వివరాలు ఆన్ లైన్ లో అప్డేట్ చేయండి
Published Mon, Nov 7 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
అనంతపురం టౌన్ :
కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ యోజనకు సంబంధించి ఇల్లు కావాల్సిన వారి వివరాలను ’ఆవాస్ సాఫ్ట్’లో అప్లోడ్ చేయాలని హౌసింగ్ పీడీ ప్రసాద్ సూచించారు. సోమవారం సాయంత్రం డ్వామా హాల్లో గృహ నిర్మాణ సంస్థ అధికారులకు శిక్షణ నిర్వహించారు. అనంతరం తన చాంబర్లో సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా 737 గ్రామ పంచాయతీల్లో ఆప్లోడ్ చేయాల్సి ఉన్నా 357 పంచాయతీల్లో మాత్రమే చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇళ్లకు సంబంధించి 50 శాతం అనుమతులు వచ్చాయన్నారు.
Advertisement
Advertisement