Aler
-
అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం..
సాక్షి, యాదాద్రి: మాజీ మంత్రి,సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ తొలి జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలనుకున్న మోత్కుపల్లికి అవకాశం దక్కకపోవడంతో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. గురువారం యాదగిరిగుట్టలో తన అనుచరులతో సమావేశం అవుతున్నారు. అవమానంగా భావించి దళితబంధు పథకం ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ మోత్కుపల్లి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆరు నెలలుగా కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తున్నారు. టికెట్లు ప్రకటించే సమయంలోనైనా సిట్టింగులకే ఇ స్తున్నామని మాట వరుసకైనా చెప్పలేదన్న ఆవేదన ఆయనలో ఉందని అనుచరులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే నకిరేకల్ టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నకిరేకల్లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. చదవండి: అసంతృప్తులకు గాలం నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు: వైరా: ‘నేను నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు. నాకు టికెట్ రాకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు బరువెక్కిన హృదయంతో ఉన్నారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా’అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. బుధవారం ఆయన వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని, అయితే వృద్ధాప్యంలో ఉన్నందున వద్దన్నానని తెలిపారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, అందరితో కలిసి పని చేస్తానని, వైరా టికెట్ కేటాయించిన మదన్లాల్ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ భగవంతుడి కంటే ఎక్కువని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని చెప్పారు. చీకటి తర్వాత వెలుగు వస్తుందంటూ కేసీఆర్ ఆశీర్వాదం ఎప్పటికైనా తనకు లభిస్తుందని దీమా వ్యక్తం చేశారు. -
Mariyamma Lockup Death : సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక
అడ్డగూడూరు/చౌటుప్పల్: మరియమ్మ లాకప్డెత్ కేసుపై ఏసీపీ శ్యామ్ప్రసాద్ దర్యాప్తులో భాగంగా ఓఎస్డీ మల్లారెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో విచారణ జరిపారు. స్టేషన్లో ఉన్న లాకప్ గదులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. స్టేషన్లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రెండింటిని మరమ్మతు చేయించినా ఒకటే పనిచేస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్ఐ ఉదయ్కిరణ్ తెలిపారు. అలాగే.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం.మణికంఠ శనివారం రాత్రి అడ్డగూడూర్ పోలీస్స్టేషన్లో విచారణ జరిపారు. సీల్డ్ కవర్లో తన నివేదికను హైకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు.. చౌటుప్పల్ పోలీస్ సబ్ డివిజన్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ పోలీస్ కమిషనరేట్కు అటాచ్ చేస్తూ కమిషనర్ మహేశ్ భగవత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు -
పరువు పోయిందని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఆలేరు రూరల్: పరువు పోయిందని మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిగూడెంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన జన్నె భిక్షపతి (37) వ్యవసాయంతో పాటు ట్రాలీ ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆటో మరమ్మతుకు గురవడంతో ఆలేరులోని ఎస్ఎస్ ఆటోమొబైల్ దుకాణంలో విడిభాగాలను ఉద్దెరపై కొన్నాడు. అయితే, కొంత బాకీ తీర్చగా, మిగిలింది తీర్చాలంటూ షాపు నిర్వాహకుడు నాగేందర్.. గురువారం భిక్షపతిని దూషిస్తూ ఆటోను తీసుకెళ్లాడు. దీంతో తన పరువు పోయిందని మనస్తాపానికి గురైన భిక్షపతి.. ఇంటికి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకు న్నాడు. కాగా, మృతదేహాన్ని ఆటోమొబైల్ షాపు ఎదుట ఉంచి మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పరిహారం ఇప్పించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చదవండి: రెండ్రోజుల్లో నిశ్చితార్థం: అప్పు తీర్చేవారు లేరని.. -
ఎన్నికల్లో ఓడిపోవాలని.. ఏం చేశారో తెలుసా?
రాజాపేట (ఆలేరు) : ఓ వార్డు అభ్యర్థి ఇంటిముందు గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్డు, వేపకొమ్మలు పెట్టడంతో భయాందోళనకు గురవుతున్న సంఘటన మండలంలోని రఘునాథపురంలో చోటుచేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బింగి నాగేష్ పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డులో పోటీలో ఉన్నాడు. కాగా రాత్రి ఎన్నికల ప్ర చారం ముగించి శుక్రవారం తెల్లవారుజాము న లేచి చూసేసరికి ఇంటిముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపకొమ్మలు, కోడిగుడ్డుతో పూజలు చేసినట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం కాలనీవాసులకు తెలవడంతోవారంతా ఆందోళన చెందుతున్నారు. -
కొడుకు చదవడం లేదని..
ఆలేరు : కుమారుడు చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆ తల్లి కలత చెందింది.. పలుమార్లు మందలించినా పద్ధతి మార్చుకోలేదు సరికదా.. చదువును మధ్యలోనే ఆపేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు.. దీంతో విసిగివేసారిన ఆ తల్లి చనిపోవాలని నిర్ణయించుకుని టాయిలెట్లు క్లీన్ చేసే ద్రావణాన్ని తాగింది.. అది చూసిన కుమారుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలేరు మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మందనపల్లి గ్రామానికి చెందిన నర్మెట్ట వెంకటేశ్ –చంద్రకళ దంపతుల కుమారుడు బాలు ఇటీవల పాల్టెక్నిక్ డిప్లమా చదువు మధ్యలో మానేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదు. వెంకటేశ్ ఆటోడ్రైవర్, చంద్రకళ ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. వెంకటేశ్ ఉదయం బయటకు వెళ్లగా, చంద్రకళ కొడుకును మందలించింది. కుమారుడి విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన చంద్రకళ టాయిలెట్లు క్లీన్ చేసే ఫినాయిల్ తాగింది. భయాందోళనకు గురైన బాలు కూడా చంద్రకళ వదిలేసిన మిగతా ఫినాయిల్ను తాగాడు. ఇరుగుపొరుగు వారు గమనించి 108 ద్వారా ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరినీ సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని తెలిసింది. -
సెక్స్ రాకెట్ : మరో ఆరుగురికి విముక్తి
సాక్షి, యాదగిరిగుట్ట : వ్యభిచార నిర్వాహకులు, బాలికల అక్రమ రవాణా ముఠా కలిసి సాగిస్తున్న చీకటి వ్యాపారానికి చెక్ పెట్టే దిశగా పోలీస్ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో వ్యభిచార గృహాలపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. వ్యభిచార ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఆరుగురికి విముక్తి కలిగించారు. ఆలేరు రైల్వేస్టేషన్లో వ్యభిచార నిర్వహకుడి అరెస్ట్ చేశారు. రక్షించిన వారిలో ఇద్దరు యువతులు, నలుగురు బాలికలు ఉన్నారు. బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఆత్మకూరు(ఎం) (ఆలేరు) : డీసీఎం బోల్తాపడిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మండల కేంద్రంకు సమీపంలో జేఏసీ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బొమ్మలరామారం మండలం లక్ష్మీతండాకు చెందిన ఇంద్రావత్ పాండు(36) మోత్కూరు నుంచి తన సొంత డీసీఎం ద్వార బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి ఇసుకను తరలిస్తున్నారు. డ్రైవర్, యజమాని అయిన పాండుతో పాటు కూలీలు స్వామి, లక్ష్మణ్, దారవత్ భిక్షం ప్రయాణిస్తున్నారు. ఆత్మకూరు(ఎం) మండలం జేఏసీ ఫంక్షన్ హాల్ సమీపంలో మెయిన్ రోడ్డు పక్క చెట్టును ఢీకొట్టడంతో అదుపు తప్పి పడి పోయింది. ఈ సంఘటనలో పాండు అక్కడికక్కడే మృతిచెందారు. డీసీఎంలో ప్రయాణిస్తున్న స్వామి, లక్ష్మణ్, భిక్షలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుడి భార్య ఇంద్రావత్ శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కనకటి యాదగిరి తెలిపారు. -
గంధమల్ల నిర్మాణానికి సహకరించాలి
తుర్కపల్లి (ఆలేరు) : గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి రైతులు, గ్రామస్తులు సహకరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామాన్ని సందర్శించి రైతులు, గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముంపు గురవుతున్న రైతులు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రాజెక్ట్ కింద నష్టపోతున్న భూ నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్లు నిర్మాణం జరిగితేనే తెలంగాణ అన్ని విధాల సస్యశ్యామలమవుతుందన్నారు. న్యాయమైన డిమాండ్లకు ఓ కమిటీ వేసుకొని తెలియజేస్తే అట్టి నిర్ణయాలను భారీ ప్రాజెక్ట్ల మంత్రి హరిశ్రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం అందే వరకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుమూల వెంకట్రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జూపల్లిలక్ష్మీచంద్రయ్య,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షడు పడాల శ్రీనివాస్,తలారి శ్రీనివాస్,జక్కుల వెంకటేశం,గజం మురళి,బొత్తరాములు,మందల మల్లయ్య,బిచ్చిరెడ్డి,జక్కుల కిష్టయ్య,కడిపె ఇస్తారి,జెల్ల వెంకటేశం,ఎలగల రాజు,కుంభం మల్లేశం గ్రామస్తులు,రైతులు తదితరులు పాల్గొన్నారు. -
కులవృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
ఆలేరు : మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తుల్లో ౖనైపుణ్యం పెంపొందించుకోవాలని చేనేత రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ రాంగోపాల్రావు అన్నారు. ఆలేరులోని చేనేత సహకార సంఘంలో శుక్రవారం చేనేత కార్మికులకు ఆరో విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో చేనేత కార్మికులు నైపుణ్యంతో వస్త్రాలను రకరకాల డిజైన్లతో, నాణ్యంగా తయారుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఏడీ రతన్కుమార్, వీవర్స్ సర్వీస్ సెంటర్ ఏడీ íß మోద్కుమార్, ఏడీఓ వీఎస్ఎన్ రెడ్డి, డిజైనర్ పల్లావిజోషి, సీడీ సౌజన్య, చైర్మన్ చింతకింది వెంకటేశ్, కార్యదర్శి ఎనగందుల రామరుషి పాల్గొన్నారు. -
తపాలా సేవలను విస్త్రృత పరుస్తాం
ఆలేరు : దేశవ్యాప్తంగా తపాలా సేవలను మరింత విస్తృతపరుస్తున్నట్లు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ రమణారెడ్డి అన్నారు. ఆలేరులోని టీఎన్జీఓ భవనంలో ఆలేరు, యాదగిరిగుట్ట, రఘునాథపురం పరిధిలోని సిబ్బందికి పోస్టల్ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ల మాదిరిగానే ఇక నుంచి తపాలా శాఖల ఆధ్వర్యంలో అన్ని సేవలు లభ్యమవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఏఎస్పీఓ శ్రీనివాస్, ఆలేర్ బ్రాంచ్ మేనేజర్ రాములు, 3 మండలాల పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
ఆలేరు : నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలేరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో 36 గంటల పాటు బుధవారం నిరహార దీక్ష చేపట్టారు. దీక్షలో కూర్చున్న టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణికి ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజాభీష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చెబుతున్న కేసీఆర్.. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాల్సిందేనన్నారు. దీక్షకు సీపీఐ నాయకులు గోద శ్రీరాములు, చెక్క వెంకటేశం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో దడిగె ఇస్తారి, ఆరె రాములు, చామకూర అమరేందర్రెడ్డి, ఎండీ సలీం, మధుసూదన్రెడ్డి, గ్యాదపాక దానయ్య, జెట్ట సిద్దులు, సూదగాని రాజయ్య, భోగ సంతోష్కుమార్, ఎండి రఫీ, జూకంటి పెద్దఉప్పలయ్య, పల్లెపాటి బాలయ్య, బండ శ్రీను పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
ఆలేరు : సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఆలేరులోని రైల్వేగేట్ వద్ద మంగళవారం చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనానరు. కొత్త జిల్లాల ఏర్పాటులో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలకు, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాజకీయాలకు తావిస్తూ సీఎం కేసీఆర్ ఇష్టానుసరంగా జిల్లాలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలను, అన్ని పార్టీలను భాగస్వామ్యులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు దొంతిరి శ్రీధర్రెడ్డి, నాయకులు కావటి సిద్ధిలింగం, పులిపలుపుల మహేష్, భోగ శ్రీను, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, అల్వాల సిద్ధులు, కుండె సంపత్, కూళ్ల సిద్ధులు, దయ్యాల సంపత్, బడుగు జహంగీర్ పాల్గొన్నారు. -
ప్రజలను మోసగిస్తున్న టీఆర్ఎస్ సర్కార్
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. ఆలేరులోని ఇందిరాకాంగ్రెస్ భవనంలో ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిడ్మానేరు ప్రాజెక్టు, డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో అవగాహన లేక హామీ ఇచ్చానని ఇటీవల సీఎం కేసీఆర్ పేర్కొనడం ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గతేడాది పంటలను నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.972 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే ఆ నిధులను ప్రభుత్వం వేరే పనులకు మళ్లించడం సిగ్గుచేటన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను గ్రామస్థాయి నుంచి ఎండగడుతామని హెచ్చరించారు. సమావేశంలో జనగాం ఉపేందర్రెడ్డి, జూకంటి రవీందర్, కొలుపుల హరినాథ్, ఎంఎస్ విజయ్కుమార్, నీలం పద్మ, ఎండీ.జైనోద్దీన్, కె.సాగర్రెడ్డి, ఎంఏ.ఎజాజ్, జూకంటి ఉప్పలయ్య, నీలం వెంకటస్వామి, ఇల్లెందుల మల్లేశ్, గ్యాదపాక నాగరాజు, సిరిగిరి సాగర్, భీజని మధు పాల్గొన్నారు. -
బహిరంగ సభను జయప్రదం చేయాలి
ఆలేరు : నవంబర్ 13న హైదరాబాద్లో జరిగే మాదిగ మహాశక్తి బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆలేరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు మాదిగ జేఏసీ పక్షాన ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నారు. మాదిగ మహాశక్తి బహిరంగ సభకు మాదిగ యువత పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో క్యాసగల్ల శ్రీకాంత్, క్యాసగల్ల యాదగిరి, కర్రె అశోక్, భిక్షపతి, ఆంజనేయులు, సంతోష్ పాల్గొన్నారు. -
ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి
ఆలేరు : అన్ని అర్హతలున్న ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీ డీపీ, సీపీఐ ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ తీసుకోకపోవడం బాధకరమన్నారు. అలాగే ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను జనగామ డివిజన్లో కలపడం ఆశాస్త్రీయమన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలను అవలంబిస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, గోద శ్రీరాములు, ఆరె రాములు, చామకూర అమరేందర్రెడ్డి, చెక్క వెంకటేశ్, ఎండి సలీం, గుంటి మధుసూదన్రెడ్డి, జెట్ట సిద్దులు, గ్యాదపాక దానయ్య, సూదగాని రాజయ్య, గిరిరాజు వెంకటయ్య,జశ్వంత్, బాలయ్య, జెట్ట సిద్దులు, బండ శ్రీను, జూకంటి పెద్దఉప్పలయ్య, ఎండి రఫీ, గొట్టిపాముల శ్రీను, భోగ సంతోష్ పాల్గొన్నారు. -
అభివృద్ధిని అడ్డుకోవడం తగదు
ఆలేరు : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోవడం తగదని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతలు అన్నారు. ఆలేరులో గత 40 రోజులుగా మూసివేసిన రైల్వేగేట్ను మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ గొంగిడి సునీతలను అడ్డుకునేందుకు విపక్ష నాయకులు ప్రయత్నించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిని స్వాగతించాల్సింది పోయి.. అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైల్వేగేట్ మూసివేతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కేసీఆర్, రైల్వేమంత్రి సురేష్ప్రభు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, రైల్వేజీఎం గుప్తాలను కలిసి వివరించినట్లు పేర్కొన్నారు. గత 40 రోజులుగా నిరంతరం గేట్ను తెరిపించేందుకు తమ శాయశక్తులా కృషి చేశామన్నారు. అలాVó ఆర్యుబీ నిర్మాణానికి రూ. 6.50కోట్లు మంజూరయ్యాయని, ఇందులో రాష్ట్రం వాటా 5.25 కోట్లు, రైల్వేశాఖ 1.25 కోట్లు నిధులు విడుదలయ్యేలా ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. కొలనుపాక బీటీరోడ్డుకు రూ. 1.65కోట్లు, పోచ్చమ్మవాడ ప్రధాన రహదారిపై సైడ్డ్రైనేజీల నిర్మాణానికి రూ. 10 లక్షలు, ఆర్వోబీ వెంట సర్వీస్రోడ్లకు రూ. 30 లక్షలు నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. ఆలేరు అభివృద్ధే «ధ్యేయంగా ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మార్కెట్ చైర్మన్ కాలె సుమలత, ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్, నాయకులు ఆకవరం మోహన్రావు, పోరెడ్డి శ్రీనివాస్, చింతకింది మురళి, సిరమైన వెంకటేష్, మొరిగాడి ఇందిరా, గుత్తా శమంతారెడ్డి, పేరపు సిద్దులు, జల్లి నర్సింహులు, గంపల విజయ్, దూడం మధు, ఎగ్గిడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న విపక్షాలు ఆలేరులో రైల్వేగేట్ను ప్రారంభించేందుకు వస్తున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ గొంగిడి సునీతలను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ఎమ్మెల్యే గో బ్యాక్ నినాదాలు ఇచ్చారు. ఒక వైపు ఎమ్మెల్యే గోబ్యాక్ అంటుంటే.. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జిందాబాద్ అంటు నినాదాలు ఇచ్చారు. యాదగిరిగుట్ట సీఐ రఘువీర్రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష నాయకులను అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆధ్వర్యంలో కొద్దిసేపు రైల్వేగేట్ వద్ద బైఠాయించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు చామకూర అమరేందర్రెడ్డి, ఎండి సలీం, కె సాగర్రెడ్డి, తునికి దశరధ, ఆరె రాములు, ఎంఎ ఎక్బాల్, ఎంఎ ఎజాజ్, జూకంటి ఉప్పలయ్య, వడ్డెమాన్ శ్రీనివాస్, మంగ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
దళితులను నిర్లక్ష్యం చేస్తున్నారు
ఆలేరు : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70ఏళ్లు కావస్తున్నా నేటికీ దళితులను చిన్నచూపు చూడడం తగదని టీ–ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగచైతన్య పాదయాత్ర సోమవారం ఆలేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పులు కుట్టేవారికి, డప్పులు కొట్టేవారికి రూ. 2వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులను దారిమళ్లిస్తున్నారని, నేత, గీత, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, సమాజసేవ చేస్తున్న చెప్పులు కుట్టే, డప్పులు కొట్టేవారికి పెన్షన్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నవంబర్ 18లోపు ప్రభుత్వం స్పందించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీ–ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యాతాకులు భాస్కర్, కందుల రామన్, గ్యార నరేష్, మాటూరు నాగరాజు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
ఆలేరు : ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆలేరులో శనివారం జరిగిన టీడీపీ మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని.. ఇటీవల యాదాద్రి జిల్లా సాధన ప్రజల సహకరంతోనే సాధ్యమైందన్నారు. అలాగే ఆలేరు రైల్వేగేట్ విషయంలో 5వేల మందితో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. తాను ఎక్కడ ఉన్న ఆలేరు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. అలాగే యాదాద్రి జిల్లా ఏర్పాటైనందున యాదగిరిగుట్టలో అక్టోబర్ 2న అభినందన సభను ఏర్పాటు చేస్తున్నామని.. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. అలాగే టీడీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేకు ఇక్కడి ప్రజల బాగోగులు పట్టడం లేదన్నారు. కార్యక్రమంలో అమరేందర్రెడ్డి, ఇస్తారి, రాములు, సలీం, దానయ్య, బాలయ్య, మల్లేశం, మల్లేశం, సంతోష్, శ్రీను, పెద్దఉప్పలయ్య, రాజయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
ఆలేరు : ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను జనగామ రెవెన్యూ డివిజన్లో కలపాలని నిర్ణయించడం సరైందికాదని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు దొంతిరి శ్రీధర్రెడ్డి అన్నారు. ఆలేరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగామలో కలిసేందుకు ఈ మూడు మండలాల ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఆలేరు నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉందని, ఆలేరు ముక్కలు చెక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై ఉందన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తన నిర్ణయాన్ని తీసుకోకుంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. అలాగే ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించేందుకు అన్ని అర్హతలున్నాయన్నారు. ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలన్నారు. ఈసమావేశంలో తునికి దశరధ, పులిపలుపుల మహేష్, పసుపునూరి వీరేశం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, పగడాల రాంబాబు, మైదం భాస్కర్, అల్వాల సిద్దులు, దయ్యాల సంపత్, పత్తి రాములు తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ర్యాలీ ప్రారంభం
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు తలొగ్గి పాలన కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు అన్నారు. కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ప్రజల స్వాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తున్నారని విమర్శించారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా జరుపుకోవాలన్న తెలంగాణ ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. చరిత్రను మరిపించేందుకు కుట్ర చేస్తుందన్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారింగా నిర్వహించే వరకు తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తునికి దశర«థ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఆలేరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆలేరులో తిరంగయాత్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. నిజాం నాటి ఉద్యమకారుల త్యాగాలు, చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని ఎన్నికలకు ముందు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. తీరా పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 17న విమోచన దినోత్సవ వేడుకలకు హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు జాతీయ బీజేపీ అధ్యక్షులు అమిత్షా హాజరవుతున్నందున నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. కాసం వెంకటేశ్వర్లు, తునికి దశరధ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఆలేరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆలేరులో తిరంగయాత్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. నిజాం నాటి ఉద్యమకారుల త్యాగాలు, చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని ఎన్నికలకు ముందు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. తీరా పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 17న విమోచన దినోత్సవ వేడుకలకు హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు జాతీయ బీజేపీ అధ్యక్షులు అమిత్షా హాజరవుతున్నందున నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. కాసం వెంకటేశ్వర్లు, తునికి దశరధ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతోనే మానసికోల్లాసం
ఆలేరు : బాలబాలికల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని డిప్యూటీæడీఈఓ మదన్మోహన్ అన్నారు. ఆలేరులో జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో తునికి సత్తమ్మ స్మారకార్థం భువనగిరి డివిజన్ స్థాయి కబడ్డీ (అండర్–14) బాలబాలికల విభాగంలో శుక్రవారం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఆటలు ఆడితే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని చెప్పారు. ఆటలకు పాఠశాలలే ప్రధాన వేదికలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ, హెచ్ఎంలు ఎలిజ»ñ త్, ఉదయశ్రీ, పీఈటీలు తునికి సాగర్, పూల నాగయ్య, తునికి చంద్రశేఖర్, గడసంతల మధుసూదన్, తునికి రవి, సౌజన్య, ప్రేమలత, వల్లాల ప్రభ, రెడ్డప్పరెడ్డి, పూసలోజు కృష్ణ, డా. స్టాలిన్బాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
రైల్వేగేట్ను తెరిచేవరకూ ఉద్యమం
ఆలేరు : ఆలేరులోని రైల్వేగేట్ను తెరిచేవరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆలేరులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గేట్ మూసివేతతో ఆలేరు రెండు భాగాలుగా విడిపోయిందన్నారు. గేట్ అవతల వైపు ఉన్న ప్రజలకు ఇబ్బందులు కల్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిర్మించిన ఆర్వోబీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని.. ఆర్యూబీ నిర్మించే వరకూ రైల్వేగేట్ను తెరిపించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను భువనగిరిలోనే యథావిధిగా కొనసాగించాలన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్రెడ్డి, నీలం పద్మ, పులిపలుపుల మహేష్, జెట్ట సిద్దులు, కందగట్ల నరేందర్, ఎనగందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలేరును డివిజన్గా మార్చాలని రాస్తారోకో
ఆలేరు : పట్టణంలో మూసివేసిన రైల్వేగేట్ను తెరిపించాలని, ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ మేరకు శనివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆందోళనకారులు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైల్వేగేట్ను తెరిపించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే విషయం తెలుసుకున్న సీఐ రఘువీర్రెడ్డి, పలువురు ఎస్సైలు తమ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్రెడ్డి, నీలం పద్మ, కొలుపుల హరినాథ్, కె సాగర్రెడ్డి, మంగ నర్సింహులు, జూకంటి ఉప్పలయ్య, ఎక్బాల్, ఎజాజ్, గోద శ్రీరాములు, కావటి సిద్ధిలింగం, తునికి దశరథ, జంపాల శ్రీనివాస్, పసుపునూరి విరేశం, ఐడియా శ్రీనివాస్, రాచకొండ జనార్దన్, చామకూర అమరేందర్రెడ్డి, గాదపాక దానయ్య, భీజని మధు, అప్సర్ పాల్గొన్నారు. సీఐతో వాగ్వాదం... రాస్తారోకో సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దిష్టిబొమ్మను దహనం చేసేందుకు అఖిలపక్ష నాయకులు ప్రయత్నించగా వారిని యాదగిరిగుట్ట సీఐ అడ్డుకున్నారు. దీంతో కొందరు నాయకులు రహదారిపైకి దిష్టిబొమ్మను తీసుకువచ్చి దహనం చేస్తుండగా అడ్డుకోబోయారు. ఈ క్రమంలో ఎం.డి సలీం, చెక్క వెంకటేశ్, తునికి దశరథ అనే కార్యకర్తలు కిందపడిపోవడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులు సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, గాయపడిన నాయకులను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పరామర్శించారు. -
అభివృద్ధికి నోచుకోని కొలనుపాక
ఆలేరు : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మండలంలోని కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కొలనుపాకలో దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద జైనదేవాలయం ఉంది. ప్రాచీన చరిత్ర కలిగిన సోమేశ్వర, వీరనారాయణ ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ గ్రామం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. మంత్రి దత్తాత్రేయ గ్రామాన్ని దత్తత తీసుకున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. గ్రామం సంపూర్ణంగా అభివృద్ధి చెందేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు ఈ పథకం ఉద్దేశం. కొలనుపాక గ్రామ జనాభా 9168 ఉంది. గృహాలు 2123 ఉన్నాయి. ఈ గ్రామ పరిధిలో మూడు ఆవాస గ్రామాలున్నాయి. గ్రామంలో ప్రధానంగా డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, రక్షితమైన నీటిని అందించాల్సి ఉంది. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు 268 కుటుంబాలకు లేవు. గ్రామంలో రెండు ఐబీ చెరువులు, 40కుంటలు ఉన్నాయి. పీన చెరువును అభివృద్ధి చేస్తే గ్రామంలో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. దీంతో నీటిఎద్దడి ఉండదు. అలాగే గ్రామంలో వాటర్ట్యాంక్ శిథిలమైంది. గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించాల్సిన అవసరం ఉంది. కొలనుపాక–బైరాంనగర్, కొలనుపాక–గూండ్లగూడెం, కొలనుపాక–రాఘవాపురం గ్రామాల మధ్య వాగులపై చెక్ డ్యాంలు నిర్మించాల్సి ఉంది. అవి నిర్మిస్తే పంట పొలాలు సస్యశామలమవుతాయి. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాల్సి ఉంది. గ్రామంలోని హైస్కూల్ను డిజిటలైజేషన్ చేస్తానని హామీ ఇచ్చిన ప్పటికీ నేరవేరలేదు. గ్రామంలో నాలుగు వైపులా çÔæ్మశానవాటికలు ఉన్నప్పటికీ, అక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వసూలు కాని పన్నులు .. గ్రామపంచాయితీలు అభివృద్ధి చెందాలంటే పన్నులే ఆధారం. ప్రభుత్వం అందజేసే నిధులు అరకొర మాత్రమే. దీంతో గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు. అయితే కొలనుపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి, నల్ల పన్నులు రూ.లక్షల్లో వసూలు కావాల్సి ఉంది. పన్నుల ఎగవేతదారుల సం«ఖ్య పెరిగిపోతుంది. ఆరోగ్య ఉపకేంద్రాలకు పక్కా భవనాలు లేవు. శ్మశాన వాటికల్లో నీటి సౌకర్యం లేక దహన సంస్కారాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అనేక మార్లు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నాయకులు పేర్కొన్న హామీలే తప్ప అమలు లేదు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నా ప్రజలకు ఒరిగిందేమిలేదు. పేరుకే గ్రామజ్యోతి .. మౌలిక వసతులు కొరవడి అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు పంచేందుకు ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం ముందుకు కదలడం లేదు. పల్లెల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చి వేస్తుందనుకున్న గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టి నెలలు గడుస్తున్నా అభివృద్ధి అంతంత మాత్రమే. ఆలేరు నియోజకవర్గంలో 7 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దత్తత తీసుకున్నారు. అయితే అ«ధికారుల నిర్లక్ష్యం, ప్రజల భాగస్వామ్యం కొరవడడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. ఆలేరు మండలంలోని గొలనుకొండలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన నెరవేరలేదు. సీసీ రోడ్లు మంజూరు కాలేదు. పారిశుద్ధ్యపు చర్యలు అంతంత మాత్రమే. కేవలం చెత్తకుండీల ఏర్పాటు.. గ్రామంలో ఇటీవల దత్తత కింద అక్కడక్కడ చెత్తకుండీలను మాత్రమే ఏర్పాటు చేశారు. నిధులు కేటాయించాలి .. సొంటెం సోములు, కొలనుపాక. కొలనుపాక గ్రామం సంవత్సరాల తరబడి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. మంత్రి దత్తాత్రేయ దత్తత తీసుకోవడంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కాని ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యం. పాలకుల మాటలే తప్పా.. ఆచరణలో మాత్రం ఒరిగిందేమిలేదు. చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంది. -
పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడొద్దు
ఆలేరు : యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడవద్దని తెలంగాణ ధర్మ ప్రసారక్ సహ ప్రముఖ్ డీఎస్ మూర్తి, శ్రీశ్రీశ్రీ త్రిశూల్స్వామిజీ అన్నారు. ఆలేరులోని ఎస్సీ వాడలో విశ్వ హిందూ పరిషత్ ఆలేరు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాముహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కృతి గొప్పదని, హిందూ అంటే ఒక ధర్మం, జీవన విధానం అని చెప్పారు. అన్ని మతాలను, ఆచరాలను, సంప్రదాయాలను సమానంగా ఆచరించేదే హిందూ ధర్మమని పేర్కొన్నారు. అతి పురాతన, సనాతన ధర్మం, వేలాది సంవత్సరాలుగా ప్రపంచానికే జ్ఞానాన్ని అందించిన దేశం భారతదేశమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బండిరాజుల శంకర్, తోట భానుప్రసాద్, పోతంశెట్టి మీరాబాయి, కంతుల శంకర్, మొరిగాడి ప్రభు, రఘుపతి, అశోక్, రాంచందర్ పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
ఆలేరు : చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సూచించారు. ఆలేరులో ఆదివారం బస్టాండ్ వద్ద చిన్నపిల్లల ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి ఆధునిక జీవితం, జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. చిన్నపిల్లల బరువు విషయంలో తల్లిదండ్రులు తప్పక బాధ్యత తీసుకోవాలని కోరారు. పిల్లలు క్రీడలు, వ్యాయామ రంగాల్లో పాలుపంచుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ పరమేశ్వర్, రాజు, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్, చింతకింది మురళి, బింగి రవి, ఆకవరం మోహన్రావు, ఉపేందర్, దూడం మధు పాల్గొన్నారు. -
రైల్వేగేట్ తెరవాలని రాస్తారోకో
ఆలేరు : రైల్వేగేట్ను తెరిపించాలని కోరుతూ ఆదివారం ఆలేరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గింది. ఈ కార్యక్రమంలో తునికి దశర«థ, ఎండీ సలీం, చెక్క వెంకటేశం, కుమార్, సిద్ధులు, నాగరాజు పాల్గొన్నారు. కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు .. రైల్వేగేట్ను తెరిపించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. గుజ్జ అశోక్, కూళ్ల సిద్ధులు, అఫ్జల్ తదితరులు దీక్షలో పాల్గొనగా మంగ నర్సింహులు, తునికి దశర«థ, పులిపలుపుల మహేష్, ఎంఎ ఎక్బాల్, ఎనగందుల సురేష్, చామకూర అమరేందర్రెడ్డి, జూకంటి పెద్దఉప్పలయ్య, సలీం పాల్గొన్నారు. -
అభివృద్ధిని అడ్డుకుంటే గుణ పాఠం తప్పదు
ఆలేరు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే గుణపాఠం తప్పదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత హెచ్చరించారు. ఆలేరులో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించేవాళ్లమని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. తుమ్మిyì హెట్టి ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటే ఆ పత్రాలను బయటపెట్టాలని కోరారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కొరవడిందని విమర్శించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్నదే ప్రభ్యుత ధ్యేయమన్నారు. అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తే ప్రజలు ఛీకొడతారన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్, వైస్ ఎంపీపీ కొరకొప్పుల కిష్టయ్య, ఆకవరం మోహన్రావు, మొగులగాని మల్లేశం, చింతకింది మురళి, బెంజారం రవి, బాకీ ఆనందం, మొరిగాడి వెంకటేశ్, కర్రె అశోక్, దూడం మధు, ముస్తాఫా, దానియల్, గిరికుమార్, జల్లి నర్సింహులు, గంపల విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తుందని డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. ఆలేరులో మంగళవారం జరిగిన మండల కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆశలు ఆడియాసలయ్యాయని విమర్శించారు. పుష్కరాలు, పండుగలు, వేడుకల పేరిట ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చి రాష్ట్రాన్ని దివాల తీస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష కనబరుస్తుందని, పంటలు ఎండిపోతున్న ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటన్నారు. త్వరలో రైతు సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదన్నారు. డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొలుపుల హరినా«ద్, కె సాగర్రెడ్డి, నీలం పద్మ, ఎండి జైనోద్దీన్, ఎగ్గిడి యాదగిరి, ఎంఎస్ విజయ్కుమార్, జంపాల దశరధ, పిల్లలమర్రి శంకరయ్య, ఎంఎ ఎజాజ్, నీలం వెంకటస్వామి, కందుల శంకర్, జూకంటి ఉప్పలయ్య, ఎలగల కృష్ణ, దూసరి విజయ, బేతి రాములు, బండి నాగయ్య, ముదిగొండ శ్రీకాంత్, పత్తి వెంకటేశ్, పల్లె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని యువకుడి శవం లభ్యం
ఆలేరు: ఆలేరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఆదివారం గుర్తు తెలియన 30 ఏళ్ల వయస్సు యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి ఫిడ్స్ వచ్చి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహం ∙వద్ద ఎలాంటి ఆదారాలు లభించలేదు. మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రైల్వే కానిస్టేబుల్ రవి తెలిపారు. -
గేట్ తెరిచాకే ఆర్యూబీ పనులు చేపట్టాలి
ఆలేరు : యథావిధిగా రైల్వేగేట్ను తెరిచాకే రైల్వే అండర్ బ్రిడ్జ్(ఆర్యూబీ) పనులను చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక ఇందిరాకాంగ్రెస్ భవనంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేగేట్ మూసివేతతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన బైపాస్ రోడ్డు పనులు చేపడుతూ ఆర్యూబీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు అయ్యే వరకు రైల్వేగేట్ను కొనసాగించాలని కోరారు. వాస్తవ జల దృశ్యం పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రదర్శనలో వాస్తవాలు, విశ్లేషణలు లేవని తెలంగాణ ప్రభుత్వ నీటి పారుదల సలహాదారు విద్యాసాగర్రావు పేర్కొనడం హాస్యస్పదమన్నారు. ప్రజలను మభ్యపెడుతూ సీఎం కేసీఆర్ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో జనగాం ఉపేందర్రెడ్డి, కొలుపుల హరినాథ్, నీలం పద్మ, కె సాగర్రెడ్డి, ఎండీ.జైనోద్దీన్, నీలం వెంకటస్వామి, ఎలగల కృష్ణ, ఎంఏ.ఎజాజ్, పుట్ట మల్లేశం, ముదిగొండ శ్రీకాంత్, సీస రాజేష్గౌడ్, ఎగ్గిడి శ్రీశైలం పాల్గొన్నారు. -
గేట్ తెరిపించాలని రైల్వేజీఎంకు వినతి
ఆలేరు : ఆలేరులో రైల్వేగేట్ మూసివేతతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణ మే తెరిపించాలని కోరుతూ భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, పలు పార్టీల నాయకులు బుధవారం దక్షిణ మ«ధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తాను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జీఎం హామీ ఇచ్చారన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యుబీ) ఏర్పాటుకు, ఆర్యుబీ ఏర్పాటయ్యే వరకు రైల్వేగేట్ తెరిపేంచేందుకు రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్తామని కూడా హామీ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఇన్చార్జ్ సర్పంచ్ దాసి సంతోష్, నాయకులు ఎండి జైనొద్దీన్, తునికి దశరథl, మొరిగాడి చంద్రశేఖర్, దానియల్, గంపల విజయ్, గుత్తా శమంతారెడ్డి తదితరులు ఉన్నారు. -
రైల్వే గేట్ కోసం ఉద్యమిస్తాం
ఆలేరు: ఆలేరులోని రైల్వేగేట్ను య«థావిధిగా కొనసాగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఆలేరులో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆలేరులో రైల్వేగేట్ను మూసివేయడంతో సుమారు 20వేల మంది ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్వోబీ మీదుగా గేట్ ఇటువైపుకు రావాలంటే 2కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, చామకూర అమరేందర్రెడ్డి, దడిగె ఇస్తారి, ఎండి జైనోద్దీన్, తునికి దశరధ, మొరిగాడి చంద్రశేఖర్, గ్యాదపాక దానయ్య, ఆలేటి ఆంజయ్య, జెట్ట సిద్దులు, మోర్తల సాంబిరెడ్డి, భోగ సంతోష్, గొట్టిపాముల శ్రీనివాస్, సిరమైన కృష్ణమూర్తి, ఎంఎ ఎక్బాల్, ఇక్కుర్తి రాజయ్య తదితరులు పాల్గొన్నారు, -
పత్తాలేని ఆనాటి సందడి
ఆలేరు : ఆటలు ఆరోగ్యాన్ని పంచుతాయి.. ఆయుష్ను కూడా పెంచుతాయి. ఆట అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడు క్రీడలు ఆడుతుంటే వాటిపై విద్యార్థి దశలో వాటిపై పట్టు పెరుగుతుంది. దురదృష్టవశాత్తు పాఠశాలల్లో ఎక్కడ నిత్యం క్రీడలు ఆడిపించడం లేదు. అయితే ఒకప్పుడు గణతంత్ర, పంద్రాగస్టు వేడుకలు వస్తున్నాయంటే పది రోజుల ముందు నుంచే ప్రతి పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించే వారు. అప్పట్లో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసే వారు. నేడు ఆ సందడి కరువైంది. ఫలితంగా ఆటలకు నోచుకోక విద్యార్థులు నిరాశ, నిసృహలకు లోనవుతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో అంతే సంగతులు. ప్రైవేట్ పాఠశాలల్లో వార్షికోత్సవాల సందర్భంగా తూతూమంత్రంగా క్రీడలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో మొక్కుబడిగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. బాల్యంలో ఆటలే చక్కని ఆరోగ్యం. ఈ వయసులో పిల్లలు చదువుతో పాటు కనీసం గంట సేపు ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. ఖో–ఖో, వాలీబాల్, పుట్బాల్, సాఫ్ట్బాల్, స్పీడ్బాల్, టెన్నికాయిట్ తదితర ఆటలు ఆడేలా చూడాలి. క్రీడలతో పాటు యోగా, «ధ్యానం సాధన చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించగల శక్తి వస్తుంది. కొన్ని పాఠశాలల్లో మైదానాలుంటే పీఈటీలు ఉండడం లేదు. పీఈటీలు ఉంటే మైదానాలు ఉండడం లేదు. క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం .. పిల్లలు తీసుకునే ఆహారం ద్వారా లభించే కేలరీలు, ఖర్చు చేసే కేలరీలు సమానంగా ఉన్నప్పుడే శరీరం సమతుల్యంగా, నాజూకుగా ఉంటుంది. విద్యార్థి దశ నుంచే అలవడితే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎముకలు పటిష్టంగా తయారు అవ్వడమే కాకుండా ఆక్సిజన్ శరీర భాగాలన్నింటికీ సమానంగా అందుతుంది. దీనివల్ల జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఆటలు ఆడేటప్పుడు శరీరం, మనసు ఒకేలా స్పందించి చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులు, ప్రతిభావంతులుగా తయారవ్వాలంటే ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. -
ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేయాలి
ఆలేరు : ప్రభుత్వం ప్రకటించిన 3, 4వ విడతల రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. ఆలేరులో శనివారం జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలో రైతులు పెట్టిన పెట్టుబడులకు దిగుబడి రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంగ నర్సింహులు, వడ్డెమాన్ శ్రీనివాస్లు, దుంపల రాంరెడ్డి, నూకల భాస్కర్రెడ్డి, ఎలగల బాలయ్య, పిక్క గణేష్, ఎంఎ ఎక్బాల్, దూసరి సత్తయ్య పాల్గొన్నారు. -
రూ. 1024 కోట్లతో గోదాంల నిర్మాణం
ఆలేరు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1024 కోట్లతో 330 గోదాంల నిర్మాణం చేపడుతున్నామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శరత్ తెలిపారు. ఆలేరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 95 శాతం గోదాంల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 20 రోజుల్లో నిర్మాణంలో ఉన్న గోదాంలు పూర్తవుతాయని చెప్పారు. రైతులు రైతుబం«ధు పథకం కింద ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు, ఎరువులు, పీడీఎస్ బియాన్ని నిల్వ చేసుకునేందుకు ఈ గోదాంలు ఉపయోగపడుతాయని తెలిపారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 180 మార్కెట్ యార్డుల్లో రూ. 285 కోట్లతో స్వాగత తోరణాలు, ఫ్లాట్ఫామ్స్, కవర్ షెyŠ లు నిర్మిస్తున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతేడాది నాలుగున్నర లక్షల మొక్కలు నాటామన్నారు. ఇందులో 80 శాతం వరకు మొక్కలను కాపాడగలిగామని చెప్పారు. ఈ ఏడాది ఎనిమిదిన్నర లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిని ఇటీవల నలుగురిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో చైర్మన్ కాలె సుమలత, వైస్ చైర్మన్ నాయిని రామచంద్రారెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
‘మల్లన్నసాగర్’ను అడ్డుకోవడం అవివేకం
ఆలేరు : తెలంగాణలోని 6, 7 జిల్లాలు సస్యశ్యామలం అయ్యేందుకు నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూడడం అవివేకమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకంట్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. ఆలేరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంతో ఉన్నత ఆశయంతో సీఎం కేసీఆర్ తెలంగాణలోని బీడు భూములకు నీరందించేందుకు చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజñ క్టు చేపడితే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోతున్న వారిని మార్కెట్ రేటు ప్రకారం పరిహార ం చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి ఆలోచిస్తుందన్నారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా ఏపీ లబ్ధిపొందితే తెలంగాణలోని ఎన్నో గ్రామాలు మునిగినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అప్పుడు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి తీరుతుందని చెప్పారు. నల్గొండ జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీరును అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల కాలంలో జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని.. వ్యవసాయ బావుల వద్ద రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇంటి దగ్గర కూడా విద్యుత్ వినియోగదారులు నిర్లక్ష్యంగా ఉండరాదని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీపీ కాసగల్ల అనసూర్య, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఆకవరం మోహన్రావు, నాయిని రామచంద్రారెడ్డి, మొరిగాడి ఇందిరా, దూడం మధు, ముస్తాఫా, దానియల్, మొగులగాని మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
కొలనుపాక(ఆలేరు) వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని ఆలేరు, ఆత్మకూర్(ఎం) మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన కొందరు భవన నిర్మాణ కార్మికులైన ఆరుగురు మహిళలు రాజాపేట మండలం సోమారంలో స్లాబ్ వేసేందుకు పని నిమిత్తం ట్రాలీ ఆటోలో బయల్దేరారు. అయితే ట్రాలీ ఆటోకు మిల్లర్ను కట్టారు. డ్రైవర్ ఆటోను వేగంగా నడుపుతుండడంతో కొలనుపాకలోని జైనదేవాలయం వద్ద మిల్లర్ ఊడిపోయి ఓ స్తంభానికి తాకి ఆటోకు తగిలింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పొల్కంపల్లి లక్ష్మినర్సమ్మ(51) అక్కడికక్కడే మరణించింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో రేగు సరిత తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా మారింది. మరో ఇద్దరు ఎడవల్లి లక్ష్మి, కాలె వినోదలకు కూడా గాయపడ్డారు. రేగు సరితను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మిగత ఇద్దరిని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నర్సింహులు తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన విప్ మండలంలోని కొలనుపాకలో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన పొల్కంపల్లి లక్ష్మినర్సమ్మ కుటుంబాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పరామర్శించారు. ఆమె వెంట ఎంపీపీ గడ్డమీది స్వప్న, కర్రె వెంకటయ్య తదితరులున్నారు. బైక్, టాటాఎస్ ఢీకొట్టుకోవడంతో.. ఆత్మకూరు(ఎం): తుర్కల రేపాక గ్రామానికి చెందిన మూల రాజు(23) వదిన సంతోష హైదరాబాద్లో ఉంటుంది. శనివారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి రావడం కోసం కప్రాయపెల్లి స్టేజీ వద్ద బస్సు దిగింది. దీంతో వదినను తీసుకరావడానికి రాజు బైక్పై తుర్కల రేపాక నుంచి కప్రాయపెల్లి స్టేజీ వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి బైక్పై తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న టాటాఏస్ వాహనం ఢీకొనడంతో రాజు, సంతోషకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజు మృతిచెందాడు. గ్రామ సర్పంచ్ జక్కు ఉర్మిళాసోంరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యాలయాల్లో మళ్లీ ఎన్నికల సందడి
ఆలేరు : ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీంట్లోభాగంగా పాఠశాలల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే రెండు సంవత్సరాలుగా నూతన పాఠశాల యాజమాన్య కమిటీలను నియమించలేదు. పాత సంఘాలే కొనసాగాయి. అయితే నూతన యాజమాన్య కమిటీల ఎన్నుకునేందుకు ప్రభత్వం నిర్ణయించింది. దీంతో ఆగస్టు 1 నుంచి 10 వరకు కమిటీల ఎన్నికలు జరిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ పాఠశాలల్లో మినహా అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాయాజమాన్య కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కమిటీల ఎంపిక విధానం ఇలా.. – పాఠశాల యాజమాన్య కమిటీలకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. – పోటీకి నిలబడే వ్యక్తుల పిల్లలు ఆ పాఠశాలల విద్యార్థులై ఉండాలి. – ప్రాథమిక పాఠశాలల్లో 30 మందితో మాత్రమే కమిటీ ఉండాలి. – ప్రాథమికోన్నత పాఠశాలల్లో (1 నుంచి 7వ తరగతి వరకు) 42 మందితో ఉండాలి. – ఉన్నత పాఠశాలల్లో 30 మంది సభ్యులుండాలి. – పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకంటే తక్కువ ఉంటే ప్రతి ఒక్కరి తల్లి లేడా తండ్రి కమిటీలో సభ్యులే అవుతారు. – పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్యలో 50 శాతం మంది తల్లిదండ్రులు హాజరైన పక్షంలోనే ఎన్నికలు నిర్వహించాలి. – ఈ కమిటీలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్గా ఉంటారు. ఇవీ.. బాధ్యతలు.. పాఠశాలల్లో పిల్లలను చేర్పించడం, మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరు, ప్రభుత్వ నిధుల వినియోగం, ఉపాధ్యాయుల గైర్హాజరు తదితర అంశాలను యాజమాన్య కమిటీలు పర్యవేక్షించాలి. పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలి. పేరుకే కమిటీలు.. విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి ఆరేళ్లు పూర్తయ్యింది. నేటికీ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కొరత వేధిస్తూనే ఉంది. పాఠశాలల్లో ప్రధాన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రణాళికలను తయారు చేయడం, ప్రభుత్వానికి పంపడం, విద్యార్థులను మెరుగైన సదుపాయల కల్పన ప్రధాన లక్ష్యం. కాని కమిటీల పాత్ర నామమాత్రంగా మారింది. తల్లిదండ్రుల్లో అవగాహన లోపం వల్ల మొక్కుబడిగా సమావేశాలు జరుగుతున్నాయి. -
ఆలేరును అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెడతా
బొమ్మలరామారం: ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మండల కేంద్రంలో గ్రంథాలయ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్తో పాటు నాగినేనిపల్లి, మైలారం, సోలీపేట్, బండ కాడిపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి హారితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. మిషన్ కాకతీయ పథకం దేశానికే ఆదర్శమన్నారు. మిషన్ భగిర థతో అతి త్వరలో ప్రతి ఇంటికి గోదావరి జలాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, జెడ్పీపీటీసీ జయమ్మకృష్ణారెడ్డి, తహసీల్దారు జయమ్మ, సర్పంచ్లు కల్పన, బండ వెంకటేశం, లక్ష్మి, రత్న ఎంపీటీసీలు మేడబోయిన శశికళగణేష్, మాంధాల రామస్వామి, లక్ష్మి, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు గూదే బాల్ నర్సిహ్మ, వేముల సురేందర్రెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ రామిడి జంగారెడ్డి, అంజనేయులు, మల్లారెడ్డి, అంజిరెడ్డి, బీరుప్ప, సతీష్, రాంరెడ్డి పాల్గొన్నారు. -
యాదాద్రిని జిల్లాగా ప్రకటించాలి : మోత్కుపల్లి
ఆలేరు : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని జిల్లాగా అధికారికంగా ప్రకటించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఆలేరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాదాద్రిని జిల్లా కాకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రిని జిల్లాగా అధికారికంగా ప్రకటించే వర కూ మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా ఏర్పాటును స్వాగతిస్తూ, గోదావరినది జలాల సాధన కోసం చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు పొడిగిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 5న శ్రీలక్ష్మినర్సింహాస్వామి పాదాల చెంత సంతకాలు చేసిన పోస్టుకార్డులను పెట్టి, సీఎం కేసీఆర్కు పోస్టు చేస్తామని చెప్పారు. 10వేల పోస్టుకార్డుల ద్వారా లక్ష సంతకాలను సేకరించామని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, చామకూర అమరేందర్రెడ్డి, ఆరె రాములు, ఎండి సలీం, మల్రెడ్డి సాంబిరెడ్డి, ఆలేటి మల్లేశం, జూకంటి పెద్దఉప్పలయ్య, ఎండి రఫీ, భోగ సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన విప్ సునీత
టంగుటూరు (ఆలేరు) : మండలంలోని టంగుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన ఆహారాన్ని రుచిచూశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలని సూచించారు. ఆమె వెంట మార్కెట్ చైర్మెన్ కాలె సుమలత, ఎంపీపీ కాసగల్ల అనసూర్య, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, హెచ్ఎం ప్రవీణ్కుమార్, ఉపాధ్యాయులు భూషపాక రాములు, సంధ్యారాణి, గుగ్గిళ్ల రవీంద్రచారి, కిష్టయ్య తదితరులు ఉన్నారు. -
అందరి దృష్టి ఆలేరు వైపు..
జానకీపురం నుంచి కందిగడ్డ తండాకు మారిన సీన్ పోలీసు వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన ఆలేరు ఘటన ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఆందోళన సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆలేరు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఐఎస్ఐ ఏజెంట్లు చనిపోయారన్న వార్త మంగళవారం జిల్లాలో హల్చల్ చేసింది. కొన్ని రోజులుగా వరుసగా జిల్లాలో కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఎన్కౌంటర్ జరిగిందని తెలియడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటివరకు మోత్కూరు మండలం జానకీపురం ఎన్కౌంటర్ గురించి ప్రజల్లో జరుగుతున్న చర్చ ఒక్కసారిగా ఆలేరువైపునకు మళ్లింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి వికారుద్దీన్గ్యాంగ్ను హైదరాబాద్కు తీసుకువెళుతున్న పోలీసులు జిల్లాలోని ఆలేరు మండలం కందిగడ్డతండా వద్ద ఎన్కౌంటర్లో హతమార్చడం సంచలనాన్ని సృష్టించింది. ఎన్కౌంటర్ వార్త దావానలంలా వ్యాపించడంతో జిల్లాలో ఏ నోటా విన్నా ఈ మాటే వినిపించింది. గత ఆరురోజులుగా జిల్లా కాల్పుల చప్పుళ్లతో అట్టుడుకుతున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. పోలీసులది పైచేయి అయ్యిందా? ఆలేరు వద్ద కరుడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్తో పాటు మరో నలుగురిని కాల్చిచంపడంతో జిల్లాలో పోలీసులు పైచేయి సాధించారని, ఈ ఘటన పోలీసు వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందనే చర్చ జరుగుతోంది. సూర్యాపేట హైటెక్బస్టాండ్లో సీఐ మొగిలయ్య బృందంపై కాల్పులు జరిపి ఇద్దరు పోలీసులను చంపి దుండగులు దొరక్కుండా వెళ్లిపోవడం, ఆ తర్వాత తాపీగా రెండు రోజుల తర్వాత రోడ్డుమీద కు వచ్చి హల్చల్ చేస్తున్న దుండగులను మట్టుబెట్టడంలో పోలీసుల వ్యవహరించిన తీరు విమర్శల పాలు కావడం అందరికీ తెలిసిందే. జానకీపురం ఎన్కౌంటర్ జరిగిన రోజు మరో కానిస్టేబుల్, ఎస్ఐలు దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం కూడా పోలీసులు చేజేతులా చేసుకుందేననే అభిప్రాయం వ్యక్తమయింది. ఈ నేపథ్యంలో ఇంటా బయటా విమర్శల పాలవుతున్న పోలీసు యంత్రాంగం మంగళవారం జరిగిన ఘటనతో ఊపిరి పీల్చుకుంది. తీవ్రవాదులపై పోలీసులకు పైచేయి సాధించి పెట్టిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందనే భావన వ్యక్తమవుతోంది. అయితే, ఎన్కౌంటర్ జరిగిన తీరుపై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా మొత్తంమీద తీవ్రవాదులను హతమార్చడం పోలీసు వర్గాలకు ఊపిరినిచ్చిందనే చెప్పాలి. -
‘దారి’చూపుతా
యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం, ఆలేరు మండలం కొలనుపాక మధిర గ్రామమైన బైరాంనగర్ మధ్య 4 కిలోమీటర్ల మేర రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దూరం వరకు డాంబర్ రోడ్డు వేస్తే.. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట నుంచి ప్రపంచప్రఖ్యాతి గాంచిన కొలనుపాక గ్రామంతోపాటు నల్లగొండ, మెదక్, వరంగల్ జిల్లాల మధ్య దూరం తగ్గుతుంది...ఇక.. బైరాంనగర్ ప్రజలది వింత పరిస్థితి. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా గ్రామానికి ఆర్టీసీ బస్ సౌకర్యం లేదు. గ్రామానికి రోడ్డులేదని ఆ గ్రామ యువకులకు పిల్లను ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి. ఇక.. ధర్మారెడ్డిగూడెం, బైరాంనగర్ గ్రామాల మధ్య రోడ్డు వసతి కల్పిస్తే మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట, వరంగల్ జిల్లా జనగామకు దూరం తగ్గుతుంది. రైల్వేట్రాక్ సమస్యలు తీరిపోతాయి. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి ఆదివారం ‘సాక్షి ప్రతినిధి’గా మారి ఆయా గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలేరు మండలం బైరాంనగర్, యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం నుంచి గొంగిడి సునీతారెడ్డి వీఐపీ రిపోర్ట్. ఆలేరు మండలం కొలనుపాక మధిర గ్రామం బైరాంనగర్కు చేరుకున్న సాక్షి ప్రతినిధి గొంగిడి సునీతారెడ్డి అక్కడే ఉన్న మహిళలతో మాట్లాడారు. గొంగిడి సునీత : అమ్మా బాగున్నావా, నీ పేరేమిటి? మహిళ : మేడం బాగున్నాను. నా పేరు చిర్ర సుమలత. సంవత్సరాల తరబడి మా ఊరికి రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం లేదు. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయమై ఎన్నో సార్లు గ్రామస్తులం యాదగిరిగుట్ట డిపో మేనేజర్కు వినతిపత్రాలు అందజేశాం. రోడ్డు లేదు, బస్సు రాలేదు. సునీత : ఒకేనమ్మా..మీ సమస్య నాకు అర్థమైంది.. పాప.. నీ పేరేమి..ఏం చదువుకుంటున్నావు? (విద్యార్థినితో) విద్యార్థిని : నా పేరు దివ్య. ఆలేరులో 8వ తరగతి చదువుకుంటున్నాను. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బస్సు రావడం లేదు. అలాగే కొలనుపాక, బైరాంనగర్ గ్రామాల మధ్య ఉన్న వాగుపై వంతెన నిర్మించాల్సి ఉంది. చదువుకోవడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నాం. సునీత : రోడ్డు సౌకర్యం కల్పిస్తే బస్సు వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తా. అక్కడే ఉన్న మరో మహిళ లక్ష్మిని పలకరించారు. ఏమమ్మా..మీకు మంచినీళ్లు వస్తున్నాయా? లక్ష్మి : మేడం. తాగునీళ్లు లేవు. గ్రామంలో నీటి శుద్ధి ప్లాంట్ లేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల నుపాకకు వెళ్లి ఫిల్టర్ నుంచి మంచినీటిని తెచ్చుకుంటున్నాం. గ్రామంలో మంచినీటి ఫిల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సునీత : మీ సమస్యను నోట్ చేసుకుంటున్నా. ఎమ్మెల్యేను చూసిన పలువురు వృద్ధులు ఆమె దగ్గరకు వచ్చారు. వారిలో నంద మైసయ్య అనే వృద్ధుడితో సునీత మాట్లాడారు. ఏం పెద్దాయనా..పింఛన్ వస్తుందా? నందమైసయ్య : పెన్షన్ కోసం దరఖాస్తు ఫారాన్ని సర్పంచ్కు అందజేశా. ఈ నెల పెన్షన్ అందలేదు. పెన్షన్ వస్తదో రాదో అర్థం కావడం లేదు. సునీత : అర్హులందరికీ ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది. మీరేం భయపడకండి. సునీత అక్కడినుంచి కొద్దిదూరం నడుచుకుంటూ అక్కడ ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లి..నీ పేరేమిటీ? ఎందుకమ్మా..అలా ఉన్నావు..? మహిళ : మేడం నా పేరు నంద నిర్మల. ఫ్లోరిన్ సమస్యతో వెన్నుపూస వంగిపోయింది. ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందడం లేదు. మందులు వాడుతున్నాను. నెలనెలా మందుల కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఆరోగ్య పరంగా ఆదుకోవాలి. ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. సునీత : చూడమ్మా..ఏం బాధపడకు. ప్రభుత్వ పరంగా సహకారం కోసం నా వంతు కృషి చేస్తా. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ రైతు బుచ్చిరెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడారు. సునీత : ఏం పెద్దాయన గ్రామానికి 108 వాహనం వస్తుందా? బుచ్చిరెడ్డి : గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 108 కాదు కదా.. ఏ వాహనమూ రావడం లేదు. మా ఊరికి పిల్లనివ్వాలంటే కూడా భయపడుతున్నారు. సునీత : బాబు.. మీ ఊర్లో ఆటోలు ఉన్నాయా? (పక్కనే ఉన్న నంద మహేందర్తో) నంద మహేందర్ : మాఊర్లో ఆటోలు లేవు, బస్లు రావు, ఎవరికైనా ఆపతి వస్తే 250 రూపాయలు ఇస్తే కొలనుపాక నుంచి ఆటో వస్తుంది. అక్కడినుంచి ఆలేరుకు వెళ్లాలి. లేదంటే ఇక అంతే. బస్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. సునీత : బాబు ఏం చేస్తున్నావు? (మరో యువకుడు శ్రీరామ్తో) శ్రీరామ్ : నేను భువనగిరిలో ఎమ్మెస్సీ చదవుతున్నాను. గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక వరకు సైకిల్పై పోయి అక్కడినుంచి బస్లో భువనగిరికి పోతా. తిరిగి అలాగే ఇంటికి చేరుకుంటాను. రోడ్డుసౌకర్యం ఏర్పడితే చాలామంది చదువుకోవడానికి వెళ్తారు. కనీస వసతులు లేక చదువు అర్ధంతరంగా ఆగిపోతుంది. మీరే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. సునీత : ఏం సర్పంచ్ శ్రీనివాస్ గారు..గ్రామసమస్యలను చెప్పండి (ఆయన పక్కనే ఉన్నారు) గంగుల శ్రీనివాస్ : గ్రామంలో ప్రధానంగా సీసీ రోడ్డు వేయించాలి. ప్రధానం రోడ్డు సౌకర్యం లేక విద్యార్ధులు చదవలేకపోతున్నారు. బైరామ్నగరం- కొలనుపాకల మధ్య వాగుపై వంతెన నిర్మించాలి, నీటిశుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేయాలి. సునీత : మీ సమస్యలు, బాధ నాకు అర్థమైంది. సాధ్యమైనంత త్వరలో పరిష్కారమయ్యేలా చూస్తా. సరేనండి..మీరేం కోరుకుంటున్నారు (పక్కనే ఉన్న ఎంపీటీసీ మాజీ సభ్యుడు అంజయ్యతో) అంజయ్య : మేడం.. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఉపాధి హామీలో రోడ్డు కోసం కొంత పనిచేశాం. కొలనుపాక వాగుపై కల్వర్టులు , రోడ్డు లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం వస్తే చాలా కష్టం, ప్రమాదం జరిగితే సరైన వాహన సౌకర్యం అందుబాటులో ఉండదు కాబట్టి రోడ్డు వసతిని వెంటనే కల్పించాలి. సునీత అక్కడినుంచి రోడ్డు మార్గం గుండా యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం వచ్చారు.. అక్కడ పెద్దఎత్తున గుమిగూడిన మహిళలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు. అక్కడే సునీత : సదరం సర్టిఫికెట్ తీసుకున్నావా? (యాదమ్మ అనే వికలాంగురాలితో) యాదమ్మ : సర్టిఫికెట్ అంటే ఏమిటో నాకు తెలియదు, వికలాంగుల పింఛన్కోసం దరఖాస్తు చేసుకున్నా. సదరం క్యాంపు ఉందని నాకు ఎవరూ చెప్పలేదు. ఆ విషయం తెలియదు. మీరు ఎలాగైనా పింఛన్ ఇప్పించాలి. (యాదమ్మకు భరోసానిచ్చిన సునీత..అంతటితో రిపోర్టింగ్ ముగించారు.)