వద్దని వారించినా వినకుండా బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకున్నాడు. ఈ తతంగాన్ని గమనిస్తున్న మరో కానిస్టేబుల్ వీడియో చిత్రీకరించాడు. దీంతో ‘నీకిక్కడేం పనంటూ వెళ్లిపో, మెమో జారీ చేస్తానని’ బెదిరించాడు. మరుసటి రోజు సదరు బాధితురాలు తోటి కానిస్టేబుళ్లతో జరిగిన విషయాన్ని వివరించింది. ప్రస్తుతం ఠాణాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. మూడు మెమోలు జారీ.. సదరు పోలీసు అధికారిపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమేనని, ఇప్పటికే మూడు మెమోలు జారీ చేశామని తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అంతర్గత విచారణ జరుగుతోందని, ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. -
'స్వేచ్ఛ అంటే ఇలా ఉంటుందా'! ఏ జీవికైనా అంతేగా..
మనిషి దగ్గర నుంచి చిన్న చిన్న జంతువుల వరకు అన్ని ఫ్రీడమ్నే కోరుకుంటాయి. తమకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలనుకుంటాయి. ఐతే మనం పెంచుకునేందుకనో లేక మరే ఇతర కారణాల వల్లో కొన్ని పక్షులను, లేదా జంతువులను తెచ్చుకుని బంధించి ఉంచుతాం. ఐతే మనం ఎంతా బాగా టైంకి ఫుడ్ పెట్టి మంచిగా పెంచుతున్నా.. అవి ఏదో ఆర్టిఫిషయల్గా ఉంటాయే గానీ హ్యాపీగా ఉండలేవు. అదే తమదైన వాతావరణంలో స్వేచ్ఛగా ఉంటే మాత్రం అవి కూడా ఎంతో ఉల్లాసంగా గెంతులేస్తూ సహజసిద్ధంగా చక్కగా ఉంటాయి. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే 'ఫ్రీడమ్ అంటే ఇలా ఉంటుందా!' అనే క్యాప్షన్ని జోడించి మరీ అటవీ శాఖ అధికారి ఓ అద్భుతమైన వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బోనుల్లో బంధించి ఉన్న చిరుతలు, కోతులు, లేళ్లు, పక్షులు, గుర్రాలను తదితర వాటిని అడవిలో వదులుతారు. అవి ఒక్కసారిగా మాకు ఫ్రీడమ్ దొరికిందోచ్! అంటూ భలే రివ్వున వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. This is how freedom looks like. pic.twitter.com/EFUp4fT2sO — Parveen Kaswan, IFS (@ParveenKaswan) March 4, 2023 (చదవండి: ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ) -
పనికి ముందే రేటు.. కావాలనే లేటు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి వివాదమూ లేని భూములను కూడా వివాదంలో ఉంచేందుకు అవతలి పార్టీ నుంచి డబ్బు తీసుకుని ఆన్లైన్లో రెడ్మార్క్ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ భూమిని అమ్మడానికి, కొనడానికీ ఉండదు. చిన్న చిన్న ఫైళ్లకు కూడా డబ్బు అడగడం, ఇవ్వకపోతే ఫైలును నెలల తరబడి పెండింగులో పెట్టడం ఇక్కడ మామూలైంది. ముఖ్య అధికారి మామూళ్ల పర్వం తహసీల్దార్ కార్యాలయ ముఖ్య అధికారి ప్రతి పనికీ రేటు కట్టి యథేచ్ఛగా మామూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు జనన, మరణ ధృవీకరణ పత్రాలకూ లంచం తీసుకుంటున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు అధికారి అవినీతి వైఖరి నచ్చక ఒక దశలో ఇక్కడ పనిచేస్తున్న వీఆర్ఓలు సమ్మెలోకి వెళ్లాలని అసోసియేషన్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. తహసీల్దార్కు ఆర్డీఓ ఆఫీసులోని ఒక ఏఓ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) సహకరిస్తున్నారని, ఇవన్నీ ఆర్డీఓకు తెలిసినా మిన్నకుండిపోతున్నారని సమాచారం. దాదాపు 7 లక్షల మందికి ఈ తహసీల్దార్ కార్యాలయమే దిక్కు. ఈ నేపథ్యంలో భూముల సమస్యలపై ఇక్కడకు వచ్చే వేలాదిమంది పరిస్థితి వేదనాభరితంగా మారింది. రాప్తాడు నియోజకవర్గం మన్నీల పరిధిలోని భూమి(సర్వే నెం.25–4)కి సంబంధించి ఆర్ఓఆర్ (రైట్స్ ఆఫ్ రికార్డ్స్)కు యజమాని దరఖాస్తు చేసుకున్నారు. నెలల తరబడి తిరిగినా అనంతపురం తహసీల్దార్ కార్యాలయ అధికారులు కనికరించలేదు సరికదా.. ఆయన భూమిని వేరే వారి పేరున ఉన్నట్టు హక్కు పత్రాలు రాశారు. డైక్లాట్లో తనపేరే ఉన్నా తహసీల్దార్ అవతలి వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఇలా చేసినట్టు యజమాని ఆరోపిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం నారాయణపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.93–2లోని 2.84 ఎకరాల భూమిని వివాదంలో (డిస్ప్యూట్ ల్యాండ్ కింద) పెట్టారు. ఎలాంటి ఆర్డరు గానీ, ఆర్డీఓ కోర్టు నుంచి ఆదేశాలు గానీ లేకుండానే భారీగా డబ్బు తీసుకుని ఈ విధంగా చేసినట్టు తేలింది. నిజమైన హక్కుదారుడు మాత్రం బాధితుడిగా మిగిలిపోయాడు. సోములదొడ్డి గ్రామ పరిధిలోని సర్వే నెం.212–1ఎ లోని 5.50 ఎకరాల భూమిని ఇటీవలే వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్ కిందకు బదిలీ చేశారు. దీనికి సంబంధించి కిందిస్థాయిలో ఎలాంటి కన్వర్షన్ రిపోర్టు గానీ, అధికారుల సంతకాలు గానీ లేవు. నేరుగా తహసీల్దారే అన్నీ చేసేశారు. ఇందులో భారీగా డబ్బు చేతులు మారినట్టు తెలిసింది. ఉపేక్షించేది లేదు.. ఆర్ఓఆర్లు, ల్యాండ్ కన్వర్షన్లకు డబ్బు అడిగితే ఉపేక్షించేది లేదు. హక్కుదారులకు న్యాయం చేయకుండా ఫిర్యాదులను బట్టి భూములను వివాదాల్లో పెట్టడం సరి కాదు. దీనిపై ప్రత్యేక విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. – కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ (చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి) -
ఘోర రోడ్డు ప్రమాదం: సీఐ దంపతుల దుర్మరణం
కర్ణాటక: అతివేగం ఓ సీఐ, ఆయన భార్య ప్రాణాలను బలి తీసుకుంది. కలబుర్గిలో సొంత పనులను ముగించుకొని సింధగికి తిరిగి కారులో వెళుతుండగా అదుపు తప్పి ఆగి ఉన్న కంటైనర్ లారీ వెనుక భాగాన్ని ఢీకొనడంతో కారులోనే సీఐ దంపతులు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటన కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకా నెలోగి వద్ద బుధవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న సీఐ రవి ఉక్కుంద (45)తో పాటు ఆయన భార్య మధు (40) తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. వేగం, పొగమంచు వల్ల.. వేగంగా వెళ్లడానికి తోడు పొగ మంచులో దారి కనిపించకపోవడమే కారణమని భావిస్తున్నారు. కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో బయటకు పోలీసులకు తీయడానికి చాలా సమయం పట్టింది. గతంలో కొప్పళ జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం విజయపుర జిల్లా సింధగి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు 10 ఏళ్ల లోపు కొడుకు కూతురు ఉన్నారు. -
ఉత్తమ్కుమార్ బదిలీతో సంబరాలు చేసుకున్న ఉద్యోగులు
-
విద్యుత్ అధికారి బదిలీ.. ఉద్యోగుల సంబరాలు!
పండుగ చేసుకున్నారు... బ్యాండ్తో తీన్మార్ స్టెప్లు వేశారు.. ఇది పెళ్లికో, పేరంటానికో కాదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖలో ఎస్ఈగా పని చేసిన ఉత్తమ్ కుమార్ బదిలీ కావడంతో ఉద్యోగులు పండుగ చేసుకున్నారు. ఇలా పండుగ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఒక అధికారి బదిలీ అయితే సహ ఉద్యోగులు ఇలా పండుగ చేసుకుంటారా అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారి బదిలీతో పండుగ చేసుకున్న వారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లంచాలను కట్టడి చేసిన అధికారి బదిలీ కావడంతో సంబరాలు చేసుకోవడం స్థానికుల్లో ఆగ్రహం తెప్పించింది. ఏకంగా బ్యాండ్ వాయిద్యాలతో మరీ ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయం ముందు చిందులు వేయడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. -
వైరల్ వీడియో: అధికారి ముందు కుక్కలా అరుస్తూ నిరసన తెలిపిన వ్యక్తి..
-
యాక్సిడెంట్గా చిత్రీకరించి మర్డర్కి ప్లాన్! మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ మృతి
మైసూరు: కారు ఢీ కొని 82 ఏళ్ల మాజీ ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ఆరేకే కులకర్ణి మైసూరు యూనివర్సిటీ మానస గంగోత్రి క్యాంపస్ వద్ద వాకింగ్ చేస్తుండగా ఒక గుర్తు తెలియని వాహనం ఆయన్ను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆయన కుప్పకూలి మృతి చెందినట్లు తెలిపారు. ఐతే ఆ వాహనానంపై నెంబర్ ప్లేట్ లేదని పోలీసుల తెలిపారు. కులకర్ణి తన రోజువారి నిత్యచర్యలో భాగంగా వాకింగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం బారిన పడినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఆ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆ వాహనం ఆయన్ను కావాలనే ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపించింది. పోలీసులు దీన్ని ప్రీ ప్లాన్ మర్డర్గా అనుమానిస్తున్నారు. ఎందుకంటే సీసీఫుటేజ్లో కులకర్ణి కరక్ట్గా రోడ్డుకి పక్కగా ఉన్న కావాలనే కారు రోడ్డు లైన్ని క్రాస్ చేసి మరి ఢీ కొట్టినట్టు వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు అధికారులు. దీంతో అధికారులు ఈ యాక్సిడెంట్ని హత్యగా కేసుగా నమోదు చేసుకుని, ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీస్ కమీషనర్ చంద్రగుప్త తెలిపారు. తమ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. కులకర్ణి మూడు దశాబ్దాలకు పైగా ఇంటిలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసి 23 ఏళ్ల క్రితం రిటైర్ అయినట్లు తెలిపారు. (చదవండి: గంగ మీద ప్రమాణం చేద్దామని చెరువుకెళ్లి.. నీటిలో మునిగి..) -
రోడ్డుపై చిరుత కలకలం... భయపెట్టించేలా పరుగు తీసింది
మైసూర్లో ఒక రహదారిపై చిరుత హల్చల్ చేసింది. పలువురిని భయబ్రాంతులకు గురిచేసేలా పరుగులు పెట్టించింది. అందుకు సంబంధించిన వీడియో ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో చిరుత రోడ్డుపై వెళ్తున బైకర్ని కిందపడేసి, పిచ్చిపట్లినట్లు కలయ తిరిగింది. ఆ చిరుతను నియంత్రించేందుకు వస్తున్న ప్రభుత్వ ఉద్యోగికి దూరంగా పరుగులు పెట్టింది. చివరికి అటవీశాఖ అధికారులు ఆ చిరుతను ఏదోరకంగా శాంతింప చేసి లొంగదీసుకున్నారు. అది కాస్త ఒత్తిడికి గురైందని, అందువల్లే రోడ్డుపై ఉన్న జనాలను భయపెట్టించి పరుగులు పెట్టించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. ఈ వైరల్ వీడియోని చూసిన నెటిజన్లు చిరుత రక్షింపబడిందని ఆనందం వ్యక్తం చేయగా, కొంతమంది మానవులు ఆగడాలు ఎక్కువైపోవడం వల్లే అవి రోడ్లపైకి వస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. Disturbing visuals from Mysore.The crowd is only adding to the already stressed leopard. Latest, it has been safely tranquilised by the forest Department officials. It’s only mistake was that it was seen. After which the people became wild & the real wild struggled for safety. pic.twitter.com/F4dXNsAYvT — Susanta Nanda (@susantananda3) November 4, 2022 (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
యమునా నదిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు... ప్రూవ్ చేసిన అధికారి
యుమునా నది విషపూరితం అంటూ బీజేపీ ఎంపీ పర్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఢిల్లీ జల్ బోర్డ్ డైరెక్టర్ సంజయ్ శర్మతో వాదనకు దిగారు. ఉత్తరప్రదేశ్లో ప్రసిద్ధి గాంచిన ఛత్ పూజ సందర్భంగా వేలమంది స్నానం చేసే యమునా నదిలో స్నానం చేసి చూపించగలవా అంటూ ఛాలెంజ్ విసిరారు. దీంతో ఢిల్లీ జల్ బోర్డు డైరెక్టర్ సంజయ్ శర్మ ఆదివారం ఉదయం ఛత్ పూజకు ముందు యమునా నీటిలో స్నానం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో...యమునా నది శుభ్రంగా సురక్షితంగా ఉందని చూపించారు. నది నీరు స్వచ్ఛమైనది, ప్రజలకు ఎలాంటి హాని కలిగించదన్నారు. బీజేపీ ఎంపి పర్వేష్ శర్మ నీటిలో విష రసాయనాలు చల్లారంటూ ఆరోపణలు చేశారు. అందుకే తాను అన్నమాట ప్రకారం స్నానం చేసి చూపించాను. నదిని శుద్ధి చేసే నిమిత్తం సంబంధిత అధికారుల అనుమతితో రసాయనాలను పిచికారి చేశాం. నీరు విషపూరితం కాదని నొక్కి చెప్పారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. यह दिल्ली के सांसद है लेकिन इनकी जुबान तो देखो कितनी ओछी और तुच्छ है और वो भी भारतीय सरकार के एक अधिकारी के प्रति। delhi jal board k director DTQC Sanjay Sharma ji ne yamuna k Pani me naha kar ye saaf kar diya ki yamuna ka pani puri tarah se saaf h @msisodia @ANI @CNNnews18 pic.twitter.com/tsEnXfrkKA — water treatment plant DJB (@delhijalboard0) October 30, 2022 (చదవండి: ఎట్టకేలకు డ్రీమ్ గర్ల్తో వివాహం...మోదీ, యోగీలకు ఆహ్వానం!) -
ఐఏఎస్ అధికారి జీతేంద్ర నారాయణ్ను సస్పెండ్ చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారి జీతేంద్ర నారాయణ్ను సస్పెండ్ చేసింది కేంద్ర హోంశాఖ. ఓ మహిళను ఆయన లైంగికంగా వేధించారనే ఆరోపణల నేపథ్యంలో నివేదికను పరిశీలించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. జేతేంద్రపై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి(యూటీ డివిజన్) అశుతోష్ అగ్నిహోత్రి ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ఆదేశాలు జారీ చేశారు. 1990 బ్యాచ్కు చెందిన జీతేంద్ర నారాయణ్ అండమాన్ నికోబార్లో ఓ మహిళను వేధించారని ఇటీవల అరోపణలు వచ్చాయి. దీనిపై అక్కడి పోలీసుల నుంచి నివేదిక కోరింది కేంద్ర హోంశాఖ. జీతేంద్రపై వచ్చిన ఆరోపణలు నిజమే అని ఆదివారం అందిన నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఆ మరునాడే చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. జీతేంద్రను సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఉన్నత హోదాలో ఉండి అధికార దుర్వినియోగానికి, ప్రత్యేకించి మహిళలపై వేధింపులకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇలాంటి విషయాల్లో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. జీతేంద్ర నారాయణ్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసులతో పాటు, ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. చదవండి: కాంగ్రెస్ కొత్త సారథి ఎవరైనా గాంధీల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి -
నకిలీ సంతకాలు పెట్టి జీతం తీసుకుంటున్న అధికారిపై సస్పెన్షన్ వేటు
లక్నో: ఆఫీస్కు వెళ్లకుండానే ఆరు నెలలుగా జీతం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారిపై వేటు వేశారు ఉత్తర్ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్. ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల అందరిపైనా చర్యలకు ఉపక్రమించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. అమ్రోహా జిల్లాలో విధులు నిర్వహించే డా.ఇందు బాల శర్మ అనే అధికారిణి ఆర్నెళ్లుగా ఆఫీస్కు వెళ్లడం లేదు. కానీ రిజిస్టర్లో ఫేక్ సంతకాలు చేయించి జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయి తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం ఇప్పటికే డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించింది. జిల్లా అధికారులకు జీతాలు మంజూరు చేసే అధికారి సంతోష్ కుమార్పైనా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరు అధికారులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు -
ఏవో చెత్త బుద్ధి.. మహిళల ఫొటోలు తీసి ‘ఈమె ఎలా ఉంది’ అంటూ
సాక్షి, నల్గొండ: వ్యవసాయ శాఖలో ఉత్తమ ఏవోగా పేరుపొందాడు.. కానీ తన అనైతిక ప్రవర్తనతో చివరికి కటకటాల పాలయ్యాడు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కె.విజయ్రెడ్డి మహిళల ఫొటోలు తీసి.. ‘ఈమె ఎలా ఉంది’.. అంటూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ విషయం సంబంధిత మహిళలకు తెలియడంతో ఆయనపై నల్లగొండ వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాలలో నిందితుడు పెట్టిన పోస్టులను పరిశీలించిన పోలీసులు విజయ్రెడ్డిని అరెస్టు చేశారు. విజయ్రెడ్డిని కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
‘నా బిడ్డల మీద ఒట్టు.. అవి నా బ్రాండ్స్ కావు’
భువనేశ్వర్: అధికారం ఆయన చేతుల్లో ఉంది. ఇంకేం.. ఆఫీస్ను తన ఇష్టారాజ్యంగా మార్చేసుకున్నాడు. ఉద్యోగులపై వేధింపులకు పాల్పడడం చాలదన్నట్లు.. ఆఫీస్ వేళలో అదీ తన క్యాబిన్లోనే ఎంచక్కా చుక్కేశాడు. అంతటితో ఆగకుండా ఆ మైకంలో పచ్చిబూతులు మాట్లాడుతూ.. ఆ వీడియో, ఫొటోల ద్వారా వైరల్ అయిపోయాడు. ఒడిశా గాంజామ్ జిల్లా ఆరోగ్య విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో.. రాష్ట్రీయ బాల్ సురక్ష కార్యక్రమ(ఆర్బీఎస్కే), రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ(ఆర్కేఎస్కే) ప్రొగ్రామ్ల కింద అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు సందీప్ మిశ్రా. ఈయన వ్యవహార శైలిపై గతంలోనే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈసారి పక్కా ఆధారాలతో ఆయన్ని పట్టించారు కొందరు ఉద్యోగులు. ఆఫీస్ వేళలో తన కుర్చీలో తాగుతూ ఆయన మాట్లాడిన మాటలు, ఫొటోలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. వైరల్ వీడియో, ఫొటోలపై సందీప్ మిశ్రా స్పందించారు. ఇదంతా కుట్ర అని, అవి ఎడిటింగ్ చేసిన ఫొటోలనీ, తనను బద్నాం చేసేందుకు జరిగిన కుట్ర అని చెప్తున్నారాయన. ‘‘ఆఫీస్లో ఏనాడూ నేను మందు తాగలేదు. అసలు అందులో కనిపించిన బ్రాండ్లు నేనెప్పుడూ రుచి చూడలేదు. నా బిడ్డల మీద ఒట్టు.. అది మార్ఫింగ్ చేసినవి అయి ఉండొచ్చు’’ అని సందీప్ చెప్తున్నాడు. తాగిన మత్తులో ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడతాడని, మహిళా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తిస్తాడని ఓ ఉద్యోగిణి వెల్లడించారు. ఈ విషయంపై గాంజామ్ జిల్లా చీఫ్ డిస్ట్రిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమాశంకర్ మిశ్రా స్పందించారు. వీడియో తమ దృష్టికి రావడంతో సందీప్ మిశ్రాకు షోకాజ్ నోటీసులు పంపినట్లు తెలిపారు. నివేదిక రాగానే చర్యలపై నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఇలా కూడా చేస్తారా? -
మెడికల్ ఆఫీసర్ ని స్పాట్ లో సస్పెండ్ చేసిన మంత్రి విడదల రజిని
-
వ్యవసాయ అధికారి వంచన.. పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి
సాక్షి, బెంగళూరు: మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచన చేసిన వ్యవసాయ శాఖ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన మైసూరు జిల్లా పిరియా పట్టణ తాలూకా బెట్టదపుర సమీపంలో చోటుచేసుకుంది. ఇక్కడి రైతు సమాచార కేంద్రంలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న వికాస్పై కేసు నమోదు చేశారు. 2019లో పిరియా పట్టణ వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేసే మహిళతో వికాస్ పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నట్లు నటించి లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్బం దాల్చగా అబార్షన్ చేయించాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితురాలు పోలీసుల ఎదుట వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: జీన్స్ వేసుకోవద్దన్నాడని... భర్తనే కడతేర్చిన మహిళ -
చదివింపులు.. రూ. అరకోటి!
‘‘రాజుగారింట్లో పెళ్లి.. ప్రజలంతా వెళ్లి కానుకలు సమర్పించాలి’’ అంటూ అప్పట్లో రాజ్యంలో దండోరా వేయించేవారు. ఒకప్పుడు రాజరికంలో ఇవన్నీ చెల్లుబాటు అయ్యాయి. కానీ.. ఇదే పద్ధతి ఇప్పుడూ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కరీంనగర్ కలెక్టరేట్లోని ఓ ప్రభుత్వ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్న అధికారి కూడా తన ఇంట్లో జరిగే పెళ్లికి కానుకల సేకరణకు ఇలాగే దాదాపుగా దండోరా వేయించినంత పనిచేశారు. అసలే జిల్లాలో ఓ శాఖకు విభాగాధిపతి.. పైగా అతని ఇంట్లో పెళ్లి.. సిబ్బంది కానుకలు సమర్పించి స్వామి భక్తి చాటుకునేందుకు.. ఇదే అద్భుత అవకాశమని ప్రచారం చేయించారు. ఈ వార్త వినగానే.. 15 మండలాలు, 313 గ్రామపంచాయతీల్లో కలకలం రేగింది. దీనిపై సిబ్బందిలో మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఇదే మంచి తరుణమని తమ స్వామి భక్తి ప్రదర్శించేందుకు సమాయత్తమవగా.. మరికొందరు ఇదెక్కడి తలనొప్పిరా బాబూ అంటూ తల పట్టుకున్నారు. తగ్గేదేలే..! ► సదరు అధికారి ఇంట్లో పెళ్లి వేడుకకు ముందే.. కొందరు ఉద్యోగులు వసూలు చేసే బరువు బాధ్యతలను తమ భుజాలకు ఎత్తుకున్నారు. ► తొలుత జిల్లా కేంద్రంలో లిస్టు రెడీ చేసి ఆ మేరకు నగదు కానుకలను వసూలు చేశారు. ► ఆ తరువాత జిల్లాలోని ఆ విభాగానికి సంబంధించిన 15 మండలాల అధికారులకు, 313 గ్రామపంచాయతీ స్థాయిలో పనిచేసే తమ సిబ్బందికి తలా ఇంత అన్న టార్గెట్ విధించారు. ► కొందరు ససేమీరా అని ఇవ్వలేదు. మండలస్థాయి అధికారుల్లో కొందరు తలా తులం బంగారం ఇచ్చుకోగా.. మిగిలిన గ్రామస్థాయిలో నాలుగుదశల్లో పనిచేసే సిబ్బంది ప్రతీ మనిషి రూ.1000 నుంచి రూ.5000 వరకు సమర్పించుకున్నారు. ► కొందరు గ్రామీణ నేతలు, ప్రజాప్రతినిధులు, చోటా కాంట్రాక్టర్లు సైతం ఈ చదివింపుల మేళాలో పాలుపంచుకోవడం విశేషం. ► కొందరైతే విందుకోసం మేకలు, గొర్రెలు కూడా ఉడతాభక్తి కింద ఇచ్చినట్లు తెలిసింది. ► ఈ క్రమంలోనే కొన్నిచోట్ల సిబ్బంది నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు తెలిసింది. ఎవరో ఇంట్లో పెళ్లికి తామెందుకు డబ్బులు ఇవ్వాలంటూ ఎదురు తిరగడంతో వసూల్ రాజాలు వెనుదిరిగినట్లు సమాచారం. వేధింపులు మొదలు..! ఈ వేడుకకు సహకరించని వారిపై సదరు విభాగాధిపతి కక్షసాధింపులకు దిగినట్లు తెలిసింది. వారి సర్వీసు రికార్డులు తీసి మరీ వేధింపుల పర్వానికి తెరతీసినట్లు సిబ్బంది వాపోతున్నారు. సదరు అధికారి వాస్తవానికి ఈ పాటికే రిటైర్డ్ కావాల్సి ఉంది. కానీ.. ఇటీవల ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వం పెంచడంతో మూడేళ్ల సర్వీసు కలిసి వచ్చింది. దీంతో అదనంగా కలిసి వచ్చిన అవకాశాన్ని ఇలా అక్రమార్జనలకు వాడుతున్నారని సిబ్బంది మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పలువురు సిబ్బందిని సంప్రదించగా.. చాలామంది వెల్లడించేందుకు జంకి వెనకడుగువేశారు. కొందరు మాత్రం నిజమేనని ధ్రువీకరించారు. అయినా.. సదరు అధికారికి వ్యతిరేకంగా తాము ఎలాంటి ప్రకటనా చేయలేమని వాపోయారు. వాస్తవానికి కరీంనగర్ పట్టణంలో ఇలాంటి తంతు కొత్తదేం కాదు, గతేడాది కూడా ఓ నాయకుడి ఇంట్లో పెళ్లి సమయంలోనూ దాదాపుగా ఇదే జరిగింది. ప్రతీ సిబ్బంది తాము నిర్ణయించినంత మొత్తాన్ని వెంటనే అందజేయాలని కొందరు గ్రూపులీడర్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన ఆడియో సందేశం అప్పట్లో వైరల్గామారిన సంగతి తెలిసిందే. చదవండి: అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి! కారణం ఏంటంటే.. -
మళ్లీ తళుక్కున మెరిసిన ‘పోలింగ్’ బ్యూటీ.. ఆమె ఫాలోయింగ్ మామూలుగా లేదు!
లక్నో: 2019 సార్వత్రిక ఎన్నికల్లో పసుపు రంగు చీరలో పోలింగ్ బూత్కు వచ్చి ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన రీనా ద్వివేది గుర్తుందా? తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ఆఫీసర్గా ఉన్న రీనా ఈ సారి టాప్లో విధులకు హాజరయ్యారు. ప్రస్తుతం రీనా ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడత జరుగుతున్న సందర్భంగా పోలింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె స్లీవ్లెస్ బ్లాక్ టాప్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ బూత్కు విధుల నిమిత్తం వచ్చారు. ఈ క్రమంలో కొందరు ఆమెతో సెల్ఫీలు కూడా దిగారు. తన తోటి ఉద్యోగులు ఆమె ఫోలోయింగ్ చూసి ఆశ్చర్యపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు రంగు చీర ధరించి విధులకు హాజరైన రీనా తన డ్రెస్సింగ్ స్టైల్తో అందరిని ఆకట్టుకున్నారు.ఆ సమయంలో ఆమె ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికారు. దీంతో ఆమె రాత్రికి రాత్రే సోషల్మీడియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం రీనా ద్వివేదికి ఇన్స్టాగ్రామ్లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. లఖ్నవూలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా రీనా పని చేస్తోంది. -
‘సీఎం జగన్ ఆలోచనల వల్లే కోవిడ్ను విజయవంతంగా ఎదుర్కొన్నాం’
-
‘సీఎం జగన్ ఆలోచనల వల్లే కోవిడ్ను విజయవంతంగా ఎదుర్కొన్నాం’
సాక్షి, అమరావతి: సీఎం జగన్ ఆలోచనల వల్లే కోవిడ్ను విజయవంతంగా ఎదుర్కొన్నామని చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ తెలిపారు. సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన తర్వాత ఆ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 27 పీహెచ్సీ ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కరోనా మొదటి, రెండవ వేవ్లో ఆక్సిజన్ లేకపోవడం వలన సుదూర ప్రాంతాలకు పంపేవాళ్లమని తెలిపారు. ప్రస్తుతం సీఎం అందించిన సదుపాయాలతో.. దేశంలో అత్యధికంగా కోవిడ్ నిర్ధారణ చేయగలిగామని తెలిపారు. అదే విధంగా.. కోవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్లు అత్యధికంగా వేయగలిగామన్నారు. సీఎం జగన్ మంచి ఆలోచనల వల్ల కోవిడ్ను విజయవంతంగా ఎదుర్కొన్నామని డాక్టర్ కిరణ్ తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో వ్యాక్సిన్ వేయడంలోనూ దూసుకుపోతున్నామని తెలిపారు. అదేవిధంగా గుంటూరు జిల్లా జీజీహెచ్ నుంచి శైలజ అనే మహిళ మాట్లాడారు. కరోనా సెకండ్వేవ్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని తెలిపింది. గుంటూరు జీజీహెచ్లో అత్యవసర విభాగంలో చికిత్స తీసుకున్నానని తెలిపింది. డాక్డర్లు, ఆసుపత్రి సిబ్బంది చేసిన వైద్యంతోనే ఈ రోజు బ్రతికానని కన్నీటి పర్యంతమయ్యింది. అదే విధంగా మందులతో పాటు మధ్యాహ్నం పెట్టే పోషకాహరం తనప్రాణాలు నిలవడానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపింది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తమకు నిత్యవాసర సరుకులు ఇంటికి తీసుకొచ్చి అందించారని తెలిపింది. మూడోవేవ్లో ఆక్సిజన్ కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా.. విశాఖపట్నం అనస్థిషియా టెక్నిషియన్ రవికుమార్ మాట్లాడారు. కోవిడ్ సెకండె వేవ్లో ఆక్సిజన్ కొరత వేధించిందని, విశాఖలో 15 ఆక్సిజన్ ప్లాంట్స్ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పీహెచ్సీ ఆక్సిజన్ ప్లాంట్ల వలన బాధితులకు 90 శాతం వరకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించబడుతుందని తెలిపారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల వల్ల కొండ ప్రాంతాలైన అరకు, పాడేరు ప్రాంతాలలో ఆక్సిజన్ సరఫరా సులభమవుతుందని తెలిపారు. పీహెచ్సీ ప్లాంట్ల వల్ల అగ్నిప్రమాదాలు కూడా తక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. వెయ్యి ఎల్పీఎం సామర్థ్యం ఉన్న పీహెచ్సీ ఆక్సిజన్ ప్లాంట్తో ఒక రోజులో 25 ఐసీయూ బెడ్లకు, 100 నాన్ ఐసీయూ బెడ్లకు ఆక్సిజన్ అందించే అవకాశం ఉంటుందని రవికుమార్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అందించిన సదుపాయాలతో కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు రవికుమార్ తెలిపారు. -
విషాదం: బీఈఓ ఆత్మహత్య.. పిస్టల్తో తలపై కాల్చుకుని..
యశవంతపుర(కర్ణాటక): తాలూకా స్థాయి విద్యాధికారి అనారోగ్య కారణాలతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు కోడిగేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... నగర జిల్లాలోని యలహంక బ్లాక్ విద్యాధికారి (బీఈఓ)గా శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా టెంకబైలుకు చెందిన కమలాకర్ (52) నాలుగేళ్ల నుంచి పని చేస్తున్నారు. చదవండి: స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే? ఇటీవల కమలాకర్ అనారోగ్యానికి గురయ్యారు. బెంగళూరులోని ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి దగ్గర్లోని ఖాళీ స్థలంలో పిస్టల్తో తలపై కాల్చుకోవడంతో ప్రాణాలు వదిలాడు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోడిగేహళ్లి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ మంత్రికి ఝలక్.. 69 చోట్ల విజిలెన్స్ సోదాలు
అన్నాడీఎంకే మాజీ మంత్రులపై డీఎంకే ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే నలుగురు మాజీలపై అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన డీవీఏసీ తాజాగా తంగమణి లక్ష్యంగా సోదాలు చేపట్టింది. ఇందులో ఇప్పటివరకు రూ.2.37 కోట్లు లెక్కలోకి రాని నగదు, 40 కేజీల వెండి, 1.5 కేజీల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): మాజీ మంత్రి తంగమణిని బుధవారం డీవీఏసీ (డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్) టార్గెట్ చేసింది. తంగమణి, ఆయన కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాలు అంటూ 69 చోట్ల అధికారులు సోదాల్లో నిమగ్నమయ్యారు. ఈ చర్యల్ని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్షసాధింపు ధోరణి తగదని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సిద్ధం చేసిన జాబితా మేరకు.. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు సాగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగం, లంచగొండితనం తదితరుల వ్యవహారాలపై ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఓ జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. వీరిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో గవర్నర్కు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. తాజాగా, తాము అధికారంలోకి వచ్చినానంతరం ఆ జాబితాలో ఉన్న అవినీతి రాయుళ్ల భరతం పట్టే దిశగా డీఎంకే ప్రభుత్వం దూకుడు పెంచింది. తొలుత రవాణశాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్ను టార్గెట్ చేసి సోదాలు విస్తృతం చేసి, ఆయన్ని విచారణ వలయంలోకి తెచ్చా రు. తదుపరి ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఎంఆర్ విజ య భాస్కర్, రిజస్ట్రేషన్ల శాఖ మాజీ మంత్రి వీరమ ణిని టార్గెట్ చేశారు. ఇటీవల నగరాభివృద్ధి శాఖ మంత్రి, పళనిస్వామి సన్నిహితుడు ఎస్పీ వేలుమణిపై దృష్టి పెట్టారు. తాజాగా మరో సన్నిహితుడు, విద్యుత్శాఖ మాజీ మంత్రి తంగమణి లక్ష్యంగా డీవీఏసీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తు లు గడించినట్టు ఆయనపై కేసు నమోదు చేసింది. ఏక కాలంలో సోదాలు 2016–2021 మధ్య కాలంలో ఆదాయానికి మించి రూ.4.85 కోట్లు ఆస్తుల్ని తంగమణి గడించినట్టు ఆధారాలతో సహా తేల్చిన డీవీఏసీ వర్గాలు కేసు నమోదు చేశాయి. ఆయన భార్య శాంతి, కుమారు డు ధరణి ధరణ్ను సైతం ఈ కేసులో చేర్చారు. దీంతో బుధవారం ఉదయాన్నే పలు బృందాలుగా డీవీఏసీ అధికారులు రంగంలోకి దిగారు. ఏక కాలంలో తంగమణి ఆస్తులు, సన్నిహితుల ఇళ్లు, బినామీ సంస్థలపై దాడులకు దిగారు. చెన్నై, నామక్కల్, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ తదితర తొమ్మిది జిల్లాలతో పాటుగా ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో అనేకచోట్ల పొద్దు పోయే వరకు సోదాలు జరిగాయి. నామక్కల్ జిల్లా ఆలపాళయంలోని తంగమణి ఇంట్లో సోదాలు సాగుతున్నాయి. ఈ సమయంలో అన్నాడీఎంకే వర్గాలు అక్కడికి తరలివచ్చి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నైలో అరుంబాక్కం, షెనాయ్ నగర్తో పాటుగా 14 చోట్ల, సేలంలోని తంగమణి కుమారుడు ధరని ధరణ్ ఇంట్లోనూ సోదాలు సాగుతున్నాయి. పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, బినామీ సంస్థలు, పలు చోట్ల పెట్టుబడులే కాకుండా క్రిష్టోకరెన్సీలోనూ పెట్టుబడులు పెట్టినట్టుగా ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోదాలు ముగిసినా, తంగమణి, ధరణి ధరణ్ నివాసాలు, టైల్స్ సంస్థలు, మాల్స్లలో ఇంకా సోదాలు సాగుతున్నాయి. కాగా ఇప్పటివరకు రూ.2.37 కోట్లు లెక్కలోకి రాని నగదు, 40 కేజీల వెండి, 1.5 కేజీల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కక్ష సాధింపు తగదు డీవీఏసీని ఉసిగొలిపి డీఎంకే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో–కన్వీనర్ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సేలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల వాగ్దానాల్ని విస్మరించిందని, వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీ వర్గాల మీద కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తాము నిరసనలకు పిలుపు నివ్వగానే కేసులు, దాడులు అంటూ ముందుకు సాగడం శోచనీయమన్నారు. ఈ విషయంపై నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ స్పందిస్తూ, 2011 తర్వాత తనతో పాటుగా డీఎంకే వర్గాల్ని అన్నాడీఎంకే సర్కారు పెద్దఎత్తున అరెస్టు చేయించిందని గుర్తు చేశారు. అది కక్షసాధింపు అయితే, ఇది కూడా అలాగే అనుకోనివ్వండి అని పేర్కొన్నారు. -
మాజీ ఐఏఎస్ ఇంట్లో సోదాలు..అధికారుల్ని అడ్డుకున్న ఏబీఎన్ రాధాకృష్ణ!
సాక్షి, హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏపీ సీఐడీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే.. మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ శుక్రవారం సోదాలు నిర్వహించారు. కాగా, గతంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సలహాదారుగా పనిచేశారు. తన పదవీ కాలంలో యువకులకు శిక్షణనిచ్చే క్రమంలో.. లక్ష్మినారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని పలు అభియోగాలు నమోదయ్యాయి. లక్ష్మినారాయణ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర సీఎస్గా పనిచేశారు. లక్ష్మినారాయణ రూ. 242 కోట్ల నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయ్యింది. సోదాలో భాగంగా.. ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మినారాయణ ఇంట్లో వెళ్లినప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో రాధాకృష్ణ, లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులు ఏపీ సీఐడీ అధికారులను ఇంట్లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం.. అధికారులు మాజీ ఐఏఎస్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి -
కంప్యూటర్ ఆపరేటర్కు వేధింపులు.. మాతృ సంస్థకు ఉన్నతాధికారి
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ ఆపరేటర్ను లైంగికంగా వేధించాడనే ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఎస్ఓ)గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ను ఆయన మాతృశాఖ అయిన వైద్యారోగ్య శాఖకు పంపించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ తనను కొంతకాలంగా వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు నేరుగా మేయర్ను కలిసి ఫిర్యాదు చేయడం, సీరియస్ అయిన మేయర్ ఎస్ఓను మాతృశాఖకు పంపించాల్సిందిగా ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ను మా తృశాఖకు పంపించడంతో పాటు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తదుపరి చ ర్యల నిమిత్తం నివేదికను ఆయన మాతృశాఖకు పంపిస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత -
కంప్యూటర్ ఆపరేటర్కు లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: మహిళా కంప్యూటర్ ఆపరేటర్ను వేధిస్తున్న స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్ను వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు మాతృశాఖకు పంపించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత ఆరోగ్యవిభాగం అడిషనల్ కమిషనర్ బాదావత్ సంతోష్ను ఆదేశించారు. బాధితురాలు మేయర్కు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చార్మినార్ జోన్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు చీఫ్ మెడికల్ ఆఫీసర్కు, కొందరు యూనియన్ నేతలకు గత వారమే తన బాధలు తెలియజేశారు. తాజాగా సోమవారం నేరుగా మేయర్ విజయలక్ష్మిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మి అతన్ని వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్ను ఆదేశించారు. విషయం తెలిసినప్పటికీ, తగిన విధంగా స్పందించని చీఫ్ మెడికల్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన శ్రీనివాస్ గత ఫిబ్రవరిలో పదోన్నతిపై బల్దియాకు వచ్చారు. గ్రేటర్లోని 30 సర్కిళ్లకు గాను 15 సర్కిళ్లకు స్టాటిస్టికల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. తరచూ చార్మినార్ జోన్కు వెళ్లేవాడని సమాచారం. తన విషయం బహిర్గతమవుతుందని తెలిసి సోమవారం అయ్యప్పమాల ధరించినట్లు జీహెచ్ఎంసీలో ప్రచారం జరుగుతోంది. -
ఇస్రోలో ఉద్యోగం సాధించిన ఇల్లెందు వాసి..
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పట్టణానికి చెందిన కోట సాయిపవన్తేజ్ ఉద్యోగం సాధించాడు. గ్రూప్–1 గెజిటెడ్ స్థాయి కలిగిన శాస్త్రవేత్తగా అతడు ఉద్యోగం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సాయిపవన్తేజ్కు చిన్నతనం నుంచే చదువు మీద మక్కువ. తల్లిదండ్రులు కోట విజయ్కిశోర్బాబు, లావణ్య పవన్తేజ్ పదో తరగతిలో ఉన్నప్పుడే అగ్నిప్రమాదంలో మృతిచెందారు. అయినా పట్టుదలతో చదివాడు. ఇంటర్ అనంతరం జేఈఈ అడ్వాన్స్డ్ ఆలిండియా స్థాయిలో 502 ర్యాంకు సాధించాడు. ఓబీసీ కేటగిరీలో 59వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించాడు. 2021లో ఇంజనీరింగ్లో 82 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. ఈ ఏడాదిలోనే ఇస్రో వారు ఢిల్లీ ఐఐటీలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించగా సాయిపవన్తేజ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ గ్రూప్–1 గెజిటెడ్ పోస్టుకు ఎంపికయ్యాడు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (గగన్యన్ ప్రాజెక్టు)కు ఎంపికయ్యాడు. కాగా, శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయిపవన్తేజ్ను ఎమ్మెల్యే హరిప్రియతోపాటు మున్సిపల్ చైర్మన్ డీవీ, విద్యాబోధన చేసిన ఎంసీ నాగిరెడ్డి, కేఎస్వీ సుధాకర్, శ్రీను, అర్వపల్లి రాధాకృష్ణ, ప్రసాద్ అభినందించారు. చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు చదవండి: భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త -
వ్యవసాయాధికారి బాగోతం.. ముడుపుల కోసం ఏకంగా వాట్సాప్ గ్రూప్..
సాక్షి, చండ్రుగొండ (ఖమ్మం): షాపుల్లో తనిఖీచేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన మండల వ్యవసాయాధికారి(ఏఓ) వ్యాపారుల నుంచి డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. చండ్రు గొండలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపుల్లో తనిఖీచేయకుండా ఉండేందుకు ఏఓ ఎన్ఎంసీ.చటర్జీ ప్రతీ షాపు నుంచి రూ.15 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రతి నెల లంచం కోసం ఒక వాట్సప్ గ్రూప్నే ఏర్పాటు చేశాడు. దీంతో డీలర్లు గోదా సత్యం,ఎర్రం సీతారాములు, చెవుల చందర్రావు, నన్నక వెంకటరామయ్య, ముఖేష్, మచ్చా కుమార్ గతనెల 30వ తేదీన ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు విచారించిన అధికారులు వాస్తవవమేనని నిర్ధారించుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల సూచన మేరకు డీలర్లు గోదా సత్యం, ఎర్రం సీతారాములు మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో ఏఓ చటర్జీకి రూ.90 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకు న్నారు. కాగా, ఏఓ చటర్జీ స్థానికంగా తనకు తెలిసిన వ్యక్తితో పురుగు మందులు, విత్తనాల షాపు పెట్టించి రైతులందరినీ అదే షాపులో కొనాలని సూచిస్తన్నాడనే ఆరోపణలున్నాయి. ఏఓ నివాసంలో సోదాలు చండ్రుగొండ ఏఓ చటర్జీ స్వగ్రామమైన అశ్వారావుపేటలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఖమ్మం ఏసీబీ ఇ¯న్స్పెక్టర్ రఘుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి పలు డాక్యుమెంట్లు, బంగారు అభరణాలు సీజ్ చేశారు. -
భర్త స్వీపర్..అదే అఫీసులో ఉన్నత స్థాయి అధికారిణిగా భార్య
BJP Sonia: తాను స్వీపర్గా పని చేస్తున్న ఆఫీసులోనే తన భార్య బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్గా వ్యవహరిస్తుందని ఏ భర్త కలలో కూడా ఊహించడు. కానీ ఇది నిజంగానే ఓ వ్యక్తి జీవితంలో జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్హేరా గుజ్జర్ గ్రామంలో నివసిస్తున్న సునీల్, బలియాఖేరి డెవలప్మెంట్ బ్లాక్లో స్వీపర్గా పనిచేస్తున్నారు. ఇటీవల యూపీలో బ్లాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్నికలు జరగగా, అందులో తన భార్య సోనియా 55 వ వార్డు నుంచి బీడీసీ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించింది. ఆ తర్వాత బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్ అధికారి పోస్టుకు ఎన్నికలు జరగ్గా.. ఆ పోస్టును షెడ్యూల్ కుల వర్గానికి కేటాయించారు. ఈ క్రమంలో ఆ ప్రాంత బీజేపీ నాయకుడు, జిల్లా పంచాయతీ సభ్యుడు ముఖేష్ చౌదరి నిర్ణయం మేరకు విద్యావంతురాలైన సోనియాను నిలబెట్టాడు. ఈ ఎన్నికలో కూడా ఆమె సూనయాసంగా విజయం సాధించింది. ఈ క్రమంలో బలియాఖేరి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసులో తన భర్త స్వీపర్గా పని చేస్తున్న కార్యాలయంలోనే సోనియా అధికారిగా బాధ్యతలు చేపట్టింది. ఇదిలా ఉండగా సోనియా బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్గా ఎన్నికైనప్పటికీ.. తన స్వీపర్ ఉద్యోగాన్ని కొనసాగిస్తానని ఆమె భర్త సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో తన భర్త, ఆమె కుటుంబం మద్దతు ఇచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. తన భర్త ఉద్యోగం చేయడం వల్లే కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నామని సోనియా తెలిపారు. -
వ్యాక్సిన్లు విక్రయిస్తున్న వైద్యాధికారి అరెస్ట్
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): కోవిడ్ వ్యాక్సిన్లను విక్రయిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యాధికారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జీ కొండూరు మండలం లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ ఎన్ఎస్ రాజు నగరంలోని సబ్కలెక్టర్ కార్యాలయంలోని కోవిడ్ హెల్ప్లైన్ 104లో డిప్యూ టేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజులుగా కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో సత్యనారాయణపురం, మత్యాలంపాడు ప్రాంతాల్లో కారులోనే వ్యాక్సిన్లు వేస్తూ రూ.600 నుంచి రూ.1000 వరకూ వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సత్యనారాయణపురంలోని ఓ భవనంలో వ్యాక్సిన్ వేస్తున్నట్టు సమాచారం అందడంతో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శీరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ బాలమురళీకృష్ణ, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వైద్యాధికారితో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేశారు. భవనంలోని స్టోర్ రూంలో భద్రపర్చిన సిరెంజిలు, 5 కోవాగి్జన్, 6 కోవిషీల్డ్ వ్యాక్సిన్లను సీజ్ చేశారు. -
జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో దోషిగా డెరిక్ చౌవిన్
-
లేని కారుకు కిరాయి.. ఇదెలా సాధ్యం సార్!
సాక్షి, నిజామాబాద్ : సాధారణంగా కొందరు అధికారులు కారు అద్దె డబ్బులను స్వాహ చేసేందుకు తమ సొంత కార్లను, బంధువుల పేరిట ఉన్న వాహనాలను వినియోగిస్తారు. కానీ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లో ఓ అధికారి మరో అడుగు ముందుకేశాడు. లేని కారును ఉన్నట్లుగా, తిరగకున్నా తిరిగినట్లుగా చూపించి అద్దె డబ్బులు స్వాహా చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు నెలల పాటు అక్రమంగా ప్రభుత్వ సొమ్మును మింగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా, ప్రస్తుతం ఆ శాఖ ఉద్యోగుల్లో హాట్ టాపిక్గా మారింది. గ్రామీణాభివృద్ధి శాఖలో ఇదివరకు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తికి టీఎస్ 05యూఏ 7336 నంబరు గల కారు ఉండేది. ఆ కారు తన భార్య పేరుపై రిజిస్టరై ఉంది. అయితే సదరు కారు గ్రామీణాభివృద్ధి శాఖలో అద్దెకు వినియోగించనేలేదు. కానీ శాఖకు చెందిన ఓ అధికారి సంబంధిత కారు ఆర్సీని ఆధారంగా చేసుకొని కారు తిరిగినట్లుగా రికార్డులు సృష్టించాడు. మొదట ఒక నెల అద్దె డబ్బులను తీసుకోగా, రుచి మరగడంతో వరుసగా ఐదు నెలల అద్దె డబ్బులను స్వాహా చేశాడు. ప్రతినెలా 25వేలు, అంతకు పైగానే తిరిగినట్లుగా చూపించి నెలకు రూ. 32,340 చొప్పున ఐదు నెలలు కలిపి రూ. లక్షా 50 వేలకుపైనే జేబులో వేసుకున్నారు. లేని కారు పేరిట తిరగకున్నా బిల్లులు తీసుకోవడం పద్ధతి కాదని శాఖలోని ఒకరిద్దరు ఉద్యోగులు సదరు అధికారికి చెప్పినా వినలేదు. అంతా నేను చూసుకుంటానని చెప్పి వారితో బలవంతంగా బిల్లులు చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. విషయం బయటకు పొక్కడంతో ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. డ్రైవర్ వద్దన్నా.. డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి తన భార్య పేరిట ఉన్న కారు పేరుతో అక్రమంగా బిల్లులు తీసుకోవడంపై తొలుత అభ్యంతరం వ్యక్తం చేశాడు. అధికారి కింద పనిచేస్తుండడంతో ఉద్యోగానికి ప్రమాదం ఏర్పడి ఉపాధి దెబ్బ తింటుందనే ఉద్దేశంతో గట్టిగా అనలేకపోయాడు. అయితే కొన్నిరోజులకు సదరు కారును వేరే వ్యక్తులకు అమ్మేశాడు. అయినప్పటికీ కూడా ఆర్సీని ఆధారంగా చేసుకుని అధికారి బిల్లులు పొందాడు. ఇలాగే ఉంటే తనకు ప్రమాదం ఏర్పడుతుందని ఆ కారు డ్రైవర్ కూడా గ్రామీణాభివృద్ధి శాఖలో విధులు మానుకుని వేరేశాఖలో పని చేసున్నాడు. ఇదిలా ఉండగా, అద్దె వాహనాన్ని నిబంధనల ప్రకారం జిల్లా పరిధిలోనే తిప్పాలి. శాఖకు సంబంధించిన పని ఉంటే రాష్ట్ర శాఖకు వెళ్లడానికి హైదరాబాద్ వరకు నెలలో నాలుగైదు సార్లు వెళ్లే అవకాశం కూడా ఉంది. కానీ గ్రామీణాభివృద్ధి శాఖలోని సదరు అధికారి మాత్రం వారంలో ఒకటి, రెండు సార్లు వేరే జిల్లాకు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. అలాగే శాఖలోని ఇతర ఉద్యోగుల వాహనాలను కూడా సొంత పనులకు వినియోగించుకున్నట్లు విమర్శలున్నాయి. శాఖ పనులకు ఉపయోగించాం కారును శాఖ పనులకు వినియోగించాం. వేరే జిల్లాకు రెండు, మూడు సార్లు వెళ్లిన విషయం వాస్తవమే. రికార్డులు పక్కగా ఉంటేనే బిల్లులకు అనుమతి ఇచ్చాం. – శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్డీవో చదవండి: ఖమ్మం నగరంలో మోడల్ ‘వైకుంఠధామం’ కొడుకా.. నువ్వులేక మేము బతుకుడెట్లా!