రాంసాగర్‌ వెంచర్‌లో హెచ్చరిక పోస్టర్ల కలకలం | Warning posters venture caused ransagar | Sakshi
Sakshi News home page

రాంసాగర్‌ వెంచర్‌లో హెచ్చరిక పోస్టర్ల కలకలం

Jul 31 2016 11:34 PM | Updated on Sep 4 2017 7:13 AM

రాంసాగర్‌ వెంచర్‌లో హెచ్చరిక పోస్టర్ల కలకలం

రాంసాగర్‌ వెంచర్‌లో హెచ్చరిక పోస్టర్ల కలకలం

చేర్యాల మండలంలోని రాంసాగర్‌ పరిధిలో ఉన్న రాంసాగర్‌ – కొమురవెల్లి రహదారిపైనున్న దుర్గా భవానీ ఆలయం వద్ద వెంచర్‌లో ఆదివారం హెచ్చరిక పోస్టర్లు వెలిశాయి. స్థానికుల కథనం ప్రకారం..

చేర్యాల : మండలంలోని రాంసాగర్‌ పరిధిలో ఉన్న రాంసాగర్‌ – కొమురవెల్లి రహదారిపైనున్న దుర్గా భవానీ ఆలయం వద్ద వెంచర్‌లో ఆదివారం హెచ్చరిక పోస్టర్లు వెలిశాయి. స్థానికుల కథనం ప్రకారం.. సిద్ధిపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వేసిన ఈ వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఎర్రజెండాలు పాతి, మూడు హెచ్చరిక పోస్టర్లు అంటించారు. ఈ భూమిని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అప్పగించాలని.. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ పోస్టర్లలో రాశారు. ఎస్సై లక్ష్మణ్‌రావు సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఎర్రజెండాలు, పోస్టర్లను తొలగించారు. ఘటనపై విచారణ చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement