Published
Mon, Jul 18 2016 6:30 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:16 AM
మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన విప్ సునీత
టంగుటూరు (ఆలేరు) : మండలంలోని టంగుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన ఆహారాన్ని రుచిచూశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలని సూచించారు. ఆమె వెంట మార్కెట్ చైర్మెన్ కాలె సుమలత, ఎంపీపీ కాసగల్ల అనసూర్య, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, హెచ్ఎం ప్రవీణ్కుమార్, ఉపాధ్యాయులు భూషపాక రాములు, సంధ్యారాణి, గుగ్గిళ్ల రవీంద్రచారి, కిష్టయ్య తదితరులు ఉన్నారు.