సారంగాపూర్ (కరీంనగర్) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై అతని భార్య, అత్త కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఇరగదిండ్ల గంగయ్య(30) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మరోసారి వారి మధ్య వివాదం చెలరేగింది. దీంతో విసిగిపోయిన భార్య రజిత, ఆమె తల్లితో కలిసి గంగయ్యపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.