Published
Sun, Aug 28 2016 6:45 PM
| Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడొద్దు
ఆలేరు : యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడవద్దని తెలంగాణ ధర్మ ప్రసారక్ సహ ప్రముఖ్ డీఎస్ మూర్తి, శ్రీశ్రీశ్రీ త్రిశూల్స్వామిజీ అన్నారు. ఆలేరులోని ఎస్సీ వాడలో విశ్వ హిందూ పరిషత్ ఆలేరు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాముహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కృతి గొప్పదని, హిందూ అంటే ఒక ధర్మం, జీవన విధానం అని చెప్పారు. అన్ని మతాలను, ఆచరాలను, సంప్రదాయాలను సమానంగా ఆచరించేదే హిందూ ధర్మమని పేర్కొన్నారు. అతి పురాతన, సనాతన ధర్మం, వేలాది సంవత్సరాలుగా ప్రపంచానికే జ్ఞానాన్ని అందించిన దేశం భారతదేశమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బండిరాజుల శంకర్, తోట భానుప్రసాద్, పోతంశెట్టి మీరాబాయి, కంతుల శంకర్, మొరిగాడి ప్రభు, రఘుపతి, అశోక్, రాంచందర్ పాల్గొన్నారు.