విద్యావలంటీర్ల ఎంపిక జాబితా వెల్లడి
Published Tue, Jul 26 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
విద్యారణ్యపురి : జిల్లాలో 48 మండలాల్లో పాఠశాలల్లో విద్యా వలంటీర్ల నియమాకం కోసం ఎంపిక జాబితాను సోమవారం డీఈఓ పి.రాజీవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని ఎమ్మార్సీ భవనాల్లో ఎంపిక జాబితా ప్రదర్శించారు. జిల్లాలో 493 మంది విద్యావలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు.
ఇందులో 465 మందిని ఎంపిక చేసి జాబితాను వెల్లడించారు. మరో 26 మంది ఏజెన్సీ పాఠశాలలకు సంబంధించిన వా టిని పలు కారణాలతో పెండింగ్ పెట్టారు. మరో రెండు చోట్ల ఇద్దరు ఉర్దూ మీడియంలో విద్యావలంటీర్లు లభించలేదు. కాగా, ఎంపికైన విద్యావలంటీర్లు ఈనెల 26న తమకు కేటాయిం చిన పాఠశాలల్లో చేరాలని డీఈఓ కోరారు.
Advertisement
Advertisement