Midday meal
-
మధ్యాహ్న భోజన పథకానికి ఆద్యుడు ఆయనే
పిల్లలూ! ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం పూట విద్యార్థులకు భోజనం పెడతారన్న విషయం మీకు తెలుసా? పిల్లలు టిఫిన్ బాక్సులు తీసుకెళ్లకుండా, అక్కడ వండి, వడ్డించే అన్నాన్నే తింటారు. ఈ పద్ధతి చాలా బాగుంది కదా? మరి ఈ విధానాన్ని ఆలోచించింది, ఆచరణలోకి తెచ్చింది ఎవరో తెలుసా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న (Bharat Ratna) కె.కామరాజ్. ఆయన గురించి తెలుసుకుందామా?కె.కామరాజ్ (K. Kamaraj) 1903 జులై 15న అప్పటి మద్రాసు రాష్ట్రంలోని విరుదుపట్టి అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కుమారస్వామి, శివగామి అమ్మాల్. వారికి కంచి కామాక్షి అమ్మవారు ఇష్టదేవత. అందుకే పుట్టిన మగబిడ్డను ‘కామాక్షి’ అని, ‘రాజా’ అని పిలిచేవారు. చివరకు ఆ పేరు ‘కామరాజ్’గా స్థిరపడింది. ఆయనకు ఆరేళ్ల వయసు ఉండగానే ఆయన తాత, ఆ తర్వాత ఆయన తండ్రి మరణించారు. దీంతో కుటుంబం ఇబ్బందులు పడింది. అతికష్టమ్మీద చదువుకున్న కామరాజ్ 12వ ఏట చదువు మానేసి, తన మేనమామ నడిపే బట్టల దుకాణంలో పనికి వెళ్లడం మొదలుపెట్టాడు.అక్కడ ఉన్న సమయంలో స్థానికంగా ఉండే సమస్యలు, చుట్టుపక్కల జరిగే విషయాలను గమనిస్తూ తనకు తోచిన విధంగా ఇతరులకు సాయపడుతూ ఉండేవాడు. అప్పట్లో స్వాతంత్య్రోద్యమం మొదలవడంతో పలువురు ప్రముఖులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆ కార్యక్రమాలు వెళ్లే కామరాజ్ వారి ప్రసంగాలతో ఉత్తేజితుడయ్యేవాడు. బంకించంద్ర ఛటర్జీ, సుబ్రహ్మణ్య భారతి రాసిన పుస్తకాలను ఇష్టంగా చదివేవాడు. అనీ బీసెంట్ ‘స్వపరిపాలన’ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు.ఆ తర్వాత 1921లో తొలిసారి కామరాజ్ మహాత్మాగాంధీని మదురైలో కలిశారు. ఆయన భావాలు, ఆలోచనలకు ఆకర్షితుడైన కామరాజ్ తను కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి, జైల్లో ఉంచారు. అలా సుమారు 3 వేల రోజులు కామరాజ్ జైల్లోనే గడిపారు. అయినా ఆయన ఏమాత్రం చలించలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా సేవలందించారు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తమిళనాడు రాష్ట్రంలోని విద్యావిధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. పిల్లలు ఆకలితో పాఠాలు వినకుండా దేశంలోనే మొదటిసారిగా వారికి మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్కూళ్లల్లో యూనిఫారం వేసుకునే విధానం సైతం ఆయనే అమల్లోకి తెచ్చారు. ఆయన అమలు చేసిన విధానాలను ఆ తర్వాత దేశమంతా అమలు చేశారు.ఇలా ఎన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నా కామరాజ్ మాత్రం చాలా నిరాడంబరంగా జీవించేవారు. ఆయన మరణించేనాటికి ఆయనకున్న ఆస్తి 130 రూపాయలు, రెండు జతల చెప్పులు, నాలుగు చొక్కాలు, ధోతీలు, కొన్ని పుస్తకాలు. ఆయన మరణాంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించింది.చదవండి: నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!చూశారుగా! మామూలు స్థాయి నుంచి ఎదిగిన కామరాజ్, దేశానికి ఎన్ని సేవలందించారో! మీరు కూడా అలా అందరికీ ఉపయోగపడే పనులు చేసి పేరు తెచ్చుకోవాలి. -
సర్కారు బడులపై కర్ర పెత్తనం!
సాక్షి, అమరావతి: విద్యార్థులకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం నెలకో కొత్త నాటకం ఆడుతోంది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు సహా పలు హామీలిచ్చిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఒక్క పథకం అమలు చేయకుండా కుంటి సాకులు వెదుకుతోంది. తాజాగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య వాస్తవంకంటే అధికంగా ఉందని, తప్పుడు ఎన్రోల్మెంట్పై చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరిస్తోంది. అంతేగాక, విద్యార్థుల సంఖ్యపై లెక్కలంటూ ప్రభుత్వ పాఠశాలలపై రెవెన్యూ శాఖకు పెత్తనం అప్పగించింది. విద్యార్థుల లెక్క తీసేందుకు ఎమ్మార్వో, ఎండీవో, ఇతర రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తోంది. వాస్తవానికి ఆధార్ నంబర్ ఆధారంగా విద్యార్థులను బడుల్లో చేర్చుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు యూడైస్తో సరిపోవడంలేదని, డ్రాప్ బాక్స్లో కనిపిస్తున్న 2,02,791 మంది విద్యార్థులు వాస్తవానికి లేకున్నా అదనంగా నమోదు చేశారని చెబుతోంది. వారందరినీ తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో బడి బయట పిల్లలను స్థానికంగా గ్రామ/వార్డు వలంటీర్లు, సచివాలయ విద్యా కార్యదర్శులు కలిసి గుర్తించేవారు. వారిని తిరిగి పాఠశాలల్లో చేరి్పంచే బాధ్యత తీసుకునేవారు. దీంతో డ్రాప్బాక్స్ ఖాళీగా ఉండేది. ప్రస్తుతం వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడంతో బడిబయటి పిల్లలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. డ్రాప్ బాక్స్ లెక్కలు బోగస్ అంటూ.. పాఠశాల విద్యా శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 37 లక్షల మంది చదువుతున్నారు. విద్యార్థుల చేరికలు, వారి ఆధార్ వివరాలను యూడైస్తో అనుసంధానం చేశారు. దీంతో అందరి పిల్లల వివరాలు చిరునామాలతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఓ విద్యార్థి వరుసగా 30 రోజులు బడికి హాజరు కాకపోతే ఆ వివరాలు పాఠశాల విద్య డేటా బేస్లోని ‘డ్రాప్బాక్స్’లోకి వెళ్లిపోతాయి. అంటే వారు డ్రాప్ అవుట్స్గా లెక్కించాలి. ఇలా ప్రతి పాఠశాలకు నెల రోజులకు మించి హాజరు కాని వారు 10 నుంచి 50 మంది వరకు ఉంటారని అంచనా.దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా డ్రాప్ బాక్స్లో నమోదైన విద్యార్థుల సంఖ్య గతేడాది అక్టోబర్ నాటికి 2,02,791 మందికి చేరింది. ఇప్పుడు ఈ వివరాలను బోగస్ ఎన్రోల్మెంట్గా గుర్తించనుంది. ఇలా బోగస్ ఎన్రోల్మెంట్ చేసినందుకు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల ఒంగోలులో జరిగిన సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తీవ్రంగా హెచ్చరించారు. టీచర్ పోస్టులు పోకుండా కాపాడుకునేందుకు నకిలీ ఎన్రోల్మెంట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్ఎంలను హెచ్చరించారు. బోగన్ హాజరు వేసే హెచ్ఎంలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. బోగస్ హాజరును నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ అధికారుల బృందాలు ప్రతి పాఠశాలను తనిఖీ చేసేలా ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై తప్పుడు ముద్ర గత ప్రభుత్వంలో సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేది. అలాగే, ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున నగదు తల్లుల ఖాతాల్లో జమయ్యేది. దీంతో నిరుపేదలు సైతం తమ పిల్లలను బడులకు పంపేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ దాదాపు తగ్గిపోయాయి. ఒకవేళ ఎక్కడైనా డ్రాపవుట్స్ ఉంటే వలంటర్లు, సచివాలయ సిబ్బంది వారిని తిరిగి బడుల్లో చేర్చించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక బడి బయట పిల్లలను గుర్తించే బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించింది. పైగా తల్లికి వందనం కింద ఇస్తామన్న రూ.15 వేలు ఇవ్వనేలేదు.దీంతో చాలామంది నిరుపేదలు, కూలీలు పిల్లలను తీసుకుని ఉపాధి కోసం వలసపోయారు. పిల్లలు కూడా బాల కార్మికులుగా మారుతున్నారు. దీంతో బడుల్లో చేరిన విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగాయి. 2024 అక్టోబర్ నాటికి 2,02,791 మంది విద్యార్థులు డ్రాప్ బాక్స్లోకి చేరగా, ఈ మూడు నెలల్లో మరో 50 వేల మందికి పైగా పెరిగి ఉండవచ్చని అంచనా. కానీ, ఈ లెక్కలను బోగస్ అంటూ రెవెన్యూ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు లెక్క సరిపోవాలని, లేకుంటే కఠిచర్యలు తప్పవంటూ విద్యా శాఖ హెచ్చరించడంపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ, తాము తప్పు చేశామని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
AP: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీనుంచి జరిగే ఇంటర్మీడియట్ (Intermediate) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తత్కాల్ (Tatkal Scheme) కింద అవకాశం కల్పించారు. అభ్యర్థులు రూ.3 వేల ఆలస్య రుసుంతో మంగళవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంజనవరి నుంచి 1,48,923 మంది ఇంటర్ విద్యార్థులకు భోజనం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించేందుకు సమగ్ర శిక్ష విభాగం ఏర్పాట్లు చేసింది. మొత్తం 475 కాలేజీల్లో 398 కాలేజీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు అప్పగించారు. మరో 77 కాలేజీలకు ఎన్జీవోల ద్వారా భోజనం సరఫరా చేయనున్నారు.రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలకు రూ.100 కోట్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షాభియాన్ (పీఎం–ఉష)లో భాగంగా దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించింది. వర్సిటీలకు అవసరమైన ల్యాబ్స్, మౌలిక సదుపాయాల కల్పన కోసం గత విద్యాసంవత్సరం (2023)లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పుడు నిధులు మంజూరుచేసింది. ఈ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేంద్రం త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (పేరెంట్స్ కమిటీ)లకు ఒక్కరోజు శిక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 45,124 పాఠశాలలకు సంబంధించి జిల్లా, మండల, పాఠశాల స్థాయిల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలోనూ, 31 నుంచి జనవరి 2 వరకు మండల స్థాయిలోనూ, 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల స్థాయిలోనూ శిక్షణ నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు డీఈవోలను ఆదేశించారు. కాగా, జిల్లా స్థాయిలో 3,765 మందికి, మండల స్థాయిలో 93,643 మంది శిక్షణకు గానూ రూ.1,92,80,070 నిధులు మంజూరు చేశారు. నాన్ టీచింగ్ సిబ్బందికి జేఎల్ పదోన్నతులుప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2024–25 విద్యా సంవత్సరం ప్యానల్ సంవత్సరానికి బోధనేతర సిబ్బందికి 10 శాతం కోటా కింద ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జేఎల్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఆర్జేడీలను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అభ్యంతరాలను నమోదు చేయాలని సూచించారు. వీటిపై ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి తుది సీనియారిటీ జాబితాను పంపించాలన్నారు. కాగా, ఇదే కేటగిరీ కింద ఇటీవల 24 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. -
కూటమి పాలనలో చెదిరిన చదువులు
ఐక్యరాజ్య సమితి వరకు వినిపించిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రగతి ఆర్నెల్లలోనే గాడి తప్పింది! గత ఐదేళ్లూ మహోన్నతంగా విలసిల్లిన సర్కారు స్కూళ్లు మళ్లీ అద్వానంగా మారాయి. పిల్లల మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరీక్షించే నాథుడే లేరు. సదుపాయాలు, ప్రమాణాలు దిగజారి దయనీయంగా కనిపిస్తున్నాయి. ‘మెగా పేరెంట్స్ డే’ పేరుతో కూటమి ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో ఓ సమావేశాన్ని నిర్వహించి ఒక్క రోజు హడావుడి చేసింది. ఈ కార్యక్రమం ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు’లో లిఖించదగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా బోధన ఎలా ఉంది? ఎలాంటి సదుపాయాలున్నాయి? మన విద్యా వ్యవస్థ నాడు – నేడు ఎలా ఉంది? విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.మొగిలి రవివర్మ – సాక్షి ప్రతినిధి కర్నూలుకూటమి అధికారంలోకి వచి్చన తర్వాత కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారింది.⇒ కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ముడుమాల జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు చెట్ల కిందే కూర్చుని పాఠాలువింటున్నారు. కొంత మంది అసంపూర్తిగా నిలిచిపోయిన గదుల్లో ఇసుక, మట్టిపై కూర్చుని కనిపించారు. బ్లాక్ బోర్డును ఇటుకలపై అమర్చి బోధిస్తున్నారు. 12 తరగతి గదుల నిర్మాణాన్ని మధ్యలో నిలిపేశారు. రూ.46.99 లక్షలు నిధులున్నా, వాటిని పూర్తి చేసే వారు లేరు. సంగాల ఉన్నత పాఠశాల భవనాలను మధ్యలోనే నిలిపేశారు. నాగులదిన్నె, నందవరంతో పాటు జడ్పీ హైస్కూలు భవనాల నిర్మాణం ఆగిపోయింది. ప్రభుత్వం మారడంతో పనులు నిలిపివేసింది.⇒ నందవరం మండలం నాగులదిన్నె స్కూలులో తాగేందుకు మంచినీరు లేక ట్యాంకుల్లో నింపిన నీటినే పిల్లలు తాగుతున్నారు.⇒ కర్నూలులో స్టాంటన్పురం నుంచి ఎమ్మిగనూరు వరకు ఏ స్కూల్లో చూసినా మరుగుదొడ్లలో దుర్గంధమే.⇒ చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది. చాలా మంది పిల్లలకు బూట్లు లేవు. చెప్పులు, ఒట్టి కాళ్లతో బడికి వచ్చారు.⇒ కర్నూలు రూరల్ మండలం కోడుమూరు నియోజకవర్గం సుంకేసుల ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనాలు, ప్రహరీ, కిచెన్ నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. కాలనీలో నిరుపేద మహిళలను పలుకరించగా.. ‘సార్! మాలాంటోళ్లకు అమ్మ ఒడితో ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు ‘తల్లికి వందనం’ అంటూ ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామన్నారు. మరి ఎక్కడిచ్చారు?’ అంటూ మహిళలు శిరోమణి, స్వరూప, మహేశ్వరి నిర్వేదం వ్యక్తం చేశారు.అమ్మ ఒడి లేదు.. నీడనిచ్చే హాస్టళ్లూ లేవు..!కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు హైస్కూలులో 608 మంది విద్యార్థులు చదువుతుండగా 160 మంది మాత్రమే బడికి వస్తున్నారు. మిగిలిన వారంతా తల్లిదండ్రులతో కలసి ఉపాధి కోసం వలస వెళ్లారు. గతంలో తల్లిదండ్రులు వలస వెళ్లినా పిల్లలు సీజనల్ హాస్టళ్లలో ఉంటూ చదువుకునేవారు. ఇప్పుడు డిసెంబర్ వచ్చినా సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయకపోవడంతో తల్లిదండ్రులతో కలసి పనుల కోసం పిల్లలు ఊరు విడిచి వెళ్లారు. అమ్మ ఒడి కూడా అందకపోవడంతో కష్టజీవులు తమ పిల్లలను చదివించుకునే పరిస్థితి లేకుండా పోయింది.బడి వదిలి.. పొలం బాట .. సి.బెళగల్ మండలం ఈర్లదిన్నెలో శేఖర్ అనే విద్యార్థి స్కూలుకు వెళ్లకుండా తండ్రి ఈశ్వర్తో కలిసి పొలంలో గడ్డివామి వేస్తున్నాడు. అదే గ్రామంలో సందేశ్, జీవన్ అనే మరో ఇద్దరు చిన్నారులు కూడా తల్లి ప్రవీణతో కలసి మొక్కజొన్నకు మందు పిచికారీ చేస్తున్నారు. ‘అమ్మ ఒడి డబ్బులు వస్తే పిల్లల ఖర్చులకు ఉపయోగప డేవి. ఇప్పుడు ఇవ్వట్లేదు కదా సార్! ఏదో వీళ్లు పనికి వస్తే కూలీ డబ్బులైనా మిగులుతాయి’ అని తల్లిదండ్రులు చెబుతున్నారు.అమ్మ ఒడి లేక డ్రాపౌట్స్!బిజివేముల రమణారెడ్డి – సాక్షి ప్రతినిధి, బాపట్లబాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక పేద పిల్లలు పాఠశాలలకు దూరమవుతున్నారు. డ్రాపౌట్స్ పెరిగిపోతున్నారు. ఈ ఏడాది ఇంకా చాలా మందికి యూనిఫాం, బూట్లు, ఇతర వస్తువులు అందలేదు... అని చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం అక్కాయిపాలెం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చెప్పారు. అమ్మ ఒడి అందకపోవడంతో ఈ పాఠశాలలో 23 మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం అమ్మ ఒడి ఇవ్వక పోవడంతో ఇద్దరు పిల్లలను చదివించడం భారంగా ఉందని సముద్ర తీర ప్రాంతం వాడరేవుకు చెందిన మత్స్యకారుడు శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మ ఒడి రాక తమ పిల్లలను బడి మానిపించినట్లు మహిళలు సురేఖ, కుమారి తెలిపారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం చదువులు లేనప్పుడు ఇక పిల్లలను బడికి పంపడం ఎందుకు సారూ.. అని మత్స్యకార మహిళ అక్ష ప్రశ్నించింది. ఓడరేవు ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో మొదలైన భవన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు ఆరు బయట ఇసుకలో చదువుకుంటూ కనిపించారు. ⇒ చినగంజాం మండలం అడవి వీధిపాలెం ఉన్నత పాఠశాలను పరిశీలించేందుకు ఉపాధ్యాయులు అనుమతి నిరాకరించి గేటుకు తాళం వేశారు. నాసిరకం బియ్యం, టమాటా చారుతో పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పిల్లలు తినడం లేదని, చాలామంది ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారని అనూష అనే మహిళ తెలిపింది. తాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని విద్యార్థులు చెప్పారు. జిల్లాలో సుమారు రూ.350 కోట్ల విలువైన నాడు–నేడు పనులు మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి.తడికెల బడి.. కర్నూలులోని స్టాంటన్పురం జడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ నుంచి పదో తరగతి వరకూ ఒకటే బడి. ‘నాడు–నేడు’ కింద మంజూరైన నిధులున్నా భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో టీచర్లు చందాలు వేసుకుని తడికెలు సమకూర్చుకుని అందులోనే పిల్లలకు చదువు చెబుతున్నారు. ఆర్నెల్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పేందుకు ఇవి సరిపోవా?శ్రీకాకుళం జిల్లా ఆనందపురం యూపీ స్కూల్లో నిరూపయోగంగా మారిన వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ నిర్వహణ అస్తవ్యస్తంకందుల శివశంకర్ – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మూత్రశాలలు, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ లేక విద్యార్థులు అవస్థ పడుతున్నారు. రణస్థలం మండలం పైడి భీమవరం హైస్కూల్లో వాష్బేసిన్లు, మూత్రశాలలు నీటి సదుపాయం లేక వెక్కిరిస్తున్నాయి. టెక్కలి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక చాలా చోట్ల పాఠశాలల భవనాలు ప్రారంభించేందుకు సిద్ధమైనా వాటిని పట్టించుకునే నాధుడు లేరు. భవనాల్లో అమర్చాల్సిన తలుపులు, కిటికీలు, ఇతర సామగ్రిని పాఠశాలల్లోని స్టోర్ రూమ్లో పడేశారు. ఈ పనుల కోసం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని రణస్థలం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.⇒ పాఠశాలల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్లు నిర్వహణ లోపంతో పని చేయడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదు. చాలా చోట్ల ఆరు బయట అపరిశుభ్ర వాతావరణంలో వండటం కనిపించింది. రణస్థలం మండలం పాతర్లపల్లి హైస్కూల్లో విద్యార్థులకు సిద్ధం చేసిన వంటల్లో పక్షుల విసర్జితాలు నేరుగా పడుతున్న దుస్థితి ‘సాక్షి’ పరిశీలనలో కంటబడింది. పక్కా భవనం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయులు, వంట కార్మికులు చెబుతున్నారు.నాడు–నేడు కింద చేపట్టిన భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, అవి పూర్తయితే వంటగదిని కేటాయించవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. నాడు–నేడుతో తమ పాఠశాల రూపురేఖలు మారాయని, చుట్టూ రక్షణ గోడ నిర్మించడంతోఎన్నో ఏళ్లుగా వేధించిన వరద నీటి ముంపు సమస్య తొలగిందని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఆనందపురం యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఏ.ఆదినారాయణ చెప్పారు.కలలో కూడా అనుకోలేదు..‘ఎప్పుడు ఏది కూలుతుందో తెలియని దుస్థితి నుంచి కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో మా స్కూళ్లు మారతాయని ఎన్నడూ ఊహించలేదు. నా సర్వీస్లో ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు..’ – డిజిటల్ బోర్డు వైపు చూస్తూ శ్రీకాకుళం జిల్లా దేశవానిపేట యూపీ స్కూల్ టీచర్ ఉత్తముడి మాట!ఈ మార్పులు ఎవరి చలువ?‘ఇటీవల పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కోసం పాఠశాలకు వెళ్లాం. అక్కడ ఉన్నవన్నీ ఎవరు ఏర్పాటు చేసిన వసతులు? ఎవరి హయాంలో వచ్చిన మార్పులు అవి? వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మా ఊరి బడి పరిస్థితి మారేదా..?’ – శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 8వ తరగతి విద్యార్థి తండ్రి ఎస్.రామారావు మనోగతం!జగన్ మా బాధలు తీర్చారు..‘పాఠశాలకు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఒకటే టెన్షన్. చుట్టూ మురుగునీరు.. తీవ్ర దుర్గంధం! చినుకు పడితే పాముల బెడద. ఎప్పుడూ జలమయంగా ఉండే పాఠశాల ప్రాంగణం.. జగన్ నాడు–నేడులో భాగంగా చేపట్టిన ప్రహరీ నిర్మాణంతో మా బాధలు తీరాయి’ – డోల చంద్రుడు, విద్యార్థి ఆనందపురం, శ్రీకాకుళం జిల్లాఆర్నెల్లుగా జీతాలులేకున్నా..‘పిల్లల బాగోగులే మాకు కావాలి బాబూ..! జగన్ బాబు ఉన్నప్పుడు ప్రతి నెలా జీతం వచ్చేది. ఇప్పుడు జీతం ముఖం చూసి ఆరు నెలలైంది. అయినా సరే పని చేస్తున్నాం. పిల్లల ఆరోగ్యమే మా జీవితం. మా ఆకలి బాధలు తీరకున్నా మరుగుదొడ్లు నిత్యం పరిశుభ్రంగానే ఉంచుతున్నాం. మాకు చేతనైంది ఇదే పని బాబూ.. జీతాలిప్పించండి..’ అంటూ పాతర్లపల్లి, పైడి భీమవరంలో ఆయా రాములమ్మతో పాటు మరికొందరు వేడుకున్నారు. -
మధ్యాహ్న భోజనం తిని 9మంది విద్యార్థులకు అస్వస్థత
చాట్రాయి: మధ్యాహ్న భోజనం తిని తొమ్మిదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని కోటపాడు యూపీ స్కూల్లో బుధవారం మధ్యాహ్నం 39 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం దుంప కుర్మా వారికి వడ్డించారు. భోజనం తిన్న అర గంట తర్వాత ఎన్.కల్పన, టి.క్రాంతి మేఘన, ఉమా యశ్వంత్, ఎం.దుర్గామనీష్, ఎన్.అమృత, ఎన్.లాస్య, టి.సిరి స్పందన, ఎన్.ఉదయకుమార్, టి.వర్షిణి కడుపు నొప్పితో బాధపడ్డారు. విషయం తెలిసిన చాట్రాయి పీహెచ్సీ వైద్యాధికారి విజయలక్ష్మి పాఠశాలకు వెళ్లి వారికి వైద్యం అందించారు. మళ్లీ గురువారం చనుబండ పీహెచ్సీ వైద్యాధికారి దుర్గాప్రసాద్ వెళ్లి విద్యార్థులకు వైద్యం చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గురువారం మధ్యాహ్నం భోజనం చేయగానే వీరిలో ఒకరికి కడుపు నొప్పి, మరొకరికి వాంతులు అవడంతో ఎంఈవో బ్రహ్మచారి 9 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం మెనూలో దుంప కుర్మా కూరలో రాగి పిండి కలిపి భోజనం పెట్టారని, విద్యార్థుల్లో అరుగుదల లేకపోవడం వలన గ్యాస్ కారణంగా కడుపు నొప్పి వచ్చిందని చాట్రాయి పీహెచ్సీ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. -
టీడీపీపై తల్లిదండ్రుల ఆగ్రహం
-
TG: మాగనూరులో మళ్లీ ఫుడ్ పాయిజన్
సాక్షి, నారాయణపేట: తెలంగాణలోని పలు పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాజాగా జరిగిన ఘటనలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో ఆసుపత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్ఇక, ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నాలుగైదు రోజులు గడవకముందే మరోసారి నేడు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: మళ్లీ పురుగుల అన్నమే! -
వికటించిన మధ్యాహ్న భోజనం
గంగాధర (చొప్పదండి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. శుక్రవారం మధ్యాహ్నం అన్నం తిన్న పలువురు విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 205 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో శుక్రవారం 180 మంది హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలలో వండిన భోజనం తిన్నారు. కాసేపటికి ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.ఇది చూసిన మరో 20 మంది విద్యార్థులు కడుపునొస్తోందని ఉపాధ్యాయులకు చెప్పారు. వెంటనే వారు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వైద్యం అందించి, మాత్రలు ఇచ్చారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనానికి వండిన బియ్యం కొత్తవి కావడంతో పాటు అన్నం మెత్తగా కావడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఎంఈవో ప్రభాకర్రావు వివరించారు. -
పరువు పోతోంది పరిష్కారమేంటి?
సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజనం పురుగులతో విద్యార్థులు ఏదో ఒకచోట అస్వస్థతకు లోనవుతూనే ఉన్నారు. ‘ఒకరోజు ఖమ్మం జిల్లాలో, మరోరోజు నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం పరువు పోతోంది. ఏం చేద్దాం..ఎలా పరిస్థితిని చక్కబెడదాం’అంటూ ఉన్నతాధికారులు హెచ్ఎంల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.‘నాణ్యత లేని భోజనం పెడితే కటకటాలు లెక్కబెట్టిస్తాం’అని సీఎం నవంబర్ 14న ప్రకటించారు. అయినా వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎంవో ఆదేశించింది. ఘటన జరిగినప్పుడు హెచ్ఎంనో, డీఈవోనో సస్పెండ్ చేస్తే కొత్త సమస్యలొస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్ల నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నామని సీఎం భావిస్తున్నారు. ఇవేవీ లేకుండా పురుగుల అన్నంతో పరువు పోకుండా ఏం చేయాలో నివేదిక ఇవ్వడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. సమస్య ఎక్కడ? రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్లున్నాయి. విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పౌర సరఫరాల శాఖ నుంచి బియ్యం అందజేస్తారు. మిగతా సరుకులన్నీ స్వయం సహాయ బృందాల నిర్వహణలో ఉంటాయి. ఎక్కువ మంది విద్యార్థులుంటే కొంత వరకూ నిర్వహణ సాధ్యమవుతోంది. మరీ తక్కువగా విద్యార్థులుంటేనే నిర్వహణ వ్యయం ఇబ్బందే. 13,005 స్కూళ్లలో 50 లోపు విద్యార్థులే ఉన్నారు.ఈ కారణంగా వచ్చే నిధులు తక్కువ. స్వయం సహాయ బృందాలకు నెలవారీ బిల్లులు కూడా చెల్లించడం లేదు. అప్పు తెచ్చి వంట చేస్తున్నామని, వడ్డీ తామే కడుతున్నామంటున్నారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఏం చేసినా నాణ్యత ఎలా పెరుగుతుందని వారు ప్రశి్నస్తున్నారు. అదీగాక సివిల్ సప్లై నుంచి వచ్చే బియ్యంలో పురుగులు ఉంటున్నాయని, వాటిని రీ సైక్లింగ్ చేస్తే తప్ప పురుగులు అరికట్టడం సాధ్యం కాదంటున్నారు. దీనికి బడ్జెట్ ఉండదని హెచ్ఎంలు అంటున్నారు. ఇక్కడో రీతి... అక్కడో తీరు కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన మెనూ అమలు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన ఆహారం ఇస్తారు. గుడ్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. అన్నం, వెజిటబుల్స్, రసం, కోడిగుడ్డు, ఆకుకూరపప్పు, నెయ్యి, పెరుగు ఇస్తున్నారు. కాబట్టి నిర్వహణ వ్యయం సరిపోతుందనేది హెచ్ఎంల వాదన. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం బియ్యం, కూరగాయలు, పప్పు మాత్రమే ఇస్తున్నారు. పప్పు, కోడిగుడ్డు రోజూ ఉండదు. కూరల రేట్లు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ నిర్వహణ సమస్యగా ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖకు తెలిపారు.విధాన పరమైన లోపాలున్నాయి మధ్యాహ్న భోజన నాణ్యత పెంచాలంటే ముందుగా విధానపరమైన మార్పులు అవసరం. సంబంధిత ఏజెన్సీలకు ముందుగా బిల్లులు చెల్లించాలి. నాణ్యత పెంచేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. నిధులు పెంచాలి. తప్పు జరిగినప్పుడు హెచ్ఎంలనే బాధ్యులను చేయడం అన్యాయం. – పి.రాజాభాను చంద్రప్రకాశ్, తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు టీచర్లనే ప్రశ్నించడం సరికాదు మధ్యాహ్న భోజన పథకం అమలులో హెచ్ఎంల పాత్ర నామమాత్రమని 2014లో ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. బోధన సంబంధమైన విధులే హెచ్ఎంలకు తలకు మించి ఉన్నాయి. తప్పు జరిగితే బాధ్యులను చేయాలనే విధానం మంచిది కాదు. – పింగిలి శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు -
మధ్యాహ్న భోజనం వికటించి 89 మందికి అస్వస్థత
నవీపేట(బోధన్)/గాంధారి (ఎల్లారెడ్డి)/నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): మధ్యాహ్న భోజనం వికటించి పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో శుక్రవారం మొత్తం 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 188 మంది విద్యార్థులు మధ్యాహ్నం ఎప్పటిలాగే భోజనం చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పితో వరుసగా 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించగా ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లతో చికిత్స చేశారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడిన ఏడుగురు విద్యార్థులకు సెలైన్ ఎక్కించారు. అలాగే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 305 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయగా 25 నుంచి 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఇందులో ఇద్దరికి సెలైన్ ఎక్కించారు. నాగిరెడ్డిపేట మండలంలోని చీనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వీరికి వైద్య చికిత్సలు అందించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. -
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
మాగనూర్: పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తిని 83 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో సోమవారం జరిగింది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం భోజనం చేయగా దాదాపు 83 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హెచ్ఎం నర్సింహులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పీ హెచ్సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మధ్యాహ్న భోజనం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపించారు. మరో ఏడుగురు విద్యార్థులకు వాంతులు తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. -
ఉద్యోగాలు 4... దరఖాస్తులు 675!
అనంతపురం: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణకు సంబంధించి నాలుగు కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 675 దరఖాస్తులు అందినట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మధ్యాహ్న భోజన పథకం డేటా అనలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్టుకు మొత్తం 166 దరఖాస్తులు, డేటా ఆపరేటర్ ఉద్యోగానికి 199 దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించి డేటా అనలిస్ట్కు 122 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్కు 188 మంది దరఖాస్తు చేశారు. (చదవండి: ఆస్తి కోసం అంధురాలిపై హత్యాయత్నం) -
YSR-YVR Canteen: రూ.6కే మధ్యాహ్న భోజనం
గుంతకల్లుటౌన్(అనంతపురం జిల్లా): ఒక్కపూట తిండి కోసం అలమటించే ఎందరో నిరుపేదలు, నిరాశ్రయుల ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని, ఇందులో భాగంగా రూ.6కే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఎమ్మెల్యే వైవీఆర్ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్–వైవీఆర్ క్యాంటీన్’ను బుధవారం ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్ మాట్లాడుతూ.. దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఉడతాభక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని తానుంత వరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని రూ.6కే అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుర ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భవానీ, వైస్ చైర్పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియాబేగం, వీరశైవలింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్రెడ్డి, వైఎస్సార్సీపీ గుంతకల్లు, పామిడి ఎంపీపీలు మాధవి, మురళీరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యుడు కదిరప్ప, ఏడీసీసీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్.రామలింగప్ప, రామాంజనేయులు, పార్టీ పట్టణ కన్వీనర్లు సుంకప్ప, హుసేన్పీరా, సీనియర్ నేతలు శ్రీనివాసరెడ్డి, మంజునాథరెడ్డి, సందీప్రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో మార్పులకు కేంద్రం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని (ప్రధానమంత్రి పోషక్ పథకం) సమూలంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు పోషక విలువలున్న ఆహారాన్ని అందించేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సూచించింది. విద్యార్థులందరికీ మధ్యాహ్నం పోషకాలు ఎక్కువగా ఉండే రాగిజావను ఇవ్వాలని, దీంతోపాటే మొలకలు, బెల్లం అందించాలని పేర్కొంది. దీని అమలుకు గల సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది. అయితే, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాల్సిఉందని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దీనికి అదనపు నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనా స్పష్టత లేదని విద్యాశాఖలో అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరు చెప్పారు. గతంలో కూడా మధ్యాహ్నం భోజనంతోపాటు పల్లీ పట్టీ ఇవ్వాలని కేంద్రం సూచించిందని, పెరిగిన ధరల ప్రకారం దీన్ని అమలు చేయడం సాధ్యం కాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాగిజావను విధిగా ఇవ్వాల్సిందేనని కేంద్రంనుంచి ఒత్తిడి వస్తున్నట్టు చెప్పాయి. ఇప్పుడిచ్చే ఆహారంలో స్వల్ప మార్పులు చేసి రాగిజావ, బెల్లం, మొలకలు అందించే విషయం పరిశీలిస్తున్నామని, దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. జాతీయ సర్వే ప్రకారమే.. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కేంద్రస్థాయిలో కొన్నేళ్లుగా తరచూ సర్వేలు చేస్తున్నారు. స్కూలు సమయానికి విద్యార్థుల కుటుంబాల్లో సరైన పోషక విలువలున్న ఆహారం అందించడం లేదని సర్వేలో తేలింది. తల్లిదండ్రులు ఉపాధి కోసం హడావిడిగా ఉదయం వెళ్లాల్సి రావడం, విద్యార్థులు కూడా ఇంట్లో ఉన్నదేదో తిని వస్తున్నారని, దీంతో చాలామందిలో పోషకాహార లోపం కన్పిస్తోందని వెల్లడైంది. ఐదేళ్లుగా కనీసం 40 శాతం మంది విద్యార్థులు రక్తహీనత, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. 32 శాతం మందిలో పోషక విలువలు లోపించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడైంది. వీళ్లంతా ఎక్కువ రోజులు స్కూలుకు హాజరవ్వడం లేదని, ఫలితంగా విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో బడిలోనే పోషకాలతో కూడిన ఆహారం అందించాలని ప్రతిపాదించింది. ఇందులో ప్రధానంగా రాగిజావ ఇవ్వాలని భావిస్తున్నారు. దీన్ని రోజూ ఇవ్వడమా? వారంలో కొన్ని రోజులు ఇవ్వడమా? అనే దానిపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు. నిధుల సర్దుబాటు ఎలా? మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు మంజూరు చేస్తున్నాయి. ఈ పథకానికి ఏటా రూ.550 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం విద్యార్థులకు రోజుకో విధంగా ఆహారం ఇస్తున్నారు. వారానికి మూడు రోజులు గుడ్డు, మిగతా రోజుల్లో ఆకు కూరలు, కాయగూరలు, సాంబార్, కిచిడీ ఇలా పలు రకాలుగా అందిస్తున్నారు. అయితే, కేంద్రం మెనూ ప్రకారం ధరలను నిర్ణయిస్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవి ఉండటం లేదని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ.6 ఉంటే.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం రూ.2 మాత్రమే ఉంటోంది. దీంతో నిధుల సర్దుబాటు సమస్య వస్తోంది. ఇప్పుడు కూడా రాగిజావ, మొలకల కోసం ప్రత్యేక నిధులు అవసరమవుతాయని, లేని పక్షంలో పథకం అమలులో అనేక ఇబ్బందులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. (చదవండి: అంచు చీరలే ఆ‘దారం’) -
స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి నేటికీ నిరంతర అన్నదానం..
సాక్షి, వేటపాలెం(ప్రకాశం): గొల్లపూడి రాధాకృష్ణయ్య దాతృత్వం.. ముందుచూపు. 88 ఏళ్లగా పేదవిద్యార్ధుల ఆకలి తీరుస్తుంది. స్వాతంత్య్రంరాక పూర్వమే ప్రారంభించిన హాస్టల్ నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కష్టపడి చదువు కొనే విద్యార్ధులకు కులమతాలకు అతీతంగా పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పానికి భవిష్యత్లోను డోకాలేని విదంగా శాశ్వత నిధి ఏర్పాటు చేసిన రాధాకృష్ణయ్యకు విద్యార్ధులు నిత్యం జ్యోహార్లు అర్పిస్తుంటారు. వేటపాలెంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రావుసాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి పాఠశాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్ధులు వస్తుండేవారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక భోజనం కోసం ఇబ్బందులు పడుతుండేవారు. దీన్ని గొల్లపూడి రాధాకృష్ణయ్య గమనించారు. పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దుస్తులు వ్యాపారం నిర్వహించే ఈయన మద్రాసులోని షావుకారు పేటలో ఉన్న హిందూ థీయోసాఫికల్ స్కూల్ ప్రధానోపాద్యాయుడు రంగస్వామి అయ్యర్ ప్రేరణతో 1933 సంవత్సరంలో మొదటి సారిగా వేటపాలెంలో బిబిహెచ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బోజనం సౌకర్యం కల్పించారు. మొదటి హాస్టల్ నిర్వహణకు తన వ్యాపారం నుంచి నిధులు సమకూర్చేవారు. కానీ తన అనంతరం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచన ట్రష్టును ఏర్పాటు చేసేలా చేసింది. శాశ్వత భవనం, పర్నిచర్తో పాటు మూలనిధిని కూడా ఏర్పాటు చేయడంతో పాటు 88 సంవత్సరాలుగా విద్యార్ధులు కడుపు నిండా బోజనం తింటున్నారు. రాధాకృష్ణయ్య అనంతరం ఆయన దత్తపుత్రుడు గొల్లపూడి సీతారం 1977లో హాస్టల్ నిర్వహణ బాద్యతలను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భోజనం ఎవరికి పెడతారంటే... ప్రతి ఏడాది బండ్ల బాపయ్య శెట్టి కళాశాల్లో అడ్మిషన్లు జరుగుతాయి. కళాశాల్లో చేరిన విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు ఒక పద్యం నేర్పిస్తారు. ఈ పద్యం తప్పుపోకుండా చెప్పిన పేద విద్యార్థులను గుర్తించి వారికి బోజనం కోసం టోకేన్లు అందిస్తారు. ఈ టోకెన్ పొందిన విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు వారు పొందిన టోకెన్లను హాష్టల్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో వేసిరావాల్సి ఉంటుంది. టోకెన్లు ఆదారంగా హాస్టల్లో బోజనం తయారుచేస్తారు. ప్రతి రోజు 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుకోనే 100 నుంచి 150 మంది విద్యార్థులు హాష్టల్లో భోజనం చేస్తుంటారు. బోజనానికి ముందుగా ప్రార్ధన చేయాల్సి ఉంటుంది. -
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ముంబై: రాష్ట్రంలోని పేదలు ఆకలితో పస్తులుండకుండా చూడటమే లక్ష్యంగా పేదలకు పది రూపాయలకే భోజనం అందించే అపూర్వమైన పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 'శివ్ భోజన్' పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరంభించింది. ఈ పథకాన్ని మహారాష్ట్ర మంత్రి అస్లామ్ షేక్ రద్దీ ఎక్కువగా ఉండే నాయిర్ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. బండ్ర కలెక్టర్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. (ఠాక్రే కుటుంబం నుంచి మరో వారసుడు..) ఈ పథకాన్ని ప్రవేశపెడతామని శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి 'మహా అఘాడీ' ప్రభుత్వం ఏర్పాటు కాగా, మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా థాక్రే కదులుతున్నారు. శివ్ భోజన్ ప్లేటులో రెండు చపాతిలు, ఒక ఆకుకూర, అన్నం, పప్పు ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేదలకు అందుబాటులో ఉంటుందని వారు వివరించారు. ప్రతి క్యాంటీన్లో సుమారు 500 ప్లేట్ల శివ్ భోజన్ పథకాన్ని పేదలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అధికారులు తెలిపారు. తొలి రోజునే అనూహ్యమైన స్పందన లభించిందని, పేదలు బారులు తీరి ఖరీదు చేశారన్నారు. ఇంత తక్కువ ధరకు అందిస్తున్నందున ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ('88 ఏళ్ల తర్వాత గుర్రాలపై పోలీసుల గస్తీ') -
సీఎం జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న డీఎస్పీ
స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. వారిని ప్రేమగా పలుకరించాలి. సమస్యలను తెలుసుకోవాలి. పరిష్కారానికి చొరవ చూపాలి. అవసరమైతే వారికి తాగునీరు, మజ్జిగ, అన్నం పెట్టి ఆకలి తీర్చాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు, పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు ఇవి.. సీఎం ఆదేశాలనూ పాటిస్తూ అర్జీదారుల పాలిట పెద్దన్నగా, అన్నం పెట్టే ఆపన్న హస్తం అయ్యారు ఆయన. తమ సమస్యలు విన్నవించేందుకు వచ్చిన అర్జీదారుల ఆకలి తీర్చేందుకు ప్రతి రోజూ ఉచితంగా భోజనం ఏర్పాటు చేసి, ఆదర్శంగా నిలుస్తున్నారు డీఎస్పీ సూర్యనారాయణ. సీఎం జిల్లాలోని కడప పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఫిర్యాదుదారులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. సాక్షి, కడప : అక్కడ భోజనాలు వడ్డిస్తున్నదీ.... భోజనం చేస్తున్నదీ.... ఏదో కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా పెడుతున్నారనీ భావిస్తే.... పప్పులో కాలేసినట్లే..ఓ పోలీస్ అధికారి చొరవ తీసుకుని మానవత్వంతో స్పందిస్తున్న తీరుకు నిదర్శనమది. అర్జీలు ఇవ్వడానికి వచ్చి ఆలస్యమైతే ఆకలితో పస్తులుండకుండా వారికి భోజనం పెడుతున్న చిత్రమిది. రాష్ట్ర ప్రభుత్వం స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన వారిని మర్యాదగా చూడాలని..కనీసం మజ్జిగయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఈ మాటలను కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ ప్రేరణగా తీసుకున్నారు. మజ్జిగో మంచినీళ్లో కాకుండా ఒకడుగు ముందుకేసి ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. కడప పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గడచిన వందరోజులుగా అమలు చేస్తున్నారు. పైసా ఎవరినుంచి తీసుకోకుండా ఇందుకయ్యే మొత్తాన్ని ఆయనే భరిస్తున్నారు. సబ్ డివిజన్ పరిధిలో కడప నగరంతో పాటు, చెన్నూరు, కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, చింతకొమ్మదిన్నె, వల్లూరు, పెండ్లిమర్రి మండలాలున్నాయి. ఈ ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం వినతులు చేతపట్టుకుని ప్రజలు వస్తుంటారు. వీటిని పరిష్కరించడానికి అధికారులకు కొంత సమయం పడుతుంది. తామిచి్చన దరఖాస్తుల పరిస్థితి ఏమిటంటూ వారు కార్యాలయానికి మళ్లీ వస్తుంటారు. ఇది వారం పొడవునా జరిగే ప్రక్రియ. ఇలా వచ్చేవారు చాలాసేపు నిరీక్షించాలి్సన సందర్భాలుంటాయి. మధ్యలో దూరం వెళ్లి భోజనం చేయడానికి ఇబ్బందులు పడటాన్ని డీఎస్సీ సూర్యనారాయణ గమనించారు. వారికి అలాంటి ఇబ్బంది కలుగకుండా ఆయన చొరవ తీసుకుని ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మూడు నెలలుగా రోజూ 50 మందికి తక్కువ కాకుండా భోజనం చేస్తున్నారని డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.. సిద్ధంగా ఉన్న అహారం ప్రతి ఫిర్యాది ఆనందంగా వెళ్లడమే ధ్యేయం సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. చిన్నతనంలో పోలీస్స్టేషన్కు వెళ్లాలన్నా, ఎమ్మార్వో ఆఫీస్కు పోవాలన్నా ఎంతో యాతనయ్యేది. పనులుకాకపోతే ఉసూరుమంటూ ఇంటికి వచ్చేవాళ్లం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్లు ‘స్పందన’కు సంబంధించి చెప్పిన మాటలు నాకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. అందుకే ఫిర్యాదుదారులను ఆకలితో పంపకుండా భోజనం చేసి వెళ్లమంటున్నాను. దీన్ని పెద్ద సహాయంగా నేను భావించడం లేదు. –సూర్యనారాయణ, డీఎస్పీ, కడప, వైఎస్ఆర్ జిల్లా ఇలా ఎవరూ భోజనం పెట్టలేదు... మా ఊరిలో స్థలం విషయమై బంధువులతో కలిసి ఉదయం ఉదయం 9 గంటలకు వచ్చాను. ఇక్కడ మధ్యాహ్నం కాకమునుపే భోజనం పెట్టారు. ఎంతసేపయినా ఎదురుచూసి సమస్యను పరిష్కరించుకుని వెళతామనీ ధీమాగా వుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ గతంలో భోజనం పెట్టిన దాఖలాలు లేవు. ఎన్.మునీంద్రబాబు, ఎర్రగుడిపాడు, కమలాపురం -
కమిషనర్కు పురుగుల అన్నం
కర్ణాటక, మైసూరు: పర్యాటక రాజధానిగా ప్రసిద్ధి చెందిన రాచనగరిలో కొందరి నిర్వాకం వల్ల చెడ్డపేరు వస్తోంది. భోజనం చేయడానికి హోటల్కు వెళ్ళిన మహా నగర పాలికే (కార్పొరేషన్) కమిషనర్కు హోటల్ సిబ్బంది పురుగుల అన్నం వడ్డించడంతో కంగుతిన్నారు. వెంటనే ఆరోగ్య శాఖ అధికారులకు తెలపడంతో వారు వచ్చి పరిశీలన జరిపి హోటల్ యజమానికి రూ.30 వేల జరిమానా విధించిన సంఘటన మైసూరు నగరంలో చోటు చెసుకుంది. కమిషనర్గీతా గురువారం మధ్యాహ్నం భోజనం చేయడానికి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఆనందభవన హోటల్కు వెళ్లారు. ఆమె ఆర్డర్ ప్రకారం సిబ్బంది భోజనం తీసుకొచ్చారు. తినబోతుంటే.. ఆమె తినబోతూ చూస్తే భోజనంలో పురుగులు కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన వచ్చి భోజనాన్ని పరిశీలించి పురుగులు ఉన్నట్లు తేల్చారు. హోటల్లో ఉన్న అపరిశుభ్రత, కుళ్ళిపోయిన, పురుగులు పట్టిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. -
50 మంది విద్యార్థినులు అస్వస్థత
సాక్షి, శంకరపట్న(కరీంనగర్) : జిల్లాలోని శంకరపట్నం మండలం కేశవపట్నం మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినులు కలుషిత భోజనం తిని 50 మంది మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి ఆలుగడ్డ కూర విద్యార్థినులకు వడ్డించారు. గంట తర్వాత కొందరు కడుపునొప్పితో విలవిలలాడారు. హాస్టల్ ఏఎన్ఎం టాబ్లెట్లు ఇవ్వగా.. రాత్రంతా ఉండిపోయారు. మంగళవారం ఉదయం అల్పాహారంలో విద్యార్థినులకు ఉప్మా వడ్డించారు. అల్పాహారం తిన్న విద్యార్థినుల్లో కొందరు వాంతులు చేసుకున్నారు. స్థానిక పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది చికిత్స అందించారు. 32 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి పీహెచ్సీ వైద్యుడు షఖిల్ అహ్మద్ 108, పోలీసుల వాహనాల్లో తరలించారు. జిల్లా వైద్యాశాఖ అధికారి రాంమనోహర్రావు, ఆర్డీవో చెన్నయ్య, డీఐవో జువేరియా కేశవపట్నం పీహెచ్సీలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. హాస్టల్ను సందర్శించి ఉప్మా నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. అపరిశుభ్రంగా వాటర్ ట్యాంక్ హాస్టల్లో విద్యార్థినులకు తాగునీరు అందిస్తున్న వాటర్ట్యాంక్ అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెలుగుచూసింది. ట్యాంకు నీటిని భోజనంలో వాడిన కారణంగానే సోమవారం రాత్రి భోజనం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నాచు పట్టిన నీటితో వంట చేయడంతో ఆహారం విషతుల్యమై విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మోడల్స్కూల్ హాస్టల్లో 83 మంది విద్యార్థినులు ఉన్నారు. వంటకోసం హాస్టల్ భవనంపై వాటర్ట్యాంక్ నుంచి నీటిని వాడుతున్నారు. వాటర్ట్యాంక్లో నాచుపట్టగా ఇప్పటివరకు శుభ్రం చేయలేదు. రాత్రి వండిన ఆలుగడ్డ కర్రీ, ఉదయం అల్పాహారంలో చేసిన ఉప్మా, ప్యూరీపైడ్ వాటర్, వాటర్ ట్యాంక్ నీటి షాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని బీజేపీ మండల అధ్యక్షుడు సమ్మిరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు తాళ్ల సురేశ్, సీపీఎం మండల కార్యదర్శి రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కని సంజయ్కుమార్ ఆరోపించారు. వీరిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిలకడగా ఆరోగ్యం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 32 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి రీజినల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. పిల్లల వార్డులో చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తూ వారికి పెరుగు అన్నం తినిపించినట్లు డాక్టర్ తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నారు విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే చేరుకొని విద్యార్థినులను వెంటనే కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నాం. –డీఈవో వెంకటేశ్వర్లు, -
ఈ భోజనం మాకొద్దు
సాక్షి, ఆలూరు (ప్రకాశం):‘ఈ పాడు భోజనం మాకొద్దు, మురిగిపోయిన గుడ్లు అలసలే వద్దు, తిరిగి తీసుకెళ్లండి’ అని ఆలూరు పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం సక్రమంగా లేదని, కూరలు రుచిగా లేవని, వండిన గుడ్లు దుర్వాస వస్తున్నాయంటూ విద్యార్థులు ఆహారాన్ని కింద పడేయడం పరిపాటిగా మారింది. మంగళవారం ఎంపీడీఓ పి.సుజాత బూత్ల పరిశీలన కోసం వచ్చిన సందర్భంగా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో మధ్యాహ్నం భోజనం వచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ భోజనం బాగులేదని, చెడిపోయిన గుడ్లు పంపిస్తున్నారని, కూర రుచికరంగా లేదని కాంట్రాక్టరుకు ఇచ్చినప్పటి నుంచి ఇదే విధంగా కొనసాగుతోందని ఎంపీడీఓ దృష్టికి తీసికెళ్లారు. నాశిరకం భోజనం వండిపెడుతున్నారని, తాజా భోజనం వండిపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై నివేదిక తయారుచేసి జిల్లా అధికారుల దృష్టికి తీసికెళ్లతానని చెప్పారు. అనంతరం ఆలూరులో పోలింగ్ బూత్లను పరిశీలించారు. పోలింగ్ బూత్లో విద్యుత్ ఉందా, ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్లు ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. లేని వాటికి వెంటనే వేయించాలని ఆయా హెచ్ఎంలను ఆదేశింశారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ఎల్వీఎన్ రమేష్, తోట రంగారావు, దొడ్ల రాజుగోపాల్రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
‘అక్షయ పాత్ర’లో అల్లం వెల్లుల్లి గొడవ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్) ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘అక్షయ పాత్ర’ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంపై మరోసారి వివాదం రాజుకుంది. గతంలో ఒడిశా రాష్ట్రంలో తలెత్తిన వివాదానికి ప్రధాన మీడియా ప్రాధాన్యత ఇవ్వగా, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో రాజుకున్న వివాదానికి ట్విట్టర్ వేదికగా మారింది. మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తోన్న కూరలు మసాలా దినుసుల వాసనలు లేకుండా చప్పగా ఉంటున్నాయని, విద్యార్థులు వాటిని తినలేక బోరుమంటున్నారంటూ ముందుగా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దానిపై ట్విటర్లో వాదోపవాదాలు రాజుకున్నాయి. అక్షయపాత్ర వంటకాలు అలా ఉండడానికి కారణం వారు వంటల్లో అల్లం–వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉపయోగించకపోవడం. వాటిని ఉపయోగించడానికి వారు విరుద్ధం. ఎందుకంటే అది వారి తాత్విక చింతనకు వ్యతిరేకం. వాటిని తినడం వల్ల మనుషుల్లో కామ, క్రోదాలు ప్రకోపిస్తాయనడానికన్నా ఆధ్యాత్మిక చింతన తగ్గుతుందన్నది ఆ సంస్థ వాదన. మరి వారు పూజిస్తోన్న శ్రీకృష్ణుడు ఇవేమీ తినకుండానే వెయ్యి మంది గోపికలతో శృంగార లీలలు ఎలా నెరపారబ్బ!... ట్విటర్లో ఓ గడుగ్గాయి కొంటె ప్రశ్న. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును తప్పకుండా సరఫరా చేయాలంటూ భారత జాతీయ పోషకాల ప్రమాణాల సంస్థ ఆదేశాలను కూడా ఇస్కాన్ సంస్థ అమలు చేయడం లేదు. తాము శాకాహారానికి నిబద్ధులమని, కోడిగుడ్డు మాంసాహారం కనుక తాము సరఫరా చేయమన్నది వారి వాదన. అవసరమైతే తాము ఈ పథకం నుంచి తప్పుకుంటాంగానీ సరఫరా చేయమని వారు మొండికేశారు. ఒడిశాలో సామరస్య పరిష్కారం ఒడిశాలో కూడా అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థే అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెప్పిన గుడ్డును సరఫరా చేయడానికి సంస్థ నిరాకరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వారానికి మూడు సార్లు గుడ్లను ఉడకబెట్టి విద్యార్థులకు వడ్డించే బాధ్యతను పాఠశాలల హెడ్మాస్టర్లకు అప్పగించింది, ఆ మేరకయ్యే ఖర్చును ఇస్కాన్ సంస్థ నుంచే రాబట్టుకోవాలని సూచించింది. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ విషయంలో మాత్రం ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేక వదిలేసింది. కర్ణాటకలోను ఉత్తర్వులు జాతీయ పోషక ప్రమాణాల సంస్థ సిఫార్సు మేరకు కూరల్లో అల్లం వెల్లులి, ఉల్లిపాయలను తప్పనిసరిగా వినియోగించాలంటూ 2018, నవంబర్ నెలలో కర్ణాటక రాష్ట్ర విద్యా శాఖ అధికారికంగా ఇస్కాన్ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి బదులు తాము ఈ పథకం నుంచి తప్పుకుంటామని బెదిరించడమే కాకుండా తమ వంటకాల్లో విద్యార్థులకు అవసరమైన పోషకాలు ఉంటున్నాయని వాదించింది. ఈ విషయంలో ‘ఆహారం ప్రాథమిక హక్కు’ కార్యకర్తలు జాతీయ పోషక ప్రమాణాల సంస్థకు కేసును నివేదించగా వారు కూడా పోషకాలు ఉన్నాయంటూ సమర్థించారు. విద్యార్థులకు సరఫరా చేస్తోన్న ఆహారం ఎంత?, అందులో వారు వృధా చేస్తున్నది ఎంత? ఎలా మీరు శాంపిల్ను తనిఖీ చేశారంటూ ఎన్జీవోలు సంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలేదు. అక్షయ పాత్ర భోజనం ఉచితం కాదు ఇస్కాన్ సంస్థ వెబ్సైట్లో ఉన్న వివరాలు ప్రకారం ఈ సంస్థ దేశంలోని 12 రాష్ట్రాల్లోని 15,024 ప్రభుత్వం, ప్రభుత్వ ఆర్థిక సహాయ పాఠశాలల్లో 17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. ‘ఉచితంగా భోజనం సరఫరా చేస్తుంటే ఇది కావాలి, అది కావాలంటూ డిమాండ్ పెడతారా?’ అంటూ కొందరు అమాయకంగా ట్వీట్లు పెట్టారు. ఎంతమాత్రం ఈ సంస్థ ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రతి విద్యార్థి భోజనానికి ఐదున్నర రూపాయల చొప్పున చెల్లించడంతోపాటు భారత ఆహార సంస్థ నుంచి ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ పథకం కింద ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి దేశవ్యాప్తంగా 11.6 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోని 9.40 కోట్ల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. అయినా చాలడం లేదంటున్న ఇస్కాన్ అక్షయ పాత్ర కింద తాము ఖర్చు పెడుతున్న మొత్తంలో 60 శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తోందని, 12 రాష్ట్రాల్లో 43 వంటశాలలను సొంత ఖర్చుతో నిర్మించామని, 5,500 మంది ఉద్యోగులకు తామే జీతాలు చెల్లిస్తున్నామని అక్షయ పాత్ర పర్యవేక్షకుల్లో ఒకరైన మోహన్దాస్ పాయ్ వివరించారు. ఇతర ఎన్జీవో సంస్థలకన్నా ఉన్నంతలో శుభ్రంగా విద్యార్థులకు భోజనాన్ని అందిస్తోందన్న కారణంగా అక్షయ పాత్ర సేవలను వదులు కోవడానికి పలు రాష్ట్రాలు సిద్ధంగా లేవు. అసలు ఈ పథకం ఎలా పుట్టింది? 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ నిమ్న వర్గాల విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ స్వాతంత్య్రానంతరం తమిళనాడు ముఖ్యమంత్రులుగా ఉన్న కే. కామరాజ్, ఎంజీ రామచంద్రన్ అన్ని వర్గాల విద్యార్థులకు దీన్ని విస్తరించి పథకాన్ని మెరగుపర్చారు. 1995లో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుంది. పిల్లలను బడికి ఆకర్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని భావించింది. 2001లో సుప్రీం కోర్టు ‘ఆహారం ప్రాథమిక హక్కు’కు సంబంధించిన ఓ కేసులో అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ఈ పథకాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
రేపటి నుంచి వేసవి సెలవులు
అనంతపురం/కదిరి: పాఠశాలలకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. 2018–19 విద్యా సంవత్సరానికి మంగళవారం చివరి పనిదినం. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు విధిగా పాటించాలని డీఈఓ జనార్దనాచార్యులు ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నారు. 24 నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ పాఠశాలలు నడపరాదని పేర్కొన్నారు. పదో తరగతి ప్రత్యేక తరగతులు, శిక్షణలు కూడా నిర్వహించరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే సంబంధిత పాఠశాలల యాజమాన్యాలపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఇకపోతే జిల్లాలోని మొత్తం 63 మండాలాల్లో కేవలం 32 మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో ఆయా మండలాల్లోని పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే మధ్యాహ్న భోజనం వడ్డించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. మధ్యాహ్న భోజనం అమలయ్యే మండలాలివే.. అనంతపురం, బెలుగుప్ప, బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్, గుత్తి, గుంతకల్లు, కణేకల్లు, కూడేరు, పెద్దవడుగూరు, పెనుకొండ, పుట్లూరు, రామగిరి, రొద్దం, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అమరాపురం, బ్రహ్మసముద్రం, చిలమత్తూరు, గాండ్లపెంట, గోరంట్ల, గుడిబండ, గుమ్మఘట్ట, కదిరి, కళ్యాణదుర్గం, కంబదూరు, కూడేరు, ఎన్పీ కుంట, పుట్టపర్తి, సోమందేపల్లి, శెట్టూరు, తనకల్లు మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తిస్తూ జీఓ ఎంఎస్ నెం.2ను ఈ ఏడాది ఫిబ్రవరి 13న విడుదల చేసింది. ఈ కరువు మండలాల పరిధిలోని పాఠశాలల్లో మాత్రమే వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని ప్రభుత్వం తాజాగా సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో(ఆర్సీ నెం.2/27021) స్పష్టం చేసింది. సెలవుల్లో బడికెళ్లిన టీచర్కు ఏం లాభం? వేసవి సెలవుల్లో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించి దగ్గరుండి అందించినందుకు అదనంగా రూ.2 వేలు గౌరవవేతనం రూపంలో అందజేస్తారు. హెచ్ఎం బదులుగా అదే పాఠశాలలో పనిచేసే మిగిలిన ఒకరిద్దరు టీచర్లు సైతం రొటేషన్ పద్ధతిలో మధ్యాహ్న భోజన పర్యవేక్షించి, పిల్లలకు భోజన ఏర్పాట్లు చూసినందుకు వారికి కూడా ఈ గౌరవవేతనం వర్తిస్తుంది. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం రోజూ మధ్యాహ్న భోజనానికి హాజరైన విద్యార్థుల వివరాలు యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. వాస్తవంగా ఉపాధ్యాయులు వేసవి సెలవులను వదులుకొని పాఠశాలకు హాజరై మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించినందుకు మెమో నెం.225780 ప్రకారం వేతనంతో కూడిన ఆర్జిత సెలవు(ఈఎల్) కూడా మంజూరు చేయాల్సి ఉంటుంది. కాకపోతే మధ్యాహ్న భోజనానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో(ఆర్సీ నెం.2/27021) ఆ విషయమై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. -
అధ్వాన భోజనం
ఫుడ్ కమిషన్ చైర్మన్ : మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఎందుకు వడ్డించలేదు? ప్రధానోపాధ్యాయుడు: నిజం చెప్పమంటారా.. అబద్దం చెప్పమంటారా సార్? ఫుడ్ కమిషన్ చైర్మన్ : నిజమే చెప్పు.. గుడ్లు ఎలా ఉంటున్నాయి? ప్రధానోపాధ్యాయుడు: ప్రభుత్వం సరఫరా చేసే గుడ్లు మానవమాత్రులు తినేవి కాదు సార్. అధ్వానంగా ఉంటున్నాయి. ఉలవపాడు మండలం రామాయపట్నం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోగురువారం మధ్యాహ్న భోజన సమయంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మధ్య జరిగిన సంభాషణ ఇది. ఉలవపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా లేదనే అంశంపై ఇటీవల హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో గురువారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్తో పాటు కమిషన్ సభ్యులు ఉలవపాడు మండలం రామాయపట్నం గ్రామానికి వచ్చారు. మధ్యాహ్న భోజన సమయంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. దీంతోపాటు రెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాల, మరో రెండు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా సభ్యులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రామాయపట్నం పాఠశాల హెచ్ఎం ఆదిశేషును విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూపై కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. గుడ్లు ఎందుకు పెట్టలేదని అడగగా ఏజన్సీ వారు ఇవ్వడం లేదని హెచ్ఎం బదులిచ్చారు. కొద్ది రోజుల క్రితమే అయిపోయాయని తెలిపారు. నాసిరకం భోజనం గురించి ప్రశ్నించగా ఇక్కడి రాజకీయ పరమైన కుకింగ్ ఏజన్సీ కారణంగా ఈ పరిస్థితులు వచ్చాయని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను అటెండరుగా అయినా వెళ్తానని సమాధానమిచ్చారు. భోజన నాణ్యతపై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఇక్కడ లేరని చెప్పారు. బియ్యం కూడా దారుణంగా ఉన్నాయని రామాయపట్నం డీలర్ వచ్చి తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అంటున్నారని, స్టాక్ పాయింట్ కూడా తీసుకురావడం లేదని తెలిపారు. అనంతరం పాఠశాల రికార్డులు పరిశీలించిన సభ్యులు ఇద్దరు ఉపాధ్యాయులు గైర్హాజరు కావడం.. వారి సెలవు చీటీలో తేదీ వేయకుండా కేవలం సంతకాలు పెట్టి ఉండటం గమనించారు. బ్రహ్మయ్య అనే ఉపాధ్యాయుడు మెటర్నటీ లీవు అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులు రెడీమేడ్ లెటర్లు రాసిపెడుతున్నట్లు గుర్తించారు. అంతటా అధ్వాన భోజనం పల్లెపాలెం పాఠశాల తనిఖీ చేయగా కందిపప్పు అ«ధ్వానంగా ఉందని గుర్తించారు. వీటిని తనిఖీ చేయాలని లీగల్ మెట్రాలజీ అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజనం వండే గదులు కూడా పరిశుభ్రంగా లేవని గుర్తించారు. ఇక అంగన్వాడీల్లో సైతం పౌష్ఠికాహారం సక్రమంగా లేదని గుర్తించారు. గుడ్లులేని విషయాన్ని తెలియచేశారు. ఇక గర్భవతులు తిని ఇంటికి వెళ్లారని వారు తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భవతుల, బాలింతల కార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు. అన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు గుడ్లు ఈ మధ్య దాకా వచ్చాయని చెప్పడంతో ఎందుకు అబద్దాలు చెపుతారు.. పైనుంచి రాకపోతే మీరు ఈ మధ్య వరకు పెట్టామని అబద్దాలు చెపితే పిల్లలు కూడా అదే నేర్చుకోరూ..? అంటూ చైర్మన్ ప్రధానోపాధ్యాయులను మందలించారు. నోడల్ ఆఫీసర్గా ఉన్న ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు ఎక్కడ ఉన్నాయో కూడా ఆయనకు తెలియదన్నారు. ఇక నాసిరకంగా గుడ్లు పంపిణీ జరగడం గురించి, తెలిపిన ప్రధానోపాధ్యాయురాలి నుంచి పంచనామా రిపోర్టు రాయాలని తహశీల్దార్ పద్మావతికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ మెంబర్ సెక్రటరీ రవిబాబు, కమిషన్ సభ్యులు కృష్ణమ్మ, డాక్టర్ గీత, ఎల్వీ వెంకటరావు, ఎం.శ్రీనివాసరావు, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఈఓ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ విశాలాక్షి, డీడీలు లక్ష్మీదుర్గ, లక్ష్మీసుధ, డీఎం లక్ష్మీపార్వతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సాంబార్లో పురుగులు
అనంతపురం, ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని మహానంది వసతిగృహంలో శుక్రవారం మధ్యాహ్నం వడ్డించిన సాంబార్లో పురుగులు కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహించారు. పుచ్చుపట్టిన వంకాయలను సాంబార్లోకి యథాతథంగా వాడటంతో పురుగులు బయటపడ్డాయి. ఇటువంటి భోజనం ఎలా తినాలంటూ విద్యార్థులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. నాసిరకమైన ఆహారంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరి ఆందోళనలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు ప్రకటించారు. నాయకులు రాధాకృష్ణ, కళ్యాణ్ కుమార్, వినోద్, అనిల్, హేమంత్ మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి నాణ్యమైన భోజనం అందించాలని అనేక దఫాలుగా విన్నవించినప్పటికీ అధికారుల వైఖరిలో మార్పు రాలేదన్నారు. ఇటీవల టెండర్లలో రేట్లు తగ్గించేలా ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయినా కిందిస్థాయి అధికారులు వాటిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. కూరగాయలు చెడిపోయినవి సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులందరూ ర్యాలీగా వచ్చి ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. వార్డెన్ ప్రొఫెసర్ జ్యోతి విజయ్కుమార్ విద్యార్థులకు నచ్చచెప్పారు. స్టోర్ కీపర్, సప్లయర్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
సత్తెనపల్లి: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి విద్యార్థుల వివరాలు, నిర్వహణ చర్యలతో ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ ఉదయలక్ష్మి నుంచి ఆర్జేడీ, ఆర్జేడీ నుంచి కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు అందాయి. డ్రాపౌట్స్ తగ్గించేందుకే.. ప్రాథమిక పాఠశాల నుంచి పదో తరగతి వరకు మథ్యాహ్న భోజన పథకం అమలవు తోంది. తద్వారా పదో తరగతి వరకు విద్యార్థులు డ్రాపౌట్లు (చదువు మానేస్తున్న వారు) ఎక్కువగా ఉండటం లేదు. పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ నడుమ డ్రాపౌట్లు ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని నివారించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజనం అమలకు శ్రీకారం చుట్టింది. అన్నీ అనుకూలిస్తే జూలై మొదటి వారం నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. కళాశాలల్లో నిరుపేదలే..... ఇంటర్మీడియెట్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. కూలి పనులకు, వ్యవసాయ పనులకు వెళ్లే కుటుంబాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో చేరుతున్నారు. పనులకు వెళ్లే కుటుంబాలు ఉదయం వెళితే సాయంత్రానికి తిరిగి వస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భోజనం వండి క్యారియర్లలో సర్ది పంపే పరిస్థితులు ఉండవు. దీంతో విద్యార్థులు అర్థాకలితో చదువుకునే పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు ఆకలికి తాళలేక మధ్యాహ్నం తర్వాత ఇంటి బాట పడుతున్నారు. సాయంత్రం వరకూ కళాశాలలో ఉన్నా ఆకలికి అధ్యాపకులు చెప్పే పాఠాలు విద్యార్థుల బోధపడటంలేదు. మరో వైపు పౌష్టికాహారం లోపం తలెత్తుతోంది. మధ్యాహ్న భోజనం పథకం అమలైతే విద్యార్థులకు అర్ధాకలి నుంచి బయట పడటంతో పాటు పౌíష్టికాహారం లోపాన్ని అధిగమించొచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి ముందు కు వచ్చింది. పాఠశాలల తరహాలో... జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఆరు రోజులు పౌíష్టికాహారంతో కూడిన భోజనాన్ని వంట ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు వడ్డిస్తున్నారు. వారంలో మూడు రోజులు కోడి గుడ్లను విద్యార్థులకు అందిస్తున్నారు. వంట ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతోంది? అమలులో లోపాలున్నాయా? అనే విషయాల పై పర్యవేక్షణ చేయాలని ఇంటర్ కళాశాలల కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. పౌష్టికాహారంతో కూడిన భోజనం ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రోజూ పౌష్టికాహారంతో కూడిన భోజనం వడ్డించడంతో పాటు మజ్జిగ, అరటి పండు, గుడ్లను విద్యార్థులకు అందిస్తారు. తద్వారా హాజరు శాతం రోజూ పెరగడంతో పాటు కళాశాల ప్రవేశాలు పెరుగుతాయని ప్రిన్సిపాళ్లు భావిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు 22, 23 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి.వీటి పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు మొదటి సంవత్సరం విద్యార్థులు 5,239 మంది ప్రవేశాలు పొందారు. మరో 1,500 మంది వరకుప్రవేశాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం 5,340 మంది విద్యార్థులు చదువుతున్నారు. జూలై నుంచి అమలు జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకం ఎలా అమల వుతోంది. వంట ఏజెన్సీలు భోజనాన్ని విద్యార్థులకు ఏ విధంగా వండి వడ్డిస్తున్నారు తదితర వాటి పై కసరత్తు జరుగుతోంది. జులై నుంచి ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలులోకి వస్తుంది.–జెడ్.ఎస్.రామచంద్రరావు,ఆర్ఐఓ, గుంటూరు -
మురుగు నీళ్లతో మధ్యాహ్న భోజనం
చిలకలూరిపేటటౌన్: బావిలోని కలుషిత నీటితో వండిన ఆహారాన్ని తిని 19 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. నాదెండ్లలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి చెందిన 90 మంది విద్యార్థులు గురువారం మధ్యాహ్న భోజనం తిని తరగతులకు వెళ్లారు. ఇందులో కొంత మందికి కడుపు నొప్పి, వాంతులు అవడంతో విశ్రాంతి తీసుకునేందుకు హాస్టల్కు వెళ్లారు. వీరిలో 19 మందికి తీవ్రమైన జ్వరం, వాంతులు రావడంతో హుటాహుటిన నాదెండ్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లారు. అడుగడుగునా నిర్లక్ష్యం విద్యుత్ సరఫరా లేని కారణంగా బావిలోని మురుగు నీటితో వంట చేశామని నిర్వాహకులు చెప్పారు. పూర్తిగా కలుషితమై మట్టితో కూడిన బావి నీటిని వంటకు వినియోగించారు. మినరల్ వాటర్ తీసుకొచ్చేందుకు నాదెండ్ల నుంచి గణపవరం గ్రామానికి 15 నిమిషాల ప్రయాణం. అక్కడి నుంచి చిలకలూరిపేటకు ఐదు నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. కానీ 90 మంది తినే ఆహారం విషయంలో నిర్వాహకుల అశ్రద్ధ స్పష్టంగా తెలుస్తోంది. కలెక్టర్ ఆగ్రహం.... సమాచారం అందుకున్న కలెక్టర్ కోన శశిధర్ సాయంత్రం నాదెండ్లకు చేరుకున్నారు. వసతిగృహం, ఆసుపత్రిని సందర్శించారు. రామాలయం సమీపంలోని కలుషిత బావిని పరిశీలించారు. ఇలాంటి నీటితో వంట ఎలా చేశారంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. ఆనంతరం విద్యార్థులను పరామర్శించారు. కలెక్టర్ వెంట ఉప వైద్యాధికారి శ్యామల, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు మల్లికార్జునరావు, నిరీక్షణరావు, ఇతర అధికారులు ఉన్నారు. -
నిధులున్నా.. నిర్లక్ష్యమే!
నారాయణపేట రూరల్ : దేవుడు కరుణించినా.. పూజారి వరమివ్వలేదన్న చందంగా తయారైంది పాఠశాల వంటగది పరిస్థితి. ఒక పక్క సౌకర్యాల కల్పనకు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం అనుమతి వచ్చి డబ్బులు మంజూరైనా పనులు చేపట్టడంలేదు. స్వయంగా ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేసి ఏడు నెలలు కావొస్తున్నా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా ఉంది. మండల పరిషత్కు అధ్యక్షుడిగా ఉన్న ఎంపీపీ మణెమ్మ స్వగ్రామం అప్పిరెడ్డిపల్లిలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇక్కడ 8వ తరగతి వరకు 170మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజనం వండటానికి ప్రత్యేక గదిలేక ఆరుబయటనే ఏజెన్సీ నిర్వహకులు వంటలు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి దష్టికి తీసుకుని వెళ్లగా గది నిర్మాణానికి రూ.2లక్షల నిధులు మంజూరు చేయించి హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి గది నిర్మాణానికి భూమిపూజ చేశారు. అయితే ఇప్పటి వరకు అక్కడ పనులు మొదులు కాలేదు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష నాయకులు మేమంటే మేము యేస్తాం అంటూ పోటీ పడటంతో పనులు ప్రారంభం కానట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడి బంధువు, ఎంపీపీ భర్త, ఎస్ఎంసీ చైర్మన్ల మధ్య ఏర్పడిన రాజకీయ విబేధాలతో పనులు కేటాయించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు దారుణం
భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. మధ్యహ్నా భోజనంలో భాగంగా తనకు కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు ఓ వంటమనిషి ఒకటో తరగతి చదువుతున్న బాలుడి ముఖంపై వేడిగా కాలుతున్న పప్పును విసిరికొట్టాడు. దీంతో ఆ బాలుడి ముఖం కాలింది. అలాగే చెంపలు, ఛాతీ భాగం, వెనుక భాగం కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం దిండోరిలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్స్ మెహ్రా అనే విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం స్కూల్లోనే చేసే క్రమంలో నేమావతి బాయి అనే వంట చేసే మహిళను తనకు కొంచెం అదనంగా పప్పు వేయాలని కోరాడు. దాంతో ఆమె నేరుగా పప్పు అతడిపై విసిరి కొట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎంగిలి చేతులతో ఎందాక...
సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాలు లేవనడానికి ఈ చిత్రంలో వరుసగా నడిచి వెళ్తూ కనిపిస్తున్న విద్యార్థులే నిదర్శనం. పోలాకి మండలం చీడివలస ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలో వీరంతా చదువుతున్నారు. ఇక్కడ ఉన్న బోరు సుమారు ఆరు నెలల క్రితం పాడవ్వడంతో విద్యార్థులకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కంచాలు, చేతులు కడుక్కోవడానికి నీరు అందుబాటులో లేదు. దీంతో చేసేది లేక పాఠశాలకు సమీపంలో రోడ్డు ఆవలవైపు ఉన్న సాగునీటికాలువ వద్దకు వెళ్లి కంచాలు కడ్డుక్కోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. సుమారు ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. పిల్లల వెంట ఓ ఉపాధ్యాయుడు తోడుగా వెళ్లి..వస్తుండడం దినచర్యగా మారింది. బోరు పాడైన విషయాన్ని ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి సర్పంచ్ ముద్దాడ రాము తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదు. విద్యార్థులకు కష్టాలు తీరలేదు. అధికారులు స్పందించి నీటి సమస్య నుంచి తమ పిల్లలను గట్టెక్కించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
’తిండి’తిప్పలు
వరండాల్లోనే భోజనం పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలు డైనింగ్ హాళ్లు ఏవీ? వంటషెడ్లూ లేవు పట్టించుకోని సర్కారు అధికారులదీ అదే తీరు వీరవాసరం : విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామని గొప్పలు పోతున్న సర్కారు పాఠశాలల్లో వసతుల కల్పనలో విఫలమవుతోంది. ఫలితంగా పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన సమయంలో వారి అవస్థలు వర్ణణాతీతం. డైనింగ్ హాళ్లు లేక విద్యార్థులు పాఠశాలల్లో వరండాల్లోనూ, ఆరుబయట కూర్చుని తినాల్సి వస్తోంది. వానొస్తే తరగతి గదుల్లోకి పరుగులు తీయాల్సిన దుస్థితి. ఒక్కచోటా డైనింగ్ హాల్ లేదు జిల్లా వ్యాప్తంగా 2,564 ప్రాథమిక , 247 ప్రాథమికోన్నత, 507 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3,318 పాఠశాలలు ఉన్నాయి. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. భీమవరం డివిజన్ లో 563 ప్రాథమిక పాఠశాలలు, 41 ప్రాథమికోన్నత పాఠశాలలు, 97 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క పాఠశాలలోనూ డైనింగ్ హాలు లేదు. అలాగే 20శాతం పాఠశాలల్లో వంటషెడ్లు లేవు. దీంతో విద్యార్థులతోపాటు మధ్యాహ్న భోజన నిర్వాహకులూ ఇబ్బందులు పడుతున్నారు. ఆరుబయట లేదా, ఇళ్ల వద్ద వంట చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పాఠశాలలన్నింటిలోనూ డైనింగ్హాళ్లు, వంట షెడ్లు నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎండనకా.. వాననకా.. అవస్థలు మధ్యాహ్న భోజనం చేయడానికి ఎండనకా.. వాననకా ఇబ్బంది పడుతున్నాం. వర్షం వస్తే నేలంతా బురదమయంగా తయారై ఆవరణలో తినడానికి నానా అవస్థలు పడుతున్నాం. మాకు డైనింగ్ హాళ్లు నిర్మించాలి. వి.నరేష్, విద్యార్థి కింద కూర్చోవాలంటే అవస్థ మాకు కింద కూర్చొని భోజనం చేయాలంటే ఇబ్బందిగా ఉంది. చేతిలో ప్లేటు పట్టుకుని నుంచొని తినాలంటే రసం, సాంబార్లు దుస్తులపై పడి పోతున్నాయి. త్వరగా తిని తరగతులకు వెళ్ల లేక పోతున్నాం. భోజనాలకు ప్రత్యేక గదులు, బల్లలు ఉంటే బాగుంటుంది. మహేశ్వరి, విద్యార్థిని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ముందుగా బాలికల హైస్కూళ్లలో డైనింగ్ హాల్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నాం. ఆర్.ఎస్.గంగా భవానీ, డీఈఓ -
మధ్యాహ్న భోజనంపై ‘లెక్క’లేనితనం!
► పాఠశాలల్లో విద్యార్థుల లెక్కలు సరిగ్గా ఇవ్వని టీచర్లు ► రోజువారీగా భోజనం తినే విద్యార్థుల లెక్కలపై కేంద్రం అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల వివరాలను టీచర్లు ఇవ్వడం లేదు. రోజువారీగా పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు భోజనం తింటున్నారు.. ఎంత మంది గైర్హాజర్ అవుతున్నారో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు కావడంలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ చీవాట్లు పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో 28,689 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ఎన్ని పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారన్న వివరాలను మధ్యాహ్న భోజనం బాధ్యతలు చూసే టీచర్లు సరిగ్గా పంపించడం లేదు. దీంతో గత నెల, ఈ నెలలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టం అమలు కావడం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నెల 12, 14 తేదీల్లో 2 శాతం పాఠశాలలు కూడా మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల సంఖ్యను తెలియజేయలేదని పేర్కొంది. ఇప్పటికైనా సరిగ్గా వివరాలను పంపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి.. వివిధ రాష్ట్రాల్లోనూ మధ్యాహ్న భోజనం లెక్కలు కేంద్రానికి సరిగ్గా అందడం లేదు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉండే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో నిధులకు పక్కాగా లెక్కలు ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టంను ప్రవేశ పెట్టింది. ఈ నెల 12వ తేదీన మన రాష్ట్రంలోని 473 పాఠశాలల నుంచి (1.65 శాతం) మాత్రమే భోజనం చేసిన విద్యార్థుల వివరాలు కేంద్రానికి వెళ్లాయి. ఈ నెల 14న కేవలం 232 పాఠశాలలు మాత్రమే ‘భోజనం’ వివరాలను ఇచ్చాయి. -
‘భోజనం’ భారం
- మండుతున్న ధరలతో ఏజెన్సీల నిర్వాహకుల బెంబేలు ధర్మవరం : నలుగురున్న కుటుంబం కూడా కూరగాయలు కొనాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో విద్యార్థులందరికీ కూరలు వండి పెట్టడం మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారుతోంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. దీంతోపాటు మధ్యాహ్న భోజన పథకం కూడా మొదలైంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులు ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశిస్తున్నారు. అయితే మార్కెట్లో ఏ కూరగాయలు కొందామన్నా కిలో రూ.30 నుంచి రూ.50కి తక్కువ కాకుండా ఉన్నాయి. మిర్చి కిలో రూ.70 పలుకుతోంది. సరుకుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అంతంత ధరలు పెట్టి కొని సగటున 50 నుంచి 100 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టాలంటే ఏజెన్సీల నిర్వాహకులకు భారమవుతోంది. అదే ఉన్నత పాఠశాలల్లో అయితే ఈ భారం మరింత ఎక్కువగా ఉంది. అక్కడ కనీసం 500 మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పెంచిన ధరలు(1 - 5 వ తరగతి వరకు రూ.6.30 పైసలు, 6 - 10వ తరగతి వరకు రూ.8.13 పైసలు) సరిపోవడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు. రూ.లక్షల్లో గతేడాది బకాయిలు గత ఏడాది మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించిన వేతనాలు, బిల్లులు ప్రభుత్వం ఇప్పటిదాకా చెల్లించలేదు. 2017 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన బిల్లులు, వేతనాలు చెల్లించాల్సి ఉంది. సగటున వందమంది విద్యార్థులకు భోజనం అందిస్తున్న ఏజెన్సీకి నెలకు రూ.15 వేల దాకా బిల్లులు అందాల్సి ఉంది. మూడు నెలలకు కలిపి రూ.45 వేలు చొప్పున రావాలి. అవి అందకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు భోజనం పెట్టేందుకు డబ్బులు వడ్డీలకు తెస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,043 ప్రాథమిక, 1,003 ప్రాథమికోన్నత, 988 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 5,034 పాఠశాలల్లో 5,61,495 విద్యార్థులు చదువుతున్నారు. 5034 ఏజెన్సీల æద్వారా మొత్తం విద్యార్థులకు రోజూ అన్నం పెడుతున్నారు. ఇందుకుగానూ ఆయా ఏజెన్సీలకు నెలకు రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన గత ఏడాది బిల్లులే రూ.21 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మధ్యాహ్న భోజన పథకం మెనూ సోమ, గురువారం : అన్నం +కూరగాయలతో కూడిన సాంబారు మంగళవారం, శుక్రవారం : ఏదైనా ఒక కూర+రసం బుధవారం, శనివారం : పప్పు, ఆకు కూర పప్పు దీంతోపాటు వారానికి మూడురోజులు(రేట్లు పెంచిన తర్వాత పెంచారు) కోడిగుడ్డు ఇవ్వాలి -
పాత వంట.. కొత్త మంట
మధ్యాహ్న భోజనంలో కొత్తపద్ధ్దతి ► ఐదారు మండలాలకు ఒక వంటశాల ► అక్కడ నుంచే పాఠశాలలకు మధ్యాహ్న భోజనం ► పరిశీలించి ప్రతిపాదనలు పంపనున్న అధికారులు ► ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకు శ్రీకారం మెమోలు జారీ ► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏజెన్సీల నిర్వాహకులు నెల్లూరు (టౌన్) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణలో నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రసుత్తం పాఠశాలల్లో వంట చేసి భోజనం వడ్డించే విధానానికి చెక్ పెట్టనున్నారు. కేంద్రీకృత మధ్యాహ్న భోజన విధానాని(సెంట్రలైజ్డ్ మిడ్డే మీల్స్ సిస్టమ్)కి శ్రీకారం చుట్టనున్నారు. దీనిని 2017–18 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలోసెంట్రలైజ్డ్ మిడ్డే మీల్స్ సిస్టమ్ నిర్వహణకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జిల్లాలో 5 ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు. 2018–19 విద్యా సంత్సరం నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్(కేంద్రీయ భోజన వంటశాల) ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కేంద్రీయ వంటశాలకు 5 అనువైన ప్రాంతాలను గుర్తించాలని డెప్యూటీ ఈఓలు, ఎంఈఓలకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు పంపారు. ప్రస్తుతం వెంకటాచలంతో పాటు పలు పట్టణ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్రవిద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నారు. జిల్లాలో మొత్తం 3,441 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న 2,29,434 మంది విద్యార్థులకు భోజనాన్ని వడ్డిస్తున్నారు. అయితే మధ్యాహ్న భోజన నిర్వహణలో లోపాలు ఉన్నాయని, కొంతమంది వంట ఏజెన్సీ నిర్వాహకులు అపరిశుభ్ర వాతావరణంలో రుచి లేకుండా వండి పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్ విధానానికి నాంది పలుకుతోంది. ఒకే వంటశాలలో 22 వేల నుంచి 25వేల మంది వరకు పిల్లలకు సకాలంలో వండి పంపిణీ చేసే పనిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంత సామర్థ్యం ఉన్న స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలని జిల్లా విద్యాశాఖను ఉన్నతాధికారులు ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్కు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కిచెన్ స్టోర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలను వాటి పరిధిలోకి చేర్చనున్నారు. ఐదారు మండలాలకు ఒకటి జిల్లాలో విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి ఐదారు మండలాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్ను ఏర్పాటు చేయనున్నారు. అ వంటశాల నిర్వహణకు రెండు ఎకరాల వీస్తీర్ణం కలిగి ఉండాలని నిర్ణయించారు. 20 కిలో మీటర్ల దూరంలో ఉండే పాఠశాలలు ఈ వంటశాల పరిధిలోకి వచ్చే విధంగా ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు. వంటశాలలో భోజనం, కూరలు వండి ఆయా పాఠశాలలకు వాహనాల్లో తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇస్కాన్ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నారు. ఈ విధానంలో పెద్దగా లోపాలు లేకపోవడం, నాణ్యత కలిగి ఉండటంతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా మహిళల ఆగ్రహం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇతరులకు అప్పజెప్పడంపై డ్వాక్రా మహిళలు, ఏజెన్సీ నిర్వాహకులు, కార్మికులు మండిపడుతున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు గతనెల 19న మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మెమోలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 3వేలకు పైగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఉన్నాయి. వీరిలో 90శాతానికి పైగా డ్వాక్రా మహిళలే. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అనేకమంది మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆరేడు నెలల నుంచి బిల్లులను నిలిపివేసినా కొంతమంది ముందుగానే పెట్టుబడులు పెట్టి భోజనం వడ్డిస్తున్న సందర్భాలున్నాయి. మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం అర్ధంతరంగా ఒకే కేంద్రీయ వంటశాల విధానం అమలు చేస్తే దీని మీద బతుకుతున్న వేలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతారని చెబుతున్నారు. నిర్ణయం ఉపసంహరించుకోవాలి మధ్యాహ్న భోజన పథకం ద్వారా జిల్లాలో వేలాదిమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అకస్మాత్తుగా సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్ను తెస్తే వీరంతా ఎటుపోవాలి? మహిళా సాధికారిత కోసం ఇసుక, డ్వాక్రా రుణాలు అందజేస్తామని చెప్పిన చంద్రబాబు తర్వాత పట్టించుకోలేదు. తాజా నిర్ణయంతో మధ్యాహ్న భోజనం వడ్డించి ఉపాధి పొందుతున్న మహిళలు అన్యాయమైపోతారు. దీనిమీద ప్రతిపక్ష నాయకుడు జగన్ను కలిసి ఉద్యమ బాట పడతాం. – రెహనాబేగం, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా గౌరవాధ్యక్షురాలు ప్రతిపాదనలు పంపమన్నారు సెంట్రలైజ్డ్ మిడ్డే మీల్స్ సిస్టమ్ అమలుకు తగు ప్రాంతాలు గుర్తించి ప్రతిపాదనలు పంపమని ఉన్నత విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో ఐదు ప్రాంతాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. మరో రెండు రోజుల్లో గుర్తించిన ప్రాంతాలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనంతరం అత్యున్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నాం. ఈ ఏడాది నుంచి కొత్త విధానం ప్రారంభమవుతుంది. – రామలింగం, డీఈఓ -
మధ్యాహ్న భోజనం ఉడుతలు..ఎలుకలే!
♦ ఆకలిబాధ తట్టుకోలేక ఉడుతల్ని, ఎలుకల్ని తింటున్న జార్ఖండ్ గిరిజన బాలలు ♦ అధికారుల జేబుల్లోకి చేరుతున్న మధ్యాహ్న భోజనం నిధులు ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు పింకి. మధ్యాహ్నం కాగానే ఉడతలు పట్టడం పింకి దినచర్య. దొరకకపోతే ఎలుకలు కూడా పడుతుంది. వాటితో ఆడుకోవడానికో.. సరదా కోసమో పింకి ఉడతలను, ఎలుకలను పట్టడంలేదు. కడుపు కాలి.. ఆకలి బాధను భరించలేక ఈ పనిచేస్తోంది. ఆమె మధ్యాహ్న భోజనం ఇదే అంటే ఆశ్చర్యమేస్తోంది కదూ! కానీ ఇది నిజం. మరి పింకి అలా.. ఉడుతలను, ఎలుకలనే ఎందుకు తింటోంది? ...ఎందుకంటే అధికారుల రూపంలో ఉన్న పందికొక్కులు పింకి నోటికాడి ముద్దను లాగేసుకుంటున్నాయి. మధ్యాహ్న భోజనానికి వందలు.. కాదు వేలు.. కాదు కాదు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్నా అవేవీ దేశంలోని చాలామంది పిల్లల వద్దకు చేరడంలేదనేందుకు ఈ పింకే నిదర్శనం. వివరాల్లోకెళ్తే... జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లా రాజ్మహల్ హిల్స్ ప్రాంతం చుహా పహర్ అనే ఓ కుగ్రామం ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ఉంది. ఐదేళ్ల వయసున్నప్పుడే పింకిని పాఠశాలలో చేర్చారు. ఇప్పుడు పింకి వయసు తొమ్మిదేళ్లు. పింకి వయసు పెరుగుతోందే తప్ప.. తరగతి పెరగడంలేదు. కారణం.. పాఠశాల ఉంది పేరుకు మాత్రమే. ఆ ఊరిలో బడి ఈడు పిల్లలున్నా పాఠశాలలో మాత్రం ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే చదువు చెప్పేందుకు అసలు టీచరే ఉండడు. ప్రభుత్వ లెక్కల్లో పక్కాగా.. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో మాత్రం గత నాలుగు సంవత్సరాలుగా పింకి పేరుమీద నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. స్కూల్ యూనిఫారంకు, పోషకాహారాలతో కూడిన మధ్యాహ్న భోజనానికి రూపాయి రూపాయి లెక్కగడుతూ నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. వీటితో పింకికి యూనిఫారం ఇచ్చినట్లు, ఆకుకూరలు, అన్నం, రోజుకో గుడ్డుతో భోజనం పెడుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు కూడా అందుతున్నాయి. అయితే ఇక్కడ పింకి తింటోంది మాత్రం ఎలుకలు, ఉడతలు. ఎంత దారుణం!! పదివేల కోట్లు... ఈ ఏడాది బడ్జెట్లో పాఠశాల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలను కేటాయించింది. వీటితో 10.03 కోట్ల మంది చిన్నారుల చదువు, పోషకాహారం అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూ.6కు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమవంతుగా మరో రూ.4 కలిపి మొత్తం రూ.10తో పిల్లలకు పోషకాహారం పెట్టాలి. నిధులైతే మంజూరవుతున్నాయి. అయినా పింకి మాత్రం పస్తూలుంటూనే ఉంది. జార్ఖండ్లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పింకిలు ఎంతోమంది కనిపిస్తారు. సొమ్మంతా అధికారుల జేబుల్లోకి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులు ఏమవుతున్నాయంటే... సమాధానం సుస్పష్టం. అవన్నీ అధికారుల జేబుల్లోకి చేరుతున్నాయి. పిల్లల నోటికాడి ముద్దను మాత్రమే కాదు... వారి భవిష్యత్తునూ లాగేసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఎందుకంటే... బడిలో భోజనం పెడతారనే ఆశతో పాఠశాలకు వచ్చే చిన్నారులు మనదేశంలో ఇప్పటికే కోట్లాదిమందే ఉన్నారు. ఆ భోజనం దొరకనప్పుడు వారు బడికి రారు. దీంతో వారి భవిష్యత్తు నాశనమైనట్లే కదా? –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
మధ్యాహ్న భోజనానికి ఆధార్ తప్పనిసరి
న్యూఢిల్లీ: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి, లబ్ధిదారులైన విద్యార్థులకు ఆధార్ కార్డును తప్పనిసరిచేస్తూ మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యకు చెందిన సబ్సిడీ పథకాలను కేంద్రం ఆధార్తో అనుసంధానిస్తుండటంతో పథకంలో పారదర్శకత పెంచేందుకే ఈ చర్య చేపట్టారు. మానవ వనరుల శాఖ అధీనంలో పనిచేసే ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ(డీఎస్ఈఎల్) ఆధార్లేని వారికి కార్డు పొందేందుకు జూన్ 30 వరకు గడువిచ్చింది. విద్యార్థులంతా తమ ఆధా ర్ వివరాలను సమర్పించాలని కోరుతూ పాఠశాలలకు నోటిఫికేషన్ పిస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకంలో పనిచేస్తున్న వంటవాళ్లు, సహాయకులను కూడా లబ్ధిదారులుగానే పరిగణిస్తామని కాబట్టి వారికీ ఆధార్ ఉండాలని ఆయన వెల్లడించారు. -
‘ఎగ్’ నామం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉడకని మూడో గుడ్డు ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులు విడవలూరు(కోవూరు): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు పౌష్టికాహారాన్ని అందించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందులో భాగంగా వారంలో రెండు రోజులు కోడిగుడ్డు ఇస్తున్నారు. అదనంగా మరొకటి అంటే వారానికి మూడు రోజులు విద్యార్థులకు కోడిగుడ్డు ఇవ్వాలని గత ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు మూడో గుడ్డును విద్యార్థులకు అందించలేదు. జిల్లాలో 46 మండలాల్లో 390 ఉన్నత పాఠశాలలు, 396 ప్రాథమికోన్నత పాఠశాలలు, 3,338 ప్రా«థమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అందిస్తున్న మధ్యాహ్న భోజనంతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని ఇప్పటికే వారంలో రెండు రోజులు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారు. అయితే మూడో గుడ్డును కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఐదు మాసాలు గడిచిపోయింది. కాని ఇంత వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడో గుడ్డును ఇవ్వలేదు. గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మూడో గుడ్డు విద్యార్థులకు అందించాల్సి ఉన్నా ఇంత వరకు ప్రభుత్వం దానికి సంబంధించిన నిధుల పెంపు విషయమై నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలను ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడో గుడ్డు అందించేందుకు ఒక్కొక్క విద్యార్థికి గతంలో ఇస్తున్న నిధులతో పాటు అదనంగా మరి కొంత పెంచి ఇస్తామని ప్రభుత్వం చెప్పి నెలలు దాటుతున్నా ఇంత వరకు ముందడుగు పడలేదు. ఈ విద్యా సంవత్సరం ముగింపునకు కొద్దిరోజులే వ్యవధి ఉంది. వచ్చే నెల 17వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. అసలు ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు మూడో గుడ్డు మొహం చూస్తారన్న సందేహం నెలకొంది. పర్యవేక్షణ తప్పని సరి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి మంగళ, శుక్రవారాలు విద్యార్థులకు గుడ్డును మధ్యాహ్న బోజనంతో కలిపి అందిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో మంగళ, శుక్రవారాలకు అందాల్సిన గుడ్డు బుధ, శనివారం అందుతోంది. దీంతో ప్రతి నెలలో రెండో శనివారం విద్యార్థులకు గుడ్డు అందడం లేదు. దీనిపై సంబంధిత అధికారులు కూడా పర్యవేక్షణ చేయని కారణంగా నిర్వాహకులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మూడో గుడ్డు ఏ రోజు వేయాలో ఇంత వరకు నిర్వహకులకు, ఉపాధ్యాయులకు స్పష్టత లేదు. ఇప్పుడు కూడా ఉపాధ్యాయులు, అధికారుల పర్యవేక్షణ లేకపోతే మూడో గుడ్డు కూడా విద్యార్ధులకు అందకపోవచ్చు. రెండు గుడ్లే అందుతున్నాయి మా బడిలో వారానికి రెండు గుడ్లు మాత్రమే అందుతున్నాయి. మూడో గుడ్డు ఇవ్వడం లేదు. ఎప్పటి నుంచి ఇస్తారో తెలీదు. వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం మాత్రం భోజనంతో కలిపి ఇస్తున్నారు. మూడో గుడ్డు ఇస్తే మంచిది. - అనిల్, నవీన్ త్వరలోనే అమలు చేస్తాం గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మూడో గుడ్డు అందించాల్సి ఉంది, అయితే నిధులుSలేని కారణంగా కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం ఒకటి రెండు చోట్ల మూడో గుడ్డు విద్యార్థులకు అందుతోంది. త్వరలోనే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. -మువ్వా రామలింగం, డీఈఓ -
జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
వచ్చే సంవత్సరం నుంచి అమలు రూ.200 కోట్లతో డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాలు ఉన్నత స్థాయి సమావేశంలో కడియం సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏటా రూ. 84 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. విద్యా శాఖకు అవసరమైన బడ్జెట్, ప్రణాళికలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, ఇంటర్ విద్య కార్యదర్శి అశోక్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలుకు అవసరమైన నిధులను కేటాయించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రెగ్యులర్గా ఇచ్చే నిధులకంటే అదనంగా మరో రూ.1,500 కోట్లు కేటాయించాలని కడియం పేర్కొన్నారు. రాష్ట్రంలోని 404 జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులకు రూ.111 కోట్లు అవసరమన్నారు. బాలికలు చదువు కుంటున్న కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రస్తుతం కేజీబీవీ లకు ఉన్న భవనాలను హాస్టళ్లుగా వినియోగించేలా, కొత్తగా ఆరు తరగతి గదులతో అకడమిక్ బ్లాకులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు రూ. 300 కోట్లు కేటాయించాలని కోరారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు రూ.100 కోట్లు, టాయిలెట్లు, నీటి వసతులకు రూ.100 కోట్లు చొప్పున అవసరమన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పాఠశాలలను పటిష్టం చేసేందుకు అదనంగా రూ.600 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. డిగ్రీ కాలే జీలు, పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాల కోసం రూ. 200 కోట్లను బడ్జెట్లో కేటాయించాలన్నారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి చర్యలు యూనివర్సిటీల్లో మౌలిక వసతులు కల్పిం చడంతోపాటు, ఖాళీ పోస్టుల భర్తీ, కొత్త పోస్టుల మంజూరుకు చర్యలు చేపడుతున్నామని కడియం తెలిపారు. ఇందుకోసం కనీసంగా రూ.500 కోట్లు కావాలన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించా లన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో 20 స్కూళ్లను కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రూ.26 కోట్లు అవసరం అవుతాయన్నారు. -
కక్కుర్తి..
• బస్తాకు సుమారు మూడు నుంచి ఐదు కిలోలు మాయం • మూడు జిల్లాల్లో నెలకు సగటున 280 క్వింటాళ్లు హాంఫట్ • నెలకు సుమారు రూ.11.24 లక్షల దుర్వినియోగం • పలు స్కూళ్లలో సన్నాలకు బదులు దొడ్డు బియ్యం సరఫరా • సన్న బియ్యం సరఫరాపై కొరవడిన అధికారుల నిఘా • సర్కారు విద్యార్థులకు తప్పని ఆకలి బాధలు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేస్తున్న సన్న బియ్యం బస్తా బరువు 50.7 కిలోలు. కానీ.. పలు చోట్ల ఒక్కో బస్తాకు సుమారు 4 నుంచి 5 కిలోలు తక్కువగా వస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో తిప్పర్తి మండల కేంద్రంతోపాటు మామిడాల ఉన్నత పాఠశాలలో ‘సాక్షి’ పరిశీలన చేయగా.. నిజమేనని తేలింది. తిప్పర్తి హైస్కూల్కు సరఫరా అయిన బియ్యం బస్తా 45.7 కిలోలే ఉంది. ఈ రెండు పాఠశాలల్లో కలిపి నెలకు 60 కిలోల బియ్యం తక్కువగా వస్తున్నట్లు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించే ఉపాధ్యాయులు తెలిపారు. బస్తాకు 4 కిలోలు తక్కువొస్తున్నాయి.. కనగల్ పాఠశాలలో 400 మంది విద్యార్థులున్నారు. రోజుకు 350 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. నెలకు సగటున 11 బస్తాల బియ్యం వినియోగిస్తున్నాం. ఒక్కో బస్తాలో మూడు నుంచి నాలుగు కిలోల చొప్పున తూకం తక్కువ వస్తోంది. నెలకు సుమారు 44 కిలోల బియ్యం కోత పడుతోంది. ఇక్కడికి చాలాసార్లు దొడ్డు బియ్యం బస్తాలే వచ్చాయి. తూకం తక్కువగా ఉండడంతో విద్యార్థులకు అప్పడప్పుడు అన్నం సరిపోని పరిస్థితి ఉంటోంది. బియ్యం దిగుమతి చేసే సమయంలోనే తూకం వేయక పోవడంతో ఇలా జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. - జాఫర్, కనగల్ హైస్కూల్, ‘మధ్యాహ్న’ పర్యవేక్షకుడు నల్లగొండ : దేవుడు వరమిచ్చినా... పూజారి కనికరించని చందంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థుల పరిస్థితి తయూరైంది. పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం అందించాలనే మహోన్నత లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో అది అక్రమార్కుల పాలిట వరంగా మారింది. సర్కారు పాఠశాలలు, వసతి గృహాలకు సరఫరా అవుతోన్న ఒక్కో బియ్యం బస్తా నుంచి రెండు నుంచి మూడు కిలోల వరకు పక్కదారి పడుతున్నాయి. దీంతో విద్యార్థులకు ఆకలి బాధలు తప్పడంలేదు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో సగటున నెలకు 280 క్వింటాళ్ల బియ్యం అక్రమార్కులు పాలవుతున్నాయి. ఈ లెక్కన నెలకు రూ.11.24 లక్షల చొప్పున ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే సుమారు రూ.కోటి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే.. ప్రభుత్వం మిల్లర్ల ద్వారా సేకరించిన బియ్యాన్ని సీడబ్ల్యూసీ, ఎస్డబ్ల్యూసీ గోదాంల్లో నిల్వ ఉంచి ప్రతి నెలా డిమాండ్ ఆధారంగా మండల స్థాయి నిల్వ(ఎంఎల్ఎస్) కేంద్రాలకు పంపుతోంది. ఈ గోదాంలు పౌరసరఫరాల సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి స్టేజ్-2 గుత్తేదారు ద్వారా పాఠశాలలు, వసతి గృహాలకు పంపిస్తున్నారు. ఎస్డబ్ల్యూసీ ,సీడబ్ల్యూసీ గోదాముల నుంచి తూకం వేశాకే ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి పాఠశాలలు, వసతి గృహాలకు బియ్యాన్ని పంపే సమయంలో తూకం విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఎంఎల్ఎస్ పాయింట్లలో అక్రమాలకు తెరలేచిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్ఎస్ పారుుంట్ల నుంచి వసతి గృహాలు, పాఠశాలలకు బియ్యం చేరే సమయంలోనే రెండు నుంచి మూడు కిలోల బియ్యూన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలో పాఠశాలలకు పంపిణీ చేస్తోన్న బియ్యం బస్తాల పరిమాణం తక్కువగా ఉండడంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. మధ్యాహ్న భోజనం 2.82 లక్షల మందికి... మూడు జిల్లాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,276 ఉన్నాయి. ఈ పాఠశాలలన్నింటిలో 2,82,853 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి మధ్యాహ్న భోజన కోసం ప్రభుత్వం రోజూ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వంద గ్రాములు, ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు 150 గ్రాములు చొప్పున సరఫరా చేస్తోంది. బియ్యంతో పాటు రోజూ ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కోక్కరికి రూ.4.60, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.6.38 చొప్పున చెల్లిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రతి బస్తాలో రెండు నుంచి మూడు కిలోల వరకు బియ్యం తక్కువగా వస్తుండడంతో అసలు సమస్య ఎదురవుతోంది. నెలకు 37 వేల కిలోలు పక్కదారి.... మూడు జిల్లాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి విద్యార్థుల వాస్తవ లెక్క ప్రకారం సగటున రోజూ 28,440 కిలోల బియ్యాన్ని వినియోగిస్తున్నారు. అంటే రోజుకు 568 బస్తాలు బియ్యాన్ని వాడుతున్నారన్న మాట. బస్తాకు సగటున మూడు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయి. ఈ లెక్కన 568 బస్తాలకు 1706 కిలోల బియ్యం పక్కదారి పడుతున్నాయి. సాధారణంగా నెలకు 22 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. అంటే నెలకు 37,532 కిలోల బియ్యాన్ని దోచేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో రూ.35 పైగానే పలుకుతున్నాయి. ఈ బియ్యాన్ని కనీసం రూ.30 చొప్పున విక్రయిస్తున్నారని భావించినా నెలకు రూ.11,25,960 అవుతోంది. ఇంత భారీగా ఆదా యం ఉండడం, కిలో, రెండు కిలోలే కదా అంటూ ఎవరూ పట్టించుకోకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. పర్యవేక్షణ లోపం... బస్తాకు రెండు, మూడు కిలోలు బియ్యం తక్కువగా వస్తుండటంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోత పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరు కావడం, మరికొంత మంది విద్యార్థులు ఇంటికెళ్లి తిని రావడం చేస్తున్నారు. ఈ విద్యార్థుల లెక్కలను సర్ధుబాటు చేసుకుని మిగిలిన విద్యార్థులకు భోజనం వండిపెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం పాఠశాలల్లో కనిపిస్తోంది. ఇదిలావుంటే ఉపాధ్యాయులు ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళ్లి బియ్యం తీసుకురావాలి. అక్కడ వారు తూకం వేయించుకోవాలి. దీని వల్ల ఎక్కువ సమయ ం వృథా అవుతుందన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు తూకం లేకుండానే బియ్యం దిగుమతి చేసుకుంటున్నారు. చాలా మంది బస్తాకు 50 కిలోల చొప్పున ఎన్ని బస్తాలు వస్తే అన్ని కిలో లు వచ్చినట్లు రాసుకుంటున్నారు. వాటిని తూకం వేసి చూస్తేగానీ అసలు అక్రమాలు వెలుగులోకి రావడం లేదు. ఒకవేళ తూకం వేసినా బస్తాకు రెండు, మూడు కిలోలే కదా అని తేలికగా తీసుకుంటున్నారు. ఎవరైనా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా బియ్యం తీసుకునేటప్పుడు మీరే చూసుకోవాలని చెప్పడంతో తమకెందుకుని మిన్నకుండిపోతున్నారు. తిరుమలగిరి : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 730 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, వీరికోసం రోజూ 50 కిలోల నుంచి 60 కిలోల వరకు మధ్యాహ్న భోజనం వండుతున్నారు. నెల రోజులకు 11 క్వింటాళ్ల నుంచి 13 క్వింటాళ్ల బియ్యం అవసరమవుతున్నాయి. అయితే.. ప్రతి నెల 20 కేజీల నుంచి 40 కేజీల వరకు బియ్యం తేడా వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి తుంగతుర్తిలో ఉన్న గోదాం పాయింట్ వరకు, అక్కడి నుంచి వివిధ పాఠశాలలకు ఎగుమతి, దిగుమతులు చేస్తుండటంతో బస్తాలు దెబ్బతిని చినిగి పోవడంతో తేడా వస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
మధ్యాహ్న వంటకు మంట
కొవ్వూరు : పాఠశాలల్లో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఏజెన్సీలకు గుదిబండగా మారింది. వంట ఖర్చులను ఇటీవల పైసల్లో పెంచిన ప్రభుత్వం.. అదనంగా గుడ్డు వేయాలంటూ నిబంధన పెట్టి రూపాయల్లో భారం మోపింది. దీంతో వంట ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఏజెన్సీలకు భారంగా తయారైంది. ప్రభుత్వం ఇటీవల వంట ఖర్చులను పైసల్లో పెంచింది. అదే సమయంలో అదనంగా కోడిగుడ్డు వేయాలంటూ రూపాయల్లో భారం మోపడంతో నిర్వాహక ఏజెన్సీ మహిళలు ఖంగుతిన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ. 0.27 పైసలు, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.0.40 పైసలు పెంచింది. వారానికి గతంలో రెండు గుడ్డు వేయాల్సి ఉంటే ఈనెల నుంచి మూడు గుడ్లు వేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారికి వంట ఖర్చు పెంచిందన్న ఆనందం లేకుండాపోయింది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ఐటీడీఎ పరిధిలో 3,257 పాఠశాలలున్నాయి. వీటిలో 3,02,271 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నామమాత్రంగా పెంపు ఇప్పటివరకు మధ్యాహ్న భోజన పథకంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు రూ.4.86 పైసలు, 9, 10 తరగతుల విద్యార్థులకు 6.78 పైసలు చొప్పున వంట ఖర్చులు నిర్వాహకులకు చెల్లించేవారు. ఈ మొత్తాలను ప్రస్తుతం దిగువస్థాయి విద్యార్థులకు రూ. 5.13 పైసలు, పై తరగతులకు రూ.7.18 పైసలకు పెంచారు. ఈ ఏడాది జూలై నుంచి పెంచిన ధరలు వర్తించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదు. నాలుగు నెలలు తర్వాత పెంచిన ధరలు వర్తింపునకు ఆదేశాలు అందినప్పటికీ వారానికి మూడు గుడ్లు వేయాలన్న నిబంధనతో నిర్వాహకులు నష్టపోతున్నారు. కేటాయింపుల్లో వివక్ష జిల్లాలో మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నప్పటికీ కేంద్ర, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 1 నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులకు 100 గ్రాముల బియ్యం అందిస్తున్నారు. అదే ఎస్సీ, బీసీ వసతి గహాల్లో ఉండే విద్యార్థులకు (మూడు నుంచి ఏడో తరగతి వరకు) రెండు పూటలకు కలిపి 500 గ్రాములు కేటాయిస్తున్నారు. అంటే ఒక్కో పూటకి 250 గ్రాముల చొప్పున కేటాయిస్తుంటే ఇక్కడ మాత్రం వంద గ్రాములే ఇస్తున్నారు. అక్కడ మోనో చార్జీలు నెలకి ఒక్కో విద్యార్థికి ఉదయం అల్పాహారంతో పాటు రెండుపూటల భోజనానికి రూ.750 చొప్పునఅందిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి నెలకి రూ.133.38 పైసలు కేటాయిస్తున్నారు. 8, 9, 10 తరగతులకు హాస్టళ్లలో రూ.850 చొప్పున కేటాయిస్తున్నారు. ఈ సొమ్ములు కూడా రెట్టింపు కంటే పైగానే చెల్లిస్తున్నారు. బియ్యం కూడా హాస్టళ్లలో రెండు పూటలకు 500 గ్రాములు ఇస్తే పాఠశాలల్లో పై తరగతులకు 150 గ్రాములే అందిస్తున్నారు. అందుకే మ«ధ్యాహ్నం భోజనం నాణ్యత కొరవడి భోజనం చేసే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాదికి రూ.2.50 కోట్ల భారం జిల్లావ్యాప్తంగా ఉన్న 3,02,114 మంది విద్యార్థులకు వారానికి మూడు గుడ్ల చొప్పున వడ్డిస్తే నిర్వాహకులపై ఏడాదికి సుమారు రూ. 2.50 కోట్ల మేరకు భారం పడుతోంది. బహిరంగ మార్కెట్ కోడి గుడ్డు ధర రూ.4.50 పైసలు పలుకుతోంది. ఈ విధంగా నెలలో నాలుగు వారాలకు కలిపి ఒక్కో విద్యార్థిపై మూడో గుడ్డు వేయడానికి అదనంగా రూ.18 ఖర్చు చేయాల్సి వస్తుంది. పెంచిన వంట ఖర్చులు ప్రాథమికస్థాయి విద్యార్థులకు రోజుకి 27 పైసలు చొప్పున నెలకి రూ.7.02 పైసలు అదనంగా వస్తున్నాయి. ఒక్కో విద్యార్థిపై అయ్యే రూ.18 అదనపు ఖర్చు నుంచి ఈ సొమ్ము మినహాయిస్తే నిర్వాహకులకు రూ.10.98 పైసలు అదనంగా ఖర్చవుతుంది. జిల్లాలో ప్రాథమికస్థాయిలో విద్యనభ్యసించే విద్యార్థులు 2 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.10.98 చొప్పున ఏడాదిలో పది నెలలకు లెక్కిస్తే రూ. 2.20 కోట్లు ఖర్చవుతుంది. ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతి విద్యార్థులకు వంట ఖర్చులు 40 పైసలు పెంచారు. ఈ లెక్కన నెలకి రూ.10.40 పైసలు అదనంగా వస్తున్నాయి. దీనిలో మూడో గుడ్డు నెలరోజులకు అయ్యే అదనంగా ఖర్చయ్యే రూ.18లో ఈ మొత్తం మినహాయిస్తే ఒక్కో విద్యార్థికి రూ.7.60 పైసలు చొప్పున నెలకి రూ.38 లక్షల వ్యయం అవుతుందని అంచనా. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా విద్యార్థులు హాజరు తగ్గినా, తినేవారి శాతం తగ్గడం తదితర కారణాలతో కొంత తగ్గినా ఏడాదికి రూ. 2.50 కోట్ల వరకు భారం తప్పదని నిర్వాహక ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో జిల్లాలో ఎక్కడా మూడో గుడ్డు వేయాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు. ప్రభుత్వం ద్వారా గుడ్ల సరఫరాకు యత్నం మధ్యాహ్న భోజన పథకానికి కోడిగుడ్లను నెక్ ద్వారా ప్రభుత్వమే సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది అమలులోకి వస్తే భారం తగ్గుతుంది. పాఠశాల ప్రాంగణాల్లో కిచెన్ గార్డెన్లు అభివద్ధికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే అన్నీ పాఠశాలలకు ఉద్యాన శాఖ ద్వారా కూరగాయలు, ఆకు కురల విత్తనాలు అందించాం. – డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి -
మధ్యాహ్న భోజనం పెట్టకుంటే డబ్బులివ్వాలి!
► వరుసగా 3 రోజులు పథకం అమలుకాని స్కూళ్లకు వర్తింపు ► ఒక్కో విద్యార్థికి సంబంధిత స్కూలు రూ. 31 చెల్లించేలా నిబంధన ► తప్పిదాలకు పాల్పడే ఏజెన్సీలు, అధికారులపైనా కఠిన చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం అమల్లో సంస్కరణలు తెచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆహార భద్రత చట్టం నిబంధనలకు అనుగుణంగా పథకం నిబంధనలను మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా స్కూ లు విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు భోజనం పెట్టకపోతే ఆ పథకాన్ని అమలు చేసే స్కూలు (విద్యాశాఖ) సంబంధిత విద్యార్థులకు ఆ మూడు రోజులకు విద్యార్థులకు అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. అంటే పాఠశాలలో ఒక్కో విద్యార్థిపై ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తారో ఆ మొత్తాన్ని చెల్లించేలా నిబంధనల్లో విద్యాశాఖ మార్పులు చేస్తోంది. రోజూ 200 గ్రాముల చొప్పున బియ్యానికి అయ్యే ఖర్చుతోపాటు ఒక్కో విద్యార్థికి అవసరమయ్యే కూరగాయలు, వండిపెట్టేందు కు రోజుకు ఇస్తున్న రూ. 4.70 చొప్పున మొత్తంగా మూడు రోజులకు రూ. 31కిపైగా సంబంధిత పాఠశాల చెల్లించాల్సి ఉంటుం ది. అలాగే మూడు రోజులపాటు భోజనం ఎందుకు పెట్టలేదన్న విషయంలో తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయట్లేదన్న ఆరోపణలు వస్తుండటంతోపాటు 10 మంది, 20 మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లలో ఎక్కువ మంది విద్యార్థులను చూపుతూ ఏజెన్సీలు, సిబ్బంది బిల్లులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించకపోయినా, తప్పిదాలకు పాల్పడినా మధ్యాహ్న భోజనం వండిపెట్టే ఏజెన్సీలు, సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు చేపట్టేలా విద్యాశాఖ నిబంధనలు రూపొందించింది. మెనూ అమలు చేయకపోయినా, నాణ్యమైన ఆహారాన్ని అందించకపోయినా సంబంధిత ఏజెన్సీని రెండుసార్లు హెచ్చరించనుంది. అయినా తీరు మార్చుకోకపోతే ఆ ఏజెన్సీని రద్దు చేయనుంది. ఈ మేరకు రూపొందించిన నిబంధనల ఆమోదం కోసం విద్యాశాఖ రెండు నెలల కిందటే ప్రభుత్వానికి ఫైలు సమర్పించింది. రాష్ట్రంపై తగ్గనున్న ఆర్థిక భారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఎలిమెంటరీ పాఠశాలల్లో పథకం అమలుకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులిస్తుండగా రాష్ట్రం 40 శాతం నిధులను వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి అదనంగా 9, 10 తరగతుల విద్యార్థులు దాదాపు 9 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను వెచ్చించి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు దాదాపు రూ. 200 కోట్ల వరకు రాష్ట్రం అదనంగా వెచ్చిస్తోంది. అయితే సెకండరీ స్కూళ్లలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన సుబ్రమణియన్ కమిటీ సిఫారసు చేసింది. సెకండరీ స్కూళ్లలో చదివే విద్యార్థులు, కౌమార బాలికలకు పోషకాహారాన్ని అందించేందుకు దీన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ సిఫారసులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. నూతన విద్యా విధానంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొని చేర్చాలని భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కొంత మేర ఆర్థిక భారం తగ్గనుంది. -
అన్నమో రామచంద్రా!
జూనియర్ కళాశాలల్లో అమలు కాని మధ్యాహ్న భోజనం ఎదురు చూస్తున్న 21,500 మంది విద్యార్థులు జూలై ఒకటి నుంచే ప్రారంభిస్తామన్న ప్రభుత్వం స్పష్టత ఇవ్వని విద్యాశాఖాధికారులు సంగెం : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై అయోమయం నెలకొంది. పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు జూనియర్ కళాశాలల్లో జూలై ఒకటి నుంచే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. అయితే నెల రోజులు దాటినా ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్లలో ఆయా మండలాల పరిధిలోని గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన బాలబాలికలు సైతం వస్తున్నారు. అందుబాటులో ఉన్న విద్యార్థులు బస్సులు, లేదంటే ఆటోలు, సైకిళ్లపై, కాలినడకన కళాశాలలకు వచ్చి వెళ్తుంటారు. ఉదయం 9:30 గంటలకు కాలేజీకి రావాలంటే ఇంటి నుంచి 7–8 గంటల మధ్యనే బయలుదేరాల్సి వస్తోందని, తిరిగి వెళ్లేసరికి రాత్రి అవుతోందని, దీంతో మధ్యాహ్నం ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు చెపుతున్నారు. -
కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తాం
వృత్తివిద్య జిల్లా అధికారి మహమూద్ అలీ పెద్దేముల్: ఈ విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తామని వృత్తివిద్య జిల్లా అధికారి మహమూద్ అలీ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలోని 27 ప్రభుత్వ కళాశాలలను తనిఖీ చేశామన్నారు. గతేడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో 30 శాతం అడ్మిషన్లు పెరిగాయన్నారు. ప్రైవేట్ కళాశాలలకంటే ప్రభుత్వ కళాశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. దానికి తోడు బయోమెట్రిక్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల విద్యార్థులకు వసతులు కల్పిస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. పెద్దేముల్ కళాశాలలో రూ.కోటి 30 లక్షలతో అదనపు గదులు ఏర్పాటు చేస్తామన్నారు. కళాశాలలో్ ఈ-లైబ్రరీ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆయనతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు, లెక్చరర్లు ఉన్నారు. -
మధ్యాహ్నభోజనం ట్రస్టులకిస్తే చూస్తూ ఊరుకోం
స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే సహించేదిలేదు మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ పరిగి: మధ్యాహ్న భోజనం వడ్డించే బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలు, ట్రాస్టులకు అప్పగించాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ అన్నారు. శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పరిగిలో జీపుజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్నం ఏజెన్సీల నోట్లో మట్టికొడుతూ పాఠశాలలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించే బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. ఫైలెట్ ప్రాజుక్టు కింద జిల్లాను ఎంచుకుని త్వరలో స్వచ్ఛంద సంస్థల చేత నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కార్మికులు ఏజెన్సీలను నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండటం లేదని కాగ్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకువెళ్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శి వెంకటయ్య, నాయకులు యాదగిరి, మంగమ్మ, నర్సమ్మ, సత్యమ్మ పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన విప్ సునీత
టంగుటూరు (ఆలేరు) : మండలంలోని టంగుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన ఆహారాన్ని రుచిచూశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలని సూచించారు. ఆమె వెంట మార్కెట్ చైర్మెన్ కాలె సుమలత, ఎంపీపీ కాసగల్ల అనసూర్య, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, హెచ్ఎం ప్రవీణ్కుమార్, ఉపాధ్యాయులు భూషపాక రాములు, సంధ్యారాణి, గుగ్గిళ్ల రవీంద్రచారి, కిష్టయ్య తదితరులు ఉన్నారు. -
మధ్యాహ్న భోజన కార్మికుల పని భద్రత కల్పించాలి
మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ మొయినాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న కార్మికులకు పని భద్రత కల్పించాలని ఆ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని చిలుకూరు మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన నిర్వహణను ప్రభుత్వం ’మన్నా’ ట్రస్టుకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. 14 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. ట్రస్టుకు మధ్యాహ్న భోజన నిర్వహణను అప్పగిస్తే జిల్లాలో 4,500 మంది కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రస్టు ద్వారా భోజన నిర్వహణ సక్రమంగా ఉండదని పేర్కొన్నారు. ఒక చోట వంటచేసి అక్కడి నుంచే అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తారని తెలిపారు. సరఫరా చేస్తే అన్నం పాడవుతుందని.. రవాణా సౌకర్యం సరిగా లేని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందదని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి మధ్యాహ్న భోజన కార్మికులకు పని భద్రత కల్పించాలని కోరారు. సమావేశంలో కార్మికులు రాధాలక్ష్మి, మంజుల, లక్ష్మి, పెంటమ్మ, లక్ష్మమ్మ, విజయలక్ష్మి, జ్యోతి, సుశీల, అండాలు, అమల తదితరులు పాల్గొన్నారు. -
‘మధ్యాహ్నం’ అధ్వానం..!
♦ అధికారుల పర్యవేక్షణలోపమే కారణం ♦ ఆకలితో తింటే ఆస్పత్రుల పాలవుతున్నవైనం మెదక్ : మధ్యాహ్న భోజనం అధికారుల పర్యవేక్షణలోపంతో అధ్వానంగా మారింది. ఫలితంగా భోజనం తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. జిల్లాలో మొత్తం 3వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 5లక్షల మేర విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే మధ్యాహ్న భోజనంపై అధికారులు పర్యవేక్షణ పెట్టకపోవడంతో విద్యార్థులు నిర్వాహకులు వండిందే తినాల్సి వస్తోంది. కాగా గత పది రోజుల క్రితం మెదక్ మండల పరిధిలోని బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 60మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రుల పాలయ్యారు. అలాగే చిన్నశంకరంపేట మండల దర్పల్లి ఉన్నత పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనం తిన్న 15మంది చిన్నారులకు శరీరమంతా దద్దుర్లు వచ్చాయి. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వానమైన భోజనం పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలమీదకు వస్తోంది. ఈ రెండు సంఘటనలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే జరగడంతో జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామంటూ ప్రచారంచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఏమాత్రం పరిశీలించడం లేదనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కూచన్పల్లి ఉన్నత పాఠశాలలో వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఆస్పత్రి పాలుకాగా ఆ మరుసటి రోజు అధికారులు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. ముక్కిపోయి పురుగులతో ఉండలుకట్టిన బియ్యంతో వం టచేసి పిల్లలకు పెట్టడంతో వాంతులు, విరేచనాలైనట్లు అధికారులు గుర్తించారు. అలాగే చిన్నశంకరంపేట మండలం దర్పల్లి ఉన్నత పాఠశాలలో సైతం నాణ్యతలేని వంటనూనె వాడటం వల్లే విద్యార్థులకు దద్దుర్లు వచ్చినట్లు గుర్తించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు నెలనెలా బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడంలేదు. దీంతో వంట నిర్వాహకులు నాణ్యతను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వండి పెడుతుండటం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నెలనెలా వంట నిర్వాహకుల బిల్లులను చెల్లిస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
నాసిరకం వంటనూనెతో మధ్యాహ్న భోజనం
♦ దద్దుర్లతో అస్వస్థతకు గురైన విద్యార్థినులు ♦ ధరిపల్లి జెడ్పీపాఠశాలలో సంఘటన చిన్నశంకరంపేట : మధ్యాహ్న భోజనంలో నాసిరకం వంట నూనె వాడడంతో విద్యార్థులు దద్దుర్లతో అస్వస్థతకు గురైన సంఘటన చిన్నశంకరంపేట మండలం ధరిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నెలకొంది. గురువారం పాఠశాలకు హాజరైన విద్యార్థులకు చేతులపై దద్దుర్లు కనిపించాయి. మధ్యాహ్న భోజన సమయానికి దద్దుర్లతో నొప్పి ఎక్కువ కావడంతో విద్యార్థులు ఆందోళనకు గుర య్యారు. చేతులు, ఇతర శరీర భాగాలపై దద్దుర్లు పెరిగిపోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజన సమయానికి నొప్పి ఎక్కువ కావడంతో రోదించడం మొదలు పెట్టారు. విద్యార్థుల పరిస్థితిని గమనించిన పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం వెంకటేశం గ్రామ ప్రజాప్రతినిధులకు, విద్యార్థుల తల్లి తండ్రులకు సమాచారం అందించారు. వెంటనే విద్యార్థుల తల్లి తండ్రులు చిన్నశంకరంపేట పీహెచ్సీ సిబ్బందికి సమాచారం అందించడంతో డాక్టర్ సువర్ణ సిబ్బందితో వచ్చి వైద్య సేవలు అందించారు. 50 మందికి విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం 108లో మెదక్ ఏరియా అస్పత్రికి తరలించారు. కాగా విద్యార్థులకు దద్దుర్లు రావడానికి నాసిరకం వంటలే కారణమని విద్యార్థుల తల్లి తండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంఈఓ బాల్చంద్రం, చిన్నశంకరంపేట ఎస్ఐ నగేష్, ఏఎస్ఐ పోచయ్య, ఎంపీటీసీ శ్రీని వాస్, ఉపసర్పంచ్ పాండు పాఠశాలకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
భోజనానికి బియ్యం లేవ్ !
♦ అరువు తెచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న వైనం ♦ వండిపెట్టేందుకు ఏజెన్సీల విముఖత ♦ ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యాచారం: యాచారం మండల పరిధిలో ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజ నానికి బియ్యం కొరత ఏర్పడింది. కొన్ని పాఠశాలల్లో గత ఏడాది మిగిలిన బియ్యం తో సరిపెడుతుండగా మరికొన్ని పాఠశాలల్లో అవికూడా లేకపోవడంతో కిరాణషాపులు, రేషన్ డీలర్ల వద్ద అరువపై బియ్యం తెచ్చి విద్యార్థులకు వండిపెడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు కావస్తున్నా మధ్యాహ్న భోజ నానికి సంబంధించి బియ్యం సరఫరా చేయకపోవడంపై అధికారులపై విమర్శలు వెల్లువుతున్నాయి. మండల పరిధిలో 20 ఉన్నత, 37 ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు మోడల్ స్కూల్, కేజీబీవీ ఉంది. ఆయా పాఠశాలల్లో మొత్తం 4,771 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 120 లోపే విద్యార్థులు ఉండగా, ఉన్నత పాఠశాలల్లో 200 పైగానే ఉన్నారు. వీరికి మధ్యాహ్న భోజనం పథకం కింద ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిత్యం 150 గ్రాములు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 100 గ్రాముల చొప్పున బియ్యం వండిపెడుతున్నారు. మండల వ్యాప్తంగా రోజుకు సుమారు 3 క్వింటాళ్ల బియ్యం బియ్యం అవసరమవుతాయి. ఏజెన్సీలను నిర్వహించలేం.. రెండు రోజుల్లో బియ్యం పంపిణీ చేకపోతే మధ్యాహ్న భోజనాన్ని బంద్ చేస్తామని ఏజెన్సీ మహిళలు పేర్కొంటున్నారు. ఇప్పటికే నెల రోజుల బిల్లు పెండింగ్లో ఉందని, ఈ నేపథ్యంలో కూరగాయలతో పాటు బియ్యం కూడా అప్పు తెచ్చి భోజనం పెట్టలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం నిల్వలకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. మూడు రోజుల్లో బియ్యం సరఫరా చేస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం కొరత ఉన్న మాట వాస్తవమే. బియ్యం నిల్వల కోసం డీఈఓకు నివేదిక పంపించాం. రెండు, మూడు రోజుల్లో బియ్యం సరఫరా అవుతాయి. కొన్ని పాఠశాలల్లో వేసవి భోజనానికి సంబంధించిన బియ్యం ఉన్నాయి. అవి కూడా లేని చోట ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బియ్యం తెచ్చి విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నాం. - వినోద్కుమార్, ఎంఈఓ, యాచారం -
మధ్యాహ్న భోజనంలో తేలు
సోమందేపల్లి : మధ్యా హ్న భోజనంలో తేలు ప్రత్యక్షమయిన సంఘటన శుక్రవారం మండలంలోని మండ్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులకు భోజన ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం వడ్డించడం జరిగింది. విద్యార్థులు తినే సమయంలో ప్లేటులో తేలు కనిపించడంతో భయభ్రాంతులకు గురై ఈ విషయాన్ని వారు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అక్కడికి చేరుకున్న సర్పంచ్ బైల ఆంజనేయులు విద్యార్థులను వైద్య పరీక్షల నిమిత్తం సోమందేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో అందరూ శాంతించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు చేపడతాం. భోజన ఏజెన్సీ నిర్వాహకుడు హనుమంతప్పను విచారించాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని మండలంలోని అన్ని ఏజెన్సీల నిర్వాహకులకు హెచ్చరించాం. - ఆంజనేయులు నాయక్, ఎంఈఓ -
పిడుగురాళ్లలో భూకంపం
► సెకన్లపాటు కంపించిన భూమి ► ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసిన జనం పిడుగురాళ్ల : మధ్యాహ్నం భోజనం చేసి కునుకు తీస్తుండగా ఒక్కసారిగా ధభేల్మనే శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు రామయ్య... ఇదేం శబ్దమని ఇరుగుపొరుగు వారు కూడా భయంతో గృహాల్లో నుంచి బయటకు పరిగెత్తారు. అందరూ ఒకచోటకు చేరి ఏమైందంటూ చర్చించుకున్నారు. భూకంపం వచ్చిందని ఓ పెద్దాయన చెప్పాడు. దీంతో వామ్మో పిడుగురాళ్లకు భూకంపం వచ్చిందా అంటూ పట్టణవాసులంతా ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డుతో పాటు జానపాడు రోడ్డు, బస్టాండ్ సమీపంలో, పిల్లుట్ల రోడ్డు, శివాలయం బజారు, గంగమ్మగుడి ప్రాంతాలలో పెద్ద శబ్దం వచ్చింది. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న వ్యాపారులు కూడా భూకంప శబ్దంతో దుకాణాల నుంచి బయటకు పరుగులు తీశారు. శబ్దం వచ్చిందే త;్ఛజి; గృహాలు, షాపుల్లోని సామాన్లు కింద పడడం వంటి సంఘటనలు జరగలేదు. మధ్యాహ్నం 3.10 గంటలకు ఒక్క సెకను ఈ ఘటన సంభవించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. -
ఎయిడెడ్ స్టూడెంట్స్ వేరయా!
► యూనిఫాంకు ఇండెంట్ అడగని వైనం ► మిగతా పాఠశాలలకు ఇచ్చేందుకు నిర్ణయం ► ఆందోళనలో సిబ్బంది కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం చూపుతున్న సవతి తల్లి ప్రేమ మరోసారి బయటపడింది. కస్తూర్బా, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే యూనిఫాంల ఇండెంట్ను తీసుకుంది. అయితే ఎయిడెడ్ పాఠశాలల ఇండెంట్ను మాత్రం తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అక్కడ కూడా పేద విద్యార్థులే చదువుకుంటున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మొట్ట మొదటి సారిగా 2015-16 విద్యా సంవ్సరంలో ఉచిత దుస్తులను ప్రభుత్వం అందజేసింది. జిల్లాలోని 142 ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 16,348 మంది విద్యార్థులు అందుకున్నారు. ఈ సంవత్సరం కూడా దుస్తులు వస్తాయని చెప్పి విద్యార్థుల సంఖ్యను పెంచే పనిలో టీచర్లు ఉన్నారు. వస్తాయా..రావా మరోవైపు ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత దుస్తులతోపాటు మధ్యాహ్న భోజనం సదుపాయం ఉందని ఉపాధ్యాయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పిడుగు లాంటి వార్త వారి చెవిన పడింది. జిల్లాలోని కస్తూర్బా, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఉచిత దుస్తులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఇండెంట్ను ఇవ్వాలని ఎంఈఓలను ఆదేశించింది. అయితే ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఇండెంట్ను మాత్రం అడగలేదు. దీంతో ఉచిత దుస్తులు వస్తాయా లేదా అన్న అనుమానం నెలకొంది. ఉచిత దుస్తుల కోసం ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం 160 రూపాయలను చెల్లిస్తుంది. ఈ లెక్కనా ప్రభుత్వం గతేడాది 1.30 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ఏడాది కూడా దాదాపుగా అంతేమంది విద్యార్థులు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం ఉంది. ఎయిడెడ్ విద్యార్థులకు ఉచిత దుస్తులు ఇవ్వాలి: ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఏపీటీజీ ఏళ్ల పోరాటానికి గతేడాది దిగి ఇచ్చి దుస్తులు అందజేసింది. మళ్లీ ఈ ఏడు ఇవ్వకుండా తిరకాసు పెడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ పోరాటం బాట పట్టక తప్పదు. వెంటనే ఎయిడెడ్ పాఠశాలలకు కూడా ఇండెంట్ను కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఇమ్మానుయేల్, ఏపీటీజీ రాష్ట్ర కార్యదర్శి ఇంకా నిర్ణయం తీసుకోలేదు: గతేడాది జిల్లాలోని 142 ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు 16,340 ఉచిత దుస్తులను పంపిణీ చేశాం. ఈ ఏడాది ప్రభుత్వ, కస్తూర్బా, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల ఇండెంట్ను అడిగారు. ఎయిడెడ్ పాఠశాలల ఇండెంట్ను అడగలేదు. దాని ప్రకారమే ఎంఈఓలకు ఇండెంట్ కోసం పంపాం. త్వరలో ఎయిడెడ్ విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వై.రామచంద్రారెడ్డి, పీఓ -
వృథా ప్రయాసే..
సెలవుల్లో మధ్యాహ్న భోజనానికి స్పందన కరువు 26 శాతానికి మించని విద్యార్థుల హాజరు వండిన వంటలు నేలపాలు పలుచోట్ల తెరుచుకోని పాఠశాలలు ఫలితమివ్వని కరువు భోజన పథకం మెదక్: మధ్యాహ్న భోజనానికి స్పందన కరువు... వేసవి సెలవుల్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరువు భోజన పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. కొన్ని చోట్ల అసలు పాఠశాలలే తెరుచుకోవడం లేదు. మిగతా చోట్ల వంటలు వండుతున్నా తినే వారు లేకుండా పోయారు. ఫలితంగా వండి వంటలు నేలపాలవుతున్నాయి. విద్యార్థుల హాజరు శాతం స్వల్పంగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. కరువు పథకం ప్రారంభించి వారం రోజులైనా విద్యార్థుల హాజరు శాతం 26కు మించకపోవడం గమనార్హం. ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి భోజన పథకాన్ని కొనసాగిస్తోన్నా ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లాలో 2,892 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో ఒకటినుంచి 10వరకు ఉండగా, అందులో 3 లక్షల 37 వేల 56 మంది నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈనెల 21 నుంచి సెలవుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి బాధ్యతలను పాఠశాలల హెచ్ఎంలకు అప్పగించారు. వారం రోజుల్లో ఇలా... గడచిన వారం రోజుల్లో ఏనాడు 26 శాతానికి మించి విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి హాజరు కాకపోవడంతో ఈ పథకం విజయవంతం కాలేదని పలువురు పేర్కొంటున్నారు. ఈనెల 21న 25 శాతం మంది, 22న 26.24 శాతం, 23న 26.6 శాతం, 24న 24.80 శాతం, 25న 26.11, 26న 26.32 శాతం విద్యార్థులు మాత్రమే భోజనానికి హాజరైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 10శాతం కూడా విద్యార్థులు హాజరైన దాఖలాలు లేవని సాక్షాత్తు ప్రధానోపాధ్యాయులే పేర్కొంటున్నారు. మెదక్ పట్టణంలోని న్యూ హైస్కూల్లో 6నుంచి పదోతరగతి వరకు 332 మంది విద్యార్థులు చదువుతుండగా మధ్యాహ్న భోజనానికి మంగళవారం కేవలం తొమ్మిది మంది మాత్రమే హాజరైనట్టు హెచ్ఎం ఎండీ తకిమొద్దీన్ తెలిపారు. జిల్లాలోని అనేక పాఠశాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, మరికొన్ని పాఠశాలల తాళాలే తీయడం లేదన్న ఆరోపణలున్నాయి. పథకం వృథా.. మధ్యాహ్న భోజన పథకంతో ప్రయోజనం లేకుండా పోయింది. సెలవులను లెక్కగట్టి సదరు రోజులకు సంబంధించిన బియ్యాన్ని వారి ఇళ్లకే సరఫరా చేస్తే బాగుండేదని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడంతో వండిన వంటలు వృథా అవుతున్నాయని వారు చెబుతున్నారు. విద్యార్థులకు మేలు జరగడం పక్కన పెడితే ఉపాధ్యాయుల వేతనాలే రెండింతలు అవుతున్నాయని పేర్కొంటున్నారు. -
వేసవి భోజనం తింటున్నది 27 శాతం లోపే
విద్యాశాఖ అంచనా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల సంఖ్య 27 శాతంలోపే ఉందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. ఈనెల 21న ప్రారంభించిన వేసవి మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యాశాఖ పరిశీలన చేపట్టగా, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులే ఎక్కువ మంది ఈ భోజనం తింటున్నట్లు వెల్లడైంది. ఉన్నత పాఠశాలల విద్యార్థులు కొద్ది మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తినేందుకు వస్తున్నట్లు గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21వ తేదీన 5,77,503 మంది (23.92 శాతం), 22వ తేదీన 6,15,314 మంది (25.49 శాతం), 23వ తేదీన 6,28,383 మంది (26.03 శాతం), 24వ తేదీన 5,64,186 మంది (23.37 శాతం) మధ్యాహ్న భోజనం తిన్నట్లు లెక్కలు తేల్చింది. పక డ్బందీగా టెట్ జంబ్లింగ్ వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మాస్కాపీయింగ్కు పాల్పడేందుకు కొందరు పన్నిన కుట్రను గుర్తించిన విద్యాశాఖ, పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపటి ్టంది. ఇదే అంశంపై సోమవారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతో చర్చించింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సంబంధిత పరీక్ష కేంద్రంలోనే ఫీజులు చెల్లించి, వరుసగా హాల్టికెట్లు పొందిన వారిని ఆయా పరీక్ష కేంద్రంల్లోనే వేర్వేరు గదుల్లో, వరుస క్రమంలో కాకుండా, సీటింగ్ వేర్వేరుగా ఉండేలా చర్యలు చేపట్టింది. -
మధ్యాహ్న భోజనానికి బదులు రూ.150
కేకేనగర్: ఎన్నికల పనులకు సంబంధించిన శిక్షణా తరగతులకు హాజరయ్యే సిబ్బందికి మధ్యాహ్న భోజనానికి బదులుగా ఆహార భత్యం అందజేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ర్టంలో మే 16న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఆ పనుల కోసం 1.97 లక్షల మంది మహిళలతో సహా 3.29 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయలు నియమించిబడ్డారు. ఈ సిబ్బందికి శిక్షణా తరగతులు ఆదివారం రాష్ర్ట వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. వీరందరికి మూడు విడతలుగా శిక్షణ అందజేయనున్నారు. శిక్షణ కోసం వచ్చే ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం కోసం రూ.150 కేటాయిస్తున్నారు. అయితే శిక్షణా శిబిరాలలో ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్న అధికారులు నాణ్యమైన ఆహారాన్ని అందజేయడం లేదని పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ సమస్యలకు పరిష్కారం సూచించే విధంగా శిక్షణకు వచ్చే వారి చేతికే రూ.150 ఇవ్వండి, శిక్షణ శిబిరాలు వద్ద ఏదైనా తాత్కాలిక హోటల్ను కానీ, స్టాల్స్ను కానీ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. శిక్షణా తరగతులకు హాజరయ్యే ఉద్యోగులకు ఇష్టమైన ఆహారం అందించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. -
కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
♦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు: కడియం ♦ ఈసారి అడ్మిషన్లలో విద్యార్థుల ఆధార్ తీసుకుంటాం ♦ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఇంటర్మీడియెట్ ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది ఉచితంగా పుస్తకాలు అందించడం, ఎలాంటి ఫీజుల్లేకుండా చూడడం ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 20 శాతం పెరిగిందన్నారు. మధ్యాహ్న భోజనం అమలు చేయనున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈసారి ఇంటర్మీడియెట్ విద్యార్థుల ప్రవేశాల సమయంలో ఆధార్ నంబరును తప్పనిసరిగా తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పక్కా భవనాలు, తాగునీరు, టాయిలెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. గతేడాది రూ. 201 కోట్లతో కాలేజీలకు సొంత భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టామన్నారు. ఇంకా 15 కాలేజీలకు పక్కా భవనాలు లేవన్నారు. వాటికి జిల్లా కలెక్టర్లు స్థలాలు చూపిస్తే వెంటనే నిర్మాణాలు చేపడతామన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డులో 22 రకాల సేవలను ఆన్లైన్ చేశామన్నారు. పైరవీలకు, అవినీతికి ఆస్కారం లేకుండా బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేశామని చెప్పారు. కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ల్యాబ్లు, లైబ్రరీలు లేవని వాటికోసం ఈసారి ప్రణాళిక బడ్జెట్లో రూ.6 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పరికరాల కొనుగోలు కోసం మరో రూ.10 కోట్లు కేటాయించామన్నారు. కంప్యూటర్లు, స్పోర్ట్స్ పరికరాలు, ఇతరాలకు రూ.2 కోట్లు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రూపొందించిన ప్రచార కేలండర్, పోస్టర్ను కడియం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్రెడ్డి, కార్యదర్శి బాబురావు తదితరులు పాల్గొన్నారు. వేసవిలో ప్రైవేటులో శిక్షణకు ఓకే! ఎంసెట్, ఐఐటీ కోసం ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో శిక్షణ పొందుతున్న వారికి ఈ వేసవి సెలవుల్లోనూ శిక్షణ కొనసాగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు, కాలేజీల విజ్ఞప్తి ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో నిర్ధారించిన దాని కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే ప్రస్తుతం కాలేజీల్లో వసతులు, ఇతరత్రా అంశాలపై తనిఖీలను కొనసాగిస్తున్నామన్నారు. వేసవి సెలవుల్లో ద్వితీయ సంవత్సర తరగతులను కొనసాగిస్తే చర్యలు చేపడతామన్నారు. ప్రైవేటు కాలేజీలు ఫీజులు సరిపోవడం లేదని అడిగినందునే కమిటీ వేశామన్నారు. పాలిసెట్, టెట్, ఎంసెట్, పోలీసు కానిస్టేబుల్ పరీక్షలకు సహకరించాలని యాజమాన్యాలకు సూచించామని, లేకపోతే నష్టం జరుగుతుందని చెప్పినందునే ఒప్పుకున్నారన్నారు. పోలీసు తనిఖీలను ఆపే విషయంలో తాను ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. డిగ్రీ ఫీజుల ఖరారుకు ఏఎఫ్ఆర్సీ తరహాలో కొత్త సంస్థ ఏర్పాటు ఆలోచన చేయలేదన్నారు. వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా 50 శాతం మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని భావిస్తున్నట్టు కడియం తెలిపారు. విద్యార్థులు రావాలన్న బలవంతం లేదని, భోజనం కావాలనుకునే వారే రావొచ్చన్నారు. పేదల కోసమే తాము ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామన్నారు. -
మొక్కుబడి భోజనం!
► విద్యార్థుల కోసంఏజెన్సీల నిరీక్షణ ► తొలిరోజు 1,01,082 మంది మాత్రమే.. ► చాలాచోట్ల కనిపించని పర్యవేక్షకులు ► ఉపాధ్యాయులు చొరవచూపితేనే సత్ఫలితం మహబూబ్నగర్ విద్యావిభాగం: కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లో గురువారం ప్రారంభమైన మధ్యాహ్న భోజనానికి విద్యార్థుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. జిల్లాలో 4.37లక్షమంది విద్యార్థులకు గానూ వేసవి సెలవుల్లో కనీసం 2.31లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు హాజరవుతారని ఎంఈఓల రిపోర్టు ప్రకారం జిల్లా ఉన్నతాధికారులు అంచనావేశారు. కానీ తొలిరోజు 1.01లక్షల మంది విద్యార్థులు మాత్రమే వచ్చారు. జిల్లా కేంద్రంలోని పలుపాఠశాలలను పరిశీలించగా చాలా వాటిలో విద్యార్థులు కనిపించలేదు. వంట ఏజెన్సీల మహిళలు వారికోసం వేచిచూడడం కనిపించింది. పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కూడా పాఠశాలలకు రాలేదు. బేసిక్ ప్రాక్టిసింగ్ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ వారు వచ్చినప్పటికీ విద్యార్థులు ఒక్కరు కూడా రాకపోవడంతో వారు ఎదురుచూసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయులు కూడా అక్కడికి రాలేదు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు రావడంతో వారికి భోజనాలు పెట్టించి పంపించారు. పోలీస్లైన్ ప్రాథమిక, ఉన్నతపాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ కనిపించలేదు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉన్నత సంకల్పంతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనంపై కొంత నిరాసక్తి చూపినట్లు కనిపించింది. గ్రామాల్లో చిన్నారులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు పంపించాల్సిన అవసరం ఉంది. అలాగే పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న ఉపాధ్యాయులు సైతం బాధ్యతాయుతంగా పనిచేస్తేనే భోజనానికి సార్థకత చేకూరుతుందని పలువురు కోరుతున్నారు. పారదర్శకంగా మధ్యాహ్న భోజనం మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం అమలుచేస్తున్న వేసవిలో మధ్యాహ్న భోజనం పథకాన్ని జిల్లాలో మరింత పారదర్శకంగా అమలుచేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవి విద్యాశాఖ అధికారులను గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవిలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈనెల 21 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు. పథకం అమలుతీరును హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలను ఉదయం 8.30 నుంచి 10.30 వరకు నిర్వహించాలని, భోజనం చేసిన తరువాతే వారికి ఇంటికి పంపించాలని కోరారు. మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాకమిటీలు, సర్పంచ్లు, వార్డుసభ్యులు, ఇతర శాఖల సిబ్బంది భాగస్వాములు కావాలని సూచించారు. వేసవి సెలవుల్లో వంట ఏజెన్సీలను నియమించాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు డీఈఓకు పంపినట్లు ఆమె తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల వరకు పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను ఎస్ఎంఎస్ ద్వారా డీఈఓకు పంపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, విద్యార్థుల హాజరురిజిస్టర్లను నిర్వహించడమే కాకుండా కమిటీ సభ్యులు, ఇతర పెద్దలు పాఠశాలలు సందర్శించిన సమయాల్లో సంతకాలను తీసుకోవాలని ఆదేశించారు. -
వికలాంగులు, వృద్ధులకూ మధ్యాహ్న భోజనం
ప్రభుత్వానికి కోదండరాం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: చదవులతో నిమిత్తం లేకుండా గ్రామాల్లోని నిరుపేద పిల్లలతోపాటు గ్రామాల్లోని వికలాంగులు, వృద్ధులకూ మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఈ మేరకు టీజేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్తో కలసి ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. -
భోంచేసి వెళ్లండి
కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లోను మధ్యాహ్నభోజనం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళికను విడుదల చేస్తూ ఎట్టకేలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. మొదటగా కరువు మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్నభోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ... తాజాగా అ న్ని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం మం డల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మధ్యాహ్నభోజనం నిర్వహణ, విద్యార్థుల హాజరు విషయంపై వివరించనున్నారు. 20 నుంచి ప్రారంభం... ఈనెల 20 నుంచి పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నారు. వేసవి దృష్ట్యా విద్యార్థులను ప్రతిరోజు ఉదయం 8 గంటలకే పాఠశాలలకు రప్పించి, ఉదయం 10.30 గంటలకు భోజనం అందించి, 11 గంటలలోపు విద్యార్థులు వారి ఇళ్లకు వెళ్లేవిధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉదయం 8 గంటలకు వచ్చిన విద్యార్థులకు పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం, లేఖలు రాయడం, ఉపన్యాసాలు, వ్యాకరణంలో శిక్షణ, ఆటపాటలు, పెయింటింగ్, నాట్యం తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు పాఠశాలలకు హాజరయ్యే ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సంపాదిత సెలవులు మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో సైతం... జిల్లావ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, హాస్టళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం మధ్యాహ్నభోజనం పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొదటి విడతగా మండలానికి ఒకటి చొప్పున అనువుగా ఉండే ఆశ్రమ పాఠశాల, ఒక హాస్టల్ను గుర్తించి వందమంది విద్యార్థులకు తక్కువ కాకుండా వారంలో ఏడు రోజులపాటు మధ్యాహ్న భోజనం అందించాలని సూచించింది. ఈనెల 25లోగా ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల వివరాలను అందించాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రంజీవ్ ఆచార్య సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లకు సూచించారు. ఒక మండలంలో బాలురకు, పక్క మండలంలో బాలికలకు వేర్వేరుగా వసతులు ఏర్పాటు చేసి ఇదివరకు పనిచేస్తున్న వంట ఏజెన్సీ నిర్వహకుల ద్వారానే భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో తల్లిదండ్రులను సంప్రదించి ఆశ్రమ పాఠశాల, హాస్టళ్లకు రావాలనుకునే పిల్లల వివరాలు సేకరించి మధ్యాహ్నభోజనాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లల్లో ఉండే విద్యార్థులకు సైతం ఆటపాటల్లో శిక్షణతోపాటు వీలునుబట్టి విహారయాత్రకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. విద్యార్థులు వస్తారా..? రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో వంద మంది విద్యార్థులను ఒకచోట చేర్చి మధ్యాహ్నభోజనం పెట్టాలనే నిర్ణయం విస్మయాన్ని కలిగిస్తోంది. మండుతున్న ఎండలతో సతమతమవుతున్న ప్రజలు తమ పిల్లలను గ్రామం నుంచి పక్క మండలంలోని ఆశ్రమ పాఠశాలకు లేదా హాస్టల్ పంపేందుకు ఎలా ముందుకు వస్తారని పలువురు పేర్కొంటున్నారు. కరువు దృష్ట్యా వేసవి సెలవుల్లో మధ్యాహ్నభోజనం అమలు మంచిదే అయినా... తమ పిల్లలను కేవలం భోజనం కోసమే పంపుతారో లేదో వేచిచూడాల్సిందే! -
వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
* హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో అమలుకు సర్కారు నిర్ణయం * మండల, నియోజకవర్గ కేంద్రాల్లోనే గురుకుల పాఠశాలల ఏర్పాటు * జూన్ నుంచే రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించేలా చర్యలు * విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లో ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అంశాలపై సచివాలయంలో శనివారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం సమీక్ష వివరాలను కడియం వివరించారు. కరువు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని మరో 42 రోజుల పాటు కొనసాగించాలని కేంద్రం సూచించినట్లు చెప్పారు. అయితే ప్రకటించిన 231 కరువు మండలాలతో అన్ని ప్రాంతాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని, 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించినట్లు తెలిపారు. సెలవు రోజుల్లో ఈ పథకం అమలు, బాధ్యతల అప్పగింతపై ఈ నెల 18న అన్ని జిల్లాల కలెక్టర్లతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్లో నిర్ణయిస్తామన్నారు. సెలవు రోజుల్లో ఉదయం 9 గంటలకు విద్యార్థులు బడికి వస్తే గంట పాటు ఆటపాటలు గానీ, తరగతులు గానీ నిర్వహించి, 10 గంటలకు భోజనం పెట్టి 11 గంటల్లోపు ఇళ్లకు పంపేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు కేజీ టు పీజీ ఉచిత విద్య అమల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో 250 గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రెసిడెన్షియల్ స్కూల్స్ మండల లేదా నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం పాఠశాలలు ఉన్న ప్రాంతంలో కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న ఆయా శాఖల అధికారులతో జరిగే సమావేశంలో పాఠశాలలు ఏర్పాటు చేసే ప్రాంతాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక్కో గురుకుల పాఠశాలకు రూ.22కోట్లు వెచ్చించనున్నామని, ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ స్థలం లేకపోయినట్లయితే పాఠశాల కోసం ఐదెకరాల భూమిని కొనుగోలు చేస్తామన్నారు. ఒక్కో పాఠశాలకు 640 మంది చొప్పున మొత్తం 1.60 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలను 2016-17 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామన్నారు. తొలి ఏడాది 5 నుంచి 8 తరగతులు, రెండో సంవత్సరం 9, 10, మూడో సంవత్సరంలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న డిగ్రీ కాలేజీల్లోనూ తొలి ఏడాది ఫస్టియర్ను ప్రారంభించి మూడేళ్లలో పూర్తిస్థాయిలో నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. -
కరువు.. భోజనం!
వారం ఆగాల్సిందే.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వేసవిలోనూ మధ్యాహ్న భోజనం పెడతామని, జిల్లాలోని 22 కరువు మండలాల్లో దీన్ని అమలు చేస్తామని సర్కారు గతంలోనే ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలూ వచ్చాయి. అయితే.. విపరీతమైన ఎండలు, వడగాలుల నేపథ్యంలో షెడ్యూల్ కన్నా వారం రోజుల ముందే అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వచ్చే జూన్ 13న పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో ముందస్తు సెలవులు వచ్చినా సాధారణ షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 23 నుంచి కరువు భోజనం పెడతామని, ఈ వారం రోజులపాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఉండదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. వారం రోజుల సెలవులు అదనంగా ప్రకటించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు మధ్యాహ్న భోజనం ఎప్పటి నుంచి పెట్టాలనే దానిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఈనెల 23 నుంచే అమలు చేయాలనే ఆలోచనలో జిల్లా విద్యాశాఖ అధికారులున్నారు. ఎంపీడీఓలు, ఎమ్మార్వోలు, ఆర్డీఓల పర్యవేక్షణలో... వేసవి సెలవుల్లో కరువు మండలాల్లో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించే బాధ్యతలు జిల్లా రెవెన్యూ వర్గాలకు అప్పగించారు. వాస్తవానికి జిల్లాలోని 22 కరువు మండలాల్లో మొత్తం 970 పాఠశాలల్లో ఉన్న దాదాపు 80వేల మంది విద్యార్థులకు వేసవి సెలవుల్లో భోజనం పెట్టాల్సి ఉంది. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరు. ఈ నేపథ్యంలో ఈ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న దానిపై సందేహం నెలకొంది. టీచర్లకే అప్పగించి వారికి అదనపు సౌకర్యాలు ఇప్పించాలా.. లేక.. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి స్వచ్ఛందంగా భోజనాన్ని పెట్టించాలా అనే అంశాలపై చర్చ జరిగింది. చివరకు విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన నిర్ణయం మేరకు వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో అంగన్వాడీ వర్కర్లను బాధ్యులుగా చేసి వారి చేత మధ్యాహ్న భోజనం పెట్టించాలని నిర్ణయించారు. వంట వండేది మాత్రం ఆయా పాఠశాలల్లో ఇప్పటివరకు వండుతున్న ఏజెన్సీలే. వారికే వంట బాధ్యతలు అప్పగించారు. వేసవి సెలవుల్లో వండినందుకు గాను కూడా ఆయా ఏజెన్సీలకు ఎప్పుడు చెల్లించే చార్జీలే చెల్లించాలని, ఎలాంటి అదనపు భత్యం ఇచ్చేది లేదని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఆయా ఏజెన్సీల చేత వంట వండించాలని, బియ్యం బాధ్యతలు అంగన్వాడీ వర్కర్లకు అప్పగించాలని, మొత్తంగా పర్యవేక్షించే బాధ్యతలను రెవెన్యూ శాఖలకు అప్పగించాలని నిర్ణయించారు. ఆయా పాఠశాలల్లో వంట వండే ందుకు, పిల్లలు తాగేందుకు, ప్లేట్లు కడుక్కునేందుకు అవసరమైన నీటిని (నీటి సౌకర్యం లేని పాఠశాలల్లో) కూడా సరఫరా చేసే బాధ్యత వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులకే అప్పగించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మేం సిద్ధం... కరువు మండలాల్లోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. కలెక్టర్తో మాట్లాడి అన్నీ సిద్ధం చేసుకున్నాం. ముందస్తు సెలవుల్లో ఏం చేయాలన్న దానిపై మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం. - చంద్రమోహన్, జిల్లా విద్యాశాఖాధికారి వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం అమలయ్యే మండలాలు యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, బీబీనగర్, తిప్పర్తి, మునుగోడు, చండూరు, మేళ్లచెరువు, చింతపల్లి, దేవరకొండ, కనగల్, బొమ్మలరామారం, భువనగిరి, భూదాన్ పోచంపల్లి, నకిరేకల్, మోతె, సంస్థాన్ నారాయణపురం, డిండి, చందంపేట, చౌటుప్పల్, మఠంపల్లి, తుర్కపల్లి. -
రండి బాబూ.. రండి..
గీసుకొండ : మండలంలోని వంచనగిరి జేడ్పీ హైస్కూల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ప్రచార బాట పట్టారు. సర్కారు బడులను బతికించుకునే పనిలో భాగంగా తమ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ వంచనగిరి గ్రామంలో ఆ రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సోమవారం ప్రచారం చేపట్టారు. ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా గ్రామంలోని ఇంటింటికి తిరిగి సర్కారు పాఠశాలలో చేర్పిస్తే కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు, పిల్లలకు వివరించారు. అనుభవం, ఉన్నత విద్యావంతులైన శిక్షణ పొందిన టీచర్లతో బోధన ఉంటుందని, మధ్యాహ్న భోజనంతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాంలు అందజేస్తామని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రమాదేవి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సాంబరెడ్డి, ఉపాధ్యాయులు రాంమూర్తి, బాష్మియా, హేమలత పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో హైస్కూల్లో 15 మందిని, పీఎస్లో 12 మందిని చేర్పించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. -
మధ్యాహ్న భోజనంపై కాకి లెక్కలు!
67 శాతం నిధులే ఖర్చు చేసినట్లు తేల్చిన కాగ్ సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజనంపై ప్రభుత్వం వేసిన లెక్కలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని కాగ్ నివేదిక ఎండగట్టింది. కాకి లెక్కలతో చేసిన ప్రతిపాదనల కారణంగా పథకానికి కేటాయించిన నిధులు 33 శాతం మిగిలిపోయాయని పేర్కొంది. 2010-2015 మధ్య మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిన పాఠశాలలు, వాటిల్లోని పిల్లలు, భోజనాల సంఖ్యకు... 2011-2016 మధ్య చూపిన సంఖ్యలకు మధ్య పొంతన లేదని, తప్పుడు లెక్కలు చూపారని తుర్పారబట్టింది. ఈ పథకం కింద ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.5,466 కోట్లు కేటాయిస్తే రూ.3,666 కోట్లు (67 శాతం) మాత్రమే ఖర్చు చేశారని తేల్చింది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపడం, అవసరానికి మించి నిధులకు ప్రతిపాదించడం వంటి కారణాలతో 2012-13లో రూ.239.83 కోట్లు, 2013-14లో రూ.402.32 కోట్లు మిగిలిపోయాయని పేర్కొంది. కరువు మండలాల్లో వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మార్గదర్శకాల్లో ఉన్నా... 2012-13, 2013-14, 2014-15 సంవత్సరాల్లో కార్యాచరణ ప్రణాళికలతో ప్రతిపాదనలు ఇవ్వలేదని, దాంతో కరువు ప్రాంతాల్లో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం పెట్టలేదని కాగ్ వేలెత్తి చూపింది. ఇక వార్షిక కార్యాచరణ, బడ్జెట్ ప్రకారం 2010-15 మధ్య 237 కోట్ల భోజనాలకు రూ.1,209.86 కోట్లు అవసరమని చూపించగా.. ఆహార ధాన్యాలు, వంట ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 940.14 కోట్లే ఖర్చు చేసిందని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నా ఆ ప్రభావం విద్యార్థుల నమోదు, హాజరుపై ప్రభావం చూపడం లేదని పేర్కొంది. అక్షరాస్యత కార్యక్రమాల లెక్కలేవీ? రాష్ట్రంలో అక్షరాస్యత కార్యక్రమాలకు సంబంధించిన వ్యయానికి లెక్కలు పూర్తిస్థాయిలో ఇవ్వలేదని కాగ్ పేర్కొంది. సాక్షర భారత్ మిషన్ కింద రూ.240.83 కోట్లు ఖర్చు చేస్తే వినియోగ ధ్రువపత్రాలను రూ.104.23 కోట్లకే అందజేశారని వెల్లడించింది. నిధుల ఖర్చు లేని విద్యాశాఖ విద్యాశాఖకు 2014-15 బడ్జెట్లో రూ.9,276 కోట్లు కేటాయిస్తే రూ.5,872.87 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని... రూ.3,403.56 కోట్లు మిగిలిపోయాయని కాగ్ వెల్లడించింది. ఇందులో రూ.3,228.63 కోట్లు సరెండర్ చేసినట్లు పేర్కొంది. ఇక ఏడాది పొడవునా వ్యయం చేయకుండా... నిధులు మురిగిపోకుండా ఉండేందుకు డిసెంబర్ నుంచి మార్చి వరకు హడావుడిగా ఖర్చు చేస్తున్నట్లు తేల్చింది. సంక్షేమ సదనాల నిర్వహణ లోపభూయిష్టం అనాథ బాలలు, శిశు సంరక్షణ కేంద్రాల నిర్వహణ, పనితీరులో భారీ స్థాయిలో లోపాలు ఉన్నాయని కాగ్ వేలెత్తి చూపింది. ఏడు శిశు సంరక్షణ కేంద్రాలకుగాను ఐదింటిలో పిల్లల వయసు, నేర స్వభావం, వారికి అవసరమయ్యే సంరక్షణ, శారీరక-మానసిక ఆరోగ్యం ఆధారంగా వర్గీకరించలేదని స్పష్టం చేసింది. ఈ సదనాల్లో తగిన మౌలిక వసతులు లేవని.. 52శాతం వరకూ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. టీచర్ల్లూ.. ఇదేం పని! రాష్ట్ర విభజన సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన ఏడు మండలాల్లోని ఉపాధ్యాయులు మోసపూరితంగా రెండు రాష్ట్రాల్లోనూ వేతనాలను డ్రా చేసిన విషయాన్ని కాగ్ ఎండగట్టింది. జెడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన 211 మంది టీచర్లు వేతనాల కింద ఏపీ నుంచి రూ.1.65 కోట్లు, తెలంగాణ నుంచి రూ.1.58 కోట్లు డ్రా చేసుకున్నారని... మోసపూరితంగా వేతన నిధులను డ్రా చేసిన వారిపై చర్యలు చేపట్టాలని సూచించింది. ఏపీకి వెళ్లిన మూడు మండలాల్లోని ఆశ్రమ పాఠశాలల ఉద్యోగులకు సంబంధించిన రూ. 12.26లక్షల జీతభత్యాలను తెలంగాణ రాష్ట్ర డ్రాయింగ్ అధికారులు డ్రా చేసిన విషయాన్ని కాగ్ బయట పెట్టింది. -
ఉపాధిహామీ పనులపై కేంద్రం ఫోకస్
శాశ్వత ఆస్తుల కల్పనపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచన సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై కేంద్రం దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల్లో ఫోకస్ ఏరియాల్లో ఉపాధి పనులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిం ది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనతో పాటు శాశ్వత ఆస్తులను ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలవుతున్న సుమారు 5,000 పాఠశాలలల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ కింద కిచెన్షెడ్స్ (వంటగదులు), అంగన్వాడీల ఏర్పాటు, వ్యవసాయ భూముల్లో వర్షపునీటిని ఒడిసి పట్టేందుకు 55వేలకు పైగా ఫామ్ పాండ్స్, నివాస ప్రాంతాల్లో రెండు లక్షలకు పైగా ఇంకుండు గుంతలు, సేంద్రియ ఎరువుల తయారీ నిమిత్తం 95 వేల వర్మీ కంపోస్ట్ పిట్లు, స్వచ్ఛభారత్ గ్రామీణ్ కింద మూడు లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి విభాగం ప్రణాళికలను సిద్ధం చేసింది. 15 కోట్ల పనిదినాలకు ప్రణాళికలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధిహామీ కింద 15 కోట్ల పనిదినాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వచ్చే ఏడాది కనీసం 13.72 కోట్ల పనిదినాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత ్వం తాజా బడ్జెట్లో రూ. 2,352.78 కోట్ల అంచనాను ప్రతిపాదించింది. ఉపాధిహామీ కార్యక్రమాల్లో శాశ్వత ఆస్తుల కల్పన నిమిత్తం ఒక్కొక్క ఫామ్పాండ్కు రూ. 35 వేల నుంచి 55 వేలు, వర్మీ కంపోస్ట్ పిట్ ఏర్పాటుకు రూ. 16 వేలు, ఒక్కో ఐహెచ్ఎల్(మరుగుదొడ్డి)నిర్మాణానికి రూ. 12 వేలు, ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి రూ. 8 లక్షలు, ఇంకుడుగుంతకు రూ. 6 వేలు వంటగదికి రూ. రెండు లక్షల చొప్పున చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఇవి కాక రూ. 120 కోట్లతో సిమెంట్రోడ్లు, రూ. 70 కోట్లతో 1,000 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు, రూ. 100 కోట్లతో జీవనోపాధికి సంబంధించిన పనులు(పశువుల షెడ్లు, కోళ్ల పెంపకం..తదితర), తెలంగాణ హరితహారం కార్యక్రమానికై రూ. 250 కోట్లతో నర్సరీల ద్వారా మొక్కల పెంపకం.. తదితర కార్యక్రమాలను ఉపాదిహామీ పథకం ద్వారా చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. రూర్బన్ మిషన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 17 సమూహా (క్లస్టర్)ల్లో నాలుగు సమూహాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్రం మంజూరు చేసిన కస్టర్లలో రంగారెడ్డి జిల్లాలోని ఆల్లాపూర్, మెదక్ జిల్లాలోని ర్యాకల్, నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, ఆదిలాబాద్ జిల్లాలోని సారంగపల్లె క్లస్టర్లున్నాయి. -
వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
♦ పేద విద్యార్థుల సంతోషం ♦ వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం ♦ కరువు వేళ సర్కారు నిర్ణయంతో పేద పిల్లల సంతోషం ♦ జిల్లాలో 1.99 లక్షల విద్యార్థులకు ప్రయోజనం పాపన్నపేట/సిద్దిపేట: విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు చదువు నేర్చే పిల్లల ఆకలిదప్పులు తీర్చే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజానకెత్తుకున్నాయి. కరువు మండలాల్లో వలసల నివారించేందుకు, ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించడం పేదల ఇంట ఆనందాన్ని నింపనున్నది. ఈ నిర్ణయం దరిమిలా మెదక్ జిల్లాలోని 2,365 ప్రభుత్వ పాఠశాలల్లో 1,99,570 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఆ భోజనమే కడుపు నింపుతోంది.. సర్కార్ బడుల్లో డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించేందుకు, పౌష్టికాహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డి కాలంలో 2008లో అన్ని తరగతులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఈ లక్ష్య సాధన దిశగా ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా ఘోరమైన కరువు పరిస్థితులు కమ్ముకొన్నందున పల్లె జనాలు బతుకు దెరువు కోసం వలస బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో చిన్న పిల్లలను, ముసలి వాళ్లను ఇళ్ల వద్ద వదిలి జవసత్వాలు ఉన్న వాళ్లంతా వలస బాట పట్టారు. దీంతో పిల్లలు కలో..గంజో తాగుతూ పాఠశాలల కు వస్తున్నారు. మధ్యాహ్న భోజనం కొంత వరకు వారి ఆకలి తీరుస్తుంది. సెలవుల్లోనూ అన్నం. సంతోషమే! ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో పిల్లలు తల్లిదండ్రుల వెంట వలస వెళ్లే ప్రమాదముందని భావించిన సర్కార్ వేసవి సెలవుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని తాజాగా నిర్ణయించింది. చదువు చెప్పడంతో పాటే బాధ్యత తీరిపోదని, పిల్లలకు ఆనందాన్ని, విజ్ఞానాన్ని పంచుతూనే పాఠశాలలను వేసవి విడుదుల్లా తయారు చేయాలని, ఈ దిశగా మధ్యాహ్న భోజనంతో పిల్లల కడుపు నింపాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది. కరువు మండలాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నందున మెదక్ జిల్లాలోని 46 మండలాల్లో ఈ పథకం ద్వారా 1,99,570 మంది విద్యార్థులకు లబ్ధి కలగనుంది. 42 రోజుల పాటు లబ్ధి ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. అంటే 42 రోజుల పాటు ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తారు. అయితే వంట బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. వేసవి సెలవుల్లో టీచర్లు బడికి వచ్చే అవకాశం లేనందున విద్యా వలంటీర్లు లేదా అంగన్వాడీలకు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం వంట చేస్తున్న సిబ్బందికే వంటలు వండే బాధ్యతలు అప్పగిస్తారని కూడా వినవస్తోంది. పర్యవేక్షణ బాధ్యత మాత్రం ప్రధానోపాధ్యాయులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా ఉపవిద్యాధికారి శ్యాంప్రసాద్రెడ్డిని సంప్రదించగా సాధారణంగా విద్యా సంవత్సరంలో పది నెలల పాటు వంట సిబ్బందికి వేతనాలు చెల్లిస్తుంటామని, సెలవుల్లో వంటచేస్తే అదనంగా చెల్లిస్తామన్నారు. నానమ్మ వద్దే ఉంటున్నా.. నాన్న రాములు చిన్నప్పుడే చనిపోయాడు. ఉన్న కుంటల పాటి భూమి కడుపు నింపడం లేదు. దీంతో అమ్మ సుజాత బతుకు దెరువుకు పట్నం వెళ్లింది. నానమ్మ కిష్టమ్మ వద్దే ఉండి చదువుకుంటున్నా. స్కూల్లో పెట్టే అన్నమే తిని ఆకలి తీర్చుకుంటున్నాను. - సురేష్, 9వ తరగతి, కొడుపాక వలసబాటలో అమ్మానాన్న.. పంటలు పండక బతుకుదెరువు కష్టమైంది. అమ్మనాన్నలు బాలమ్మ, కనకయ్య పట్నం వలస వెళ్లారు. అక్క వీణ, నేను కలిసి అమ్మమ్మ శ్యామమ్మ వద్ద ఉంటున్నాం. సెలవుల్లో అన్నం పెడితే మాకు ఆకలి సమస్య తీరినట్టే. - ప్రవీణ్, 9వ తరగతి, కొడుపాక సెలవుల్లో భోజనం సంతోషమే.. సెలవుల్లో భోజనం పెడితే మంచిదే. ఇక్కడ బతుకుదెరువు లేక మా అమ్మానాన్న వలసపోయారు. పిన్ని వంట చేసి పెడితే నేను, అక్క ధరణి ఇక్కడ ఉంటూ చదువుకుంటున్నాం. సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం వల్ల మా పిన్ని మా పోషణ భారం తగ్గుతుంది. - సాయిబాబ, 9వ తరగతి, కొడుపాక వలస తప్పింది.. అమ్మ పోచమ్మ, నాన్న మాణయ్య పట్నం వలస వెళ్లారు. తమ్ముడు దివాకర్, నేను కొడుపాక స్కూళ్లో చదువుకుంటున్నాం. నానమ్మ లక్ష్మికి చేతగాదు. ఒక పూట వంట జేస్తే మరో పూట కష్టం. అందుకే సెలవుల్లో పట్నం వెళ్దామనుకుంటున్నం. సెలవుల్లోనూ బడిలో భోజనం పెడతారని తెలిసింది. చాలా సంతోషం. - గూడెం శైలజ, 9వ తరగతి, గాజులగూడెం -
‘మధ్యాహ్న భోజనానికి’ బయోమెట్రిక్
అవకతవకల నియంత్రణకు విద్యాశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అవతవకలను నియంత్రించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆయా పాఠశాలల్లో భోజనం చేస్తున్న విద్యార్థుల కచ్చితమైన హాజరు వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28,500 పాఠశాలలకు చెందిన సుమారు 21 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పథ కానికి ప్రభుత్వం ఏటా రూ. 450 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే విద్యార్థుల సంఖ్యకు, క్షేత్రస్థాయి అధికారులు సమర్పిస్తున్న గణాంకాలకు పొంతన ఉండట్లేదని ఉన్నతాధికారులు ఇటీవల నిర్వహించిన పరిశీలనలో తేలింది. 10 మంది విద్యార్థులు భోజనం చేసిన చోట 25 మంది విద్యార్థులు భోజనం చేసినట్లు కిందిస్థాయి సిబ్బంది తప్పుడు లెక్కలు రాస్తున్నట్లు బయటపడింది. పథకానికి ప్రభుత్వ నిధులు భారీగా దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల కచ్చితమైన వివరాలను తెలుసుకునేందుకు బయోమెట్రిక్ విధానాన్ని విద్యాశాఖ ఎంచుకుంది. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని, ఆపై అన్ని మండలాల్లోని పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను అమర్చేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. మొత్తం 28,500 పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటు, వాటి నిర్వహణకు అయ్యే ఖర్చుపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం బడ్జెట్లో తగినన్ని నిధులిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కరువు మండలాల్లో వేసవిలోనూ... ప్రభుత్వం ప్రకటించిన 231 కరువు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాలు జారీచేశారు. వేసవిలో మధ్యాహ్న భోజనానికి ఏయే పాఠశాల నుంచి ఎంత మంది విద్యార్థులు హజరయ్యే అవకాశం ఉందో జిల్లాలవారీ వివరాలు తెలియజేయాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాలిచ్చారు. వేసవిలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు పాఠ్యాంశాలు కాకుండా క్రీడలు, సాంస్కృతిక అంశాలపై ఆసక్తి పెంపొందించే కార్యాక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. -
పేదల బియ్యం స్వాహా
భారీగా అమ్ముకున్న వైనం మిల్లర్లు, డీలర్లు, అధికారులు కుమ్మక్కై సొమ్ముచేసుకున్నారు విజిలెన్స్ తనిఖీల్లో రూ.8.19 కోట్ల బియ్యం మాయం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమో... ధనార్జనో తెలియదు. పేదల ఆకలి తీర్చే బియ్యాన్ని పెద్దల పరం చేస్తున్నారు. ఆ పెద్దల్లో ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాలుపంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ దుకాణాలు, వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం కోసం కేటాయించిన బియ్యాన్ని అమ్మి జేబులు నింపుకున్నారు. అందుకు తాజా సంఘటనలే నిదర్శనం. గత ఎడాది ప్రభుత్వం 100కుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. అలా సేకరించిన ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించి నిల్వచేశారు. మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని బియ్యంగా చేసి (సీఎంఆర్) ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది. ధాన్యాన్ని బియ్యంగా మార్చి గత ఎడాది నవంబర్లోపు ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంది. 1.25 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యానికి సంబంధించి 84,400 మెట్రిక్ టన్నులు బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 79 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రం సరఫరా చేశారు. మిగిలిన 5,100 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వటంలో మిల్లర్లు కాలయాపన చేశారు. కావలి, నెల్లూరు ప్రాంతాల్లో సుమారు 10 మంది మిల్లర్లు తీసుకున్న ధాన్యం బయటమార్కెట్లో విక్రయించారు. పౌరసరఫరాలశాఖ అధికారులు సరఫరా చేసిన ధాన్యాన్ని మిల్లర్లు బయట విక్రయించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసినా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుని నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపించాయి. అధికారులు మిల్లర్ల నుంచి కమీషన్ పుచ్చుకుని సామర్థ్యంలేని రైస్మిల్లులకు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సరఫరా చేశారు. మిల్లర్లకు ఇచ్చిన సమయం పూర్తయి రెండు నెలలు దాటినా ఎటువంటి సమాచారం లేకపోవటంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. ఆ మేరకు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. నాలుగేళ్ల కిందట మిల్లులకు ధాన్యం సరఫరా చేశారు. బియ్యాన్ని బొక్కేశారు జిల్లాలో రూ.8.19 కోట్లు విలువ చేసే 3,413 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. జిల్లాలో సోమవారం విజిలెన్స్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ మండల పరిధి అల్లీపురంలోని శ్రీదేవి ఎంటర్ప్రైజెస్, వెంకటలక్ష్మి రైస్మిల్, లక్ష్మీవాసవి వెంకటసత్యసాయి రైస్మిల్, కావలిలోని శ్రీమాలతి మోడ్రన్ రైస్మిల్, పొదలకూరులోని మరో రైస్మిల్లులో తనిఖీలు నిర్వించారు. రైస్మిల్లుల్లో ఉండాల్సిన బియ్యం మాయమైనట్లు గుర్తించారు. రేషన్దుకాణాలు, వసతిగృహాలు, పాఠశాలలకు తరలించకుండా కొందరు మిల్లర్లు, అధికారులు, డీలర్లు కలిసి విక్రయించుకున్నట్లు గుర్తించారు. ఆమేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటనాథరెడ్డి వెల్లడించారు -
సన్నబియ్యం నాణ్యతపై పరిశీలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలకు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అందిస్తున్న సన్నబియ్యం నాణ్యత పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న సన్నబియ్యంలో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బఫర్ గోదాముల్లో ఉన్న బియ్యం శాంపిళ్లను సేకరించి నాణ్యతను పరిక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఆ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు శాంపిళ్ల సేకరణ ప్రారంభించారు. రాష్ట్రం లోని 3,036 సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 5.39 లక్షల మంది, 34,319 ప్రభుత్వ పాఠశాలల్లోని 29,86,010 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి సన్నబియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం పౌరసరఫరాల శాఖ నెలకు 14 వే ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. దీంతో పాటే స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లు, అనాథ శరణాలయాలను కలిపితే ఏటా రూ.642 కోట్లతో 1.92 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇప్పటికే రెండుమార్లు తనిఖీలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం జిల్లాకు నాలుగైదు హాస్టళ్ల చొప్పున 50 చోట్ల తనిఖీలు చేశా రు. ఎక్కడా బియ్యం నాణ్యతలో తేడాలు కాన రాలేదు. అయితే సన్నబియ్యంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపణలు చేయడంతో దీనిపై స్పందించిన మంత్రి ఈటల అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని రూఢీ చేసేందుకు జిల్లాల్లోని బఫర్ గోదాముల్లో ఉన్న సన్నబియ్యం నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల మేనేజర్లకు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగా తెలిసింది. -
సీఐటీయూ ఆందోళన
అనంతపురం: పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను తొలగించటంతో సీఐటీయూ కార్మికులు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డరుకు విరుద్ధంగా ఏజెన్సీలను తొలగించటం అన్యాయమని వారు ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులకు ఏజెన్సీలను కట్టబెడుతున్నారని సీఐటీయూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (కనగానపల్లె) -
సాక్షి కార్టూన్
హోంవర్క్ చేయకుండా వెధవ్వేషాలు వేశావో మధ్యాహ్న భోజనం పెట్టిస్తా జాగ్రత్త! -
అన్నం కాదది.. విషం
నరసాపురం (రాయపేట)/నరసాపురం రూరల్ : నరసాపురం మండలం చిట్టవరం జెడ్పీ హైస్కూల్లో బుధవారం విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనం వారి పాలిట విషమైంది. 40 మంది చిన్నారులను ఆస్పత్రి పాల్జేసింది. రెండు ముద్దలు నోట్లో పెట్టుకోగానే వాంతులు చేసుకుని, కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థుల్ని ఉపాధ్యాయులు, గ్రామస్తులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిం ది. ఈ ఘటనతో చిట్టవరం గ్రామం ఉలిక్కిపడింది. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటింది. భోజనం విషతుల్యం కావడానికి కారణమేంటనేది ఇంకా వెల్లడి కాలేదు. తుప్పు కంపుకొడుతున్న బియ్యూన్ని వండటం వల్ల ఆహా రం కలుషితమైందా.. పప్పు, తోటకూర కూర కలుషితమైం దా.. వంట చేయడానికి ఉపయోగించిన నీళ్లవల్ల ఇలా జరి గిందా అనేది తేలాల్సి ఉంది. ఇదే అన్నం తిన్న పాఠశాల ప్రధానోపాధ్యారుుని సైతం అస్వస్థతకు గురయ్యూరు. వి ద్యార్థులు, ప్రధానోపాధ్యాయిని నరసాపురంలోని ప్రైవే టు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఎవరికీ ప్రమాదం లేదని, అంతా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. తుప్పు బియ్యం.. చేదెక్కిన అన్నం అన్నం ముద్దను నోట్లో పెట్టుకోగానే కొంతమంది విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయూరు. మరికొందరు వాంతులు చేసుకున్నారు. పాఠశాలలో మొత్తం 184 మంది విద్యార్థులు ఉండగా, 140 మంది తరగతులకు హాజరయ్యూరు. వీరిలో 110మంది పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని ఆటోలు, 108 వాహనంలో నరసాపురంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. పాఠశాలలో వడ్డిస్తున్న అన్నం నాలుగు రోజులుగా తుప్పు వాసన వస్తోందని, నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉంటోందని అస్వస్థతకు గురైన విద్యార్థులు చెప్పారు. దీంతో తినకుండా పారబోస్తున్నామన్నారు. ఆకలిని తట్టుకోలేక బుధవారం అన్నం తిన్నామన్నారు. అన్నం బాగుండటం లేదని వంట చేస్తున్న వారికి చెబుతుంటే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుప్పు పట్టిన బియ్యం వల్ల అన్నం ఇలా ఉంటోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన నరసాపురం చేరుకున్నారు. ఆస్పత్రులకు వెళ్లి విద్యార్థుల పరిస్థితిని తెలుసుకుని తక్షణ వైద్యసేవలందించేందుకు కృషి చేశారు. జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, డీఎంహెచ్వో ఆర్.శంకరరావు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో జె.ఉదయ భాస్కరరావు, తహసిల్దార్ శ్రీపాద హరినాథ్, ఎంపీడీవో శివప్రసాద్యాదవ్, ఎంఈవో ప్రసాద్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రైవేటు వైద్యులు ఇలపకుర్తి ప్రకాష్, ఎం.కోటేశ్వరరావు, కేకే జాన్ తదితరులు చిన్నారులకు వైద్య సేవలందించారు. పలువురు ఆర్ఎంపీలు సైతం వైద్య సేవల్లో పాలు పంచుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, మునిసిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల, వైస్చైర్మన్ పొన్నాల నాగబాబు, టీడీపీ నాయకులు బండారు ప్రతాప్నాయుడు, డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, డాక్టర్ రమేష్, చిట్టవరం సర్పంచ్ పోలిశెట్టి సత్తిబాబు తదితరులు విద్యార్థులను పరామర్శించి, వారి తల్లిదండ్రులను ఓదార్చారు. విచారణకు ఆదేశం విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై డీఈవో ఆర్.నరసింహరావు విచారణకు ఆదేశించారు. విద్యార్థుల పరిస్థితిని పరిశీలించిన ఆయన ప్రధానోపాధ్యాయిని ఆర్.కుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నం చేదుగా ఉందని విద్యార్థులు చెప్పడంతో తాను రుచి చూశానని, ఆ వెంటనే అస్వస్థతకు గురయ్యూనని ప్రధానోపాధ్యాయిని చెప్పారు. తక్షణమే విచారణ నిర్వహించి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంఈవోను డీఈవో ఆదేశించారు. ఇదే అంశంపై మరో మండలస్థాయి అధికారి కూడా విచారణ నిర్వహిస్తారని డీఈవో చెప్పారు. డీఎంహెచ్వో ఆర్.శంకరరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఐసీయూలో 18మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ఇప్పటికే చాలామందిని డిశ్చార్జి చేశారని, మిగిలిన వారిని గురువారం డిశ్చార్జి చేస్తారని తెలిపారు. పప్పు వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని భావిస్తున్నామన్నారు. సాల్మనెల్లా అనే బాక్టీరియా వల్ల ఇటువంటి పరిస్థితి వస్తుందన్నారు. ఆహారాన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు వైద్యులు సత్వర సేవలందించడం వల్లే విద్యార్థులు కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు.