selection
-
ఢిల్లీ సీఎం ఎంపిక.. ప్రధాని సహా బీజేపీ అగ్రనేతల భేటీ
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సీఎం ఎవరనే సస్పెన్స్కు కొన్ని గంటల్లో తెరపడనుంది. సీఎం ఎవరన్నది ఖరారు చేసేందుకు బుధవారం(ఫిబ్రవరి 19) ఉదయం ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. సీఎం ఎవరన్నది ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. ఖరారు తర్వాత సీఎం ఎవరన్నది సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు.అనంతరం రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకోనున్నారు. బీజేఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, ఓపి దంకర్ను అధిష్టానం నియమించింది. బీజేఎల్పీ నేతను ఎన్నుకునేందుకుగాను వీరు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతారు. బీజేఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత పార్టీ ముఖ్య నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. సీఎం రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ),రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్),అజయ్ మహావార్ (ఘోండా) ఉన్నారు. అయితే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందున్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పర్వేష్వర్మకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని సమాచారం.ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన వారిలో పదిమంది జాట్ ఎమ్మెల్యేలుండడం పర్వేష్కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.కాగా గురువారం 11 గంటలకు ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు.రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం కోసం రామ్లీలా మైదానంలో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. మొత్తం 150 మంది ముఖ్య అతిథులకు ఆహ్వానం పలికారు.ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. ప్రమాణస్వీకారానికి లక్ష మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది. -
గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ కొలువుల తివాచీ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎర్రతివాచీతో ఆహ్వానం పలుకుతున్నాయి. రూ.లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ.. తమ సంస్థల్లో ఉద్యోగాలిస్తున్నాయి. ఈసారి నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి ఏకంగా 473 మంది విద్యార్థులను క్యాంపస్ సెలక్షన్లలో వివిధ కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. కొందరు విద్యార్థులైతే రూ.27.6 లక్షల వార్షిక వేతనానికి సైతం ఎంపికయ్యారు. సాకారమవుతున్న వైఎస్సార్ ఆశయం.. పేదల పిల్లలకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీల ఆశయం నెరవేరుతోంది. ట్రిపుల్ ఐటీల్లో చదివే వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, కూలీలు, చిరుద్యోగుల పిల్లలే. వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించి ట్రిపుల్ ఐటీల్లో సీట్లు దక్కించుకున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి చదువు పూర్తికాకముందే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇప్పటివరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో 11 బ్యాచ్లు చదువు పూర్తిచేసుకొని వెళ్లగా.. దాదాపు ఏడు వేల మందికి పైగా విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలాగే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో, మరికొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈసారి 2018–24 బ్యాచ్కు చెందిన 473 మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగ అవకాశాలు లభించేలా శిక్షణ.. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసం నూజివీడు ట్రిపుల్ ఐటీలోని కెరీర్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ సెల్ ఎంతో కృషి చేస్తోంది. విద్యార్థులకు నిరంతరం మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో క్యాంపస్ సెలెక్షన్లు నిర్వహింపజేస్తోంది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, థాట్ వర్క్స్, ఎఫ్ట్రానిక్స్, అచల ఐటీ సొల్యూషన్స్, పర్పుల్ టాక్, పర్పుల్ డాట్కామ్, ఈజ్ సాఫ్ట్, ఎన్సీఆర్, ఏడీపీ, అన్లాగ్ డివైజస్, టెక్ మహీంద్రా తదితర ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ క్యాంపస్ సెలెక్షన్లు నిర్వహించేలా ప్రత్యేక కృషి చేస్తోంది. దీంతో గత విద్యా సంవత్సరంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో 56 కంపెనీలు క్యాంపస్ సెలక్షన్లు నిర్వహించాయి. ఆరుగురికి అత్యధిక ప్యాకేజీ.. క్యాంపస్ సెలక్షన్లకు 746 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 473 మంది విద్యార్థులు రూ.4.5 లక్షల నుంచి రూ.27.6 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. బెంగళూరుకు చెందిన అన్లాగ్ డివైసెస్ కంపెనీ రూ.27.6 లక్షల వార్షిక వేతనానికి ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసుకుంది. వీరికి ఏడాది పాటు ఇచ్చే ట్రైనింగ్లో సైతం నెలకు రూ.40 వేల స్టైఫండ్ ఇవ్వనుంది. అలాగే సినాప్సిస్ కంపెనీ రూ.20 లక్షల వార్షిక వేతనంతో ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసుకుంది. హైదరాబాద్కు చెందిన మైక్రాన్ కంపెనీ రూ.16 లక్షల వార్షిక వేతనంతో ఇద్దరిని, బెంగళూరుకు చెందిన వేదాంతు కంపెనీ రూ.15 లక్షల వార్షిక వేతనంతో నలుగురిని, బెంగళూరుకు చెందిన బీఈఎల్ కంపెనీ రూ.12.45 లక్షల వార్షిక వేతనానికి నలుగురిని, హైదరాబాద్కు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ఫౌండేషన్ రూ.11 లక్షల వార్షిక వేతనానికి 10 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.క్యాంపస్ సెలక్షన్స్పై ప్రత్యేక తర్ఫీదు విద్యార్థులకు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం నుంచే క్యాంపస్ సెలక్షన్ల కోసం నిరంతరం శిక్షణ అందిస్తుంటాం. మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. దీంతో విద్యార్థులు ఎలాంటి భయం, బెరుకు లేకుండా క్యాంపస్ సెలెక్షన్లలో అన్ని దశలను ఎదుర్కొని.. సులభంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు.– బి.లక్ష్మణరావు, ఏఓ, నూజివీడు ట్రిపుల్ ఐటీ -
స్పీకర్ ఎన్నిక.. ‘ఇండియా’ కూటమిలో చిచ్చు !
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్ పదవికి కె.సురేష్ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపిస్తోంది. స్పీకర్ పదవికి కె.సురేష్ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్25) మీడియాకు తెలిపారు. ‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా కె.సురేష్ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.కాగా, 18వ లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం(జూన్26) జరగనుంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్ చేయకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి. -
క్యాంపస్ సెలక్షన్స్లో టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థినీ గ్లోబల్ ఉద్యోగిగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఉద్యోగ నైపుణ్య ఆధారిత విద్యా సంస్కరణలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. విద్యార్థి చదువు సమయంలోనే వృత్తి నైపుణ్యాలను కూడా నేర్చుకోవడం ద్వారా మల్టీ నేషనల్ కంపెనీల్లో సులభంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలకు ఎంపికవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది.ఇంటర్న్షిప్, ఫ్యూచర్ స్కిల్స్లో రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో నిలిచింది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్షిప్, మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఇంజనీరింగ్, డిగ్రీలోనే కాకుండా డిప్లొమా విద్యార్థులూ మంచి మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. వీటన్నింటికీ తోడు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో పేదింటి బిడ్డల విద్యకు ఆరి్థక భరోసా లభిస్తోంది. ఇందుకోసం సీఎం జగన్ ఈ ఐదేళ్లలో రూ.18,600 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పెరిగిన క్యాంపస్ కొలువులు చంద్రబాబు హయాంలో కేవలం 35 వేలుగా ఉన్న క్యాంపస్ కొలువులు సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణ ఫలితంగా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది (2022–23లో) ఏకంగా 1.80 లక్షల మందికి పైగా ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు సాధించారు. వీరిలో 1.20 లక్షల మందికి పైగా సాంకేతిక విద్యనభ్యసించిన వారు కాగా, సాధారణ డిగ్రీ అభ్యసించి ఉద్యోగాలు పొందిన వారు 60 వేల మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే క్యాంపస్ సెలక్షన్స్ జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది 11 వేలకు పైగా డిప్లొమా విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు రూ.8.60 లక్షల వరకు ప్యాకేజీని అందుకున్నారు. ఇంటర్న్షిప్తో ఉద్యోగ నైపుణ్యంఉన్నత విద్యలో 30కి పైగా గ్లోబల్ సర్విసు ప్రొవైడర్ల ద్వారా వర్చువల్, మరో 27 వేలకు పైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసి ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్లకు వైఎస్ జగన్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల్లో 52.80 శాతం ఐటీ, 13.43 శాతం అకౌంటింగ్, 8.45 శాతం విద్యా, 5.47 శాతం ఫార్మా, 8.68 శాతం మార్కెటింగ్, 4.39 శాతం గవర్నమెంట్ సెక్టర్, 2.01 శాతం ఉత్పత్తి, 1.78 శాతం వ్యవసాయం, 1.36 శాతం ఆతిథ్యం, 0.9 శాతం అడ్వరై్టజింగ్, 0.7 శాతం బయోటెక్నాలజీ రంగంలో పేరు గడించిన సంస్థల్లోనే ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్లను అందించింది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్టైఫండ్తో కూడిన ఇంటర్న్షిప్ను అందించింది. తద్వారా చదువు సమయంలోనే విద్యార్థులు సంపాదనను ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఒక్క ఏడాదిలోనే 1.25 లక్షల మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్ సర్టీఫికేషన్, మరో 1.50 లక్షల మంది ఇతర సర్టిఫికేషన్లు సాధించారు. ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ వర్సిటీ సర్టీఫికేషన్ కోర్సులు పూర్తి చేసి 1.73 లక్షలకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. వీటన్నింటి ఫలితంగా క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. నైపుణ్యాన్ని పెంచే సర్టీఫికేషన్ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్తోపాటు తదితర సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. మైక్రోసాఫ్ట్ అప్స్కిల్లింగ్లో భాగంగా డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సర్టీఫికేషన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 37 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ద్వారా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), పైథాన్, క్లౌడ్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది. నాస్కామ్ ప్యూచర్ స్కిల్స్ పేరినేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్విసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఫ్యూచర్ స్కిల్స్ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ విభాగాల్లో వర్చువల్గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్ ఎక్స్ప్రెస్’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వీస్, హోండా, మారుతి సుజుకి వంటి కంపెనీల్లో ఫుల్స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బీఎఫ్ఎస్ఐ అనలిస్ట్ తదితర అంశాల్లో శిక్షణ అందించింది. అదేవిధంగా ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్ సంస్థతో వర్చువల్ ఇంటర్న్షిప్ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.60 లక్షల మంది విద్యార్థులకు ఈ సంస్థ వర్చువల్ ఇంటర్న్షిప్ అందించింది. 281మంది ఏయూ విద్యార్థులకు ఉద్యోగాలు ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన 281 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఏపీఎండీసీలో రూ 8.4 లక్షల వార్షిక వేతనంతో ఐదుగురు, ప్రధాన్ ఎన్జీఓలో రూ.10 లక్షల వార్షిక వేతనంతో పదిమంది, శ్రీ చైతన్య కళాశాలల్లో 60 మంది, ఎంఎస్ఎన్ ల్యాబ్స్లో 58 మంది, హెటిరో డ్రగ్స్లో 109 మంది, సింధు సంస్థలో 39 మంది మొత్తం 281 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో కొంతమందికి వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసి, వారిని అభినందించారు. విశ్వవిద్యాలయం నుంచి వెళ్లే సమయంలో విద్యార్థి చేతిలో ఉద్యోగ నియామక పత్రం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి వి.ఆర్.రెడ్డి పాల్గొన్నారు. రూ.16.30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది మా స్వస్థలం ఒంగోలు. నాన్న రైతు. రాష్ట్రంలో సాంకేతిక విద్య కరిక్యులమ్లో తెచ్చిన మార్పులు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చదువు సమయంలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను క్యాంపస్లోనే నేర్చుకున్నాం. సాధారణ పాఠ్యాంశాలతో విషయ పరిజ్ఞానం వస్తుంది. 10 నెలల ఇంటర్న్షిప్ ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించాం. కంప్యూటర్ సైన్స్ చివరి ఏడాదిలో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చింది. డారి్వన్బాక్స్ డిజిటల్ సొల్యూషన్స్లో రూ.16.30 లక్షల ప్యాకేజీతో లభించింది. – అల్లాడి సంధ్య, జేఎన్టీయూ కాకినాడ మా ఫ్యామిలీ ఫుల్ ఖుష్మాది విశాఖపట్నం. నాన్న పండ్ల వ్యాపారి. అమ్మ గృహిణి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను.. ఇప్పుడు థాట్ వర్క్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాను. అక్కడ ఉద్యోగం చేసేవారికి ఉన్నత చదువులకు ఆ కంపెనీ సహకారం అందిస్తుంది. ప్రత్యేకంగా మార్కెట్లో జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్పై మాకు తరగతి గదిలోనే నేరి్పంచారు. ఇంటర్న్షిప్, ఆన్లైన్ కోర్సులతో సిలబస్ను దాటి చాలా విషయాలు నేర్చుకున్నాం. గడిచిన రెండేళ్లుగా మా కాలేజీలో క్యాంపస్ ఎంపికలు బాగున్నాయి. – ఆర్.అజయ్, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనకాపల్లి -
గ్రామీణ యువతికి ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
రాజస్థాన్లోని గ్రామీణ ప్రాంత యువతులు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కల్పన దీనికి ఉదాహరణగా నిలిచారు. రాజస్థాన్లోని ఫతేపూర్ షెఖావతి పరిధిలోని రినౌ గ్రామానికి చెందిన కల్పనా బిర్దా ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తొలుత సీహెచ్ఎస్ఎల్లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. తరువాత ఆడిటర్గా ఉద్యోగం దక్కించుకుంది. ఇప్పుడు సీజీఎస్టీలో ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేజిక్కించుకుంది. కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది. బనస్థలి విద్యాపీఠ్లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. కల్పన తండ్రి మహిపాల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె తల్లి పొలం పనులతో పాటు ఇంటిపనులకు కూడా చేస్తుంది. కల్పన ఇన్స్పెక్టర్గా ఎంపికకావడంతో వారి ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కల్పన మీడియాతో మాట్లాడుతూ తాను పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నానని, ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని తెలిపింది. చదువుతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేసుకునేదానినని, ఈ రివిజన్ కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగానని తెలిపింది. -
రాహుల్ అవుట్
రాజ్కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్కోట్లో జరుగుతుంది. రాజ్కోట్కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్లతో పాటు పార్ట్టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
AP: మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి : సరైన సదుపాయాలు కల్పిస్తే తామెంతో అద్భుతంగా రాణించగలమని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు వీరు తమ ప్రతిభను చాటుతున్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ‘ఇన్స్పైర్’ పోటీల్లో వారిప్పుడు తమ సత్తా చాటుతున్నారు. 2019 నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు తమ సైన్స్ ప్రతిభతో ‘జపాన్ సకురా’ పోటీలకు ఎంపిక కాగా, వీరిలో ముగ్గురు జపాన్లో పర్యటించి వచ్చారు. మరో నలుగురు వచ్చే మేలో జపాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 10 నుంచి మూడో స్థానానికి.. నిజానికి.. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. గతంలో రెండు మూడేళ్లకు ఒక్కరు ఈ పోటీలకు ఎంపికవడమే గగనంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏటా ముగ్గురు నుంచి నలుగురు ఎంపికవుతుండడం విద్యా ప్రమాణాలు, సదుపాయాల పెరుగుదలకు, ఉపాధ్యాయుల శిక్షణ కారణమని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 10 మంది గత సెప్టెంబరులో అమెరికా, యూఎన్ఓలో ప్రసంగించిన విషయం తెలిచిం దే. ఇప్పుడు అదే స్థాయిలో ఇన్స్పైర్ విద్యారు్థలు జపాన్కు వెళ్లి ఏపీ విద్యా ప్రగతిని చాటుతున్నారు. జాతీయ పోటీలకు ఏటా 40 మంది.. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యుట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సైన్స్ పోటీలను నిర్వహిస్తోంది. దీనిద్వారా పాఠశాల స్థాయిలోని విద్యార్థులు తమ దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపుతూ నమూనాలను తయారుచేయాలి. ఇందుకోసం ఇన్స్పైర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే.. ఆకర్షణీయమైన అంశాలౖపె ప్రాజెక్టు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. గత నాలుగేళ్లుగా 40 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులు నమోదుచేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. జాతీయ పోటీల్లో రాష్ట్రం నుంచి ఇంత పెద్దస్థాయిలో విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికవడం ఇప్పుడే జరుగుతోంది. ఉత్తమ ప్రాజెక్టులకు పేటెంట్ రైట్స్.. గతేడాది గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి. కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునే వారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్ను రూపొందించింది. రూ.10 వేల ఖర్చుతో తయారుచేసిన ఈ బండిపై ఆకు కూరలు వారంరోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే.. ► చిత్తూరు జిల్లా ఏఎల్పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె. ప్రణయ దాదాపు 15 రోజులపాటు కూరగాయలు పాడవకుండా ఫ్రెష్గా నిల్వచేసుకునే గార్లిక్ బ్యాగ్ను రూపొందించింది. వెల్లుల్లి పేస్టును గోనె సంచికి పూసి తయారుచేసిన ఈ సంచిని నిపుణులు సైతం పరిశీలించి, ప్రణయను అభినందించారు. వెల్లుల్లి ఉన్నచోట బ్యాక్టీరియా చేరదని, రూ.25 ఖరీదుతో చేసిన ఈ బ్యాగ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థిని చెబుతోంది. ► ఇక చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి. చరణ్ తేజ బైక్పై ప్రయాణించే మహిళలు పడిపోకుండా రక్షణగా ఉండే సైడ్ సీట్ను రూపొందించాడు. ఇలా.. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు తాము ప్రతిరోజూ చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించారు. తమ ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందడంతో పాటు గత నవంబరులో జపాన్ వెళ్లి వచ్చారు. మేలో మరో నలుగురు విద్యార్థులు జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారని స్టేట్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ భాగ్యశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్ సదుపాయాలు, బోధనా పద్ధతులు మెరుగుపడ్డాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్రెడ్డి చెప్పారు. 2022–23 సంవత్సరపు ఇన్స్పైర్ పోటీలు జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రారంభమయ్యాయని, గతంకంటే ఈసారి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే మన విద్యార్థులు పెరుగుతారని ఆయన చెబుతున్నారు. -
రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. రెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారు. లోక్సభ సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీ ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రేవంత్ మంత్రివర్గంలో కచి్చతంగా స్థానం లభిస్తుందని భావిస్తున్న తుంగతుర్తి నాయకుడు అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కోటాలో ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేశ్కుమార్గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం. వీరిద్దరితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్అలీ, ఫిరోజ్ఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని, పటేల్ రమేశ్రెడ్డిని నల్లగొండ ఎంపీగా, చిన్నారెడ్డిని మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంపించే ఆలోచనలో కాంగ్రెస్పెద్దలున్నట్టు సమాచారం. -
6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్కార్డును ప్రామాణికం(థంబ్రూల్)గా పెట్టుకుంది. ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. వన్సైడ్ బ్యాటింగ్ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్సైడ్ బ్యాటింగ్ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు. ]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్. ఐఏఎస్ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం ధరణి పోర్టల్ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్/ సీసీఎల్ఏ లాగిన్ అయితే పోర్టల్లో ఐటం కనబడదన్నారు. ’’ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు. -
రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్కి మధురపూడి..
‘మధురపూడి గ్రామం అనే నేను’ సినిమా ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ 2023కి ఎంపిక అయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించింది. శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్పై కేఎస్ శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలైంది. ఈ మూవీ 10వ ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’కి ఎంపిక అయింది. 2024 జనవరిలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ‘‘మా మూవీ భవిష్యత్లో మరిన్ని అవార్డులు సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘ఈ సినిమాపై మొదటి నుండి మా టీమ్ చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది’’ అన్నారు మల్లి. -
కన్నప్పలో కథానాయికగా..
కన్నప్పలో భాగమయ్యారు ప్రీతీ ముకుందన్. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ప్రభాస్, మోహన్బాబు, బ్రహ్మానందం, మోహన్లాల్, శివరాజ్ కుమార్, శరత్కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ న్యూజిల్యాండ్లో జరుగుతోందని సమాచారం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ప్రీతీ ముకుందన్ను ఎంపిక చేసినట్లు గురువారం చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘ప్రీతికి ఇది తొలి సినిమా. ‘కన్నప్ప’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుంది. నాట్య కళలో ప్రీతికిప్రావీణ్యం ఉంది. ‘కన్నప్ప’లో ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. -
మధ్యప్రదేశ్ సీఎం ఎవరు? రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాజస్థాన్ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఛత్తీస్గఢ్ కొత్త ముఖ్యమంత్రి పేరును ఆదివారం ప్రకటించారు. విష్ణుదేవ్ సాయికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఇంకా సీఎం ఎవరనేది ఖరారు కాలేదు. సోమవారం మధ్యప్రదేశ్లో శాసనసభా పక్ష సమావేశం జరగాల్సివుంది. అయితే రాష్ట్రపతి లక్నో పర్యటన కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. ఇప్పుడు ఈ సమావేశం మంగళవారం జరగనుంది. ఇక రాజస్థాన్ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన సత్తాను చాటుతున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రాజే జైపూర్లోని తన నివాసంలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. ఇదేవిధంగా పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్, మాజీ మంత్రి రాజ్పాల్ సింగ్ షెకావత్, మాజీ మంత్రి దేవి సింగ్ భాటీ కూడా రాజేను కలిశారు. మరోవైపు ఎమ్మెల్యేలతో ఆదివారం జరగాల్సిన పరిశీలకుల సమావేశం కూడా వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమ, మంగళవారాల్లో లక్నోలో పర్యటనలో ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన కారణంగానే శాసనసభా పక్ష సమావేశం వాయిదా పడిందని తెలుస్తోంది. వసుంధర రాజేను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్ కూడా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అటువంటి పరిస్థితిలో అనుభవమున్న నేత మాత్రమే చక్కదిద్దగలరని.. అందుకు వసుంధర రాజే మాత్రమే సరైనవారని పేర్కొన్నారు. కాగా ఆదివారం జైపూర్ చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ సీంఎం ఎంపికకు సంబంధించి త్వరలోనే పార్టీ హైకమాండ్, రాజస్థాన్ ఎమ్మెల్యేలు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇది కూడా చదవండి: 19న ‘ఇండియా’ భేటీ -
ఏరోస్పేస్ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చేసిన ప్రతి విద్యార్థికి అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో పారిశ్రామిక శిక్షణకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ఆయన ఆధ్వర్యంలో విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు. ఏరోస్పేస్ రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంపిక చేశామన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సహకారంతో మెకానికల్ డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పారిశ్రామిక శిక్షణకు గాను రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో 134 మంది పాల్గొనగా రాత, మౌఖిక పరీక్ష ద్వారా 25 మందిని ఏరోస్పేస్లో శిక్షణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరిలో 12 మంది బాలురు, 13 మంది బాలికలున్నట్లు చెప్పారు. వీరికి అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో శిక్షణనిస్తారని, శిక్షణ కాలంలో బోయింగ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్కు నిధులు అందిస్తుందని తెలిపారు. లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంస్థ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35,000 కోర్సు ఫీజుతోపాటు నెలకు రూ.3,000 ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు. -
కొందరికే ‘గృహలక్ష్మి’!
సాక్షి, హైదరాబాద్: గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితా తయారీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాలుగు లక్షల మందితో జాబితా రూపొందించాల్సి ఉండగా, సోమవారం వరకు కేవలం 1.75 లక్షల మందికి మాత్రమే మంజూరు పత్రాలు జారీ చేయగలిగారు. దీంతో అంతే సంఖ్యతో లబ్ధిదారుల జాబితా రూపొందింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో జాబితా రూపొందించే పని నిలిచిపోయింది. ఎమ్మెల్యేల జాబితాలతో జాప్యం.. గృహలక్ష్మి పథకానికి గత బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. సొంత జాగా ఉన్న ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు అందించాల్సి ఉంటుంది. కానీ, దరఖాస్తుల ప్రక్రియను మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభించగా, 15 లక్షల వరకు అందాయి. వాటి నుంచి 4 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. నియోజకవర్గంలో ఏయే ఊళ్లు, ఒక్కో ఊరు నుంచి ఎంతమంది లబ్ధిదారులు.. అన్న విషయంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యతను అప్పగించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే, లబ్ధిదారుల జాబితా రూపొందించాల్సి ఉన్నా.. వివరాలు మాత్రం ఎమ్మెల్యేలు అందించాల్సి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు వేగంగా స్పందించగా, కొందరు జాప్యం చేశారు. ఫలితంగా జాబితా రూపొందించే ప్రక్రియ నత్తనడకన సాగింది. పూర్తి జాబితా కోసం ఈసీని అనుమతి అడుగుతామంటున్న అధికారులు ఈనెల ఆరో తేదీ తర్వాత ఏ క్షణాన్నయినా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో, ఐదో తేదీ రాత్రి వరకు జాబితాను సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా సచివాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలందాయి. కానీ, ఎమ్మెల్యేల నుంచి వివరాలు సకాలంలో అందకపోవటంతో.. సోమవారం నాటికి 1.75 లక్షల మందితో కూడిన లబ్ధిదారుల జాబితా సిద్ధమైనట్టు తెలిసింది. కొన్ని జిల్లాల నుంచి వివరాలు అందాల్సి ఉందని, దీంతో ఆ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధికారులంటున్నారు. కోడ్ అమలులోకి వచ్చినందున, మిగతా లబ్ధిదారుల ఎంపిక ఇప్పట్లో ఉండదని, కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయినా, పూర్తి జాబితా సిద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఏదైనా ఇక ఎన్నికల తర్వాతనే.. ఎన్నికలు ముగిసి కోడ్ అడ్డంకి తొలగిపోయిన తర్వాతనే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఆలోచనలకు వీలుగా ఈ పథకం భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోడ్ అమలులోకి వచ్చే లోపు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు మాత్రం రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయి. వారు పనులు మొదలుపెట్టుకోవచ్చు. మిగతా లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ మాత్రం ఎన్నికల తర్వాతనే జరుగుతుందని అధికారులంటున్నారు. కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటేనే ఆ ప్రక్రియ ముందుకు సాగుతుందని, లేనిపక్షంలో తదనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. -
గృహలక్ష్మి పథకం.. ఆరు రోజులే
సాక్షి, హైదరాబాద్: ఆరు రోజుల్లోనే గృహలక్ష్మి పథకానికి సంబంధించి రెండున్నర లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. వచ్చే నెల ఐదో తేదీ నాటికి మొత్తం మూడున్నర లక్షల మంది లబ్దిదారుల జాబితా ప్రభుత్వానికి అందాలన్నది ఉద్దేశం. ఈ మేరకు సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ కసరత్తు పూర్తి చేయాలనే అక్టోబర్ 5 డెడ్లైన్గా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దరఖాస్తులు 15 లక్షలు..అర్హత ఉన్నవి 11లక్షలు సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించి.. వారే ఇళ్లు నిర్మించుకునేలా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లు, సీఎం కోటాలో మరో 43 వేల ఇళ్లు మొత్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా ఇటీవల కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహా్వనించగా 15 లక్షల వరకు అందాయి. వాటిల్లో 11 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా ఎంపిక చేశారు. వాటి నుంచి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. ఏ ఊరు.. ఎవరు లబ్ధిదారులు నియోజకవర్గంలో ఏఏ ఊళ్ల నుంచి ఎవరెవరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనే విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చొరవ చూపాలని గతంలోనే మౌఖికంగా ఆదేశాలందాయి. ఇప్పుడు అధికారులకు ఎమ్మెల్యేలు అందించే వివరాల ఆధారంగా జాబితాలు రూపొందుతున్నాయి. ఏఏ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వేగంగా వివరాలు అందిస్తున్నారో, ఆయా ప్రాంతాల్లో జాబితాలు అంత వేగంగా సిద్ధమవుతున్నాయి. శుక్రవారంనాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందితో జాబితా సిద్ధమైంది. మిగతా లబ్దిదారుల జాబితా వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం లోపు ఖరారు చేయాలని తాజాగా సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖికంగా అదేశాలందినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఆ పనిలో వేగం పెంచారు. ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ గతంలో అందిన దరఖాస్తులే కాకుండా ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిసింది. అందిన దరఖాస్తులు కాకుండా, కొత్త ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపు ‘అవసరం’అని భావిస్తే, ఆయా ప్రాంతాల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకొని జాబితాలో పేరు చేరుస్తున్నట్టు సమాచారం. దరఖాస్తులు స్వీకరించేది నిరంతర ప్రక్రియే అన్న మాటతో ఈ తంతు కానిస్తున్నట్టు సమాచారం. -
తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి?
మన దేశానికి తొలి ఒలింపిక్ పతకం ఎవరు సాధించిపెట్టారు? మన దేశానికి మొదటి క్రికెట్ ప్రపంచకప్ను అందించిన జట్టుకు కెప్టెన్ ఎవరు? దేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? మొదటి ప్రధాన మంత్రి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు మనకు సమాధానం తెలిసేవుంటుంది. కానీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన మొదటి భారతీయుడు ఎవరో మీకు తెలుసా? ఆయన మరెవరో కాదు.. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి చాలా ఏళ్లముందు సత్యేంద్రనాథ్ ఠాగూర్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నాటిరోజుల్లో బ్రిటీష్ వారు మనదేశాన్ని పరిపాలిస్తున్నారు. వారు భారతీయులను చాలా ఏళ్లపాటు సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతించలేదు. అయితే సత్యేంద్ర ఠాగూర్ తన అపార ప్రతిభతో ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 17వ శతాబ్దంలో బ్రిటీష్ వారు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి, ఇక్కడ పాలన ప్రారంభించారు. అప్పట్లో వారి ప్రభుత్వం ఉండేది. సమస్తం వారి నియంత్రణలో ఉండేది. చాలా ఏళ్లపాటు బ్రిటీష్ ప్రభుత్వంలోని ఉన్నత స్థానాల్లో భారతీయులు పనిచేసేందుకు వీలు కల్పించలేదు. 1832లో మొదటిసారిగా మున్సిఫ్, సదర్ అమీన్ పదవులకు భారతీయులు ఎన్నికయ్యేందుకు అనుమతించారు. తరువాత డిప్యూటీ మేజిస్ట్రేట్, కలెక్టర్ పదవులకు పోటీపడేందుకు భారతీయలను అనుమతించారు. కానీ 1860ల వరకు భారతీయులు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరు కాలేదు. 1861లో ఇండియన్ సివిల్ సర్వీస్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఇండియన్ సివిల్ సర్వీస్ స్థాపితమయ్యింది. ఫలితంగా భారతీయులను సివిల్ సర్వీసెస్ పరీక్షకు అనుమతించారు. అయితే ఈ పరీక్షకు హాజరుకావడం భారతీయులకు అంత సులభం కాలేదు. ఈ పరీక్షలకు హాజరు కావడానికి లండన్కు వెళ్లవలసి వచ్చేది. పాఠ్యాంశాలు గ్రీక్, లాటిన్ భాషలలో ఉండేవి. గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లుగా ఉండేది. 1842 జూన్లో జన్మించిన సత్యేంద్రనాథ్ ఠాగూర్ చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. కోల్కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అడ్మిషన్ పొంది తన ప్రతిభచాటారు. ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టం ఆమోదం పొందిన తరువాత సత్యేంద్రనాథ్ ఠాగూర్ తన స్నేహితుడు మోనోమోహన్ ఘోష్తో కలిసి ఈ పరీక్షకు వెళ్లాలని భావించారు. ఇద్దరూ లండన్ వెళ్లి పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. అయితే ఘోష్ ఈ పరీక్షలో విజయం సాధించలేకపోయారు. సత్యేంద్ర ఠాగూర్ (1863లో) ఎంపికయ్యాడు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకుని, 1864లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అతను తొలుత బాంబే ప్రెసిడెన్సీలో నియమితులయ్యారు. తరువాత అహ్మదాబాద్లో అసిస్టెంట్ కలెక్టర్/మేజిస్ట్రేట్గా నియమితులయ్యారు. సత్యేంద్ర ఈ పదవిలో 30 సంవత్సరాల పాటు ఉన్నారు. 1896లో మహారాష్ట్రలోని సతారా నుండి న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహణ 1922లో ప్రారంభమైంది. అప్పుడు దానిని ఇండియన్ ఇంపీరియల్ సర్వీసెస్ అని పిలిచేవారు. ఆ తర్వాత దానిని సివిల్ సర్వీసెస్గా మార్చారు. ఇది కూడా చదవండి: ‘సిటీ ఆఫ్ డోర్స్’ అంటే ఏమిటి? మనదేశంలోని ఆ నగరానికి ఎందుకంత ప్రత్యేకత? -
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
ట్రైన్ టిక్కెట్ల కేటాయింపు కసరత్తు సాగుతుందిలా..
ఇప్పుడున్న రోజుల్లో రైలులో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోవడం ఎంతో ముఖ్యమైదిగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనూ చాలామంది ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు వస్తుంటుంది. అలాగే చాలాసార్లు కన్ఫర్మ్ సీటు కూడా లభించదు. ఒక్కోసారి వివిధ రకాల కేటగిరీలలోని వెయిటింగ్ లిస్టులలోకి చేరిపోతుంటుంది. వాటిలో ఒకటే పీక్యూ. దీని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎక్స్ప్రెస్ ట్రైన్లో 12 కోచ్లు ఉంటాయి. ప్రతీ కోచ్లో 72 సీట్లు ఉంటాయి. ఈ విధంగా రైల్లో మొత్తంగా 864 సీట్లు ఉంటాయి. రైల్వే అధికారులు ఈ 864 సీట్లను వివిధ కోటాల కింద కేటాయిస్తుంటారు. వీటిలోనిదే పీక్యూ. దీని అర్థం పూల్డ్ కోటా. దీనిలో 8శాతం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. ఏదైనా రైలు తన మొదటి స్టేషన్ నుంచి ఏడవ స్టేషన్ వరకూ వెళితే ఆ రూటులో 2 నంబరు మొదలుకొని 6వ నంబరు వరకూ స్టేషన్లు వస్తాయి. అయితే దీనిలో నాల్గవ నంబరు స్టేషన్ ప్రధానమైనది అవుతుంది.ఈ విధంగా రైలు అధికారులు 8 శాతం సీట్లను పూల్డ్ కోటా తరహాలో రిజర్వ్ చేస్తారు. ఈ విధంగా చూస్తే 864 సీట్లలో 8 శాతం అంటే 69 సీట్లు ఈ స్టేషన్లకు పూల్డ్ కోటా కింద రిజర్వ్ చేస్తారు. మొదటి స్టేషన్ నుంచి టర్మినేటింగ్ స్టేషన్ వరకూ ప్రయాణించేవారికి లేదా ఏదైనా మధ్యలోని స్టేషన్ నుంచి టర్నినేటింగ్ స్టేషన్ వరకూ లేదా రెండు మధ్యస్థ స్టేషన్ల మధ్య ప్రయాణించేవారికి పూల్డ్ కోటా సీట్లను కేటాయిస్తారు. ఈ కోటా నిండిపోయిన పక్షంలో వెయిటింగ్ లిస్టు(పీక్యూడబ్ల్యుఎల్) కింద టిక్కెట్ జారీ చేస్తారు. పీక్యూడబ్ల్యుఎల్ అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్. పీక్యూడబ్ల్యుఎల్ టిక్కెట్.. కన్ఫర్మ్ టిక్కెట్ అయ్యేందుకు సాధారణంగా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ప్రాధాన్యాతా సూచీలో ఇవి జీఎన్డబ్ల్యుఎల్ తరువాత వస్తాయి. ముందుగా జీఎన్డబ్ల్యుఎల్ టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తరువాతనే పీక్యూడబ్ల్యుఎల్ నంబరు వస్తుంది. అటువంటిప్పుడు మీరు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మీ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాన్ని చెక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వేలో టిక్కెట్ల ఎడ్వాన్స్ బుకింగ్ అనేది ప్రయాణపు తేదీకి సరిగ్గా 120 రోజుల ముందు మొదలవుతుంది. అందుకే ఎవరైనా సరే రైలులో దూర ప్రాంతాలు వెళ్లాలనుకుంటే ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం. అప్పుడు కన్ఫర్మ్ టిక్కెట్ దొరికి, రైలులో సౌకర్యవంతంగా ప్రయాణించేందకు అవకాశం ఏర్పడుతుంది. -
యశస్విజైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్.. వెల్కమ్ టు టీమ్ ఇండియా
-
కూతురి శుభలేఖ సెలక్ట్ చేసేందుకు పోటీపడుతున్న అలీ దంపతులు (ఫొటోలు)
-
అంచనాలకు మించి టెట్ దరఖాస్తులు...పరీక్ష కేంద్రాలు బ్లాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం నిలిచిపోయింది. దరఖాస్తులు సమర్పించేందుకు మరో రెండురోజులు గడువు ఉండగానే హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ అయింది. నగరం నుంచి అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండటంతో పరీక్ష కేంద్రాల జాబితా నుంచి గ్రేటర్ జిల్లాలు తొలగింపునకు గురయ్యాయి. వాస్తవంగా టెట్ పరీక్ష ఎంత మంది రాస్తారన్న అంశంపై సంబంధిత అధికారులు సరిగా అంచనా వేయలేకపోయారు. ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు సంఖ్య అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేసింది. టెట్ పరీక్ష కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఈ నెల 12తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు మాత్రం నేటితో (సోమవారం) ఆఖరిరోజు. పరీక్షకు హజరయ్యేందుకు ఆ¯న్లైన్లో టెట్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా, సర్వర్ సమస్య, నెట్ సెంటర్లలో రద్దీ తదితర కారణాలతో ఆఖరులో దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన వారితో పాటు ఇప్పటికే ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయని వారికి సైతం షాక్ తగిలినట్లయింది. లక్ష మందికి పైగా.. మహానగర పరిధిలో సుమారు లక్ష మందికి పైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన, పూర్తి చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్లు అంచనా. దీంతో కొత్త, పాత వారితో కలిపి దరఖాస్తులు సంఖ్య ఎగబాగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షలకు నగరంలో కోచింగ్ తీసుకుంటున్న అభ్య ర్థులు సైతం టెట్ పరీక్ష కోసం ఇక్కడి కేంద్రాలను ఎంపిక చేసుకోవడంతో ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. వాస్తవంగా టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీ నిర్వహించగా.. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వం ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 5,640 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తిచేస్తూ వస్తున్నారు. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తిచేస్తున్నారు. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు పాత అభ్యర్థులు సైతం ఈసారి దరఖాస్తు చేసుకుంటుండంతో సంఖ్య మరింత ఎగబాగుతోంది. సొంత జిల్లాలో చాన్స్ మిస్.. టెట్ పరీక్ష కేంద్రాల జాబితాను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు బ్లాక్ కావడంతో అభ్యర్థులు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా అభ్యర్ధులైన గర్భిణులు, చిన్నపిల్లల తల్లులతో పాటు వికలాంగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయడం మరో పరీక్షగా తయారైంది. ఈసారి బీఈడీ అభ్యర్థులకు రెండు పేపర్లకు చా¯న్స్ ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అవకాశం ఉన్నా.. మహానగర పరిధిలో మరిన్ని పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. జాబితా నుంచి నగర జిల్లాలు తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరం చుట్టూ ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే సగానికిపైగా అభ్యర్థులు నగర పరిధిలోనే పరీక్షలు రాసేవారు. ఈసారి మాత్రం పరీక్ష కేంద్రాలు పరిమితి సంఖ్యలో కేటాయించి బ్లాక్ చేయడం పట్ల అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. మరోవైపు టెట్ అప్లికేషన్ల సందర్భంలో, ఇతర సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం లేదు. టెట్ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్కు అవకాశం లేకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అప్లికేషన్లలో టెక్నికల్, టైప్ ఎర్రర్స్తో పాటు ఫొటోలూ సరిగా రాలేదు. వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ లేక అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. (చదవండి: చదివింపుల్లేవ్.. విదిలింపులే!) -
ఫిబ్రవరిలో ఆర్మీ స్పోర్ట్స్ కంపెనీ సెలక్షన్స్
కంటోన్మెంట్: ఇండియన్ ఆర్మీ ఆర్టిల్లరీ సెంటర్ ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీలో స్పోర్ట్స్ క్యాడెట్ల నియామకాలు చేపట్టనున్నట్లు ఆర్మీ పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ర్యాలీ కొనసాగుతుందని వెల్లడించారు. 8 నుంచి 14 ఏళ్ల లోపు బాయ్స్కు ఫిబ్రవరి 1 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ (స్ప్రింట్స్, జంప్స్), విభాగానికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు త్రివేండ్రమ్, జైపూర్, కౌశాంబీ (యూపీ)లో.. ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు గుంటూరు, భివానీ (హరియాణా) జలంధర్ (పంజాబ్)లలో ప్రాథమిక ఎంపిక ఉంటందని తెలిపారు. హ్యాండ్ విభాగానికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు గోరఖ్పూర్ (యూపీ)లో.. ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు ఒంగోలు, భివానీ (హరియాణా)లో.. జలంధర్ (పంజాబ్)లో ప్రాథమిక స్థాయి ఎంపిక కొనసాగుతుందన్నారు. -
అమ్మఒడికి శ్రీకారం
విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జనగన్న అమ్మఒడి’ పథకం అమలుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చిన షెడ్యూల్ వివరాలు, ప్రధానోపాధ్యాయులు నిర్వహించాల్సిన అంశాలను డీఈఓ జి.నాగమణి సోమవారం విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన విధి విధానాలను వివరించారు. పథకానికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/గుర్తింపు పొందిన సంరక్షకుల అర్హతను నిర్ధారిస్తారు. అర్హులందరికే ఈ పథకం అందేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్సార్ నవశకం పేరుతో ఈ నెల 20 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే పథకం అమలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అమ్మ ఒడి జిల్లా స్థాయి షెడ్యూల్ ఇలా... -పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరిశీలించాలి. ఈ నెల 19వ తేదీలోగా ధ్రువీకరించాలి. -ఇతర పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో ఉన్న విద్యార్ధులను తిరిగి నమోదు చేసుకోవాలి. -గుర్తించిన జాబితాను గ్రామ సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకునికి ఈ నెల 20న పంపించి 25న నోటీసు బోర్డులో పెట్టాలి. అప్డేట్ అయిన చైల్డ్ ఇన్ఫో డేటా రాష్ట్ర స్థాయిలో ఏపీ ఆన్లైన్ ద్వారా ఏపీసీఎఫ్ఎస్ఎస్కు అందజేస్తారు. -ఏపీ ఆన్లైన్కు అందిన చైల్డ్ ఇన్ఫో రేషన్ కార్డుల జాబితా మరియు ప్రజాసాధికార సర్వే సమాచారంతో పోల్చి అమ్మ ఒడికి అర్హులైన తల్లులు/సంరక్షకుల సమాచారాన్ని నిర్ధారించి ఈ నెల 21న ఏపీసీఎఫ్ఎస్ఎస్ ద్వారా ప్రకటిస్తారు. -ఏపీసీఎఫ్ఎస్ఎస్ ద్వారా ప్రధానోపాధ్యాయులకు లాగెన్ ఐడీ మరియు పాస్వర్డ్ కేటాయిస్తారు. ∙కొత్తగా అర్హతలను జోడించడానికి అవసరమైన మూడు ఫార్మేట్స్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ విడుదల చేస్తుంది. -వాటిలో ఫార్మేట్–1 తెల్ల రేషన్ కార్డు కలిగిన తల్లులు, సంరక్షకుల వివరాలతో కూడి ఉన్న విద్యార్థుల జాబితా ఉంటుంది. ఇందులో సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి లోపాలు ఉన్నట్లయితే సరిదిద్ది గ్రామ సచివాలయ లాగిన్లో ఈ నెల 24లోపు క్రోడీకరించాలి. -ఫార్మేట్–1ను గ్రామ సచివాలయంలోని విద్య సంక్షేమ సహాయకుడు ప్రధానోపాధ్యాయుల నుంచి అందిన సమాచారాన్ని నోటీస్ బోర్డులో ప్రకటించాలి. అభ్యంతరాలపై గ్రామస్థులకు మూడు రోజులు గడువు ఇవ్వాలి. -ఫార్మేట్–2 తెల్లరేషన్ కార్డు లేని తల్లులు, సంరక్షకుల వివరాలతో కూడిన విద్యార్థుల జాబితా ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు పరిశీలించి గ్రామ సచివాలయం లాగిన్కు ఈ నెల 24వ తేదీలోగా పంపాలి. -ఫార్మేట్–3 ఆధార్ నంబర్/ఈఐడీ నంబర్ లేని విద్యార్థుల జాబితా సేకరించడం కోసం ఉపయోగించాలి. ప్రధానోపాధ్యాయుల ద్వారా అందిన ఫార్మేట్–2, ఫార్మేట్–3వ లను విద్య సంక్షేమ, సహాయకునికి గ్రామవలంటీర్లు అందజేయాలి. -గ్రామ వలంటీర్లు ఆ సమాచారాన్ని కుటుంబాలకు వివరించి... సమాచారంలో లేని తల్లుల పేర్లు, రేషన్ కార్డు వివరాలు ఆధార్ కార్డు నంబర్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ వివరాలు సేకరించాలి. కుటుంబాలు అర్హత కలిగిన వారు అవునో కాదో ఆరు అంచెల పరిశీలన ద్వారా ధ్రువీకరించుకోవాలి. సమాచార సేకరణ గ్రామ వలంటీర్ల ద్వారా ఈ నెల 25 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు చేపట్టాలి. -సేకరించిన సమాచారాన్ని తిరిగి ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి. ఆ సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు ఏపీసీఎఫ్ఎస్ఎస్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. -ముసాయిదా జాబితా సిద్ధం చేసేటప్పటికీ 75 శాతం హాజరు ఉన్నది లేనిదీ పరిశీలించాలి. 75 శాతం హాజరు లెక్క కట్టేటప్పుడు వీలైనంత విద్యార్థి పక్షంగా ఉండాలి. -వచ్చేనెల 9వ తేదీన గ్రామ సచివాలయంలో జాబితా ప్రకటించాలి. అభ్యంతరాలపై గ్రామస్తులకు వచ్చే నెల 13 వరకు గడువు ఇవ్వాలి.వచ్చేనెల 15 నుంచి 18వ తేదీ లోగా గ్రామసభలో జాబితాను ప్రకటించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. -ఆమోదించిన జాబితా వచ్చేనెల 20వ తేదీ నాటికి ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి. సంబంధిత ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారికి అదే నెల 23వ తేదీలోగా అందజేయాలి. ∙ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేసినప్పుడు పేరెంట్స్ కమిటీని తప్పకుండా సంప్రదించాలి. జిల్లా స్థాయిలో హెల్త్లైన్ సెంటర్: ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం అర్హులను క్రోడీకిరించే ప్రక్రియలో ఎలాంటి సందేహాలు వచ్చినా ప్రధానోపాధ్యాయు లు సంప్రదించుకోవడానికి జిల్లా స్థాయిలో హెల్ప్లైన్ సెంటర్ని ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు సందేహాలను సత్వరమే నివృత్తి చేసుకోవడానికి ఫోన్: 9440011576, 8008686988 నంబర్లను సంప్రదించాలి. – జి.నాగమణి, డీఈఓ -
ప్రపంచకప్ హాకీ టోర్నీకి రజని
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి ఇతిమరపు రజని ప్రపంచకప్ టోర్నమెం ట్లో పాల్గొనే భారత జట్టులో ఎంపికైంది. గతేడాది ఆసియా కప్ నెగ్గిన భారత జట్టుకు గోల్కీపర్గా వ్యవహరించిన రజని ప్రపంచకప్లో బరిలోకి దిగనున్న∙భారత జట్టులో రెండో గోల్కీపర్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జూలై 21 నుంచి ఆగస్టు 5 వరకు లండన్లో జరిగే ప్రపంచకప్లో పాల్గొనే భారత బృందానికి రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తుంది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్ కీపర్లు), సునీత లాక్రా, దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, నమిత టొప్పో, లిలిమా మిన్జ్, మోనిక, నేహా గోయల్, నవ్జ్యోత్ కౌర్, నిక్కీ ప్రధాన్, రాణి రాంపాల్ (కెప్టెన్), వందన కటారియా, నవ్నీత్ కౌర్, లాల్రెమ్సియామి, ఉదిత. -
అన్న... తమ్ముడు... క్రికెట్!
కొత్త బంగారం అరవింద్ అడిగా ముంబయిలో నివసిస్తున్న కుమార్ల కుటుంబంతో నవల ప్రారంభం అవుతుంది. 14 ఏళ్ల రాధాకృష్ణ (రాధ), 13 ఏళ్ల మంజునాథ్ (మంజు), తండ్రి మోహన్! ఆయన తన కొడుకులను పేరొందిన క్రికెటర్లుగా తయారు చేయడానికి, కర్ణాటక నుండి ముంబయి మురికివాడకు వస్తాడు. కుర్రాళ్లు తమ బాల్యాలను ఆరోగ్యం, శుభ్రత కోసం త్యాగం చేయవలసి వచ్చినప్పుడు, తండ్రిని అసహ్యించుకుంటారు. భార్య వదిలేసి పోతుంది. మోహన్ రైల్లో ప్రయాణికులతో చెప్తుంటాడు: ‘నేను అద్భుతమైన చట్నీలమ్ముతాను. రోజుకి 24 రకాలైన చట్నీలు. పుదీనా, వెల్లుల్లీ, మిరపా, తీపీ. అన్నీ నూరు శాతం శాకాహారం’. అబ్బాయిలు టీనేజీలోకి ప్రవేశించినప్పుడు, ముంబయి క్రికెట్ అసోసియేషన్ కోసం పని చేసే ‘టామీ సర్’ కుర్రాళ్ళ ప్రతిభ గుర్తించి, స్పాన్సర్షిప్ ఇప్పిస్తాడు. ఆ డబ్బుని మితంగా ఖర్చుపెడుతూ కుమార్ల కుటుంబం చెంబూర్కు మారుతుంది. మంజూ, రాధా క్రికెట్ ఆడుతున్నప్పుడు, వారి జట్టులో ఉండే జావెద్ అన్సారీ వాళ్ళకి పోటీగా నిలబడతాడు. అన్నదమ్ములకీ తండ్రికీ మధ్య ఘర్షణ ఎక్కువవుతూ ఉంటుంది. సెలెక్షన్ డే సమీపిస్తున్నప్పుడు, తనవల్ల ఇతరులకి కావలసినదేమిటో, తనకోసం తాను కోరుకున్నదేమిటో అని పరిశీలించుకునే అవసరం పడుతుంది మంజుకి. ఇక, సెలెక్షన్ డే నాడు తండ్రి నమ్మకం పెట్టుకున్న రాధ ఎంపికవక, క్రికెట్ ఆడటం ఇష్టం లేని మంజు ఎంపికవుతాడు. అన్నదమ్ముల మధ్య ఈర్షా్యద్వేషాలు పుడతాయి. మంజుకీ, జావెద్కీ ఉన్న సంబంధం లైంగిక రూపం దాలుస్తుంది. పుస్తకంలో స్త్రీలు ఉండరు. వారి గురించిన క్లుప్తమైన ఉదహరింపులుంటాయంతే. నవలలో అధికభాగం తోబుట్టువుల మధ్య పోటీ గురించినదే. పుస్తకం, క్రికెట్లో పేరు ప్రఖ్యాతుల కోసం మార్గం వెతకడం కన్నా, ఆ క్రీడవల్ల మూసుకోబడిన ఇతర మార్గాల గురించినది. తన పాత్రలకున్న భయాలనీ, మనఃస్థితులనీ, తమకి తాము నిర్మించుకున్న వారి ఖైదులనీ– రచయిత వారి అంతర్గత కంఠాల లోపలకీ, బయటకీ త్వరితంగా ప్రయాణిస్తూ, వర్ణిస్తారు. చిన్న పాత్రలకి కూడా రచయిత విషాదాన్నీ, గంభీరతనీ ఆపాదిస్తారు. వ్యంగ్య చిత్రాలు లేవు నవల్లో. ఇతివృత్తం ఆహ్లాదకరమైనది. 1983 అనంతరపు క్రికెట్ చుట్టూ కథ అల్లారు రచయిత. నవల నేపథ్యం క్రికెట్ మీదనున్న భారతదేశపు ఆరాధన. ఆ క్రీడ మీద సవిమర్శక పరిశీలనతోనే నడిచే నవల ఇది. క్రికెట్ అంటే మనకి దేవుడు, అది జాతీయ వ్యామోహమే కాక ఒక మతంలా కూడా తయారయిందన్న ఉదహరింపులున్నాయి. పుస్తకం, లైంగిక మేల్కొలుపు గురించినది కూడా! రచయిత రాసిన విధానం వల్ల కథను ఆస్వాదించాలంటే పాఠకులకి క్రికెట్ గురించి తెలియాల్సిన అవసరం ఉండదు. క్రీడల మీద రాయబడిన ఇతర పుస్తకాల్లాగే ఇక్కడ కూడా, క్రికెట్ అన్న అంశం– విస్తృత సమస్యలను అన్వేషించే పరికరం మాత్రమే. ఈ క్రీడ మనుష్యులని ఎలా ఏకం చేస్తుందో, విడదీస్తుందో, ఉత్తేజపరుస్తుందో అన్న సంగతులనీ, తెర వెనకాతల సాగే లంచగొండితనాలూ, సాధికారతలన్నిటినీ రచయిత వర్ణిస్తారు.తన తొలి నవల ‘ద వైట్ టైగర్’కు 2008లో బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరవింద్ అడిగా మూడో నవల ఈ ‘సెలెక్షన్ డే’. 2016లో వచ్చింది. u క్రిష్ణవేణి -
నేడు హజ్ యాత్రికుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్ : హజ్ యాత్రికుల 2018 ఎంపికకు సంబంధించిన కంప్యూటరైజ్డ్ డ్రా పద్ధతిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గురువారం నాంపల్లి హజ్హౌస్లో ప్రారంభించనున్నట్లు హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు 17,146 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 70 ఏళ్లకు పైబడిన కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 508 మందిని నిబంధనల ప్రకారం డ్రా లేకుండా నేరుగా ఎంపిక చేశామని తెలిపారు. ఈ ఏడాది సౌదీ ప్రభుత్వం దేశ హజ్ కోటాలో 5 వేలు పెంచడంతో రాష్ట్ర కోటాలో 300 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. వరుసగా మూడేళ్లు యాత్రకు దరఖాస్తు చేసుకున్నా డ్రాలో ఎంపిక కానివారిని నాలుగోసారి నేరుగా ఎంపిక చేసే కేటగిరీని కేంద్ర హజ్ కమిటీ రద్దు చేసిందని తెలిపారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మందికి డ్రా ద్వారా యాత్రకు వెళ్లే అవకాశం దక్కనుందని పేర్కొన్నారు. -
ప్రాబబుల్స్కు క్రీడాకారుల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంతపురం జిల్లా అండర్–16 బాలుర క్రికెట్ జట్టు సెలెక్షన్స్లో ప్రతిభ కనబరచిన 56 మంది క్రీడాకారులను జిల్లా జట్టు ప్రాబబుల్స్కు ఎంపిక చేశామని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా గ్రామంలో నిర్వహించిన సెలెక్షన్స్కు జిల్లా వ్యాప్తంగా 135 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 56 మంది క్రీడాకారులను ప్రాబబుల్స్కు ఎంపిక చేశామని, ఈనెల 20 నుంచి వారికి సెలక్షన్ మ్యాచ్లను నిర్వహించి ప్రతిభ కనబరచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని షాబుద్దీన్ చెప్పారు. -
జిల్లాస్థాయి చెస్ జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాస్థాయి అండర్–7, సీనియర్ బాలికల జట్ల ఎంపికను ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ ఎంపికకు జిల్లాలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రవిరాజు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు జూలై 1, 2 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు సీనియర్ బాలికల విభాగం సాయి సుష్మ, నిరుపమాబాయి అండర్–7 బాలికలు స్ఫూర్తిరెడ్డి బాలురు సంప్రీత్ దేశాయ్, వరుణ్ సాయి. -
నూతన కానిస్టేబుళ్లు 1న డీపీఓలో హాజరుకావాలి
కర్నూలు : సివిల్, ఏఆర్, వార్డర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన స్త్రీ, పురుష అభ్యర్థులు జూన్ 1వ తేదీ ఉదయం 9.30 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ ఆకే రవికృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన పీఎంటీ, పీఈటీ పరీక్షల్లో పాల్గొని ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన సివిల్ అభ్యర్థులు 218 మంది, ఏఆర్ అభ్యర్థులు 42 మంది, వార్డర్ పురుష అభ్యర్థులు 49 మంది, ఒక వార్డర్ మహిళా అభ్యర్థి అటెస్టేషన్ ఫారంలో పూర్తి వివరాలను నింపి డీపీఓలో అధికారులకు సమర్పించాలని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్(పీఈటీ)లలో పాల్గొని సివిల్, ఏఆర్, వార్డర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మాత్రమే హాజరుకావాలని ఎస్పీ సూచించారు. -
18న టెన్నికాయిట్ జట్ల ఎంపిక
కర్నూలు (టౌన్): స్థానిక యునైటెడ్ క్లబ్లో ఈనెల 18 వ తేదీ జిల్లా జూనియర్ బాల, బాలికల జట్లను ఎంపిక చేస్తున్నట్లు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ఏ. రవూఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు రూ. 10 చెల్లించి నేరుగా యునైటెడ్ క్లబ్లో నిర్వహిస్తున్న ఎంపిక పోటీలలో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుండి 1 వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో జరుగుతున్న అంతర్ జిల్లాల చాంపియన్ షిప్లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 8555033182 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. -
రాజేశ్ గోపీనాథన్కు టీసీఎస్ పగ్గాలు
• చంద్రశేఖరన్ స్థానంలో ఎంపిక • ఫిబ్రవరి 21న బాధ్యతల స్వీకరణ ముంబై: టీసీఎస్ నూతన ఎండీ, సీఈవోగా రాజేశ్ గోపీనాథన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న ఎన్.చంద్రశేఖరన్ టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులు కావడంతో, ఆయన స్థానంలో నూతన నాయకుడిగా గోపినాథన్ను టీసీఎస్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 21న ఎన్.చంద్రశేఖరన్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. అలాగే, కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఎఫ్వో)గా ఎన్ గణపతి సుబ్రమణ్యంను నియమించింది. ఈయనను టీసీఎస్ బోర్డు డైరెక్టర్గానూ ఎంపిక చేసింది. ప్రస్తుతం సుబ్రమణ్యం టీసీఎస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. రాజేశ్ గోపీనాథన్ 2001 నుంచీ టీసీఎస్లో పనిచేస్తున్నారు. 2013 ఫిబ్రవరిలో టీసీఎస్ సీఎఫ్వోగా నియమితులయ్యారు. ఎన్S. చంద్రశేఖరన్ చదివిన తిరుచ్చి ఆర్ఈసీలోనే రాజేశ్ గోపీనాథన్ కూడా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. టీసీఎస్ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది. -
ఎస్ఐ కొలువు కోసం ‘ఎత్తు’
– పోలీసులకు చిక్కిన అనంతపురం జిల్లా యువకుడు కర్నూలు : ఎస్ఐ కొలువు కోసం అడ్డదారి తొక్కిన అనంతపురం జిల్లా యువకుడు పోలీసులకు దొరికిపోయాడు. ఈనెల 3 నుంచి స్థానిక ఏపీఎస్పీ మైదానంలో ఎస్ఐ, ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్ నియామకాల కోసం దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ‘సీమ’ ప్రాంతానికి చెందిన కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల యువకులు ఎస్ఐ పరుగు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం డీఐజీ రమణకుమార్ పర్యవేక్షణలో జరుగుతున్న స్క్రీనింగ్ టెస్టుకు అనంతపురం జిల్లా గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన హరీష్ హాజరయ్యాడు. ఎత్తు తక్కువగా ఉన్నందున తలపై ఎంసిల్ అతికించుకొని వచ్చాడు. కంప్యూటరైజ్డ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంటు సిస్టంపై నిలుచోగా ఎత్తు పరిశీలించే కానిస్టేబుళ్లు అతని తలను తడిమి చూడగా తేడా కనిపించింది. అనుమానం వచ్చి పరిశీలించగా వెంట్రుకలకు ఎంసీల్ అంటించినట్లు గుర్తించారు. డీఐజీ తీవ్రంగా పరిగణించి కేసు నమోదుకు ఆదేశించారు. కొలతలు పరిశీలించే సిబ్బందితో ఫిర్యాదు తీసుకొని 4వ పట్టణ సీఐ నాగరాజు రావు కేసు నమోదు చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
పోలీసు కొలువులకు ముగిసిన దేహదారుఢ్య పరీక్ష
– చివరి రోజు 2,090 మంది హాజరు – రాత పరీక్ష జనవరి 22 కర్నూలు : పోలీసు శాఖలో సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం ముగిశాయి. నవంబర్ మాసంలో పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 11,762 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరిని రోజుకు వెయ్యి మంది చొప్పున ఆహ్వానించి స్థానిక ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో ఈనెల 8వ తేదీ నుంచి రెండు వారాల పాటు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగాయి. భర్తీ కానున్న 221 పోస్టులు జిల్లా పోలీసు శాఖలో మరో 221 సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ కానున్నాయి. కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈనెల 4వ తేదీతో దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో 14,576 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. 494 మహిళా, పురుష కానిస్టేబుళ్ల పోస్టులను రాత పరీక్ష అనంతరం భర్తీ చేయనున్నారు. మూడు అంశాల్లో శారీరక పరీక్షలు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మూడు అంశాల్లో శారీరక పరీక్షలు నిర్వహించారు. లాంగ్జంప్, 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు అంశాల్లో శారీరక పరీక్షలు నిర్వహించారు. ఈ మూడు అంశాల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ప్రధాన పరీక్ష(మెయిన్)కు ఎంపిక చేశారు. గతంలో పురుష అభ్యర్థులకు 5 కిలోమీటర్ల పరుగు, మహిళలకు 3 కిలోమీటర్ల పరుగు ఉండేది. దాన్ని ప్రభుత్వం రద్దు చేసి ప్రాథమిక పరీక్ష, మెయిన్ పరీక్ష విధానాన్ని తీసుకొచ్చింది. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన వారికి పోస్టులు కేటాయిస్తారు. పొద్దుపోయేదాకా సాగిన స్క్రీనింగ్ టెస్టు... ఛాతీ, ఎత్తు కొలతలతో పాటు పరుగు పందెం పోటీలను అధికారుల ప్రమేయం లేకుండానే సాంకేతిక పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 17వ తేదీన వర్షం కారణంగా పరుగు పోటీలకు అంతరాయం ఏర్పడింది. వారితో పాటు గైర్హాజరైన వారందరికీ చివరిరోజు మంగళవారం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,090 మంది పురుష, మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి పరుగు పోటీలు నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారికి జనవరి 22న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ విజయవాడలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశానికి హాజరైనందున ముగింపు రోజు డీఐజీ రమణకుమార్ దేహదారుఢ్య పరీక్షలను పర్యవేక్షించారు. రెండు వారాల పాటు దేహదారుఢ్య పరీక్షల వద్ద సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్తో పాటు డీపీఓ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సోమవారం నుంచి కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలు
* ఉదయం ఆరు గంటలకే ప్రారంభం * గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల హాజరుకానున్న అభ్యర్థులు పట్నంబజారు: కానిస్టేబుల్ ఎంపికకు సంబంధించి సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. గుంటూరులోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో అభ్యర్థులకు ఉదయం ఆరు గంటలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య, దానికి అణుగుణంగా పరీక్షల నిర్వహణ ఇప్పటికే కసరత్తు చేశారు. గత నెల 6వతేదీన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా మొత్తం 41,910 మందికిగాను 36,832 మంది హాజరయ్యారు. వారిలో సుమారు 11వేల మందికిపైగా దేహదారుఢ్య, లాంగ్, హైజంప్, 100, 1600 మీటర్ల పరుగు పరీక్షలకు అర్హత సంపాదించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. నిత్యం వెయ్యి మంది వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందటే రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణ్నాయక్ పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లోని ఏర్పాట్లు పరిశీలించి, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులకు అందుబాటులో గ్లూకోజ్, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయటంతో పాటుగా, త్వరితగతిన పరీక్షలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆదివారం పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లును పరిశీలించారు. పలువురు ఉన్నతాధికారులు పరీక్షలకు పర్యవేక్షణాధికారులుగా వ్యవహరించనున్నారు. -
23న హాకీ జూనియర్ బాలుర జట్టు ఎంపిక
కర్నూలు(టౌన్): జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న ఉదయం 11 గంటలకు స్థానిక ఎస్టీబీసీ కళశాల మైదానంలో హాకీ జూనియర్ బాలుర జట్టును ఎంపిక చేస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి డి. సుధీర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 1998 తర్వాత జన్మించిన క్రీడాకారులే ఎంపికకు హాజరు కావాలన్నారు. 15 సంవత్సరాల వయస్సు దాటిన అభ్యర్థులు ప్రవేశ రుసుం రూ.10 చెల్లించి పుట్టిన తేదీ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారన్నారు. -
రేపు సీనియర్ బాలికల జిల్లా జట్టు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 15న మంగళవారం సీనియర్ బాలికల జిల్లా జట్టు ఎంపికను స్థానిక ఆర్డీటీ క్రీడా గ్రామంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి విజయ్బాబు తెలిపారు. ఆసక్తి కలిగిన బాలికలు ఈ ఎంపికలకు హాజరుకావచ్చన్నారు. ఎంపికైనవారు కర్నూలు జిల్లా నంద్యాలలో 7వ రాష్ట్రస్థాయి సీనియర్ హాకీ క్రీడా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీలు ఈ నెల 18 శుక్రవారం నుంచి 20వ తేదీ ఆదివారం వరకు ఉంటాయన్నారు. -
రెండో రోజు 330 మంది ఎంపిక
- కొనసాగుతున్న కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ టెస్టు కొనసాగుతోంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో రెండో రోజు మంగళవారం దేహదారుఢ్య పరీక్షలకు 800 మందిని ఆహ్వానించగా 603 మంది హాజరయ్యారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్టుకు హాజరయ్యారు. ముందుగా హాల్టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన, బరువు, ఛాతీ, ఎత్తు కొలతల్లో అర్హత సాధించినవారిని 30 మంది ప్రకారం బ్యాచ్లుగా చేసి1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. రెండో రోజు మొత్తంగా 330 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. 182 మంది ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో వెనక్కు పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన స్క్రీనింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాలు మినహా వచ్చే నెల 3వ తేదీ వరకు నిరంతరాయంగా దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతాయని ఎస్పీ వెల్లడించారు. -
అత్యాధునిక పోలీస్ స్క్రీనింగ్ టెస్టు
కర్నూలు : పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో రాష్ట్రంలోనే మొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. పోలీసు కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుళ్ల భర్తీకి (డ్రైవర్, మెకానిక్) ప్రభుత్వం అనుమతించడంతో స్థానిక ఏపీఎస్పీ మైదానంలో సోమవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి అర్బన్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్కీన్రింగ్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఆరు జిల్లాలకు సంబంధించిన 23,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుళ్ల భర్తీ కార్యక్రమానికి ఎస్పీ ఆకే రవికష్ణను ప్రభుత్వం చీఫ్ సూపరింటెండెంట్గా నియమించింది. మొదటి రోజు వెయ్యి మందిని దేహదారుఢ్య పరీక్షలకు ఆహ్వానించగా 590 మంది హాజరయ్యారు. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ డివైజెస్(ఆర్ఎఫ్ఐడీ) ద్వారా ట్రాక్ వెంట అభ్యర్థులు పరిగెత్తేటప్పుడు ఎంత సమయంలో ఎన్ని రౌండ్లు పూర్తి చేశారన్నది బార్ కోడింగ్ ద్వారా అభ్యర్థుల సమయాన్ని లెక్కిస్తున్నారు. మొదటిరోజు 362 మంది స్కీన్రింగ్ టెస్టులో అర్హత సాధించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాని 172 మంది అభ్యర్థులను అనుమతించలేదు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లా సబ్జూనియర్ చెస్ టోర్నీ
నెల్లూరు(బృందావనం) : జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని చిల్డ్రన్స్పార్క్ సమీపంలో ఉన్న సుమన్ చెస్ అకాడమీలో జరుగుతున్న జిల్లా సబ్జూనియర్ చెస్ పోటీలు సోమవారంతో ముగిశాయి. బాలురవిభాగంలో ఈ.సాయికార్తీక్, బాలికల విభాగంలో పి.మేఘన విజేతలుగా నిలిచారు. అండర్–15 బాలుర విభాగంలో 61మంది హాజరుకాగా 5 రౌండ్లకు గానూ సాయికార్తీక్ 5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. బాలికల విభాగంలో 19 మంది పాల్గొనగా 4 రౌండ్లకు గానూ మేఘన 4 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. పోటీలను ఆదిత్యవిద్యాసంస్థల అధినేత ఆచార్య ఆదిత్య పర్యవేక్షించారు. విజేతలను చెస్టోర్నీ ఆర్బిటర్స్ వంశీకృష్ణా, వెంకటరమణ, జిల్లా చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.సుమన్ అభినందించారు. రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొనే వారు.. - వైఎస్ఆర్జిల్లా కడపలో నవంబరు 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి అండర్–15 టోర్నీలో జిల్లా నుంచి బాలుర విభాగంలో ఈ.సాయికార్తీక్, ఏ.ఎం.శ్రీహరి, ఎన్.తారకేశ్వర్రెడ్డి, సి.రిషిధర్రెడ్డి, బాలికల విభాగంలో పి.మేఘన, ఎం.కీర్తన, టీకే సుప్రియ, స్నేహశ్రీ ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు చెప్పారు. రాష్ట్రస్థాయి విజేతలు న్యూఢిల్లీలోని జవహర్లాల్నెహ్రూ స్టేడియంలో నవంబరు20 నుంచి 28వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. -
‘కొలువు’ యజ్ఞం
అంబర్పేట అంబర్పేట సీపీఎల్ జరుగుతున్న హోంగార్డుల ఎంపిక ప్రక్రియాకు అభ్యర్థులు భారీగా తరలివస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కోసం సోమవారం వందలాది మంది అభ్యర్థుల రాకతో ఆ ప్రాంతమంతా జాతరను తలపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోంగార్డు ఉద్యోగం కోసం అభ్యర్థులు బారులు తీరారు -
రాష్ర ్టస్థాయి బాస్కెట్బాల్కు కృత్తివెంటి విద్యార్థులు
రామచంద్రపురం : రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు స్థానిక కృత్తివెంటి పేర్ారజు పంతులు జాతీయోన్నత పాఠశాల క్రీడాకారులు నలుగురు ఎంపికైనట్టు పాఠశాల పీడీ గెడా శ్రీనివాసు, పీఈటీ సయ్యిద్ మస్తానీ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అండర్ 14 బాలుర విభాగం పోటీల్లో పవ¯ŒSకుమార్ స్వర్ణపతకం సాధించి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడన్నారు. అదే విధంగా అండర్ 17 బాలుర విభాగంలో షేక్ సలీం, ఎ. ప్రవీణ్, అండర్ 17 బాలికల విభాగంలో పి. పాప, కౌసల్య జిల్లా జట్టుకు ఎ ంపికయ్యారన్నారు. చిత్తూరులో జరిగే రాష్ర ్టస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. వీరిని పాఠశాల హెచ్ఎం జి. రాంప్రసాద్, రీజినల్ ఇ¯ŒSస్పెక్టర్ ఆఫ్ పిజికల్ ఎడ్యుకేష¯ŒS అధికారి ప్రమీలాకుమారి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సూర్యమోహన్, బాస్కెట్బాల్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్, రాష్ట్ర అసోసియేష¯ŒS కోశాధికారి గన్నమని చక్రవర్తి, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ ఎం. సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
ఖోఖో జిల్లా జట్ల ఎంపిక
చిర్రావూరు (తాడేపల్లి రూరల్): అండర్–14 ఖోఖో జిల్లా జట్టు ఎంపిక మంగళవారం చిర్రావూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా 35 స్కూళ్ల నుంచి 350 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంపిక చేసిన జట్లు అనంతపురంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని జిల్లా గేమ్స్ ఆర్గనైజర్ ఎం.గణేష్ తెలిపారు. బాలికల జట్టులో.. ఒ.అమ్మాజీ , జి.భారతి, ఎం.అక్షిత, బి.ఇందు, ఎస్కె.జాన్బి, ఎం.అనిత, ఎం.స్రవంతి, వి.నాగశ్రీ, ఎన్.కోటేశ్వరి, జి.శ్రీలక్ష్మి, కె.పావని, జి.దుర్గాభవానీ, ఎం.ధరణి, ఎం.కీర్తి, పి.సుస్మిత, ఎం.లక్ష్మి, వి.దీక్షిత ఎంపికయ్యారు. బాలుర జట్టులో.. జె.బ్రహ్మారావు, వి.సాయినాయక్, డి.వెంకట అనిల్రెడ్డి, జి.విక్టర్పాల్, ఎం.ఉమేష్, వి.రాజు, ఎం.అశోక్, ఎం.బ్రహ్మం, శివనాగరాజు, ఎం.నవీన్, ఎ.వంశీ, ఎం.మణికంఠ, ఎం.పేరయ్య, వి.నవీన్, వి.సింహాద్రి, పి.వెంకటరమణ, ఈశ్వరరెడ్డి, ఎస్.సంతోష్ ఎంపికయ్యారు. -
అథ్లెటిక్స్ పోటీలకు 200 మంది
గుంటూరు స్పోర్ట్స్: అండర్–14, 16 బాలబాలికల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను మంగళవారం స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియంలో స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఈ పోటీల నుంచి జిల్లా జట్టును ఎంపిక చేసి విశాఖపట్నంలో నవంబర్లో 18 నుంచి 20వ తేదీ వరకు జరిగే నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ పోటీలకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్టేడియం సంయుక్త కార్యదర్శి సంపత్ కుమార్, ఉపాధ్యక్షుడు ఓరుగంటి అంకయ్య, అథ్లెటిక్స్ శిక్షకుడు భాష్యం కృష్ణారావు, టెన్నిస్ కోచ్ శివ ప్రసాద్, పీఈటీలు శరత్, నాయక్, రమాసుందరి, జి.జె.కిషోర్, ఎన్.శ్రీనివాస్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బాల్ బాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఎన్జీవో హోమ్లో జిల్లా బ్యాడ్మింటన్ జూనియర్, సబ్ జూనియర్ జట్ల ఎంపికలు జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ జూనియర్ జిల్లా జట్లు ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయన్నారు. సబ్ జూనియర్ జట్లు ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయన్నారు. ఎంపికైన జట్లకు ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్థన్రెడ్డి, సునీల్ బాబు, కృష్ణారెడ్డి క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. -
స్టేట్ సివిల్ సర్వీసెస్ జట్ల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్ : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన బుధవారం స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, గాంధీనగర్లోని సిమ్మింగ్పూల్, దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఫుట్బాల్, వెయిట్లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, స్విమ్మింగ్ జట్లను ఎంపిక చేశారు. శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, శాప్ కోచ్ పర్యవేక్షణలో ఈ సెలక్షన్స్ ట్రయల్స్ జరిగాయి. -
6న అర్చరీ, రైఫిల్ షూటింగ్ బాలబాలికల జట్ల ఎంపిక
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈనెల 6వ తేదీన కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో అర్చరీ, రైఫిల్ షూటింగ్ అండర్–19 విభాగంలో బాల బాలికల ఎంపికకు పోటీలు నిర్వహిస్తున్నట్లు అండర్–19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి చలపతిరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గలవారు వయో పరిమితి ధ్రువీకరణ పత్రాలతో నేరుగా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 14, 15, 16 తేదీల్లో కడప, చిత్తూరులలో అండర్–19 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 93938554601, 9491526617 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
ఆపరేటర్ల ఎంపిక వాయిదా
జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్ హన్మకొండ : విద్యుత్ సబ్స్టేçÙ¯ŒS అపరేటర్ల నియామకంపై జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్ ప డింది. దసరా రోజు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్న క్రమంలో విద్యుత్ సబ్స్టేçÙన్లలో ఆపరేటర్ల నియామకాలు నిలిచిపోనున్నాయి. జిల్లాలో 230 ఆపరేటర్ల పోస్టుల భర్తీకి ఎన్పీడీసీఎల్ విద్యుత్ సబ్స్టేçÙ¯ŒS కాంట్రాక్టర్లు నోటిఫికేష¯ŒS జారీ చేశారు. త్వరలో నియామక ప్రక్రి య మొదలు కావాల్సి ఉండగా.. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెరమీదకు రావడంతో నియామకాల ప్రక్రియ నిలిపివేయాలని ఎన్పీడీసీఎల్, డివిజ¯ŒS అధికారులకు ఆదేశాలు అం దాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు నిరాశకు గురయ్యారు. కాగా, విద్యుత్ సబ్స్టేష¯ŒS ఆపరేటర్ల నియామకాల్లో అక్రమాలు, అవినీతికి తావు లేదని తెలంగాణ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ మ్యానింగ్, వర్కర్స్ స్టాఫ్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు బండ కుమారస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. -
వెయిట్లిఫ్టింగ్ జిల్లా జట్టు ఎంపిక
డోర్నకల్ : హైదరాబాద్ లో ఆదివారం నుంచి ప్రా రంభమయ్యే రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూని యర్ వెయిట్లిఫ్టింగ్ పో టీలకు జిల్లా జట్లను శనివారంమండల కేంద్రంలో ఎంపిక చేశారు. స్థానిక హనుమా¯ŒS వ్యాయామశాలలో జిల్లా వెయిట్లిఫ్టింగ్ అసోసియేష¯ŒS జనరల్ సెక్రటరీ కొత్త్త రాంబాబు జట్లను ప్రకటిం చారు. సబ్జూనియర్ బాలుర జట్టుకు సంబంధించి 50 కేజీల విభాగంలో ఎం. వేణు, జి.గణేష్, 56 కేజీల విభాగంలో కె.హర్షిత్, బి.కార్తీక్, 62 కేజీల విభాగంలో ఎ¯ŒS.రాజేష్, 69 కేజీల విభాగంలో జె.సాయికుమార్, 77 కేజీల విభాగంలో ఎండీ.మాదుర్, 85 కేజీల విభాగంలో జి.గణేష్ ఎంపికైనట్లు తెలిపారు. జూని యర్ బాలుర జట్టుకు 50 కేజీల విభాగంలో కె.ప్రవీణ్, 56 కేజీల విభాగంలో కె.సందీప్, 62 కేజీల విభాగంలో రాజేష్, జి.హేమంత్, 69 కేజీల విభాగంలో జె.సాయి, 77 కేజీల విభాగంలో కె.నరేంద్రబాబు, ఎ¯ŒS ఉమేష్, 85 కేజీల విభాగంలో కె.యాకేష్, 94 కేజీల విభాగంలోఎండీ.ఖలీల్, జె.రమేష్ ఎంపికయ్యారు. సబ్ జూనియర్ బాలికల జట్టుకు 44 కేజీల విభాగంలో బి.కావేరి, 48 కేజీల విభాగంలో ఎం.సుష్మ, 53 కేజీల విభాగంలో పి.స్రవంతి, 58 కేజీల విభాగంలో ఎం.మౌనిక, 63 కేజీల విభాగంలో బి.సింధు, 68 కేజీల విభాగంలో ఎస్.సంధ్య, 75 కేజీల విభాగంలో డి.ప్రియాంక, ఎస్.సోని ఎంపికయ్యారు. జూనియర్ బా లికల జట్టుకు 44 కేజీల విభాగంలో జి.రోజా, 53 కేజీల విభాగంలో బి.వాణీశ్వరి, 63 కేజీల విభాగంలో మహాలక్ష్మి ఎంపికయ్యారు. బాలుర టీంకు కొత్త కుమార్, బాలికల టీంకు అనిల్కుమార్ కోచ్లుగా వ్యవహరిస్తారని రాం బాబు తెలిపారు. -
ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా జట్ల ఎంపిక
రామచంద్రపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాలురు, బాలికల జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వై.తాతబ్బాయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్, చదరంగం, విలువిద్య పోటీలకు సంబంధించి క్రీడాకారుల ఎంపిక జరిగిందన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన పీడీలు స్థానిక కృత్తివెంటి పేర్రాజుపంతులు క్రీడా ప్రాంగణంలో పోటీలు నిర్వహించి ఈ ఎంపికలు పూర్తి చేసినట్లు తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్కు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి అన్నవరంలో జరిగే ఏపీ బాల్ బ్యాడ్మింటన్ చాంపియ¯Œæషిప్ పోటీల్లో పాల్గొంటారని, మిగిలిన పోటీలకు తేదీలు, ఖరారు కావాల్సి ఉందని అన్నారు. ఎంపికైన క్రీడాకారులు వీరే బాల్ బ్యాడ్మింటన్ (బాలురు) : కేఎస్ శివప్రసాద్, డి.రమేష్, ఎం.సాయిరాం, కె.జయప్రసన్న (జీబీఆర్ కాలేజీ, అనపర్తి); జీవీఎన్ ప్రసాద్ (ఎస్ఎస్డీ జూనియర్ కళాశాల, అన్నవరం); ఎస్కే సంసిద్ (శ్రీ ప్రజ్ఞ జూనియర్ కాలేజీ, బిక్కవోలు); ఎన్.నాగ అరుణస్వామి (జీజేసీ, మండపేట); ఎ.దశరథరాము (ఆదిత్య కాలేజీ, కాకినాడ); టి.కిషోర్ (ఏపీటీడబ్ల్యూ, రంపచోడవరం); కె.అజయ్ (జీజేసీ, మామిడికుదురు). బాల్ బ్యాడ్మింటన్ (బాలికలు) : గీతా ప్రసన్న (ప్రగతి జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం); కె.సుధాపావని (ప్రగతి కళాశాల, ప్రత్తిపాడు); జి.స్వర్ణలత, వై.చంద్రకళ, డి.మణిచందన (జీజేసీ, కొత్తపేట). చదరంగం (బాలికలు) : ఆర్.రాగజోత్య్న (గీతం కాలేజీ, కాకినాడ); కె.అనిత (ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్, రాజోలు); డి.సిరి (శ్రీచైతన్య, కాకినాడ); వీఎస్ఎస్ ప్రత్యుష. చదరంగం (బాలురు) : వై.గాబ్రేష్, కె.సుధీష్, (నారాయణ, కాకినాడ); కె.సుధీర్, వై.శేఖర్ (డాక్టర్ బీవీఎస్ఆర్ కాలేజీ, కొత్తూరు); ఎల్.ఆనంద్ ఏపీఎస్డబ్ల్యూఆర్జేసీ, ఎ.మల్లవరం); ఎస్.ఫణీంద్ర (జీజేసీ ఆలమూరు); పి.వీరాస్వామి (ఎస్వీజేసీ, తుని). విలువిద్య (బాలికలు) : కె.జస్వంతి (శ్రీచైతన ్య జూనియర్ కళాశాల, అమలాపురం) విలువిద్య (బాలురు) : జేహెచ్ఎస్ అరుణ్తేజ (నారాయణ కాలేజీ, రాజోలు); ఎన్ఎల్ వంశీకృష్ణ, బీఎస్ఎన్ నరేంద్ర (తిరుమల జూనియర్ కళాశాల, కాతేరు); సీహెచ్.నవీన్, కె.మహేష్బాబు, ఎం.స్వరూప్కుమార్ (ఏపీఎస్డబ్ల్యూఆర్జేసీ, కొత్తూరు); కె.వెంకటకృష్ణ, కె.అజయ్ (జీజేసీ, మామిడికుదురు). -
వెబ్సైట్లో ఆదర్శ పాఠశాలల ఉత్తీర్ణుల జాబితా
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో జూనియర్ అసిస్టెంట్, వాచ్మన్ కమ్ స్వీపర్ పోస్టుల మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను WWW.KURNOOL.AP.GOV.IN లో ఉంచినట్లు డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 17న కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. వెబ్సైట్ నుంచి అర్హత జాబితాను డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని పేర్కొన్నారు. -
11న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికలు
బోట్క్లబ్(కాకినాడ): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల క్రీడామైదానంలో బాలబాలికలకు అథ్లెటిక్ క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక జరుగుతుందని కార్యదర్శి సీహెచ్వీవీ రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికలు ఈ ఎంపిక పోటీలలో పాల్గొనవచ్చునన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17 వరకూ విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు అసోసియేషన్ నిర్వాహక కార్యదర్శి స్పర్జన్రాజును సంప్రదించాలన్నారు. 14న బ్యాడ్మింటన్, చెస్, ఆర్చరీ, బాక్సింగ్ పోటీలకు ఎంపిక స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాల్ బ్యాడ్మింటన్, చెస్, ఆర్చరీ, బాక్సింగ్ టీమ్ ఎంపిక ఈ నెల 14న రామచంద్రపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతుందని ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1997 జనవరి ఒకటి తరువాత జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. హాజరయ్యేవారు సంబంధిత ధృవపత్రాలు తీసుకురావాలని సూచించారు. -
జిల్లా టెన్నీకాయిట్ జట్లు ఇవే
నూజివీడు : టెన్నీకాయిట్ అండర్–14 జిల్లా బాల బాలికల జట్లను పట్టణంలోని ఎస్ఆర్ఆర్ హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన సెలక్షన్లో ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ కార్యదర్శి డీ. సూర్యనారాయణ తెలిపారు. బాలుర జట్టు: జీ రమేష్, ఎన్. నవీన్, పీ. ఫణీంద్ర, ఎం. హరీష్, బీ. దుర్గారావు, పీ. కార్తీక్, కే తారక్, ఎం విశాల్. బాలికల జిల్లా జట్టుకు జీ. స్వాతి, జే. హరిణి, జే. రాజేశ్వరి, సీహెచ్. శ్రావణి, ఎం. సునంద, జీ. నిఖిత, యూ. ప్రవల్లిక, రవళి ఎంపికయ్యారు. -
25న హాకీ బాలికల జూనియర్స్ ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హాకీ జూనియర్స్ స్థాయి బాలికల ఎంపిక పోటీలను ఈనెల 25వ తేదీన హన్మకొండలోని ఎన్యూసీ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలికలు తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు నల్లగొండలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని చెప్పారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే వారు జనవరి 1, 1998 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన వారు 25న ఉదయం 8 గంటలకు పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రాలను తీసుకుని హాకీ క్లబ్లో హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 90002–82185 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక
స్టేషన్ఘన్పూర్ టౌన్ : త్రోబాల్ జిల్లా జట్టును ఆదివారం స్థానిక శ్రీ శివాణి గురుకుల పాఠశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాuý శాలల నుంచి వచ్చిన 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా 12 మందితో కూడిన బాలబాలికల జట్లను వేర్వేరుగా ఎంపిక చేశారు. ఎంపికలో త్రోబాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కార్యదర్శి చీరటి ప్రభాకర్, పీఈటీలు వి.చంద్రశేఖర్రెడ్డి, బి.కిషన్, ఎం.రాజు, జి.మనోహర్, ఎం.రాజేందర్, ఎ.అశోక్, సాంబయ్య, కె.రవి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు వీరే... త్రోబాల్ బాలుర జట్టు : ఎస్.ఆంజనేయులు, ఎం.సాంబరాజు, స్వరాజ్యం, మధు, అశోక్, ప్రతాప్, రవి, రాజు, సుమన్, చంద్రశేఖర్, ఎం.రాజు, వి.సంజీవ. బాలికల జట్టు : శారద, సాయిశ్రీ, నవ్యశ్రీ, రజిత, అశ్విని, అంజలి, సాత్విక, రమాదేవి, కవిత, కపిల, రమ్య, అనూష ఎంపికయ్యారు. -
ముగిసిన కానిస్టేబుళ్ల ఎంపిక పోటీలు
l మెయిన్ రాత పరీక్షలకు 5,963 మంది అర్హత l ఎస్పీ అంబర్ కిషోర్ఝూ l విధులు నిర్వర్తించిన వారికి అభినందనలు వరంగల్ : రూరల్ పోలీసుశాఖ పరిధిలో ఉద్యోగాల భర్తీ కోసం గత నెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న పరుగు పందెం, దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారంతో ముగిసినట్లు ఎస్పీ అంబర్ కిషోర్ఝూ తెలిపారు. రూరల్ పరిధిలోని కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం కేయూ మైదానంలో నిర్వహించిన పో టీల్లో 12,000 మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజ రైనట్లు తెలిపారు. ఇందులో 4,829 మంది పురుషులు, 1,134 మంది మహిళలు రాత పరీక్షలకు అర్హత సాధించినట్లు చెప్పారు. త్వరలో జరిగే కానిస్టేబుళ్ల మెయిన్ రాత పరీక్షల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. ఈ ఎంపిక పరీక్షలు, పోటీలు పారదర్శకంగా నిర్వహించామని, ఈవెంట్లను వీడియో కెమెరాల్లో చిత్రీకరించామని తెలిపారు. చివరి రోజు న 390 మంది దేహదారుఢ్య పరీక్షలు హాజరయ్యా రు. పరీక్షలు, పోటీలల్లో భాగస్వాములైన పీఈటీలు, డాక్టర్లు, పోలీసు అధికారులను, డీపీఓ, ఐటీ కోర్ సభ్యులు, సిబ్బందిని, ఎస్పీ అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ రూర ల్ అదనపు ఎస్పీ జాన్వెస్లీ, డీఎస్పీలు సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర, మరళీధ ర్, రాజమహేంద్రనాయక్, రాంచందర్రావు, కుమారస్వామి, పోలీసు అ«ధికారులు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్ జిల్లా జట్టుకు ఎంపిక
శ్రీరాంపూర్ : జిల్లా స్థాయి సబ్జూనియర్స్ హ్యాండ్ బాల్ జిల్లా జట్టుకు నస్పూర్ మార్టిన్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 2న జరిగిన ఎంపికలో వీరికి చోటు దక్కింది. పాఠశాల విద్యార్థులు ఏ.మనీషా, వి.లక్ష్మీప్రియ, సుప్రతిక ఎంపికయ్యారు. వీరు త్వరలో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పీఈటీ పెంచాల వేణు తెలిపారు. ఈ విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ సబియాసుల్తానా, వైస్ ప్రిన్సిపల్ వసీం రాజా, సాధన స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు సాయి, వేణు, వంశీకష్ణ, బాలకష్ణ అభినందించారు. -
7న జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్ : జిల్లా జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపికల ఈనెల 7వ తేదీన పట్టాభిపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శివ శంకర్ సోమవారం తెలిపారు. ఎంపికలలో పాల్గొనే క్రీడాకారులు 02–01–1997 తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్ జారి చేసిన జనన ధ్రువీకరణ పత్రము తీసుకొని రావాలని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్కు పంపటం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు 93969 90666, 98497 03676 నెంబర్లకు సంప్రదించాలన్నారు. -
31న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక
పెదగంట్యాడ: రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు ఈ నెల 31న టీఎస్సార్ అండ్ రారాజు జిమ్లో ఎంపిక చేయనున్నట్లు విశాఖ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజారావు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 28న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. చాంపియన్ ఆఫ్ ది చాంపియన్కు రూ. 20 వేలు, బెస్ట్ పోజర్కు రూ. 10 వేలు నగదు బహుమతి అందించనున్నారని తెలిపారు. ఆసక్తి గల వారు జిమ్ నిర్వాహకులను సంప్రదించాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారు డిసెంబర్లో కర్ణాటకలోని బెలగాంలో జరగనున్న పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. -
విద్యావలంటీర్ల ఎంపిక జాబితా వెల్లడి
విద్యారణ్యపురి : జిల్లాలో 48 మండలాల్లో పాఠశాలల్లో విద్యా వలంటీర్ల నియమాకం కోసం ఎంపిక జాబితాను సోమవారం డీఈఓ పి.రాజీవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని ఎమ్మార్సీ భవనాల్లో ఎంపిక జాబితా ప్రదర్శించారు. జిల్లాలో 493 మంది విద్యావలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 465 మందిని ఎంపిక చేసి జాబితాను వెల్లడించారు. మరో 26 మంది ఏజెన్సీ పాఠశాలలకు సంబంధించిన వా టిని పలు కారణాలతో పెండింగ్ పెట్టారు. మరో రెండు చోట్ల ఇద్దరు ఉర్దూ మీడియంలో విద్యావలంటీర్లు లభించలేదు. కాగా, ఎంపికైన విద్యావలంటీర్లు ఈనెల 26న తమకు కేటాయిం చిన పాఠశాలల్లో చేరాలని డీఈఓ కోరారు. -
జిల్లా నుంచి స్పోర్ట్స్ స్కూల్కు ఎంపిక
విశాఖపట్నం: కడప వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లోని నాలుగవ తరగతిలో ప్రవేశాలకు బాలుర విభాగంలో 24 మంది, బాలికల విభాగంలో 15 మందిని జిల్లా స్థాయిలో ఎంపిక చేశారు. ఈనెల 27న జరగనున్న రాష్ట్ర స్థాయిలో ఎంపికలకు వీరంతా హాజరుకానున్నారు. జిల్లాలోని పలు మండలాల నుంచి ఎంపికైన వీరంతా ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఈనెల 25న మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా క్రీడాభివద్ధి సంస్థ వద్ద హాజరుకావాలని డి.ఎస్.డి.ఓ. జూన్ గాల్యట్ కోరారు. ఆధార్కార్డు, వయస్సు ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్లతో పాటు 20 పాస్పోర్ట్సైజ్ ఫొటోలతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. బి.భాస్కరరావు, శ్యామ్, హేమంత్, పూర్ణసాయి, పూర్ణచందు, శేషు, పి.భాస్కరరావు, జి.రోహిత్, ఎం.రోహిత్, కాసువంత్, హేమ్చరణ్, హరీష్, అనిల్, చరణ్తేజ్, నాయుడు, తేజ, బి.రోహిత్, సాయికుమార్, ప్రవీణ్సాయి, పి.అనిల్కుమార్, ఆకాష్, పి.రాజేష్, ఎస్.గౌతమ్, కె.కిరణ్ బాలుర విభాగంలో ఎంపికయ్యారు. కె.దేవి, పి.రామలక్ష్మి, వసంత, దేవి, పూజిత, హేమవర్షిణి, శ్రావణి, కె.దేవి, సాయిలత, లావణ్య, దేవమణి, రమ్య, అనురాధ, దీపిక, రిచిత బాలికల విభాగంలో జిల్లా స్థాయిలో ఎంపికైన వారిలో ఉన్నారు. -
రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఎనిమిది మంది ఎంపిక
రాజమహేంద్రవరం సిటీ : ప్రతిభ చూపితే ఉన్నత శిఖరాలు సునాయసంగా అధిరోహించవచ్చని రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వైడీ రామారావు అన్నారు. స్థానిక ఇన్నీసుపేట అల్యూమినియం కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–19 బాలబాలికల చదరంగం పోటీలను ఆయన ప్రారంభించారు. సుమారు 60 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. బాలుర విభాగంలో ఎన్.చైతన్య సాయిరామ్, ఎస్.సాయి గృహికేష్, జీఎంవీ అజయ్, ఎం.స్టీఫెన్; బాలికల విభాగంలో ఎన్.లాస్య మయూక, సాయి రిషిత, ఎం.మాధుర్య, పి.ప్రవల్లిక రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరు ఆగస్ట్ 12, 13, 14 తేదీల్లో విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి జీవీ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్ విభాగం మేనేజర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. 23ఆర్జేసి235 : రాష్ట్ర చదరంగం పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు -
చెస్ చాంపియన్షిప్ ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్ : అహ్మదాబాద్(గుజరాత్)లో ఈనెల 22 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించే జాతీయ అండర్–13 బాలుర చెస్ చాంపియన్షిప్ ఏపీ జట్టుకు జె.అక్షిత్కుమార్, బీజేఎస్కే రణధీర్ ఎంపికయ్యారు. గ్లోబల్ చెస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వీరిద్దరూ గత నెల మూడు నుంచి ఐదో తేదీ వరకు రాజమండ్రిలో ఏపీ చెస్ చాంపియన్షిప్లో వరుసగా మొదట రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. జె.అక్షిత్కుమార్ ప్రస్తుతం నొయిడా నేషనల్æప్రీమియం చెస్ టోర్నీ ఆడుతున్నాడు. జట్టులో బీజేఎస్కే రణధీర్ బుధవారం అహ్మదాబాద్కు పయనమయ్యాడు. గ్లోబల్ చెస్ అకాడమీలో బుధవారం రణధీర్ను గ్లోకల్ టెక్నాలజీస్ సీఈఓ తరుణ్ కాకాని అభినందించి నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో గ్లోబల్ చెస్ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు కె.రాజేంద్ర, ఎస్కే ఖాసీం, ఏపీ చెస్ అసోసియేషన్ కార్యదర్శి డి.శ్రీహరి పాల్గొన్నారు. -
21న హ్యాండ్బాల్ జిల్లాజట్టు ఎంపికలు
కడప స్పోర్ట్స్ : హ్యాండ్బాల్ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 21వ తేదీన కడప నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద హాజరుకావాలని జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి వి. లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న నిర్వహించిన ఎంపికల్లో జిల్లాజట్టుకు ఎంపికైన క్రీడాకారులకు కర్నూలులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఎంపికైన క్రీడాకారులు అర్హత పత్రాలు, ఆధార్కార్డ్, 4 పాస్పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలకు 93474 21927 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
డబుల్.. గుబుల్!
♦ దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు 3,61,847 ♦ మీసేవా కేంద్రాల ద్వారా వచ్చినవి 2,50,600 ♦ కలెక్టరేట్లో సమర్పించినవి 91,347 ♦ క్షేత్రస్థాయి కార్యాలయాల్లో వచ్చినవి 19,900 ♦ రెండు పడక గదుల ఇళ్ల కోసం ♦ కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు రెండు పడక గదుల ఇళ్లకోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఈ పథకం కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తుల స్వీకరణకు జిల్లా యంత్రాంగం తెరలేపింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశించినప్పటికీ.. జిల్లా యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శించి ఈ ప్రక్రియ ప్రారంభించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ కావాలంటూ ఏకంగా 3.61లక్షల మంది దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం. -సాక్షి, రంగారెడ్డి జిల్లా రెండు పడక గదుల ఇళ్ల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు ఇప్పటికే 3.61లక్షల అప్లికేషన్లు స్వీకరించిన యంత్రాంగం పథకంపై ఇంకా స్పష్టత ఇవ్వని సర్కారు.. అయోమయంలో అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి ఈ పథకం కింద నియోజకవర్గాల వారీగా పరిమిత సంఖ్యలో ఇళ్లను మంజూరు చేసినప్పటికీ నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ సమయంలో జిల్లా యంత్రాంగం దరఖాస్తుల ప్రక్రియకు పూనుకోవడంతో లబ్ధిదారుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకున్నట్లైంది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమాచారమందుకున్న పలువురు అర్జీదారులు కలెక్టరేట్కు బారులుదీరారు. కేవలం వారంరోజుల వ్యవధిలో ఏకంగా 91,347 దరఖాస్తులు అందాయి. జనాల తాకిడిని తట్టుకోలేక కలెక్టరేట్లో దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేసిన యంత్రాంగం మీసేవా కేంద్రాల ద్వారా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో జనాలంతా మీసేవా కేంద్రాలకు పరుగెత్తారు. ఈ క్రమంలో మీసేవా కేంద్రాల ద్వారా 2,50,600 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర అవతరణ తేదీ నుంచి సాధారణ పద్ధతిలో 19,900 దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. మొత్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావాలంటూ జిల్లా వ్యాప్తంగా 3,61,847 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలోనే అత్యధికం.. జిల్లాలో జీహెచ్ఎంసీ పరిధిలోనే డబుల్బెడ్ రూమ్ ఇళ్లకు సం్బంధించిన దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పది మండలాల్లో ఇప్పటివరకు 2,26,260 మంది మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్ పరిధి మినహాయించి 33 మండలాల పరిధిలో 24,340 దరఖాస్తులు అందినట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ, అర్హు ల ఎంపికపై ప్రభుత్వం స్పష్టత ఇస్తే వీటి సంఖ్య రెట్టింపు కావడం ఖాయమని గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
గందరగోళంలో టీడీపీ- బీజేపీ కార్యకర్తలు
-
ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక
సాక్షి,సిటీబ్యూరో: ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. 5న కౌంటింగ్ పూర్తవనుండగా, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి విజయం సాధించిన కార్పొరేటర్లకు 6న ప్రత్యేక నోటీస్ జారీ చేయనున్నట్లు చెప్పారు. గురువారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. మేయర్ ఎన్నికల్లో 150 డివిజన్ల కార్పొరేటర్లతో పాటు జీహెచ్ఎంసీలో ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉన్న వారు ఓటర్లుగా ఉంటారు. ఈ ఎన్నికకు రంగారెడ్డి లేదా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను రిటర్నింగ్ అధికారిగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా మీడియా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సెంటర్లో ఎన్నికల సమాచారాన్ని చార్టుల రూపంలో ప్రదర్శించడంతోపాటు ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు మూడు టెలిఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఫోన్ నెంబర్లు: 040- 2326 1330, 2322 2018, 2322 1978. అదనంగా 35 పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే ఉన్న 7757 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 35 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లు పెరిగినందునఅదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాలు 7792 కానున్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈనెల 27లోగా పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వీటిని ఫిబ్రవరి 4లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపించాల్సి ఉంటుందన్నారు. ఓటర్లందరూ తప్పనిసరిగా పోలింగ్లో పాల్గొనేలా విద్యార్థుల ద్వారా సంకల్ప పత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 8.92 లక్షల ఓటర్ స్లిప్లు పంపిణీ చేశామన్నారు. వీటితోపాటు ఎన్నికల సంఘం వెబ్సైట్, ప్రత్యేక యాప్ల ద్వారా 3.83 లక్షల మంది ఓటర్ స్లిప్లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. -
మేయర్ మాకు... డిప్యూటీ మీకు
1956లో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు విలీనమయ్యాయి. పాలనలో సికింద్రాబాద్కు పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పించేలా ఒప్పందం కుదిరింది. 1. మొత్తం స్థానాల్లో 30 శాతం సికింద్రాబాద్ ఏరియాలో ఉండాలి. 2. మేయర్ హైదరాబాద్కిస్తే, డిప్యూటీ సికింద్రాబాద్కు ఇవ్వాలి.మేయర్ పదవీకాలం ఏడాదే.. విలీనానికి ముందు సికింద్రాబాద్ మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 30 మంది కౌన్సిలర్లను ఎన్నుకునేవారు. మేయర్ పదవీ కాలం ఏడాది. సికింద్రాబాద్ తొలి మేయర్ వాసుదేవ మొదలియార్(1951-52), డిప్యుటీ మేయర్ డాక్టర్ వైఎన్ తిమ్మరాజులు. ఈ ఎన్నికల్లో ఈశ్వరీబాయి (చిలకలగూడ), సుశీలాదేవి(జీరా)లు కౌన్సిలర్లుగా గెలుపొంది కార్పొరేషన్లో తమ వాణి వినిపించారు. -
ఆంధ్రా బ్యాంక్ చైర్మన్...ఎంపిక మళ్లీ మొదటికి
చైర్మన్గా ఉండటానికి నిరాకరించిన బి.సాంబమూర్తి తెలుగువాడిగా రాజకీయ, వ్యాపార ఒత్తిళ్ళు ఉంటాయన్న భయమే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ ఎంపిక ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. చైర్మన్ పదవి కోసం ఈ రంగంలో అపార అనుభవం ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బి. సాంబమూర్తిని ఎంపిక చేస్తే ఆ పదవిని స్వీకరించడానికి ఆయన మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఈ పదవికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞత చెపుతూనే సాంబమూర్తి ఈ పదవిని సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ‘‘ఒక తెలుగువాడిగా ఈ పదవిని చేపడితే నా పైన స్థానిక వ్యాపారాలు, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయని, ఈ సమయంలో ఆంధ్రా బ్యాంక్ చైర్మన్గా పదవి చేపట్టలేనని’ సాంబమూర్తి ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ పదవి ఎంపిక మొదటికొచ్చినట్లు అయ్యింది. భారీ నిర్థక ఆస్తులకు తోడు, రాష్ట్ర విభజనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వివాదాల నేపథ్యంలో ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ పదవిని చేపట్టడానికి చాలామంది విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఫ్రభుత్వ ఖాతాల నిర్వహణ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు నెలకొన్న విషయం విదితమే. గత ఏప్రిల్ 30న సీఎండీగా సి.వి.ఆర్ రాజేంద్రన్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.కె కల్రాను మూడు నెలలపాటు తాత్కాలిక ఎండీ,సీఈవోగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాబ్యాంక్తో పాటు సుమారు పది ప్రభుత్వరంగ బ్యాంకుల చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
నేడు బళ్లారి మేయర్, ఉపమేయర్ ఎన్నిక
బళ్లారి : బళ్లారి మహానగర పాలికె మేయర్, ఉపమేయర్ ఎన్నిక శనివారం జరగనుంది. రెండవ అవధి కింద మేయర్ పదవిని ఎస్టీ వర్గానికి రిజర్వు చేయడంతో ఆ వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు కుమార స్వామి, నాగమ్మ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మెజారిటీ సభ్యులున్నప్పటికీ రెండు వర్గాలుగా విడిపోయి సూచనలు ఉన్నాయి. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు. మేయర్ పదవి కోసం కుమారస్వామి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకు కొందరు కార్పొరేటర్లు ముమ్మర కృషి చేస్తున్నారు. దీంతో మాజీ మంత్రులు దివాకర్ బాబు, అల్లం వీరభద్రప్ప, మాజీ ఎంపీ కె.సి.కొండయ్య మేయర్ ఏకగ్రీవ ఎన్నికకు కార్పొరేటర్లను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు కార్పొరేటర్లు కుమారస్వామికి, మరికొందరు నాగమ్మకు మద్దతు ఇవ్వాలని బయటపడుతుండడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో విపక్ష వర్గానికి చెందిన ఎంపీ శ్రీరాములు శిబిరంలో ఆరుగురు కార్పొరేటర్లు ఉండడంతో వారిపై ఓ వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి స్వగృహంలో శ్రీరాములు నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన నేపథ్యంలో తాము ఏ వర్గానికి మద్దతు ఇవ్వరాదని శ్రీరాములు వర్గానికి చెందిన కార్పొరేటర్లు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎవరిని మేయర్గా ఎన్నుకున్నా తమకు అభ్యంతరం లేదని, ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చొబెట్టిన నేపథ్యంలో ప్రజల అభీష్టం మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఇది ఇలా ఉండగా బళ్లారి నగర మేయర్ స్థానంపై కాంగ్రెస్ గ్రూపుల మధ్య విభేదాలు వేడెక్కాయి. -
భావి జవాన్లపై బ్రోకర్ల వల!
ఎన్నడూ లేని విధంగా చాలా పెద్ద స్థాయిలో శ్రీకాకుళంలో ఆర్మీ నియామక ప్రక్రియ జరుగుతోంది. వివిధ జిల్లాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు వస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బ్రోకర్లు కూడా రంగంలోకి దిగారు. కష్టపడే పని లేకుండా ఉద్యోగాలిప్పిస్తామంటూ ఆశావహులను బుట్టలో వేసుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. దీనిపై మౌఖికంగా ఫిర్యాదులందుతుండటంతో పోలీసులూ నిఘా పెట్టారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:నిరుద్యోగుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు జిల్లాలో కొన్ని ముఠాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 13 నుంచి పట్టణంలో భారీ స్థాయిలో ఆర్మీ ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని ఆసరా సొమ్ము దండుకునేందుకు పలువురు దళారులు దందా మొదలెట్టారు. తమకు ఆర్మీలో తెలిసిన అధికారులున్నారని, డబ్బులిస్తే ఎలాంటి పరీక్షలు లేకుండానే ఉద్యోగాలిపిస్తామన్న మాయమాటలతో అభ్యర్థులపై వల వేస్తున్నారు. ఆర్మీ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్తోపాటు వివిధ లాడ్జీల్లో దళారులు తిష్ట వేసి అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో మాటలు కలుపుతూ వల విసురుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై తమకు కూడా మౌఖికంగా ఫిర్యాదులందుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం విశాఖ కేంద్రంగా సన్యాసిరావు అనే వ్యక్తి ఆధ్వర్యంలో నాగేశ్వరరావు, గణేష్ అనే వ్యక్తులు బృందంగా ఏర్పడి ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన, ఎత్తు, పరుగు పందెం, వైద్య పరీక్షలు ఇలాంటివేవీ లేకుండా తాము చూసుకుంటానని, ఇందుకోసం మొదట విడతగా కొంత సొమ్ము ఇవ్వాలంటూ అప్పట్లో ఒత్తిడి తేవడం, అభ్యర్థులు ఢిల్లీ వెళ్లి మరీ సమర్పించుకోవడాన్ని పోలీసులు గుర్తుచేస్తున్నారు. ఈ ముఠా సభ్యులపై అప్పట్లో నమోదైన కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అభ్యర్థుల నుంచి తీసుకున్న సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకున్నట్టు అప్పట్లో పోలీసులు తేల్చారు. చివరికి ఈ బృందం ఇచ్చిన పత్రాలన్నీ నకిలీవేనని తేలడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. మాజీ సైనికులమంటూ.. ప్రస్తుతం శ్రీకాకుళంలో మకాం వేసిన దళారులు నియామక ప్రక్రియ జరుగుతున్న ప్రాంతాల్లో సంచరిస్తూ అభ్యర్థులను ఆకట్టుకునేందుకు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. తాము మాజీ సైనికులమంటూ తమకు తెలిసిన వారి ఫోన్ నెంబర్లు, ఫోటోలు చూపిస్తూ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొంతమంది తాము కూడా ఆర్మీ ర్యాలీ కోసమే వచ్చామని నమ్మిస్తూ తమకు తెలిసిన వ్యక్తులకు సొమ్ములిచ్చామని, మీరు కూడా ఇస్తే ఉద్యోగాలు గ్యారెంటీ అంటూ ఫోన్ నెంబర్లు ఇవ్వడంపైనా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అప్రమత్తం కాకపోతే మోసపోతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో నిఘా వేయడంతోపాటు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పే వారికి డబ్బులు ఇవ్వరాదని సూచిస్తూ ఆర్ట్స్ కళాశాల తదితర ప్రాంతాల్లో పోస్టర్లు కూడా పెట్టించారు. సమాచారం ఇవ్వండి ఆర్మీ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే ముఠాలపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఉద్యోగం అంటూ ఎవరైనా వల వస్తే డబ్బులిచ్చి మోసపోవద్దని ఆర్ట్స్ కళాశాల వద్ద పోస్టర్లను అతికించాం. కష్టపడి సంపాదించే సొమ్మును పరుల పాలు చేయొద్దని తల్లిద ండ్రులను కోరుతున్నాం. ఏజెంట్ల వలలో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. -ఎ.ఎస్.ఖాన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, శ్రీకాకుళం. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
హన్మకొండ : జిల్లా ప్రణాళిక మండలి(డీపీసీ) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులుగా ఉండే 17 మంది జెడ్పీటీసీ సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 2, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 2, బీసీ జనరల్ 3, బీసీ మహిళ 3, జనరల్ మహిళ 2, జనరల్కు 3 రిజర్వు అయ్యాయి. ఈ కేటగిరీలకు చెందిన 17 స్థానాలకు.. 28 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 15న నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణ, 17న పోలింగ్ జరుగుతుంది. అనంతరం కౌంటింగ్ జరుగుతుంది. నామినేషన్ల దాఖలు చేసిన వారి జాబితా ఇదీ... ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక స్థానం ఉంది. ముగ్గురు జెడ్పీటీసీలు నామినేషన్లు వేశారు. స్టేషన్ఘన్పూర్ జెడ్పీటీసీ భూక్య సామ్య(టీఆర్ఎస్), వర్ధన్నపేట జెడ్పీటీసీ సభ్యుడు పాలకుర్తి సారంగపాణి(టీఆర్ఎస్), తొర్రూరు జెడ్పీటీసీ సభ్యుడు జాటోతు కమలాకర్(టీఆర్ఎస్). ఎస్టీ మహిళా కేటగిరీలో రెండు స్థానాలు ఉన్నాయి. ఇద్దరు నామినేషన్లు వేశారు. ఈ పదవికి రఘునాథపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు భానోతు శారద(టీఆర్ఎస్), తాడ్వాయి జెడ్పీటీసీ సభ్యురాలు పుల్సం సరోజన(స్వతంత్ర) నామినేషన్ వేశారు. ఎస్సీ జనరల్ కేటగిరీలో ఒక స్థానం ఉంది. నర్సింహులపేట జెడ్పీటీసీ సభ్యుడు ధర్మారపు వేణు(కాంగ్రెస్) నామినేషన్ వేశారు. ఎస్సీ మహిళా కేటగిరీలో రెండు స్థానాలు ఉన్నా యి. నలుగురు జెడ్పీటీసీలు నామినేషన్లు వేశారు. దేవరుప్పుల జెడ్పీటీసీ సభ్యురాలు నల్ల ఆండాలు(కాంగ్రెస్), గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు నామవరపు విజయలక్ష్మి(కాంగ్రెస్), కొడకండ్ల జెడ్పీటీసీ సభ్యురాాలు బక్కి కవిత(కాంగ్రెస్), పర్వతగిరి జెడ్పీటీసీ సభ్యురాలు మాదాసి శైలజ(టీఆర్ఎస్) నామినేషన్ వేశారు. బీసీజనరల్ కేటగిరీలో మూడు స్థానాలు ఉన్నాయి. ఆరుగురు జెడ్పీటీసీలు నామినేషన్ వేశారు. ధర్మసాగర్ జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు(టీఆర్ఎస్), ములుగు జెడ్పీటీసీ సభ్యుడు సకినాల శోభన్(టీఆర్ఎస్), నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడు చెట్టుపల్లి మురళీధర్(టీడీపీ), హసన్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు కొత్తకొండ సుభాష్(టీఆర్ఎస్), మరిపెడ జెడ్పీటీసీ సభ్యుడు పూల్నె మాణిక్యం(కాంగ్రెస్), మహబూబాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు మూలగుండ్ల వెంకన్న(కాంగ్రెస్) నామినేషన్ వేశారు. బీసీ మహిళా కేటగిరీలో మూడు స్థానాలు ఉన్నాయి. ఏడుగురు జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్ వేశారు. జనగామ జెడ్పీటీసీ సభ్యురాలు బెలిదె విజయ(టీఆర్ఎస్), బచ్చన్నపేట జెడ్పీటీసీ సభ్యురాలు వేముల స్వప్న(టీఆర్ఎస్), చేర్యాల జెడ్పీటీసీ సభ్యురాలు సుంకరి సరిత(టీఆర్ఎస్), మద్దూరు జెడ్పీటీసీ సభ్యురాలు నాచగోని పద్మ(కాంగ్రెస్), ఏటూరునాగారం జెడ్పీటీసీ సభ్యురాలు వలియాబీ(కాంగ్రెస్), కేసముద్రం జెడ్పీటీసీ సభ్యురాలు బండారు పద్మ(కాంగ్రెస్), హన్మకొండ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీరామోజు అరుణ(టీఆర్ఎస్) నామినేషన్లు వేశారు. జనరల్ మహిళా కేటగిరీలో రెండు స్థానాలు ఉన్నాయి. ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి(టీఆర్ఎస్), భూపాలపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు మీరాబాయి జర్పుల(టీఆర్ఎస్) నామినేషన్ వేశారు. జనరల్ కేటగిరీ స్థానాలు మూడు ఉన్నాయి. లింగాలఘణపురం జెడ్పీటీసీ సభ్యుడు గంగసాని రంజిత్రెడ్డి(టీఆర్ఎస్), నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం భరత్(కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మారారు), ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యుడు లేతాకుల సంజీవరెడ్డి(కాంగ్రెస్) నామినేషన్లు వేశారు. ఏకగ్రీవానికి సహకరించాలి : జెడ్పీ చైర్పర్సన్ డీపీసీ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవం చేయనున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అన్నారు. ఈ మేరకు నామినేషన్ వేసిన సభ్యులతో చర్చలు జరుపుతున్నామన్నారు. జిల్లా పరిషత్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల ముఖ్య నాయకులతో, జెడ్పీ ఫ్లోర్ లీడర్లు, నామినేషన్ వేసిన జెడ్పీటీసీ సభ్యులతో చర్చలు జరుపుతున్నామన్నారు. దీనికి సభ్యులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
సెలక్షన్ పరేషాన్!
విజయాల బాటలో ఉన్నప్పుడు తుది జట్టును మార్చకూడదనేది క్రికెట్లో సహజ సూత్రం. భారత కెప్టెన్ ధోని కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉంటాడు. ఒక ఆటగాడు పదే పదే విఫలమైనా జట్టు గెలుస్తోంది కాబట్టి మార్పులు అనవసరం అనేది అతని నిశ్చితాభిప్రాయం. మరి టీమ్ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు... జట్టు సభ్యులలో ఎక్కువ మంది పేలవ ఫామ్లో ఉన్నారు. చేసిన మార్పులేమో కలిసి రావడం లేదు. ఇలాంటి స్థితిలో తుది జట్టు కూర్పు కుదిరేదెలా? ఎవరిని ఎంపిక చేయాలి... ఎవరిని పక్కన పెట్టాలి..! ఓవల్ టెస్టుకు ముందు తుది జట్టు ఎంపికే ఇప్పుడు టీమిండియాకు కొత్త సమస్యగా మారింది. ‘స్థానం కోసం సొంత జట్టులోనే గట్టి పోటీ ఉంది. ఇది మంచి పరిణామం’... భారత్ జోరు మీదున్నప్పుడు జట్టు గురించి ఈ మాట తరచుగా వినిపించేది. మన ‘బెంచ్ బలం’ బాగుందని, అందరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు కాబట్టి తుది జట్టు ఎంపిక కష్టంగా మారిం దని అనేవారు. అయితే ఇప్పుడు ఈ ‘పోటీ’ అవాంఛనీయ మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఒకరు విఫలమైతే ఆ స్థానంలో రావాల్సిన ఆటగాడిపై కూడా జట్టు మేనేజ్మెంట్కు నమ్మకం లేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో చివరి టెస్టు తుది జట్టు ఎంపికలో జరిగే పొరపాట్లు సుదీర్ఘ కాలం కెప్టెన్ను వెంటాడవచ్చు. సరిగ్గా చెప్పాలంటే ఓవల్ టెస్టులో విఫలమైతే ప్రస్తుత జట్టులో చాలా మం దికి భవిష్యత్తులో మరో టెస్టు ఆడే అవకాశం కూడా దక్కకపోవచ్చు. ఫలితం ఇవ్వని మార్పులు లార్డ్స్ టెస్టులో ఘన విజయం తర్వాత సౌతాంప్టన్లో ధోని రెండు మార్పులతో బరిలోకి దిగాడు. ఇషాంత్ గాయంతో తప్పుకోగా బిన్నీని పక్కన పెట్టారు. వీరి స్థానాల్లో పంకజ్ సింగ్, రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. పంకజ్ ఒక్క వికెట్ తీయకపోగా...రోహిత్ 28, 6 పరుగులు చేశాడు. ఆ తర్వాత మాంచెస్టర్లో భారత్ మూడు మార్పులు చేసింది. ధావన్, రోహిత్, షమీ స్థానాల్లో గంభీర్, అశ్విన్, ఆరోన్ వచ్చారు. వీరిలో ఆరోన్ ఆకట్టుకున్నాడు. అశ్విన్ బ్యాటింగ్లో నిలబడినా...తన అసలు బాధ్యత బౌలింగ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇక చాలా కాలం తర్వాత టెస్టు ఆడిన గంభీర్ అయితే ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో చివరి టెస్టు కోసం తుది జట్టును ఎంపిక చేసే ముందు ధోని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఎవరి స్థానంలో ఎవరు? జడేజా, అశ్విన్లలో ఎవరిని తీసుకోవాలనేదే ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ముందున్న ప్రధాన సమస్య. ఓవల్లో పేస్కు అనుకూలమైన వికెట్ ఉండవచ్చని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇద్దరిలో ఒకరికే అవకాశం దక్కడం ఖాయం. బౌలింగ్లో ఇద్దరూ అంతంత మాత్రంగానే రాణించారు. గత టెస్టులోనైతే అశ్విన్కు ఒక్క వికెట్టూ దక్కలేదు. ఇక లార్డ్స్లో జడేజా కీలక ఇన్నింగ్స్ భారత్ విజయానికి బాటలు వేసినా ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. నాలుగో టెస్టులో అశ్విన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కాబట్టి ఎవరి స్థానమూ ఖాయం కాదు. ఐదుగురు బౌలర్లతో ఆడాలనుకుంటేనే ఈ ఇద్దరూ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఈ ఇద్దరిదే సమస్య! రెండు చెత్త ప్రదర్శనల్లో మెరుగైంది ఎంచుకోమంటే ఏది ఎంచుకుంటాం! ఇప్పుడు జట్టు ఓపెనర్ స్థానం కూడా సరిగ్గా అలాగే ఉంది. ధావన్ వరుసగా విఫలమైన చోట గంభీర్కు అవకాశం ఇస్తే అతనూ అలాగే ఆడాడు. కాబట్టి వీరిలో ఎవరికి చాన్స్ అనేది తేల్చుకోవాల్సి ఉంది. విఫలమవుతున్నా... యువ ఆటగాడు కాబట్టి ధావన్ వైపే కొంత మొగ్గు ఉంది. ఇదే జరిగితే గంభీర్ కెరీర్ ముగిసినట్లే! అయితే వన్డే ఓపెనర్గా రోహిత్తో మరో ప్రయోగం చేయడమా...ఒకప్పుడు ఓపెనింగ్ చేసిన రహానేను ముందు పంపడమా...ఇలా వేర్వేరు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొత్తానికి మ్యాచ్లో వ్యూహ ప్రతివ్యూహాలకు ముందే జట్టును ఎంపిక చేసేందుకు ధోని తీవ్ర కసరత్తు చేయాలి. - సాక్షి క్రీడా విభాగం ఓవల్లో ఒక విజయం... ఐదో టెస్టు జరిగే లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత రికార్డు చెత్తగా ఏమీ లేదు. ఇక్కడ 11 టెస్టులు ఆడిన ఇండియా ఒక మ్యాచ్లో గెలిచి 3 ఓడింది. మరో 7 మ్యాచ్లు ‘డ్రా’ చేసుకోగలిగింది. 1971 సిరీస్లో భాగంగా అజిత్ వాడేకర్ నాయకత్వంలోని టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి మూడు టెస్టుల సిరీస్ను 1-0తో సొంతం చేసుకుంది. 2011 పర్యటనలో ధోని సేన ఇదే గ్రౌండ్లో ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో చిత్తయింది. ఇషాంత్ ఫిట్గా ఉన్నాడా? లార్డ్స్ టెస్టు హీరో ఇషాంత్ శర్మ గత రెండు మ్యాచుల్లోనూ ఆడకపోవడం భారత్ను దెబ్బ తీసింది. అతను ఈ మ్యాచ్ బరిలోకి దిగడంపై ఇంకా స్పష్టత రాలేదు. బుధవారం అతను ప్రాక్టీస్లో మాత్రం చురుగ్గా కనిపించాడు. ఇషాంత్ జట్టులోకి వస్తే మరో సందేహం లేకుండా నేరుగా పంకజ్పై వేటు పడుతుంది. ఒక వేళ ఇషాంత్ లేడంటే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ఎందుకంటే పంకజ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మళ్లీ షమీనే నమ్ముకోవచ్చు. ఈ టూర్లో ఇప్పటి వరకు మ్యాచ్ ఆడని ఆటగాడు ఈశ్వర్ పాండే మాత్రమే. పోయేదేముంది... ఒక ప్రయత్నం చేసి చూద్దామనుకుంటే తన చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడిని ధోని ఎంపిక చేసే అవకాశం ఉంది. -
రేపే మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, ఖమ్మం : మున్సిపల్ చైర్మన్ పీఠాల కోసం ఎవరికివారు పావులు కదుపుతున్నారు. ఎన్నిక సమయం దగ్గర పడుతుండడంతో ఆ పదవి దక్కించుకోవడమే ధ్యేయంగా తెరచాటు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఇల్లెందు, కొత్తగూడెం, మధిరలో చైర్మన్ పీఠం ఆశిస్తున్న వారు ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేసి కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. ఇక సత్తుపల్లిలో టీడీపీకి మెజారిటీ ఉన్నా.. సొంత పార్టీ కౌన్సిలర్లే పీఠం కోసం నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులకు గురువారం ఎన్నిక జరగనుంది. జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, మధిర, సత్తుపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. సత్తుపల్లి మినహా మిగతా మూడు చోట్ల చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఏ పార్టీ, కూటమికి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో చైర్మన్ పీఠం ఆశిస్తున్న వారు తెరచాటు రాజకీయాలు నడుపుతున్నారు. చైర్మన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజునే తమ అనుంగు కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. రూ.లక్షలు ఖర్చు చేసేందుకు, అవసరైమైతే నజరానాలు ఇచ్చేందుకు కూడా వారు వెనకాడడం లేదు. క్యాంపులకు తీసుకెళ్లిన వారిని ఎన్నిక జరిగే రోజు తెల్లవారుజామున తిరిగి తమ ప్రాంతానికి తరలించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. తమ క్యాంపు నుంచి పోతే.. తిరిగి ఎటు వెళ్తారోనన్న భయంతో తమ అనుచరులను కౌన్సిలర్ల వెంటే ఉంచుతున్నారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధులు తమ అనుంగు కౌన్సిలర్లకు చైర్మన్ పీఠం దక్కేలా చక్రం తిప్పుతున్నారు. రిజర్వేషన్ ప్రకారం గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు చైర్మన్ స్థానాలనూ మహిళలే దక్కించుకోనున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి చైర్మన్ పదవులు బీసీ మహిళలకు, మధిర ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ‘గూడెం’ పీఠం ఎవరిదో..? కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 33 వార్డులు ఉన్నాయి. సీపీఐ- టీఆర్ఎస్, సీపీఎం - వైఎస్సార్సీపీ కూటములుగా, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. కాంగ్రెస్ 12, సీపీఐ 8, టీడీపీ 4, స్వతంత్రులు 6, టీఆర్ఎస్ 1, వైఎస్సార్సీపీ 1, టీఆర్ఎల్డీ 1 వార్డు దక్కించుకున్నాయి. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి ఏ పార్టీ, కూటమికి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 17 వార్డులుంటేనే ఎవరికైనా చైర్మన్ పీఠం దక్కనుంది. కాంగ్రెస్ నుంచి పులి గీత చైర్పర్సన్ పదవి కోసం పోటీ పడుతుండగా, సీపీఐ-టీడీపీ కూటమి స్వతంత్రుల మద్దతుతో పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే ఆ పదవి ఎవరు దక్కించుకోవాలన్నా ఇక్కడ స్వతంత్రుల మద్దతే కీలకం. దీంతో ఎవరికి వారు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. పీఠంపై కన్నేసిన టీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల నుంచి గెలుపొందిన కౌన్సిలర్ల కోసం వేట ప్రారంభించినట్లు సమాచారం. మధిరలో లోపాయికారి ఒప్పందం.. నూతనంగా ఏర్పడిన మధిర నగర పంచాయతీకి ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అడ్డదారిన చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ- సీపీఎం, కాంగ్రెస్- సీపీఐ కూటమిగా బరిలోకి దిగగా టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. వైఎస్సార్సీపీకి 4, సీపీఎంకు 3, కాంగ్రెస్కు 4, సీపీఐకి 2, టీడీపీకి 6 వార్డులు, స్వతంత్రులు 1 వార్డు కైవసం చేసుకున్నారు. పొత్తుతో పోటీ చేసిన కాంగ్రెస్- సీపీఐ కూటమి ఇప్పుడు టీడీపీతో జత కట్టాలని లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. టీడీపీ, కాంగ్రెస్ చేరో రెండున్నరేళ్లు చైర్మన్ పదవిని పంచుకునేలా అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఇక వైస్ చైర్మన్ పదవి సీపీఐకి ఐదేళ్లు ఇచ్చేలా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. తొలి రెండున్నరేళ్లు చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే ప్రతిపాదనతో టీడీపీకి చెందిన కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్లారు. కాంగ్రెస్లో మాత్రం మొండితోక నాగరాణి, నంద్రూ శారమ్మ చైర్పర్సన్ పదవికోసం పోటీ పడుతున్నారు. ఇల్లెందు చైర్మన్ గిరి ‘మడత’కేనా..? ఇల్లెందులో కాంగ్రెస్- సీపీఐ, వైఎస్సార్సీపీ-సీపీఎం కూటములుగా బరిలోకి దిగాయి. టీడీపీ, న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 8, సీపీఐ 3, టీడీపీ 4, టీఆర్ఎస్ 3, ఎన్డీ 2, స్వతంత్రులు 4 వార్డులు దక్కించుకున్నారు. స్వతంత్రుల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ పార్టీ నుంచి చైర్మన్ పదవికి మడత రమ, వైస్ చైర్మన్ పదవికి సీపీఐ నుంచి బాస శ్రీనివాస్ రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య చక్రం తిప్పడంతో ఆయన అనుచరుడైన మడత వెంకట్గౌడ్ భార్య మడత రమకు చైర్పర్సన్ పీఠం దక్కే అవకాశాలున్నాయి. ఈ పీఠాన్ని ఆశిస్తున్న కాంగ్రెస్.. సొంత పార్టీతో పాటు మిగతా కౌన్సిలర్లనూ క్యాంపునకు తరలిచింది. సత్తుపల్లిలో ఇంటిపోరు.. సత్తుపలి నగర పంచాయతీలో టీడీపీ అత్యధిక వార్డులు దక్కించుకున్నా చైర్మన్ పదవి వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. ఇక్కడ వైఎస్సార్సీపీ- సీపీఎం, కాంగ్రెస్- సీపీఐ కూటములుగా, టీడీపీ ఒంటరిగా బరిలో నిలిచాయి. టీడీపీ 17 వార్డులు దక్కించుకోగా, వైఎస్సార్సీపీ 3 వార్డులు కైవసం చేసుకుంది. అయితే ఎక్కువ వార్డులు దక్కించుకున్నామన్న ఆనందం టీడీపీలో లేదు. చైర్మన్ పీఠంపై వర్గపోరు కొనసాగుతుండడమే ఇందుకు కారణం. వెలిశాల సత్యావతి, దొడ్డాకుల స్వాతి ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. పీఠం తనకే ఇవ్వాలని ఇరువురూ తమకు మద్దతు తెలిపే కౌన్సిలర్లతో కలిసి పలుమార్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వద్దకు వెళ్లారు. ఎన్నిక సమయం దగ్గరకు వచ్చినా ఇంకా చైర్మన్ పీఠం ఎవరికన్నది ఆ పార్టీలో కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా జోక్యం చేసుకోకపోవడంతో ఇప్పటి వరకు చైర్మన్ ఎవరన్నది తేలలేదని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. -
పొన్నాలకు సవాల్
ప్రతిష్టాత్మకంగా జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక - 24 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ - అయినా.. పీఠం దక్కుతుందన్న ఆశలు లేవు - తాజాగా క్యాంపునకు దూరమైన ముగ్గురు సభ్యులు - పట్టు పెంచుకుంటున్న టీఆర్ఎస్ - కాంగ్రెస్కు చైర్పర్సన్ పదవి దక్కకుంటే టీ పీసీసీ చీఫ్కు ఇబ్బందులే సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక పెద్ద పరీక్షగా మారింది. టీఆర్ఎస్కు మొదటి నుంచీ పట్టుంది. టీఆర్ఎస్ హవాలోనూ స్థానిక ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చాయి. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలిచింది. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ 24, టీఆర్ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ 1, స్వతంత్రులు ఒక స్థానం గెలుచుకున్నారు. ఇలా ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్కే జెడ్పీ పీఠం దక్కుతుందని ఫలితాలు వచ్చిన వారం వరకు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో పరి స్థితి మారింది. జెడ్పీ చైర్పర్సన్ పదవి లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలు ప్రారంభించారుు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి పొన్నాల టార్గెట్గా కాంగ్రెస్లో విమర్శలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంలోనూ ఆయనపై విమర్శలు పెరిగాయి. పొన్నాల సొంత నియోజకవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం సైతం టీఆర్ఎస్లో చేరారు. పొన్నాల లక్ష్మయ్య తీరుతోనే పార్టీకి ప్రస్తుత పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. ఇతర జిల్లాల నేతల నుంచి ప్రతిరోజూ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో జెడ్పీ ఎన్నిక పొన్నాలకు పరీక్షగా మారనుంది. కాంగ్రెస్కు జెడ్పీ పీఠం దక్కితే పొన్నాలకు విమర్శల నుంచి కొంత ఊరట కలగనుంది. దక్కనిపక్షంలో పొన్నాలపై విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది. క్యాంపు.. రోజుకో మలుపు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ క్యాంపు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. క్యాంపు ప్రారంభించిన మొదట్లో 21 మంది కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు టీడీపీ సభ్యులు, బీజేపీ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ సభ్యుడు కలిపి 25 మంది క్యాంపులో ఉన్నారు. మొత్తం సభ్యుల్లో సగం మంది తమవైపు ఉన్నారని.. చైర్మన్ పీఠం తమేదనని ప్రకటిస్తూ వచ్చారు. కాంగ్రెస్ క్యాంపు ఊటీలో ఉన్న సమయంలో గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కీలక నేతలు ఒప్పించడంతో ఆగిపోయారు. కాంగ్రెస్ క్యాంపునకు మొదటి నుంచీ దూరంగా ఉంటున్న పాలకుర్తి సెగ్మెం ట్కు చెందిన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు తమకు మద్దతు ఇస్తారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి జారీ చేసిన నోటీసుపై వీరు ముగ్గురు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీంతో వీరు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ క్యాంపులోని ముగ్గురు సభ్యులు బయటకు వచ్చారు. వైస్చైర్మన్ పదవి ఆశించినా కాంగ్రెస్లో హామీ లేకపోవడంతో నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడి తోపాటు శాయంపేట, చిట్యాల జెడ్పీటీసీ సభ్యులు క్యాంపు నుంచి బయటకు వచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుతో ఉన్న సంబంధాల కారణంగానే భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఇద్దరు జెడ్పీటీసీలు కాంగ్రెస్ క్యాంపు నుంచి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో కాంగ్రెస్ కీలక నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు తాజా పరిణామాలతో జెడ్పీ చైర్మన్ కచ్చితంగా తమకే దక్కుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన 18 మందితోపాటు నలుగురు టీడీపీ, పాలకుర్తి పరిధిలోని ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులతో మొత్తం 25 మంది ఉన్నారని వీరు అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ క్యాంపు నుంచి బయటికి వచ్చిన ముగ్గురు సభ్యులు కలిపి తమ బలం 28కి పెరిగిందని.. జెడ్పీ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికకు ఇంకా ఏడు రోజుల గడువుంది. ఈలోపు రాజకీయ పరిణామాలు మరింత మారే పరిస్థితి కనిపిస్తోంది. -
బంగారం కొంటున్నారా?!
ఎంపిక కొనుగోలు చేసే ప్రతి ఆభరణానికీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బిఐఎస్) హాల్మార్క్ ముద్ర ఉండాలి. దానికి సంబంధించి కొనుగోలు పత్రాన్ని కూడా జాగ్రత్తపరుచుకోవాలి. 24 క్యారట్ల బంగారం నూటికి నూరు శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారమైతే 2 భాగాలు ఇతర లోహాన్ని( రాగిని) జత చేసి ఆభరణాలను తయారుచేస్తారు. వాడుకలో ఎక్కువగా ఉన్నది 91.6 శాతం బంగారం. 18 క్యారెట్ల బంగారం, 6 భాగాలు ఇతర లోహాలతో కలిపి ఆభరణాలను తయారుచేస్తారు. ఇది 75 శాతం బంగారం అని చెప్పవచ్చు. స్వచ్ఛమైన బంగారానికే ధర నిర్ధారించి ఆభరణాల తయారీ ఖర్చును జోడించి ఖరీదును నిర్ణయిస్తారు. 18 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు దీర్ఘకాలం మన్నుతాయి. అందుకని వజ్రాలు, ఇతర జాతిరత్నాలను 18 క్యారెట్ బంగారంతోనే పొదుగుతారు. పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేసేవారికి నాణేలు మంచి ఆప్షన్. వీటిని స్టోర్ చేయడం సులువు. ఆభరణాల నిపుణులు వీటినే ఎక్కువ కొనుగోలు చేస్తారు.