వివాహిత ఆత్మహత్య
Published Wed, Mar 15 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
నంద్యాల: స్థానిక ఎంఎస్ నగర్కు చెందిన మహాలక్ష్మి(32) ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కలిసి ఆమె సాయి బాలాజీ ఫుడ్ ప్రొటెక్షన్స్ పేరుతో బిస్కెట్ల తయారీ సంస్థను నెలకొల్పింది. ఈ సంస్థ నిర్వహణకు కెనరా బ్యాంక్ నుంచి దాదాపు రూ.28 లక్షలు అప్పు చేశారు. ఈ అప్పు తీర్చక పోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ఆవేదనను తట్టుకోలేక మహాలక్ష్మి ఉరేసుకొని మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి తల్లి నాగశిరోమణి దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ పోలీసులు మంగళవారం తెలిపారు.
Advertisement
Advertisement