Bank
-
లిక్విడిటీ అవసరాలకు ఆర్బీఐ రూ.43 లక్షల కోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ సవాళ్లను పరిష్కరించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలపై దృష్టి సారించారు. గత నాలుగు నెలల్లో సవాళ్లతో కూడిన లిక్విడిటీ పరిస్థితులను సమర్థంగా నిర్వహించేందుకు ఆర్బీఐ రూ.43.21 లక్షల కోట్లను చొప్పించింది.2024 డిసెంబర్ 16 నుంచి 2025 ఫిబ్రవరి 14 మధ్య బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు రూ.30,000 కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. పన్ను ప్రవాహాలు, పరిమిత ప్రభుత్వ వ్యయం, రూపాయికి మద్దతుగా ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ భారీగా జోక్యం చేసుకోవడం ఈ మార్పునకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.ఆర్బీఐ తీసుకున్న చర్యలుపెరుగుతున్న లిక్విడిటీ లోటును పరిష్కరించేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంది. వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలం ద్వారా రూ.16.38 లక్షల కోట్లను అందుబాటులో తీసుకొచ్చింది. రోజువారీ వీఆర్ఆర్ వేలం ద్వారా రూ.25.79 లక్షల కోట్లను అందించింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా రూ.60,020 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసింది. విదేశీ కరెన్సీ కొనుగోలు-అమ్మకం ద్వారా సుమారు రూ.45,000 కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది.ఇదీ చదవండి: ఒకప్పుడు సుజుకీ సంస్థ నమ్మని మొదటి బిలియనీర్!మనీ మార్కెట్ రేట్లపై ప్రభావంలిక్విడిటీ లోటు సమస్యలున్నప్పటికీ ఓవర్నైట్ మనీ మార్కెట్ రేట్లు ఆర్బీఐ రెపోరేటు కంటే కొంచెం అధికంగానే ఉన్నాయి. 6.6 శాతం నుంచి 6.74 శాతం మధ్య ట్రేడ్ అవుతున్నాయి. కార్పొరేట్లు, బ్యాంకుల రుణ వ్యయాలపై ఇది నిరంతర ఒత్తిడిని పెంచుతోంది. దీన్ని పరిష్కరించాలని బ్యాంకర్లు ఆర్బీఐను కోరుతున్నారు. ఆర్థిక సవాళ్లను నిర్వహించడానికి, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి ఆర్బీఐ విస్తృత వ్యూహంలో భాగంగా ఇటీవలి పాలసీ రేటు కోతకు మద్దతు ఇచ్చింది. దాంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పిస్తోంది. -
ప్రముఖ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత
కోటక్ మహీంద్రా బ్యాంక్పై విధించిన పర్యవేక్షక ఆంక్షలను ఎత్తివేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏ కింద 2024 ఏప్రిల్ 24న విధించిన ఆంక్షలను తొలగించింది. బ్యాంక్ తన ఆన్లైన్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి, తిరిగి కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు అనుమతించింది.ఐటీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ప్యాచ్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీతో సహా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ మౌలిక వసతుల్లో లోపాలను గతంలో ఆర్బీఐ గమనించింది. దాంతో నిబంధనలు పాటించకపోవడం వల్ల బ్యాంక్పై ఆంక్షలు విధించింది. ఫలితంగా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్) కార్యకలాపాలు, ఆన్లైన్, డిజిటల్ బ్యాంకింగ్ ఛానళ్లు కొంతకాలంగా అంతరాయాలు ఎందుర్కొంటున్నాయి.నివారణ చర్యలుఆర్బీఐ ఆందోళనలకు ప్రతిస్పందనగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నివారణ చర్యలను ప్రారంభించింది. లోపాలు సవరించుకునేందుకు బ్యాంకు అనుసరిస్తున్న విధానాలను నిత్యం ఆర్బీఐకు నివేదికల రూపంలో సమర్పించింది. ఈ కాంప్లయన్స్ను ధ్రువీకరించడానికి ఆర్బీఐ ఆమోదించిన ఎక్స్టర్నల్ ఆడిట్ను బ్యాంక్ పూర్తి చేసింది. బ్యాంకు తీసుకున్న పరిష్కార చర్యలతో సంతృప్తి చెందిన ఆర్బీఐ గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: స్టార్లింక్ సేవలను ధ్రువీకరించిన మస్క్ఆంక్షలు ఎత్తివేయడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు మార్గం లభించింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు లైన్క్లియర్ అయింది. ఈ చర్య వల్ల సమర్థవంతమైన కస్టమర్ సేవలను అందించడానికి వీలవుతుంది. బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ ఆంక్షలు ఎత్తివేయడం కీలకంగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. -
రేట్ల కోతతో తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు
ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం రెపో రేటుతో అనుసంధానమయ్యే రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై, ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), డిపాజిట్లతో ముడిపడి ఉన్న రుణాలపై విస్తృత ప్రభావాలు చూపడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.రెపో లింక్డ్ రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనాలుఆర్బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీని రెపో రేటు అంటారు. రెపో రేటును తగ్గించడం వల్ల ఈ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. ఇది చాలా మంది రుణగ్రహీతలకు సమాన నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించడానికి దారితీస్తుంది.ఎంసీఎల్ఆర్ రుణాలపై ప్రభావం ఆలస్యంఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం వెంటనే కనిపించదు. ఎంసీఎల్ఆర్ అనేది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్మార్క్ వడ్డీ రేటు. రెపో రేటు మాదిరిగా కాకుండా బ్యాంకులకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు.. వంటి వాటిపై ఆధారపడి ఎంసీఎల్ఆర్లో మార్పులు ఉంటాయి. రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్ఆర్లో పూర్తిగా ప్రతిబింబించడానికి కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు తమ వ్యయాలను సర్దుబాటు చేయడానికి, రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయడానికి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. ఫలితంగా ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్నవారు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంత కాలం ఆగాలి.ఇదీ చదవండి: టార్గెట్ ఎఫ్డీఐ.. విధానాల సవరణకు యోచన!డిపాజిట్లకు సవాల్..వడ్డీరేట్ల తగ్గింపు డిపాజిట్ల పరంగా బ్యాంకులకు సవాలుగా మారుతుంది. రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. డిపాజిట్ రేట్లను వెంటనే తగ్గించడం వల్ల బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం కష్టతరం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ పొదుపుపై మంచి రాబడిని కోరుకునే ఇతర మార్గాలను ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు. -
బందరు బ్యాంక్ @ 219 ఏళ్లు
సాక్షి, మచిలీపట్నం: ఒకవైపు సముద్రతీరం మరోవైపు కృష్ణమ్మ ఒడి.. ఒడ్డున వెలిసిన ప్రాచీన పట్టణం మచిలీపట్నం. ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యాంక్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందింది.ఈ బ్యాంక్ ఏకంగా 218 వసంతాలు పూర్తి చేసుకొని 219వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. బ్రిటీష్ పాలనలో ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ నేడు సామాన్య ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తోంది.అప్పట్లో ఇది బ్యాంక్ ఆఫ్ మద్రాస్గా ఆవిర్భవించి.. అనంతరం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. గుంటూరు బ్యాంక్కు సబ్ బ్రాంచ్గా ఉన్న ఈ బ్యాంక్ 1908లో ప్రత్యేక బ్రాంచ్గా ఆవిర్భవించింది. జనవరి 1వ తేదీతో ప్రత్యేక బ్రాంచ్ ఏర్పడి 117 ఏళ్లు పూర్తయ్యాయి. బ్రిటిష్ కాలంలో ఓ వెలుగు వెలిగిన పట్టణం బ్రిటీష్వారు తమ పాలనకు ఎంతో అనువైన పట్టణంగా మచిలీపటా్నన్ని గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రోజుల్లో మచిలీపట్నం దేశంలో మూడో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ఎందరో స్వాతంత్య్రం కోసం సాగిన పోరులో పాల్గొనడంతో పాటు రాజకీయ, సినీ, సామాజిక రంగాల్లో రాణించారు. మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్కు ఎంతో చరిత్ర ఉంది. రిటైర్డ్ ఉద్యోగులు, చరిత్రకారుల వివరాల మేరకు.. 1806లో దీన్ని బ్యాంక్ ఆఫ్ మద్రాస్గా 14 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా ఉద్యోగులు శిక్షణ కేంద్రం కూడా నెలకొల్పారు. 1905 నుంచి గుంటూరు బ్యాంక్కు అనుబంధంగా సబ్ బ్రాంచ్గా నిర్వహించి, 1908 జనవరి 1 నుంచి ప్రత్యేక బ్రాంచ్గా ఏర్పాటు చేశారు.1923లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పడి, 1955 జూన్ 30 వరకు సేవలందించింది. అదే ఏట జూలై 1 నుంచి ఆర్బీఐలో విలీనమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. మచిలీపట్నం పేరు ఆర్బీఐలో మసులీపట్నంగా నమోదు కాగా నేటికీ అదే పేరు ఉంది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం.. బ్రిటిష్ కాలంలో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేశారు. నాడు పదిమంది లోపు మాత్రమే ఉద్యోగులు ఉండేవారు. 1955లో స్టేట్ బ్యాంక్గా ఏర్పడిన తరువాత ఉద్యోగుల సంఖ్య 20కి చేరింది. అప్పట్లో బ్యాంకింగ్ సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండేవి. ఆ రోజుల్లో వందల్లోనే ఖాతాదారులు, పదుల్లో లావాదేవీలు జరిగేవి. నేడు 50 వేలకు పైగా ఖాతాదారులు ఉండగా రోజూ వెయ్యికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. 1905లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆంగ్లేయులకు అన్ని విధాలా ఉపయోగపడింది. రెండో ప్రపంచయుద్ధం (1913–1945) సమయంలో ఆంగ్లేయులు పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం ఈ బ్యాంక్లో భద్రపరచినట్లు పెద్దలు చెబుతున్నారు. -
బ్యాంకుల్లోకి రూ.45 వేల కోట్ల డిపాజిట్లు
బడ్జెట్లో ఆదాయపన్ను తగ్గింపు, ఇతర పన్ను ప్రతిపాదనలతో బ్యాంకుల్లోకి వచ్చే డిపాజిట్లు పెరగనున్నాయి. సుమారు రూ.40,000 నుంచి 45,000 కోట్ల వరకు బ్యాంకుల్లోకి డిపాజిట్లు(Bank Deposit)గా రావొచ్చని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై ఆదాయం రూ.40,000 మించినప్పుడు (60 ఏళ్లలోపు వారికి) బ్యాంక్లు 10 శాతం మేర టీడీఎస్ వసూలు చేస్తుండగా, ఈ పరిమితిని రూ.50,000కు పెంచడం గమనార్హం. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000గా ఉన్న పరిమితిని రూ.లక్షకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే.‘పన్ను రాయితీని పెంచడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.20,000 కోట్లు డిపాజిట్ల రూపంలో రావొచ్చు. సేవింగ్స్ డిపాజిట్లపై వృద్ధులు ఆర్జించే వడ్డీపై టీడీఎస్ పరిమితిని పెంచడం వల్ల మరో రూ.15,000 కోట్లు రావొచ్చు’ అని నాగరాజు వివరించారు. సీనియర్లు కాని ఇతర వ్యక్తులకు పన్ను ఆదా రూపంలోనూ మరో రూ.7,000 కోట్ల మేర డిపాజిట్లుగా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఇదీ చదవండి: త్వరలో భారత్ సొంత జీపీయూ క్యాన్సర్ సంస్థలతో యాక్సిస్ బ్యాంక్ జట్టుక్యాన్సర్పై పరిశోధనలు, పేషంట్ల సంరక్షణ కార్యక్రమాలకు తోడ్పాటు అందించే దిశగా దేశీయంగా మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో చేతులు కలిపినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. టాటా మెమోరియల్ సెంటర్కి చెందిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్కేర్ సెంటర్స్ వీటిలో ఉన్నట్లు వివరించింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల కింద ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ విజయ్ మూల్బగల్ తెలిపారు. ప్రధానంగా పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, క్యాన్సర్ నివారణ .. చికిత్సపై అవగాహన కల్పించే సంస్థలు, అలాగే పేషంట్ల సంరక్షణ మొదలైన వాటికి సహాయసహకారాలు అందించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొన్నారు. సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్కేర్ సెంటర్స్ సంస్థ హైదరాబాద్లో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయం అందించినట్లు వివరించారు. -
బ్యాంకులు, ఫైనాన్స్ షేర్ల జోరు
ముంబై: ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టడంతో బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. వచ్చే నెల ద్రవ్య పరపతి సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే అంచనాలూ మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 535 పాయింట్లు పెరిగి 75,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 22,957 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా అదే ట్రెండ్ కొనసాగించాయి.బ్యాంకులు, ఫైనాన్స్తో పాటు వడ్డీరేట్ల సంబంధిత షేర్లైన ఆటో, రియల్టీ, కన్జూమర్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,145 పాయింట్లు బలపడి 76,513 వద్ద, నిఫ్టీ 308 పాయింట్లు ఎగసి 23,138 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే ట్రేడింగ్ చివర్లో ఫార్మా, ఇండస్ట్రీయల్, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఆయిల్అండ్గ్యాస్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు కొంత లాభాలు కోల్పోయాయి. ట్రంప్ వాణిజ్య విధానాలపై అనిశ్చితులు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ప్రకంపనల ప్రభావంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ట్రంప్ వాణిజ్య సుంకాల పెంపు భయాలతో డాలర్తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 86.57 వద్ద ముగిసింది.⇒ ఆర్థిక వ్యవస్థలోకి రూ.1.50 లక్షల కోట్లు జొప్పించేందుకు ఆర్బీఐ పలు చర్యలు ప్రకటించడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు మెరిశాయి. యాక్సిస్ బ్యాంకు 3.20%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఐసీఐసీఐ బ్యాంకు 2.15%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2% లాభపడ్డాయి. బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు 1–0.50% పెరిగాయి. మరోవైపు ఫెడరల్ బ్యాంక్ 5%, యస్ బ్యాంక్ 1.5%, కెనరా బ్యాంకు 1% మేర నష్టపోయాయి. -
ఏ బ్యాంక్లో అయినా ఈపీఎఫ్ పెన్షన్
న్యూఢిల్లీ: ‘ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్), 1995’ సభ్యులకు శుభవార్త. 68 లక్షల పెన్షనర్లు ఇక మీదట ఏ బ్యాంక్లో అయినా పెన్షన్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అన్ని ఈపీఎఫ్వో ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ (సీపీపీఎస్)ను అమల్లోకి తీసుకువచ్చినట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పింఛను పంపిణీ వ్యవస్థ కేంద్రీకృతమై లేదు. ప్రతి జోనల్/ప్రాంతీయ కార్యాలయ పరిధిలో సభ్యులకు పింఛను పంపిణీకి వీలుగా 3–4 బ్యాంకులతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చేది. సీపీపీఎస్ కింద లబ్ధిదారు ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ తీసుకోవచ్చని, పెన్షన్ ప్రారంభంలో ధ్రువీకరణ కోసం బ్యాంక్ను సందర్శించాల్సిన అవసరం ఉండదని కార్మిక శాఖ తెలిపింది. పెన్షన్ను మంజూరు చేసిన వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని పేర్కొంది. పెన్షనర్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలివెళ్లినప్పటికీ, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్కు బదిలీ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుందని వివరించింది. రిటైర్మెంట్ అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లి స్థిరపడే పింఛనుదారులకు నూతన వ్యవస్థతో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సీపీపీఎస్ను అన్ని ఈపీఎఫ్వో ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పూర్తి స్థాయిలో అమలు చేయడాన్ని చారిత్రక మైలురాయిగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యాఖ్యానించారు. -
మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?
పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా(penalty) చెల్లించాలనేలా బ్యాంకు సిబ్బంది చెబుతుంటారు. అకౌంట్ నిర్వహణ, ఏటీఎం కార్డు ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు.. వంటి వాటికోసం సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. లేదంటే నిబంధనల ప్రకారం తిరిగి అకౌంట్(Bank Account) వినియోగించినప్పుడు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. దాంతో ప్రధానంగా ఉన్న అకౌంట్లోనే లావాదేవీలు(Transactions) నిర్వహిస్తూ మిగతావాటి జోలికి వెళ్లడంలేదు. దాంతో కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆ అకౌంట్లో లావాదేవీలు చేయాలంటే జరిమానా చెల్లించడం తప్పడం లేదు. కొన్ని చిట్కాలు పాటించి జరిమానా భారాన్ని తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే..సేవింగ్స్ ఖాతాలో అవసరమైన మినిమం బ్యాలెన్స్(Minimum Balance) ఎల్లవేళలా ఉండేలా చూసుకోవాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ (MBA)ను ఎలా లెక్కిస్తారో మీ బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకోండి. దాని పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఉదాహరణకు, మీ మినిమం బ్యాలెన్స్ రూ.10,000 అయితే అవసరమైన ఎంఏబీని మెయింటెన్ చేయడానికి నెలలోపు ఆరు రోజుల పాటు రూ.50,000 మీ అకౌంట్లో ఉండాలి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ నిబంధనలు ప్రతి బ్యాంకును అనుసరించి మారుతుంటాయి. మీ బ్యాంకులో ఎంఏబీ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా అకౌంట్లో నగదు ఉంచుకోవాలి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుబేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్బీడీఏ) అని కూడా పిలువబడే ఈ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాకు మారేందుకు ప్రయత్నించాలి. చాలావరకు సాలరీ అకౌంట్లు ఈ తరహా ఖాతాలుగా ఉంటాయి. ఈ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.రెగ్యులర్ మానిటరింగ్అకౌంట్ బ్యాలెన్స్ అవసరమైన కనీస స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్ ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి అలర్ట్లు లేదా రిమైండర్లను సెట్ చేసుకోవాలి. ఏదైనా కారణాలతో డబ్బు కట్ అయిన వెంటనే అలెర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి, మినిమం బ్యాలెన్స్ పాటించవచ్చు.ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్స్అవసరమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు తరచూ లావాదేవీలు చేసే ప్రధాన అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తక్కువగా ఉన్న సేవింగ్స్ అకౌంట్కు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లను సెట్ చేసుకోవాలి.ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలుఖాతాను మూసివేయడంఎంత ప్రయత్నించినా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేకపోతే, ప్రస్తుత ఖాతాను మూసివేసి, జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందించే బ్యాంకుతో అనుసందానమై కొత్త ఖాతా తెరవడానికి ప్రయత్నించండి. -
బ్యాంకులకు కొత్త టైమింగ్స్.. జనవరి 1 నుంచే..
వివిధ పనుల నిమిత్తం నిత్యం బ్యాంకులకు (Banks) వెళ్తుంటారా..? అయితే ఈ వార్త మీకోసమే. బ్యాంక్ తెరిచే వేళలు, మూసే సమయం ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడానికి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ బ్యాంకుల పని వేళలు (Bank Timings) ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంది.ఈ మార్పులు 2025 జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరిచి సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. బ్యాంకింగ్ సేవలను క్రమబద్ధీకరించడంలో ఈ చర్య సహాయపడుతుందని కమిటీ అభిప్రాయపడింది.మార్పు ఎందుకంటే..వివిధ బ్యాంకులకు వేర్వేరు సమయాల కారణంగా ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరుచుకోగా, మరి కొన్ని బ్యాంకులు 10:30 లేదా 11 గంటలకు తెరుచుకుంటున్నాయి. ఈ వ్యత్యాసం కారణంగా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు వెళ్లాల్సిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కస్టమర్లు ఇప్పుడు వివిధ బ్యాంక్ షెడ్యూల్ల ప్రకారం ప్రణాళిక లేకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఏ బ్యాంకుకు అయినా వెళ్లవచ్చు. ఏకరీతి పని వేళలు ఉండటం వల్ల గందరగోళం తగ్గుతుంది. వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.అన్ని బ్యాంకులు ఒకే సమయంలో పని చేయడం వల్ల ఇంటర్-బ్యాంక్ లావాదేవీలు, కస్టమర్ రిఫరల్స్ వంటి సేవల్లో మెరుగైన సమన్వయం ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆఫీసు షిఫ్ట్ల మెరుగైన ప్రణాళికలో సహాయపడుతుంది. మధ్యప్రదేశ్ తీసుకున్న ఈ చర్యను దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా అనుసరించవచ్చు. -
బ్యాంకులో రూ.558 కోట్ల దొంగతనం!
ఖాతాదారులకు చెందిన సేఫ్ డిపాజిట్ బాక్స్ల నుంచి ఒక బిలియన్ యెన్ (సుమారు 6.6 మిలియన్ డాలర్లు-రూ.558 కోట్లు) సొమ్మును బ్యాంకు ఉద్యోగి దొంగలించినట్లు జపాన్లోని ప్రముఖ బ్యాంకు మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ తెలిపింది. అందుకుగాను అధికారికంగా కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. 60 మంది క్లయింట్ల్లో సుమారు 20 మంది ఖాతాల్లో నుంచే 300 మిలియన్ యెన్ (దాదాపు 2 మిలియన్ డాలర్లు-రూ.169 కోట్లు) వరకు దొంగతనాలు జరిగినట్లు ధృవీకరించింది. కస్టమర్లు కోల్పోయిన నగదు పరిహారం కోసం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త సార్ ముందున్న సవాళ్లు!ఎంయూఎఫ్జీ ప్రెసిడెంట్, సీఈఓ జునిచి హంజావా విలేకరులతో మాట్లాడుతూ..‘టోక్యోలోని మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ బ్యాంకు శాఖల్లో ఈ దొంగతనాలు జరిగాయి. ఏప్రిల్ 2020 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు ఈమేరకు ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించాం. సేఫ్ డిపాజిట్ బాక్స్లను ఓ మహిళా ఉద్యోగి నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన కీ తనవద్దే ఉంటుంది. ఆ ఉద్యోగి డబ్బు తీసుకున్నట్లు, ఇతర పెట్టుబడులు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు అంగీకరించింది. వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి విచారణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాం. జరిగిన దొంగతనానికి క్షమాపణలు కోరుతున్నాం. నగదు నష్టపోయిన కస్టమర్లకు పరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. -
బ్యాంకులో రూ.6.5 కోట్లు మోసం.. అధికారులు ఏమన్నారంటే..
హైదరాబాద్లోని బేగంపేట యాక్సిస్ బ్యాంకులో ఇటీవల రూ.6.5 కోట్ల ఘరానా మోసం జరిగినట్లు వచ్చిన కథనాలపై బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. ఎన్ఆర్ఐ బ్యాంకు కస్టమర్ పరితోష్ ఉపాధ్యాయ్ ఖాతా వివరాలు ఉపయోగించి బ్యాంకు సిబ్బంది అనధికారికంగా పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈమేరకు బ్యాంకు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.‘పరితోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు యాక్సిస్ బ్యాంక్ అధికారులపై క్రిమినల్ అభియోగాలు నమోదైనట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సదరు లావాదేవీలన్నీ పరితోష్కి పూర్తిగా తెలిసే జరిగాయి. యాక్సిస్ బ్యాంక్ సిబ్బందిపై ఆయన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ విషయం సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా బ్యాంకు విచారణకు పూర్తి సహకారం అందిస్తుంది. బ్యాంకుపై గానీ, అధికారులపై గానీ తప్పుడు లేదా తమ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రకటనలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు బ్యాంకునకు పూర్తి హక్కులు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్ ఎల్లప్పుడూ తమ కస్టమర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోంది’ అని ఉన్నతాధికారులు తెలిపారు.ఇదీ చదవండి: సహోద్యోగులతో పంచుకోకూడని అంశాలు..అసలేం జరిగిందంటే..ఆస్ట్రేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయ్కు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుంచి ప్రీమియం అకౌంట్ ఉంది. ఇటీవల అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీశారు. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు స్టేట్మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించినట్లు ఉపాధ్యాయ్ తెలిపారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బేగంపేట యాక్సిస్ బ్యాంకులోని కొంతమంది సిబ్బంది తన పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారని ఉపాధ్యాయ్ తెలిపారు. -
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?. అయితే తస్మాత్ జాగ్రత్త. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంచిది. కానీ చేసే ముందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల లాభ నష్టాల్ని ఒక్కసారి బేరీజు వేసుకోండి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేశానురా భగవంతుడా అనుకుంటూ తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకి ఏం జరిగింది.గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం వస్త్రపూర్కు చెందిన జైమన్ రావల్ తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయనే నమ్మకంతో యూనియన్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తి కావడంతో తన తల్లితో పాటు బ్యాంక్కు వచ్చారు. అనంతరం, బ్యాంక్ మేనేజర్ సంప్రదించి తన ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తియ్యింది. డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నాను. సంబంధింత ప్రాసెస్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.దీంతో సదరు బ్యాంక్ మేనేజర్.. కస్టమర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని డబ్బులు విత్ డ్రా ప్రాసెస్ ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఎఫ్డీపై ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో డిడక్ట్ అవ్వడాన్ని గమనించారు.ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్తో ప్రస్తావించారు. బ్యాంక్ మేనేజర్ నుంచి వచ్చిన సమాధానంతో కస్టమర్ జైమన్ రావెల్ సహనం కోల్పోయారు. ఎదురుగా ఉన్న బ్యాంక్ మేనేజర్ కాలర్ పట్టుకుని ప్రశ్నించారు. బ్యాంక్ మేనేజర్ సైతం కస్టమర్ చొక్కా కాలర్ పట్టుకున్నారు. అంరతరం ఇరువురి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసింది. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.'Customer' turned 'Crocodile' after TDS Deduction in Bank FD. FM sud instruct Bank staffs to learn 'taekwondo' for self defense. pic.twitter.com/CEDarfxcqi— Newton Bank Kumar (@idesibanda) December 6, 2024 కుమారుడు, బ్యాంక్ మేనేజర్ల మధ్య జరుగుతున్న గొడవని ఆపేందుకు కస్టమర్ తల్లి ప్రయత్నాలు చేసింది. బ్యాంక్లో పనిచేస్తున్న ఉద్యోగి శుభమన్ను కోరింది. ఇరువురి మధ్య కోట్లాట తారాస్థాయికి చేరడంతో చేసేది లేక ఆ తల్లి తన కుమారుడిని కొట్టింది. దీంతో తల్లి కొట్టడంతో కుమారుడు వెనక్కి తగ్గడంతో గొడవ సర్ధుమణిగింది. బ్యాంక్లో జరిగిన దాడిపై సమాచారం అందుకున్న వస్త్రపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మరోవైపు, ఫిక్స్డ్ డిపాజిట్లే కాదు, ఇతర బ్యాంక్ లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు సేవింగ్స్ విషయంలో లాభనష్టాల గురించి ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. బ్యాంక్లో దాచుకునే డబ్బులుపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలా ట్యాక్స్ కట్టే పని లేకుండా నిబంధనలు పాటిస్తూ డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. అందుకే డబ్బులు దాచుకునే విషయంలో కస్టమర్లకు సరైన అవగాహన ఉండాలని సూచిస్తున్నారు. -
డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం..
నెల్లూరు నగరానికి చెందిన కిశోర్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వివిధ వస్తువుల కొనుగోలు కోసం అతను ఆన్లైన్ యాప్లో రూ.20 వేలు రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేకపోయాడు. యాప్ నిర్వాహకులు చాలా వడ్డీ వేశారు. దీనికితోడు సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయింది.నెల్లూరులో నివాసం ఉంటున్న సంతోష్ ఓ షోరూంలో ఏడునెలల క్రితం ఏసీ కొన్నాడు. ఐదునెలలపాటు ఈఎంఐలు సమయానికి చెల్లించాడు. వివిధ కారణాలతో ఆ తర్వాత కట్టలేకపోయాడు. దీంతో రూ.750 అపరాధ రుసుము చెల్లించాలని బ్యాంక్ వారు పేర్కొన్నారు. అదనపు చెల్లింపుల భారంతోపాటు సిబిల్ స్కోర్ సైతం తగ్గిపోయింది.నెల్లూరు సిటీ: కాలం మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతోంది. దీంతో జీవనశైలిలో అనేక మార్పులొచ్చాయి. నాడు ఎంతో నెమ్మదిగా జరిగిన పనులు నేడు నిమిషాల్లోనే అయిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు బ్యాంక్ రుణం కావాలంటే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. పొలం, ఇళ్ల డాక్యుమెంట్లు ఉన్నా డబ్బు ఇచ్చేందుకు బ్యాంక్లు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవి. నేడు స్మార్ట్ ఫోన్లోని యాప్ నుంచి రూ.5వేల నుంచి రూ.లక్షల్లో రుణాలు పొందొచ్చు. ఇక్కడే ఒక మెలిక ఉంది. అదే సిబిల్ క్రెడిట్ స్కోర్. డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం. దీని ఆధారంగా ఇప్పుడు బ్యాంక్లు, ఆన్లైన్ యాప్లు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్కోర్ను 750 కంటే తగ్గకుండా చూసుకోవాల్సి బాధ్యత ఏర్పడింది. ఈఎంఐల్లోనే.. నేడు బ్యాంక్లు ఈఎంఐల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించాయి. చేతికి పెట్టుకునే వాచ్ నుంచి సెల్ఫోన్, కారు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఇళ్లు కొనుగోలుకు నెల వాయిదాల విధానంలో రుణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న వస్తువుల కోసం ఈ–కామర్స్ యాప్లో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈఎంఐలు పెడుతున్నారు. అయితే కొందరు నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తోంది. లోన్ యాప్లు, ఒక్కోసారి కొన్ని బ్యాంక్ల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు. సులువుగా.. యాప్లు వచ్చిన నాటి నుంచి రుణం తీసుకోవడం సులభంగా మారిపోయింది. కేవలం పాన్కార్డు నంబర్ ఉంటే చాలు. సంబంధిత వెబ్సైట్ లేదా యాప్లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ దుకాణాలు, షాపుల్లోనూ పాన్కార్డు నంబర్ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎల్రక్టానిక్స్ వస్తువులపై ఆసక్తి చూపుతున్నారు. జీరో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు లేదంటూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు చెప్పే మాటలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వస్తువులు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో సిబిల్ స్కోర్ గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల భవిష్యత్లో అత్యవసరమైనప్పుడు రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతోంది.ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ.. కొత్త కొత్త లోన్ యాప్లు పుట్టుకుని రావడంతో యువత, విద్యార్థులు ఆ ఉచ్చులో ఇరుక్కుని పోతున్నారు. సరదాల కోసం రుణం తీసుకోవడం మొదలుపెట్టి, చివరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యాప్లలో ఇష్టారాజ్యంగా లోన్లు తీసుకుని బెట్టింగ్లు, మద్యంకు బానిసవుతున్నారు. రుణాలు సమయానికి చెల్లించకపోవడంతో నిర్వాహకులు వారిని బ్లాక్మెయిల్ చేయడం, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాగా ఉన్నత చదువులకు రుణాలు తీసుకునే సమయంలో సమస్యలు త లెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సిబిల్ను కాపాడుకుంటేనే.. రానున్న రోజుల్లో సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఇప్పటికే బ్యాంక్ రుణాలు తీసుకోవాలంటే ఇది కచ్చితంగా బాగుండాలి. రుణ చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే చెక్»ౌన్స్తోపాటు సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. భవిష్యత్లో తీసుకునే రుణాలపై కూడా ప్రభావం పడుతుంది. బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. – సీహెచ్ వెంకటసందీప్, సీఏ తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. బ్యాంక్ స్టేట్మెంట్లు, రుణాలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా వారి అలవాట్లను నిత్యం గమనిస్తుండాలి. చెడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – వేణు, సీఐ, నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ -
అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!
డబ్బు పొదుపు చేయాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు విభిన్న మార్గాలు ఎంచుకుంటారు. అయితే వాటిలో డిపాజిట్ చేసే డబ్బుకు ఆర్బీఐ కొంత వరకు బీమా కల్పిస్తోంది. దాంతో చాలా మంది ఎఫ్డీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో వివిధ మనీ యాప్లు, బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ సంస్థలు వంటివి ఎఫ్డీలకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అందులో ఎక్కువ వడ్డీ అందించే సంస్థలు, ఏడాదిలో వాటి వడ్డీరేట్లను కింద తెలియజేశాం.యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50% నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50%సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10% ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10% శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.05% శ్రీరామ్ ఫైనాన్స్ - 9.07% వరకు (మహిళలకు)బజాజ్ ఫైనాన్స్ - 8.65% వరకుఇండస్ ఇండ్ బ్యాంక్ - 8.25%సౌత్ ఇండియన్ బ్యాంక్ - 7.75%ఈ రేట్లు ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయి. ఇన్వెస్టర్లు ఎంచుకునే కాలపరిమితి, వారి పెట్టుబడిని బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చు.ఇదీ చదవండి: అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?9.5 శాతం వడ్డీ ఇస్తున్న మనీ యాప్‘సూపర్.మనీ’ యాప్ ఎఫ్డీపై 9.5 శాతం వడ్డీ అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఆర్బీఐ గుర్తింపు కలిగిన ఏ ఆర్థిక సంస్థలో ఎఫ్డీ ద్వారా పెట్టుబడి పెట్టినా రూ.5 లక్షల వరకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) బీమా అందిస్తుంది. అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అందుకు సంబంధిత బ్యాంకు/ ఆర్థిక సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి రూ.5 లక్షలలోపు ఎప్డీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నవారు అధిక వడ్డీలిచ్చే బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి విభిన్న మార్గాలను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
పనితీరు బాగుంటే ప్రోత్సాహకాలు
ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థంగా పని చేసేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బ్యాంకులను సారథ్యం వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, హోల్టైమ్ డైరెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్ఐ)’లో సవరణలు చేస్తున్నట్లు ప్రకటించింది.పీఎల్ఐ అందుకోవాలంటే అర్హతలురిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్ఓఏ): బ్యాంకులకు పాజిటివ్ ఆర్ఓఏ ఉండాలి. మొత్తం బ్యాంకు మిగులుపై మెరుగైన రాబడులుండాలి.ఎన్పీఏ: నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం 25 బేసిస్ పాయింట్లు ఎన్పీఏ తగ్గించాలి.కాస్ట్ టు ఇన్కమ్ రేషియో (సీఐఆర్): సీఐఆర్ 50% లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల మధ్య నిష్పత్తిని అది సూచిస్తుంది. ఒకవేళ ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఏడాదిలో మెరుగుదల చూపించాలి.ప్రోత్సాహకాలు.. ఇతర వివరాలునిబంధనల ప్రకారం బ్యాంకులు మెరుగ్గా పనితీరు కనబరిస్తే వారి సారథులకు పీఎల్ఐలో భాగంగా ఒకే విడతలో నగదు చెల్లిస్తారు. లేటరల్ నియామకాల్లో వచ్చిన వారు, డిప్యుటేషన్ పై ఉన్న అధికారులు సహా స్కేల్ 4, ఆపై అధికారులు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగం నుంచి తొలగించిన వారు దీనికి అనర్హులు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!2023-24 ఆర్థిక సంవత్సరం పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు ఆడిట్ చేసిన గణాంకాల ఆధారంగా పనితీరును లెక్కించనున్నారు. -
మభ్యపెట్టి అంటగట్టొద్దు
బ్యాంకులో డబ్బు డిపాజిట్, విత్డ్రా, క్రెడిట్ కార్డులు, లోన్లు జారీ.. వంటి కార్యకలాపాలు సాగిస్తుంటారు. దాంతోపాటు వివిధ బీమా పాలసీలు కూడా విక్రయిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా తెలిపారు.ఈ సందర్భంగా పాండా మాట్లాడుతూ..‘బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలి. మోసపూరిత బీమా పాలసీలు విక్రయించకూడదు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకస్యూరెన్స్ (బ్యాంక్ శాఖల ద్వారా బీమా పాలసీలు విక్రయించే) మార్గం చాలా ఉపయోగపడుతోంది. అయితే దీన్ని కస్టమర్లకు అందించడంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్త వహించాలి. మోసపూరిత పాలసీలను అంటగట్టకూడదు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకర్ల పాత్ర కీలకం. బీమా పాలసీలను అమ్మడాన్ని ప్రాధాన్యతగా తీసుకోకూడదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలుప్రస్తుతం మార్కెట్లో చాలా బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాలసీలు విక్రయించినందుకు సిబ్బందికి ఇన్సెంటివ్లు ప్రకటిస్తున్నారు. దాంతో కస్టమర్లకు అధిక ప్రయోజనాలు చేకూర్చని పాలసీలను, నిబంధనలు సరిగా తెలియజేయకుండా మోసపూరితంగా అంటగడుతున్నారు. దాంతో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ బ్యాంకులకు కొన్ని సూచనలు చేశారు. తాజాగా ఐఆర్డీఏఐ ఛైర్మన్ దీనిపై స్పందించారు. -
నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కేవైసీ అమలులో సరైన విధానాలు పాటించని బ్యాంకులపై చర్యలు తప్పవని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అన్నారు. సరైన పద్ధతిలో కేవైసీ పూర్తి చేయకుండా కొన్ని బ్యాంకులు ఇప్పటికే నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని చెప్పారు. దాంతో ఈ ప్రక్రియ పూర్తి చేయని బ్యాంకు కస్టమర్లు ప్రభుత్వం అందించే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) నిధులను పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో స్వామినాథన్ మాట్లాడుతూ..‘బ్యాంకులు కేవైసీ మార్గదర్శకాలను సరైన పద్ధతిలో అమలు చేస్తున్నట్లు నిర్ధారించుకోవాలి. కస్టమర్ల నుంచి కేవైసీ పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకులదే. దాన్ని సాకుగా చూపి ప్రభుత్వ డీబీటీ నగదును వినియోగదారులకు చెందకుండా చర్యలు తీసుకోకూడదు. కస్టమర్లు కేవైసీ పూర్తి చేసేందుకు బ్యాంకులు విభిన్న మార్గాలు అన్వేషించాలి. లేదంటే మనీ లాండరింగ్కు అవకాశం ఉంటుంది. కస్టమర్ల కేవైసీ వివరాలను కాలానుగుణంగా అప్డేట్ చేయడంలో బ్యాంకులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సిబ్బందిని తగినంతగా నియమించుకోవాలి. కేవైసీ అప్డేట్ కోసం కస్టమర్లు హోమ్ బ్రాంచ్లో సంప్రదించాల్సి ఉంటుంది. ఈమేరకు కస్టమర్లకు వివరాలు తెలియజేయడంతో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవేళ పత్రాలు బ్యాంకులో సమర్పించినా కేవైసీ అప్డేట్ చేయడంలో కాలయాపన చేస్తున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుఅంతర్గత అంబుడ్స్మన్ ఏర్పాటు చేయడంతోపాటు వినియోగదారు ఫిర్యాదుల యంత్రాంగంపై ఆందోళనలున్నాయని స్వామినాథన్ తెలిపారు. బ్యాంకులో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అంతర్గత అంబుడ్స్మన్ యంత్రాంగం పని చేయాలని సూచించారు. -
4.5 లక్షల ‘మ్యూల్’ ఖాతాలను స్తంభింపజేసిన కేంద్రం
సైబర్ నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునేందుకు వాడే దాదాపు 4.5 లక్షల ‘మ్యూల్’(మనీ లాండరింగ్ కోసం వాడే ఖాతాలు) బ్యాంక్ ఖాతాలను కేంద్రం స్తంభింపజేసింది. సైబర్ మోసగాళ్లు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే లావాదేవీలు జరుపుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారులు తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో జరిగిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు.బ్యాంకింగ్ వ్యవస్థలో మ్యూల్ ఖాతాలను వినియోగించుకుని సైబర్ నేరస్థులు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తంగా 4.5 లక్షల మ్యూల్ ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపారు. అందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణంI4C సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐలోని వివిధ శాఖల్లో సుమారు 40,000 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు కనుగొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 10,000 (ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా), కెనరా బ్యాంక్లో 7,000 (సిండికేట్ బ్యాంక్తో సహా), కోటక్ మహీంద్రా బ్యాంక్లో 6,000, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో 5,000 మ్యూల్ ఖాతాలు కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2023 నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో సుమారు ఒక లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. గత ఏడాదిలో సుమారు రూ.17,000 కోట్ల నగదు మోసం జరిగిందని పేర్కొన్నారు.మ్యూల్ ఖాతాల నిర్వహణ ఇలా..సైబర్ నేరస్థులు బ్యాంకు ఖాతాదారులను నమ్మించి వారికి తెలియకుండా కేవైసీ పూర్తి చేస్తారు. మనీలాండరింగ్కు పాల్పడుతూ ఖాతాదారుల ప్రమేయం లేకుండా లావాదేవీలు పూర్తి చేస్తారు. లీగల్ కేసు అయితే ఖాతాదారులను అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి బ్యాంకులోగానీ, బయటగానీ అపరిచితులు, బంధువులకు బ్యాంకు, వ్యక్తిగత వివరాలు తెలియజేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటీపీలు కూడా ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు. -
భారత్లో బెస్ట్ బ్యాంక్గా ఎస్బీఐ
ప్రభుత్వ రంగ బ్యాంక్ 'ఎస్బీఐ' (SBI) 'భారతదేశంలో అత్యుత్తమ బ్యాంక్'గా గుర్తింపు పొందింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 'బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా'గా ఎంపిక చేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ సమావేశంలో భాగంగా.. వాషింగ్టన్ డీసీలో జరిగిన 31వ యానివెర్సరీ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది. ఈ సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్.. సీఎస్ సెట్టి ఈ అవార్డును స్వీకరించారు.22,500 పైగా శాఖలు.. 62,000 కంటే ఎక్కువ ఏటీఎంలతో విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న ఎస్బీఐ.. యోనో డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా కూడా భారతీయ బ్యాంకింగ్ రంగంలో తన వృద్ధిని బలోపేతం చేస్తోంది. 2024-25 మొదటి త్రైమాసికంలో 63 శాతం సేవింగ్స్ ఖాతాలు డిజిటల్ విధానంలో ఓపెన్ అయ్యాయి. అంతే కాకుండా యోనో ద్వారా మొత్తం రూ. 1,399 కోట్ల వ్యక్తిగత రుణాల చెల్లింపులు జరిగినట్లు సమాచారం.ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలుభారతదేశంలో చాలామంది.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎస్బీఐ బ్యాంకులో ఖాతాలో ఓపెన్ చేయడానికి లేదా లావాదేవీలను జరపడానికి ఆసక్తి చూపుతారు. ఎస్బీఐ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువవుతూనే ఉంది. ఇలా మొత్తం మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. భారతదేశంలో అత్యుత్తమ బ్యాంకుగా అవతరించింది. ఈ కొత్త అవార్డు సాధించినందుకు స్టమర్లకు, ఉద్యోగులకు, ఇతర వాటాదారులందరికీ ఎస్బీఐ ధన్యవాదాలు తెలిపింది.SBI was recognised as the Best Bank in India for the year 2024 by Global Finance Magazine at its 31st Annual Best Bank Awards event, which took place during the sidelines of International Monetary Fund (IMF)/ World Bank (WB) Annual Meetings 2024 at Washington, D.C., United… pic.twitter.com/ZEz94Hn0QN— State Bank of India (@TheOfficialSBI) October 26, 2024 -
బ్యాంకు డిపాజిట్లపై గరిష్ట వడ్డీ
బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ పొందాలనుకునే వారికి ఇదే మంచి తరుణం. ప్రస్తుతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయితే భవిష్యత్తులో వీటిని తగ్గించే అవకాశముందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన సంకేతాలను అందించింది. డిసెంబర్కు పావు శాతం, వచ్చే మార్చి నాటికి మరో పావు శాతం కలిపి.. ఆరు నెలల్లో వడ్డీ రేట్లు అర శాతం వరకూ తగ్గుతాయని అంచనా. ఇప్పటికే అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడంతో మన దేశంలోనూ వడ్డీ రేట్లు తగ్గుతాయనుకుంటుండగా.. ద్రవ్యోల్బణం సాకుతో ఆర్బీఐ తగ్గింపును వాయిదా వేసింది. దీంతో బ్యాంకులు కూడా అధిక వడ్డీ రేటును అందిస్తున్న పరిమిత కాల డిపాజిట్ల పథకాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ ప్రజలకు 7.10 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీని అందిస్తుండగా, ప్రైవేటు రంగ బ్యాంకులు 7.25 నుంచి 8.10 శాతం వరకు అందిస్తున్నాయి. – సాక్షి, అమరావతికనిష్ట స్థాయికి డిపాజిట్లు.. మేల్కొన్న బ్యాంకులుదేశీయ అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత కలశ, అమృత వృష్టి పేరుతో ప్రవేశపెట్టిన రెండు ప్రత్యేక డిపాజిట్ల పథకాలను 31 మార్చి, 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 444 రోజుల కాల పరిమితి ఉన్న అమృత వృష్టి పథకంపై 7.25 శాతం, 400 రోజుల అమృత కలశ పథకంపై 7.10 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తోంది. అతి పెద్ద ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ నాలుగేళ్ల ఏడు నెలల కాలపరిమితికి 7.40 శాతం వడ్డీని అందిస్తోంది. చైతన్య గోదావరి వంటివి ఏడాది దాటి.. రెండేళ్ల లోపు కాల పరిమితికి 8.10 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కొంతకాలంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉండి బంగారం, స్టాక్ మార్కెట్లు మంచి రాబడి ఇస్తుండటంతో ప్రజలు బ్యాంకు డిపాజిట్ల వైపు అంతగా మొగ్గు చూపలేదు. దీంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకుల డిపాజిట్లు కనిష్ట స్థాయికి చేరాయి. దీంతో ఇప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచి డిపాజిట్లను పెంచుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ స్థాయి వడ్డీ రేట్లు ఎంతోకాలం కొనసాగే అవకాశం లేదని, దీర్ఘకాలిక డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి తరుణమంటున్నారు. -
అక్టోబర్లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?
సెప్టెంబర్ నెల ముగుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవుదినాల్లో పబ్లిక్ హాలిడేస్, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాల సాధారణ సెలవులు ఉన్నాయి.సెలవుల పూర్తి జాబితా➤అక్టోబర్ 1: రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు 2024 (జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి (జాతీయ సెలవుదినం)➤అక్టోబర్ 3: నవరాత్రి (జైపూర్)➤అక్టోబర్ 5: ఆదివారం➤అక్టోబర్ 10: దుర్గాపూజ - మహా సప్తమి (అగర్తల, గౌహతి, కోహిమా, కోల్కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 11: దసరా - దుర్గా అష్టమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్లలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 12: రెండవ శనివారం / విజయదశమి (తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 13: ఆదివారం➤అక్టోబర్ 14: దుర్గా పూజ (గ్యాంగ్టక్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 16: లక్ష్మీ పూజ (అగర్తల, కోల్కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి (బెంగళూరు, గౌహతి, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 20: ఆదివారం➤అక్టోబర్ 26: నాల్గవ శనివారం➤అక్టోబర్ 27: ఆదివారం➤అక్టోబర్ 31: దీపావళి (దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు)ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
టాటా వాహనాలకు ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాణిజ్య వాహన కస్టమర్లకు రుణాలను అందించేందుకు ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి.చిన్న, తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు టాటా మోటర్స్ తెలిపింది. భవిష్యత్తులో అన్ని వాణిజ్య వాహనాలకు విస్తరించనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ 55 టన్నుల వరకు సామర్థ్యం గల కార్గో వాహనాలను తయారు చేస్తోంది. అలాగే పికప్స్, ట్రక్స్తోపాటు 10 నుంచి 51 సీట్ల బస్లను సైతం విక్రయిస్తోంది. -
భారత్ అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. టెక్నాలజీతో కొత్త మార్పులు.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్దే ఉంటోందన్నారు.అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
‘డిపాజిట్’ వార్!
బ్యాంకింగ్ వ్యవస్థలో ఇప్పుడు డిపాజిట్ల పోరు మొదలైంది. రుణాలు ఇస్తున్నంత జోరుగా డిపాజిట్ల సమీకరణ జరగడం లేదంటూ ఆర్బీఐ పదేపదే హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల మోత మోగుతోంది. అధిక వడ్డీ రేట్ల రేసులో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ముందుండటం గమనార్హం!డిపాజిట్ల సమీకరణలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు) దూసుకెళ్తున్నాయి. దాదాపు అరడజను ఎస్ఎఫ్బీలు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై 8% శాతం పైగా వడ్డీరేటును ఆఫర్ చేస్తూ డిపాజిటర్లను ఆకర్షిస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బడా బ్యాంకులు, ఇతర వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఏకంగా 1 శాతం పైగానే అధికంగా వడ్డీరేటును ఆఫర్ చేస్తుండటం గమనార్హం. గత కొన్నేళ్లుగా డిపాజిట్ రేట్లు నేలచూపులు చూడటంతో పాటు షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు ఇతరత్రా ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు ఆకర్షించడంతో ఇన్వెస్టర్లు తమ పొదుపు నిధులను చాలా వరకు అటువైపు మళ్లిస్తున్నారు. దీంతో కొంతకాలంగా బ్యాంకుల్లో డిపాజిట్లు వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఆర్బీఐ తీవ్రంగా దృష్టి పెట్టడంతో బ్యాంకులు మళ్లీ రేట్ల పెంపు, ప్రత్యేక స్కీమ్ల ద్వారా డిపాజిట్ల సమీకరణ వేట మొదలు పెట్టాయి.ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’జులై నుంచి జోరు...ఈ ఏడాది జూన్లో డిపాజిట్లు, రుణ వృద్ధి మధ్య అంతరం ఆల్టైమ్ గరిష్టానికి ఎగబాకడంతో రేట్ల పెంపు మొదలైంది. బ్యాంకులన్నీ వరుస కట్టడంతో జులై నుంచి ఇది వేగం పుంజుకుంది. ఈ రేసులో ఎస్ఎఫ్బీలు బ్యాంకులతో పోటాపోటీగా వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఉత్కర్ష్, సూర్యోదయ ఎస్ఎఫ్బీలు 2–3 ఏళ్ల వ్యవధి ఫిక్సిడ్ డిపాజిట్లపై 8.5% వడ్డీని ఇస్తున్నాయి. ఈక్విటాస్ కూడా రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్డీలపై 8.5% వడ్డీరేటును అందిస్తోంది. యూనిటీ ఎస్ఎఫ్బీ అయితే 1,001 రోజుల ఎఫ్డీపై ఏకంగా 9% వడ్డీ ఇస్తుండటం విశేషం. ఈ విషయంలో వాణిజ్య బ్యాంకులు వెనుకబడుతున్నాయి. ఎస్బీఐ 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్పై అత్యధికంగా 7.25% వడ్డీ ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గరిష్ట డిపాజిట్ రేటు 7.4%. అయితే, ఈ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అదనంగా అర శాతం వడ్డీ ఇస్తున్నాయి. కాగా, బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కూడా 8% పైగా వడ్డీ ఆఫర్ చేస్తూ బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ 1–3 ఏళ్ల ఎఫ్డీలపై 8.25% వడ్డీ ఇస్తుండగా.. బజాజ్ ఫైనాన్స్ 42 నెలల డిపాజిట్కు 8.65% వడ్డీ రేటు అందిస్తోంది. -
మన దేశంలోనూ టైమ్ బ్యాంక్
విశాఖపట్నానికి చెందిన సత్యమూర్తి విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తన ఇద్దరు పిల్లలను అమెరికా పంపించి బాగా చదివించారు. ఉన్నతోద్యోగాల్లో వారు అక్కడే సెటిల్ అయ్యారు. ఏడాదికి ఓసారి భార్యతో కలిసి అమెరికాలోని కొడుకుల వద్దకు వెళ్లి కొద్దిరోజులుండి రావడం ఆయనకు అలవాటు. అయితే, ఏడాది క్రితం భార్య చనిపోవడంతో ఇక్కడ ఒంటరైపోయారు. తమ వద్దకు వచ్చేయమని కొడుకులు కోరుతున్నా ఆయన ఒప్పుకోవడం లేదు. తాను టైమ్ బ్యాంక్లో కొంత సమయం దాచుకున్నానని, తనకు అవసరం వచ్చినప్పుడు తనను చూసుకునేందుకు మనుషులు వస్తారని చెప్పడంతో కొడుకులు ఆశ్చర్యపోయారు. విలువైన నగలు, డాక్యుమెంట్లను లాకర్లో దాచుకున్నట్టు బ్యాంకులో టైమును కూడా దాచుకోవచ్చా..అలాంటి అవకాశం కూడా ఉందా!! సాక్షి, అమరావతి: ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. జీవితాలు అపార్ట్మెంట్లలో బందీ అయ్యాయి. ఇది ఒంటరిగా ఉన్న వృద్ధులకు పెద్ద సవాలుగా మారింది. విదేశాల్లోనో లేక మరో దూర ప్రాంతంలోనో ఉండటంతో తల్లిదండ్రులను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో పిల్లలు ఉన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకో లేక ఇంటి వద్దే కొన్ని పనులు చేసిపెట్టేందుకో ఓ వయసు దాటాక ప్రతి ఒక్కరికీ మరొకరి సాయం తప్పనిసరైంది. ఇలాంటి అవసరాలు ఉన్న వారిని చూసుకునేందుకు రోటరీ సంస్థ ‘టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో సామాజిక కమ్యూనిటీ ప్రాజెక్ట్ని అందుబాటులోకి తెచ్చి కుటుంబ అవసరాల అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.ఏమిటీ టైమ్ బ్యాంక్.. అరవై ఏళ్లు దాటి ఆరోగ్యవంతమైన వ్యక్తి టైమ్ బ్యాంక్ సభ్యుడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సమయంలో సహాయం చేయడం ద్వారా వారి సమయాన్ని కొంత ఇతరులకు వెచ్చించవచ్చు. ఇలా ఎన్ని గంటలు వెచి్చస్తే అన్ని గంటలు సదరు సమయం కేటాయించిన వ్యక్తి పేరుపై అతని ఖాతాలో ఆ సమయం జమ అవుతుంది. దానిని వారు అవసరమైన సమయంలో ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ సభ్యులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా ఇతర అవసరాలు ఉన్నపుడు ఇంకో సభ్యుడు వీరికి సాయం చేస్తారు. ఇందులో సభ్యులు.. సేవ కోరేవారి మధ్య డబ్బు లావాదేవీ ఉండదు. ఉదాహరణకు, ఒక సభ్యుడు వారానికి నాలుగు గంటలు మరొకరికి సేవ చేస్తున్నట్టయితే, అతను నెలకు 16 గంటలు సంపాదిస్తాడు లేదా ఆదా చేస్తాడు. ఇలా సంవత్సరానికి 192 గంటలు లేదా 8 రోజులు అతని/ఆమె ఖాతాలో జమ అవుతాయి. ఈ సమయాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత విడతల వారీగా లేదా ఒకేసారి తన అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చు. దీనికోసం సదరు బ్యాంకులో నమోదు చేసుకుంటే మరో సభ్యుడు లేదా సభ్యురాలు వచ్చి సేవలందిస్తారు. సరళంగా చెప్పాలంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజి్రస్టేషన్ అనేది జీరో బ్యాలెన్స్తో బ్యాంక్ ఖాతాను తెరవడం లాంటిది. పెద్దలకు సేవ చేయడం ద్వారా డబ్బుకు బదులు సమయాన్ని జమ చేసుకుంటారు. వారి అవసరాల సమయంలో వారి డిపాజిట్ సమయానికి సమానమైన సమయాన్ని విత్డ్రా చేసుకుంటారు. ప్రపంచంలో 34 దేశాల్లో అమలు స్విట్జర్లాండ్లో మొదలైన టైమ్ బ్యాంక్ కాన్సెప్్టను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాలు అమలు చేస్తున్నాయి. ఇందులో యూకే, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, స్పెయిన్, గ్రీస్, సింగపూర్, తైవాన్, సెనెగల్, అర్జెంటీనా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో 300కు పైగా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 40 రాష్ట్రాల ప్రభుత్వాలు టైమ్ బ్యాంక్ను అమలు చేస్తున్నాయంటే వీటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనూ ఈ తరహా కాన్సెప్ట్ అవసరమని 2018లో జాతీయ మానవ హక్కుల సంఘం కేంద్రానికి సూచించింది. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే 2019లో టైమ్ బ్యాంక్ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం 50 వేల మంది వలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతోపాటు సామాజిక సేవల్లో ముందుండే రోటరీ క్లబ్ కూడా టైమ్ బ్యాంక్ను ప్రారంభించగా, ఇందులో 5 వేల మంది వరకు సభ్యులుగా చేరారు. 2012లో స్విట్జర్లాండ్లో ప్రారంభండబ్బుతో అవసరం లేకుండా ‘మనిíÙకి మనిషి సాయం’ అందించే వినూత్న విధానానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నాంది పలికింది. స్విస్ ప్రభుత్వం వృద్ధులకు ప్రత్యేకంగా పెన్షన్ అందిస్తోంది. అయితే, తమకు డబ్బు కంటే సాయం చేసేవారు అవసరమని, చాలా సందర్భాల్లో ఏ పనీ చేసుకోలేకపోతున్నామని అక్కడి వృద్ధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తమతో మాట్లాడేందుకు మనిíÙని తోడు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన అక్కడి ఫెడరల్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసి అధ్యయనం చేసింది. దేశంలో వృద్ధుల్లో అత్యధికులు ఒంటరి జీవితాలు గడుపుతున్నారని, వారు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మనిషి సాయం కోరుతున్నట్టు గుర్తించారు. దాంతో ఇంట్లో ఉండే ఒంటరి వృద్ధులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012లో ‘టైమ్ బ్యాంక్’ను అక్కడి ప్రభుత్వం ప్రారంభించి ‘టైమ్ ఈజ్ మనీ’ కాన్సెప్్టను వర్తింపజేస్తోంది. ఈ కాన్సెప్ట్ని కచ్చితంగా ఆచరించడంలో స్విట్జర్లాండ్ ముందడుగు వేసింది. ఆ దేశంలో పౌరులు తమ సమయాన్ని బ్యాంకుల్లో ‘పొదుపు’ చేసేలా ప్రోత్సహించింది. ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో వలంటీర్గా రిజిస్టర్ చేసుకుంటే వారిని అవసరం ఉన్నవారికి అలాట్ చేస్తారు. అలా వారు తోటపని, ఇంటి పని, బయటకి తీసుకెళ్లడం, కబుర్లు చెప్పడం, వృద్ధులు చెప్పే మాటలు వినడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి పనుల్లో సాయంగా ఉంటారు. వీరు ఎన్ని గంటలు కేటాయించారో అంత సమయం సాయం చేసిన వ్యక్తి అకౌంట్లో జమ చేయడం ప్రారంభించారు. -
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు
సమయం అర్థరాత్రి ఒంటి గంట.. నగరం గాఢ నిద్రలోకి జారుకున్న వేళ.. హఠాత్తుగా బ్యాంకు సైరన్ పెద్దగా మోగింది... స్థానికులకు ఉలిక్కిపడి లేచారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు... బ్యాంకులోకి దొంగలెవరో ప్రవేశించారని అనుకున్నారు. అయితే వారు బ్యాంకు దగ్గరకు చేరుకుని అక్కడ జరిగినదేమిటో తెలుసుకుని నవ్వాలో ఏడవాలో తెలియక తెల్లముఖం వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో చోటుచేసుకుంది.హర్డోయ్: ఉత్తరప్రదేశ్లోని షాహాబాద్లోని హర్దోయ్లో రాత్రి ఒంటి గంటకు అకస్మాత్తుగా బ్యాంక్ సైరన్ మోగింది. అప్రమత్తమైన స్థానిక పోలీసులు బ్యాంకు దగ్గరకు చేరుకున్నారు. బ్యాంకు క్యాషియర్ను పిలిపించి, లోపల తనిఖీలు చేశారు. గంటల తరబడి వెదికినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఎలుకలు సైరన్ వైరును కొరికినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. అందుకే ఎమర్జెన్సీ సైరన్ మోగిందని తెలుసుకున్నారు. ఊహించిన విధంగా ఏమీ జరగకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చకున్నారు.షహబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్దనున్న ఆర్యవర్ట్ గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో బ్యాంకులోని ఎమర్జెన్సీ అలారం ఒక్కసారిగా మోగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై బ్యాంకు చుట్టుపక్కల దొంగలెవరైనా ఉన్నారేమోనని తనిఖీలు కూడా చేశారు. అయితే ఎలుకల కారణంగా సైరన్ మోగిందని తెలుసుకుని నవ్వుకున్నారు. ఇది కూడా చదవండి: నవ్వుతూ.. నవ్విస్తూ.. -
రుణాలు పీక్... డిపాజిట్లు వీక్
న్యూఢిల్లీ: రుణాల పెరుగుదల డిపాజిట్ వృద్ధిని మించిపోతోందని, ఇది బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతా) సవాళ్లకు దారితీయవచ్చని ఫిక్కీ–ఐబీఏ నివేదిక ఒకటి పేర్కొంది. రుణ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను పెంచడం అలాగే రుణ రేటును తక్కువగా ఉంచడం బ్యాంకుల ఎజెండాలో అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) విభాగం వాటా తగ్గినట్లు సర్వేలో పాల్గొన్న బ్యాంకుల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ తెలియజేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు సహా మొత్తం 22 బ్యాంకులు (మొత్తం అసెట్ పరిమాణంలో వీటి వాటా 67 శాతం) ఈ సర్వేలో పాల్గొన్నాయి. 2024 జనవరి నుంచి జూన్ మధ్య జరిగిన ఈ 19వ దఫా ఫిక్కీ–ఐబీఏ సర్వే నివేదికలో వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్ని..2024 ప్రథమార్థంలో 80 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు కాసా డిపాజిట్ల వాటా తగ్గుదలను నమోదుచేసుకోగా, సగానికి పైగా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇదే విషయాన్ని తెలిపాయి. అయితే అధిక, ఆకర్షణీయమైన రేట్ల కారణంగా టర్మ్ డిపాజిట్లు వేగం పుంజుకున్నాయి. సర్వేలో 71% బ్యాంకులు గత ఆరు నెలల్లో మొండిబకాయిల స్థాయిలు తగ్గిన్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల రేటు 90 శాతంగా ఉంటే, ప్రైవేటు రంగ బ్యాంకుల రేటు 67 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాలు, లోహాలు, ఇనుము, ఉక్కు వంటి రంగాల్లో వృద్ధికి తగినట్లుగా దీర్ఘకాలిక రుణ డిమాండ్ కనబడుతోంది. ప్రత్యేకించి మౌలిక విభాగం పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ రంగానికి రుణ డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు సర్వేలో 77% బ్యాంకులు వెల్లడించాయి. బ్యాంకులు– ఫిన్టెక్ కంపెనీల మధ్య భాగస్వామ్యం– నూతన ఆవిష్కరణలు, సేవల విస్తృతి, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవడం వంటి సానుకూల చర్యలకు దోహదపడుతుంది. ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్ఏటీఎం చానెల్ నిర్వహణ విషయంలో వ్యయాలు తగ్గాలి. వ్యూహాత్మక స్థానాలను ఎంచుకోవడం, ఏటీఎం లావాదేవీల కోసం ఇంటర్ఛేంజ్ ఫీజులను పెంచడం, వ్యయాలు– ప్రయోజనాలను విశ్లేషించడం, సాంకేతికతను పెంచడం వంటి పలు కీలక సూచనలను బ్యాంకర్లు చేశారు. -
తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) రుణ వృద్ధి 25–27 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 28 శాతంగా నమోదైంది. ఎస్ఎఫ్బీలు విభాగాలవారీగా, భౌగోళికంగా కార్యకలాపాలు విస్తరిస్తే రుణ వృద్ధి మెరుగుపడుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదిక పేర్కొంది.క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఎస్ఎఫ్బీల మూలధన నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్పటికీ తక్కువ వ్యయాలతో డిపాజిట్లను సేకరించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో రుణ వృద్ధికి అవసరమయ్యే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ, డిపాజిట్యేతర వనరులను అన్వేషిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా ఉన్న సూక్ష్మరుణాలతో పాటు తనఖాలు, అన్సెక్యూర్డ్ రుణాలు మొదలైన కొత్త మార్గాల్లో రుణ వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు చిన్న బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని నివేదిక తెలిపింది. కొత్త అసెట్స్ విభాగాల్లో రుణ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 40 శాతం వరకు ఉండొచ్చని, సంప్రదాయ విభాగాల్లో ఇది 20 శాతంగా ఉండొచ్చని సంస్థ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు.ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు యాపిల్ కంటెంట్మరిన్ని విశేషాలు..నెట్వర్క్పరంగా ఎస్ఎఫ్బీల బ్రాంచీల సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి రెట్టింపై 7,400కి చేరింది. తూర్పు రాష్ట్రాల్లో శాఖల సంఖ్య అత్యధికంగా ఉంది. 2019 మార్చి నాటికి మొత్తం శాఖల్లో తూర్పు రాష్ట్రాల్లో 11 శాతం ఉండగా ప్రస్తుతం ఇది 15 శాతానికి పెరిగింది. సగానికి పైగా శాఖలు, గణనీయంగా వృద్ధి అవకాశాలున్న గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి.గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బ్యాంకింగ్ రంగానికి పూర్తి భిన్నంగా, ఎస్ఎఫ్బీల్లో రుణ వృద్ధికన్నా బల్క్ డిపాజిట్ల వృద్ధి 30 శాతం అధికంగా నమోదైంది. 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ డిపాజిట్లు 22 శాతమే. చౌకగా ఉండే కరెంట్–సేవింగ్స్ డిపాజిట్ల వాటా 35 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది.ఎస్ఎఫ్బీలు టర్మ్ డిపాజిట్లపై ఆధారపడటం ఇకపైనా కొనసాగనుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీ లోన్ల విభాగంలో రూ.6,300 కోట్ల లావాదేవీలు జరగ్గా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,000 కోట్లకు చేరాయి. -
శ్రీకృష్ణాష్టమికి బ్యాంకులు పనిచేస్తాయా?
జన్మాష్టమి.. దీనినే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది హిందువులు అత్యంత వేడుకగా చేసుకునే పండుగ. ఈసారి జన్మాష్టమి సోమవారం అంటే ఆగస్టు 26న వచ్చింది. ఆగస్టు 24, 25వ తేదీలు శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. మరి సోమవారం, శ్రీకృష్ణాష్టమి నాడు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా మూసివుంటాయా?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26న సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయయనున్నారు. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్టక్, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, పట్నా, రాయ్పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్లలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేయవు. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు తమ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సెలవుల జాబితాను పొందవచ్చు.కాగా త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, న్యూఢిల్లీ, గోవాలలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేస్తాయి. అయితే సోమవారం సెలవు ఉన్న బ్యాంకులకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మొదలైన సేవలు ఎప్పటిలానే కొనసాగుతాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు బ్యాంకు సేవలను పొందవచ్చు. -
మాకెందుకు రుణమాఫీ కాలేదు
సాక్షి, నెట్వర్క్: రుణమాఫీ జరగలేదంటూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. పలుచోట్ల బ్యాంకుల వద్ద బారులుదీరి మాకెందుకు రుణమాఫీ కాలే దంటూ బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ⇒ సిద్దిపేట జిల్లా తోటపల్లిలో రైతులు ఇండియన్ బ్యాంక్ సిబ్బందిని బయటకు పంపి బ్యాంకును మూసివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బ్యాంక్ పరిధిలో 1,300 మంది రైతులుంటే కేవలం 400 మందికి మాత్రమే మాఫీ అయ్యిందని మండిపడ్డారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగగా, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ⇒ మెదక్ మండల పరిధిలో అత్యధికంగా రైతులు ఆటోనగర్లోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు వచ్చే రైతుల రద్దీ పెరగ్గా, బ్యాంకు అధికారులు రోజూ కొందరికి టోకెన్లు ఇచ్చి వివరాలు చెబుతున్నారు. ఆదివారం సెలవు, సోమవారం రాఖీపౌర్ణమి కావడంతో బ్యాంకుకు రైతులు పెద్దగా రాలేదు. మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు రోడ్డువెంట బారులు తీరారు. ఈ క్రమంలో చిన్నపాటి వర్షం పడుతున్నా, లెక్క చేయకుండా వరుసలోనే నిలబడ్డారు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతువేదికల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద, బ్యాంకుల వద్ద రైతులు బారులు దీరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ యూనియన్ బ్యాంకుకు మంగళవారం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘సారూ.. జర మా ఖాతా చూడండి. ఎందుకు మాఫీ కాలేదో చెప్పండి’ అంటూ వేడుకున్నా రు. మరోవైపు వరంగల్ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల వద్ద, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, నర్సింహులపేటలలో, జనగామ కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ⇒ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో అన్నదాతలు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. భూషణరావుపేట గ్రామానికి చెందిన రైతు ముస్కు సాగర్రెడ్డి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కథలాపూర్ ఎస్సై నవీన్కుమార్ రైతు చేతిలో నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కు న్నారు. పంటల సాగుకు చేసిన అప్పు పెరిగిపోయిందని, రుణమాఫీ కాలేదని సాగర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేటకు చెందిన రైతు సోమ శ్రీనివాస్ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. రైతు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన భార్య సోమలత పేరిట ముత్యంపేట ఇండియన్ బ్యాంక్లో రూ.1.21 లక్షల రుణం ఉందని, మాఫీకి అన్ని అర్హతలూ ఉన్నా, కాలేదన్నారు. ⇒ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహారాష్ట్ర బ్యాంకు ఎదుట బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గుడిహ త్నూర్ మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.మాకు రుణమాఫీ కాలేదు⇒ ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు రైతుల ఫిర్యాదు⇒ రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారు బ్యాంకులు ⇒ సందర్శించే షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తమకు రుణమాఫీ కాలేదని, మాఫీలో అనేక సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని 566 రైతు వేదికల రైతులతో మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా అధికారులకు ఈ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, నాగర్కర్నూల్, జనగామ, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్తోపాటు పలు రైతు వేదికలకు చెందిన రైతులు పంట రుణ మాఫీలో సమస్యలు ఉన్నాయని తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, సంచాలకులు గోపి పంట రుణాల మాఫీ పథకానికి సంబంధించిన వివిధ ఫిర్యాదులపై స్పష్టత ఇచ్చారు. రఘునందన్రావు మాట్లాడుతూ, కుటుంబ సమూహానికి సంబంధించిన సమస్యలకు ప్రభుత్వం విధివిధానాలను జారీ చేస్తుందని తెలిపారు. కుటుంబ రుణ మొత్తాలు రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రైతులు బ్యాంకులను సందర్శించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ను ప్రకటిస్తుందని తెలిపారు. ఇంకా రుణమాఫీ పొందని రైతులు ఆధార్ కార్డులకు సంబంధించిన సమాచారం, బ్యాంక్ డేటాలో తప్పులు, పట్టా పాస్ పుస్తకాల సమస్యలు, పేరు సరిగ్గా లేకపోవడం మొదలైన ఫిర్యాదు లను మండల స్థాయిలో సమర్పించవచ్చని సూచించారు.పంట రుణమాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కారమయ్యే వరకు అన్ని పని దినాల్లో మండల స్థాయిలో నియమించబడిన నోడల్ అధికారులు అందు బాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన ప్రతి రైతులు రుణమాఫీ ప్రయో జనం పొందుతారని తెలిపారు. ఫిర్యా దుల స్వీకరణకు నిర్దిష్ట కటాఫ్ తేదీ లేనందున రుణాల మాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు రైతులు ఎప్పుడైనా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చన్నారు. మండల స్థాయిలో నోడల్ అధికారు లను నియమించాలని, రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వ్యవసాయ సంచాలకులు గోపి కిందిస్థాయి అధికారులను కోరారు. అన్ని పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పంట రుణా ల మాఫీ ఫిర్యాదులకు హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. -
పటిష్టంగా భారత ఎకానమీ
దేశ ఆర్థిక వ్యవస్థసహా పలు అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిశోధనా నివేదికలు, ఆర్టికల్స్ సానుకూల అంశాలను వెలువరించాయి. అయితే ఈ నివేదికలు, ఆర్టికల్స్ ఆర్బీఐ బులెటిన్లో విడుదలవుతాయి తప్ప, వీటిలో వ్యక్తమయిన అభిప్రాయాలతో సెంట్రల్ బ్యాంకు ఏకీభవించాల్సిన అవసరం లేదు. తాజా ఆవిష్కరణలను చూస్తే...ధరల్లో స్థిరత్వం..‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ శీర్షికన విడుదలైన ఆర్టికల్ ప్రకారం ఆగస్టులో తృణధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరల్లో నియంత్రణ కనబడింది. ఆయా అంశాలు ఆగస్టు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్ 2024లో 5.1 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, జూలైలో ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.5 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని టీమ్ రూపొందించిన ఈ ఆర్టికల్, గ్రామీణ వినియోగం ఊపందుకుందని, ఇది డిమాండ్, పెట్టుబడులకు దోహదపడుతుందని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుదల..ఆర్బీఐ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానం వల్ల తయారీ రంగంలో 2022–23లో ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమైందని ఆర్థికవేత్తలు పాత్రా, జాయిస్ జాన్, ఆసిష్ థామస్ జార్జ్లు రాసిన మరో ఆర్టికల్ పేర్కొంది. అయితే ఆహార ద్రవ్యోల్బణం తీవ్రత మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోందని ‘ఆర్ ఫుడ్ ప్రైసెస్ స్పిల్లింగ్ ఓవర్? (మొత్తం సూచీ ద్రవ్యోల్బణానికి ఆహార ధరలే కారణమా?) అన్న శీర్షికన రాసిన బులెటిన్లో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఆహార ధరల ఒత్తిళ్లు కొనసాగితే జాగరూకతతో కూడిన ద్రవ్య పరపతి విధానం అవసరమని ఈ ఆర్టికల్ పేర్కొంది. ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!నిధులకోసం ప్రత్యామ్నాయాలు..డిపాజిట్ వృద్ధిలో వెనుకబడి ఉన్నందున కమర్షియల్ పేపర్, డిపాజిట్ సర్టిఫికేట్ వంటి ప్రత్యామ్నాయ వనరుల వైపు బ్యాంకింగ్ చూస్తోందని బులెటిన్ ప్రచురితమైన మరో ఆర్టికల్ పేర్కొంది. 2024–25లో ఆగస్టు 9 వరకూ చూస్తే, ప్రైమరీ మార్కెట్లో రూ.3.49 లక్షల కోట్ల సర్టిఫికేట్లు ఆఫ్ డిపాజిట్ (సీడీ) జారీ జరిగిందని ఆర్టికల్ పేర్కొంటూ, 2023–24లో ఇదే కాలంలో ఈ విలువ రూ.1.89 లక్షల కోట్లని వివరించింది. ఇక 2024 జూలై 31 నాటికి కమర్షియల్ పేపర్ల జారీ విలువ రూ.4.86 లక్షల కోట్లయితే, 2023 ఇదే కాలానికి ఈ విలువ రూ.4.72 లక్షల కోట్లని తెలిపింది. -
డిపాజిట్ల పెంపుపైనే దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) డిపాజిట్ వృద్ధిని మెరుగుపరచాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్థికమంత్రి ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో బ్యాంకింగ్ పనితీరు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గత కొన్ని నెలల్లో రుణ వృద్ధి కంటే డిపాజిట్ల పరుగు 300–400 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వెనుకబడి ఉంది. ఇలాంటి పరిస్థితి బ్యాంకులకు అసెట్–లయబిలిటీ (రుణాలు–డిపాజిట్లు) అసమతుల్యతను సృష్టిస్తోంది. ప్రత్యామ్నాయ పెట్టుబడులపై ఆసక్తి వల్లే...ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు గృహ పొదుపులు మారడంవల్లే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి రేటు పడిపోతోందన్న ఆందోళనలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇటీవలే స్వయంగా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ విస్తారమైన బ్రాంచ్ నెట్వర్క్ను ఉపయోగించుకోవడం, అలాగే వినూత్న ఉత్పత్తులు, సేవల ద్వారా డిపాజిట్లను సమీకరించాలని ఆయన కోరారు. ‘పెరుగుతున్న క్రెడిట్ డిమాండ్ను తీర్చడానికి బ్యాంకులు స్వల్పకాలిక నాన్–రిటైల్ డిపాజిట్లు, ఇతర సాధనాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. డిపాజిట్లు పెరక్కపోవడం బ్యాంకింగ్ వ్యవస్థను నిర్మాణాత్మక లిక్విడిటీ సమస్యలకు గురిచేసే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు. రిటైల్ కస్టమర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయని పేర్కొన్న ఆయన, ఫలితంగా బ్యాంకులు రుణ వృద్ధికి వెనుకంజలో ఉన్న డిపాజిట్లతో నిధుల విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ బ్యాంకుల చీఫ్లతో ఆరి్థకమంత్రి డిపాజిట్లపైనే ప్రత్యేకించి దిశా నిర్దేశం చేయడం గమనార్హం. ఈ సమావేశంలో చర్చనీయాంశలను ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సమీక్షా సమావేశ ముఖ్యాంశాలు.. 2024–25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన మొదటి సమీక్ష సమావేశం ఇది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం సూర్య ఘర్, పీఎం విశ్వకర్మ యోజనతోసహా ప్రభుత్వం వివిధ ప్రధాన పథకాల అమలులో బ్యాంకుల ఆరి్థక పనితీరు, పురోగతిని ఆర్థిక మంత్రి సమీక్షించారు.కోర్ బ్యాంకింగ్ వ్యాపారంపై దృష్టి సారించాలని, వినూత్న ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా డిపాజిట్ వృద్ధి వేగాన్ని పెంచాలని బ్యాంకుల చీఫ్ను ఆర్థిక మంత్రి కోరారు.సమర్థవంతమైన కస్టమర్ సేవల డెలివరీ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లతో మెరుగైన సంబంధాలను కలిగి ఉండాలని సీతారామన్ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో ఉద్యోగులు తమ కస్టమర్లతో కనెక్ట్ అయ్యేలా చూడాలని ఆమె బ్యాంకులను కోరారు.వడ్డీ రేటు విషయంలో ఆర్బీఐ బ్యాంకింగ్కు స్వేచ్ఛనిచ్చిందని, ఆ స్వేచ్ఛను ఉపయోగించి బ్యాంకులు డిపాజిట్లను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలని ఆమె సూచించారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఆందోళనలు, ఆర్థిక రంగానికి ఎదురయ్యే నష్టాలపై కూడా ఈ సమీక్షా సమావేశం చర్చించింది. మోసం, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన సమస్యలు అలాగే మొండిబకాయిల సమస్యల పరిష్కారానికి సంబంధించి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) పురోగతికి వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.ప్రభుత్వ బ్యాంకుల పనితీరుపై హర్షం2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం రూ. 1.4 లక్షల కోట్లను దాటింది. దాదాపు రూ.1 లక్ష కోట్ల అధిక బేస్పై గత ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కలిసి 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.1,04,649 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. ఎక్స్ఛేంజీల్లో ప్రచురితమైన సంఖ్యల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ.141,203 కోట్ల మొత్తం లాభంలో మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వాటానే 40 శాతానికి పైగా ఉంది. ఎస్బీఐ ఆర్జిత లాభం రూ.61,077 కోట్లయితే, వార్షిక వృద్ధి 22 శాతం. 2022–23లో ఈ వృద్ధి రూ.50,232 కోట్లు. 2023–24 ఆరి్థక సంవత్సరం అన్ని వ్యాపార అంశాల్లో బ్యాంకింగ్ మెరుగైన పనితీరును ప్రదర్శించడంపట్ల తాజా సమీక్షా సమావేశంలో హర్షం వ్యక్తం అయ్యింది. నికర మొండిబకాయిలు 0.76 శాతానికి తగ్గడం, మూలధన నిష్పత్తి తగిన స్థాయిలో 15.15 శాతంగా నమోదుకావడం, నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం) 3.22 శాతంగా నమోదుకావడం, షేర్ హోల్డర్లకు రూ.27,830 కోట్ల డివిడెండ్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ సానుకూల అంశాలు మార్కెట్ల నుండి మూలధనాన్ని సేకరించే విషయంలో ప్రభుత్వ బ్యాంకుల సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచాయని సమీక్షా సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో డీఎఫ్ఎస్ సెక్రటరీ వివేక్ జోషి, సెక్రటరీ డిజిగ్నేటెడ్ ఎం నాగరాజు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (డీఎఫ్ఎస్) సీనియర్ అధికారులు పాల్గొన్నారు.అధిక వడ్డీ మార్గాలపై యువత దృష్టి: ఎస్బీఐదేశంలోని యువ జనాభా బ్యాంకింగ్ డిపాజిట్లపై కాకుండా అధిక వడ్డీరేటు లభించే ఇతర మార్గాలను అన్వేషిస్తోందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికవేత్తల నివేదిక తాజాగా పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని దాదాపు సగం టర్మ్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్లవేనని పేర్కొన్న నివేదిక, రుణ వృద్ధి రేటుతో పోటీగా డిపాజిట్ల వృద్ధి రేటుకు దోహదపడ్డానికి డిపాజిట్లపై పన్ను విధానంలో మార్పులు అవసరమని స్పష్టం చేసింది. కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే, డిపాజిట్ల వృద్ధి రూ.61 లక్షల కోట్లయితే, రుణ వృద్ధి 59 లక్షల కోట్లుగా ఉందని పేర్కొనడం గమనార్హం. గడచిన 26 నెలల్లో డిపాజిట్ల స్పీడ్ మందగమనం ఉందని ఆర్బీఐ 2024 జూన్లో విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ, గడచిన కాలం చూస్తే మూడు నుంచి నాలుగేళ్లు డిపాజిట్ల వృద్ది రేటుకన్నా, రుణ వృద్ధి స్పీడ్గా ఉన్న చరిత్ర ఉందని నివేదిక పేర్కొంది. ఈ లెక్కన తాజా పరిస్థితి (డిపాజిట్ల మందగమనం) 2025 జూన్–అక్టోబర్ మధ్య ముగిసే అవకాశం ఉందని అంచనావేసింది. తాజా డిపాజిట్–రుణ పరిస్థితి ఇదీ..ఈ ఏడాది జూలై 12 నాటికి వార్షికంగా చూస్తే, బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 11 శాతానికి పరిమితమైంది. అయితే, రుణ వృద్ధి మాత్రం 14 పైగా శాతంగా నమోదైంది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ, డిపాజిట్ వృద్ధిలో ఇంత తేడా రావడం గడిచిన 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుత తక్కువ వడ్డీ రేట్లతో రిటైల్ డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు కష్టతరంగా మారిందన్నది ప్రధాన విశ్లేషణ. ఆర్ఆర్బీల సేవలు పెరగాలిసూక్ష్మ, లఘు, మధ్య, చిన్న తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రొడక్టులను రూపొందించాలని ప్రాంతీయ గ్రామీ ణ బ్యాంకులు (ఆర్ఆర్బీ), వాటి స్పాన్సర్డ్ బ్యాంకుల సీఈఓలకు ఆర్థిక మంత్రి ఈ సమీక్షా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. వాటికి రుణ లభ్యత సకాలంలో లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రుణ ఫోర్ట్ఫోలియోను పెంచడానికి అపారమైన అవకాశాలు ఉన్న వస్త్ర, చెక్క ఫర్నీచర్, తోలు, ఆహార ప్రాసెసింగ్ వంటి చిన్న సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. అలాగే సాంకేతిక రంగంలో పురోగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలనీ ఆమె విజ్ఞప్తి చేశారు. -
ప్రపంచంలోనే బలమైన బ్యాంకులు
భారతదేశ 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై తివర్ణ పతకాన్ని ఎగరవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించిన ప్రసంగించారు. అందులో భాగంగా ప్రస్తుత ప్రభుత్వ కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. గతంలో బ్యాంకింగ్ రంగం సవాళ్లు ఎదుర్కొన్నా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ప్రపంచంలోని కొన్ని సమర్థమైన బ్యాంకుల్లో భారతీయ బ్యాంకులున్నాయన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న భారతీయ బ్యాంకులు బలంగా మారాయి. గతంలో బ్యాంకింగ్ రంగం పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి. వృద్ధి లేదు, విస్తరణ లేదు, విశ్వాసం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సంస్కరణలు తీసుకొచ్చింది. నేడు ఆ సంస్కరణల కారణంగా బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని సమర్థమైన బ్యాంకుల్లో భారతీయ బ్యాంకులు ఉన్నాయి. మధ్యతరగతి, రైతులు, గృహ కొనుగోలుదారులు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ రంగాల అవసరాలను తీర్చడానికి బ్యాంకింగ్ వ్యవస్థ కీలకంగా మారింది’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: సుప్రీం కోర్టు తీర్పు.. రూ.2 లక్షల కోట్లు నష్టం -
సీఈఓల జీతాలు పెంపు!
ప్రైవేట్ బ్యాంకులకు సారథ్యం వహించే సీఈఓల వేతనాలు గతేడాదితో పోలిస్తే ఈసారి స్వల్పంగా పెరిగాయి. బ్యాంకుల్లో కీలకమైన మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగుల జీతం, బోనస్లు, స్టాక్ ఆప్షన్లకు సంబంధించిన వెసులుబాటును పెంచాలంటే ఆర్బీఐ అనుమతులు తప్పనిసరి. ఈ వ్యవహారంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు దృష్టి సారించినట్లు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.కొన్ని నివేదికల ప్రకారం.. ప్రముఖ బ్యాంకుల సీఈఓల వేతనాలు కింది విధంగా ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్-శశిధర్ జగదీషన్ వేతనం 2024లో రూ.10.77 కోట్లు, 2023లో రూ.10.54 కోట్లు, స్టాక్ ఆప్షన్స్ రూపంలో 2,09,131.ఐసీఐసీఐ బ్యాంక్-సందీప్ భక్షి, 2024లో రూ.9.96 కోట్లు, 2023లో రూ.9.57 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 2,99,100.యాక్సిస్ బ్యాంక్-అమితాబ్ చౌదరి, 2024లో రూ.9.64 కోట్లు, 2023లో రూ.9.75 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 3,13,300.ఇండస్ఇండ్ బ్యాంక్-సుమంత్ కత్పలియా, 2024లో రూ.8.5 కోట్లు, 2023లో రూ.8.5 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 1,98,000.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్-వీ.వైద్యనాథన్, 2024లో రూ.5.3 కోట్లు, 2023లో రూ.4.45 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 30,59,514.యెస్ బ్యాంక్-ప్రశాంత్ కుమార్, 2024లో రూ.3.77 కోట్లు, 2023లో రూ.3.47 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 48,16,490.ఇదీ చదవండి: ఏ ధర ఫోన్లను ఎక్కువగా కొంటున్నారంటే..ప్రైవేట్ బ్యాంకుల మొదటి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా బ్యాంకులు వార్షిక సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అందులో సీఈఓల జీతాల పెంపునకు ఇన్వెస్టర్ల మద్దతు లభించింది. దాంతో వారి వేతనాలు పెరిగినట్లు రెగ్యులేటరీలకు రిపోర్ట్ చేశాయి. ఇదిలాఉండగా, త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకులు పెద్దగా లాభాలను పోస్ట్ చేయలేదు. ఇటీవల ఆర్బీఐ మానిటరీ సమావేశంలోనూ రెపోరేటును స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ సెప్టెంబర్లో నిర్వహించే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే దేశీయంగా ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగా జరిగితే బ్యాంకులకు సానుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!
ద్రవ్యోల్బణం పెరుగుతోంది..ఖర్చులూ పెరుగుతున్నాయి..ఇలాంటి సందర్భంలో బ్యాంకులు రుణాలు ఇస్తాయంటే ఎందుకు తీసుకోకుండా ఉంటారు..అయితే వాటిని తిరిగి చెల్లించేపుడు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాంతో బ్యాంకుల వద్ద మొండి బకాయిలు పోగవుతున్నాయి. అలా ఒక్క ఐడీబీఐ బ్యాంకు వద్దే ఏకంగా రూ.6,151 కోట్లు పేరుకుపోయాయి. ఆ లోన్లను రికవరీ చేసేందుకు బ్యాంకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఇటీవల ఆ బకాయిలను విక్రయానికి పెట్టింది. వాటిని కొనుగోలు చేసేందుకు ఓంకార అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) గరిష్ఠంగా రూ.652 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తాకథనాలు వెలువడ్డాయి.వార్తా నివేదికల ప్రకారం..ఐడీబీఐ బ్యాంకు తన వద్ద పోగైన రూ.6,151 కోట్ల మొండి బకాయిలను విక్రయించాలని గతంలోనే నిర్ణయించుకుంది. దాంతో ప్రభుత్వ అధీనంలోని నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్తోపాటు ఇతర కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. తాజాగా ఓంకార అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) ఆ మొండి బకాయిలను దక్కించుకునేందుకు గరిష్ఠంగా రూ.652 కోట్లు(మొత్తంలో 10.5 శాతం) ఆఫర్ చేసింది.బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి సంఖ్య పెరుగుతోంది. వాటిని వసూలు చేసేందుకు ప్రభుత్వం నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)ను ప్రతిపాదించింది. ఇది బిడ్డింగ్లో తక్కువ ధరకు బ్యాంకుల నుంచి మొండి బకాయిలను దక్కించుకుంటుంది. అనంతరం రుణ గ్రహీతల నుంచి పూర్తి సొమ్మును వసూలు చేస్తోంది. తాజాగా ఎన్ఏఆర్సీఎల్తోపాటు బిడ్డింగ్లో పాల్గొన్న ఓంకార ఏఆర్సీ అధికమొత్తంలో చెల్లించేందుకు సిద్ధమైంది.ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ అదానీ!ఐడీబీఐ బ్యాంకులో గరిష్ఠంగా ఎల్ఐసీకు 49.24 శాతం వాటా ఉంది. వీటిని 26 శాతానికి తగ్గించేందుకు మే 2021లో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 2022లో ఆసక్తిగల సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. ఇటీవల వెలువడిన రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఎమిరేట్స్ ఎన్బీడీ, కోటక్ మహీంద్రా బ్యాంక్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బిడ్డర్లుగా ఆమోదించింది. ఈ బ్యాంకులో ఎల్ఐసీ తర్వాత గరిష్ఠంగా ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉంది. -
బ్యాంకు సర్వీసులను అప్డేట్ చేయట్లేదు.. బీసీజీ నివేదిక
గ్లోబల్ బ్యాంకులతో పోలిస్తే భారతీయ బ్యాంకులు ఐటీ సర్వీసులకు తక్కువ ఖర్చు చేస్తున్నాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకులు సాధారణంగా తమ ఆదాయంలో 7-9% వరకు ఐటీ ఖర్చులు చేస్తుండగా, భారతీయ బ్యాంకులు 5 శాతమే కేటాయిస్తున్నాయని నివేదిక పేర్కొంది.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన ‘ది పోస్టర్ చైల్డ్’ నివేదికలో వివరాల ప్రకారం..2026 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీలు, రుణాలు మొత్తం 75 శాతం డిజిటల్ రూపంలో జరుగుతాయి. థర్డ్ పార్టీ ప్లాట్ఫారమ్ల ద్వారా 25% కొత్త డిజిటల్ ఖాతాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం బ్యాంకులకు సమకూరే మొత్తం ఆదాయంలో ‘చేంజ్ ది బ్యాంక్ (సీటీబీ)’తో పోలిస్తే దాదాపు 80% ఐటీ బడ్జెట్ ‘రన్ ది బ్యాంక్ (ఆర్టీబీ)’ కోసం ఖర్చు చేస్తున్నారు. భారతీయ బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరిచేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దాంతో ఐటీ కేటాయింపులు తగ్గుతున్నాయి. గ్లోబల్ బ్యాంకులు మాత్రం బ్యాంకింగ్ ఐటీ సేవల అప్డేట్లకు ప్రాధాన్యమిస్తున్నాయి.సుమారు 10 బిలియన్ డాలర్ల(రూ.83 వేలకోట్లు) కంటే ఎక్కువ నికర ఆదాయాన్ని ఆర్జించే గ్లోబల్ బ్యాంక్లు 9.1% ఐటీ మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి ఖర్చు చేస్తున్నాయి. అదే భారతీయ బ్యాంకులు వాటి ఆదాయంలో కేవలం 3.2% మాత్రమే ఇందుకు కేటాయిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు (రూ.8 వేలకోట్లు) నుంచి రూ.83 వేలకోట్లు మధ్య నికర ఆదాయాన్ని సంపాదించే బ్యాంకులు సరాసరి 7.2 శాతం ఐటీ బడ్జెట్కు ఖర్చు చేస్తున్నాయి. భారతీయ బ్యాంక్ల్లో ఈ వాటా 3 శాతంగా ఉంది.ఇదీ చదవండి: టాటా స్టీల్..2,800 ఉద్యోగాల కోత2022, 2023లో ఆర్బీఐ అంబుడ్స్మన్ పరిధిలో 40,000 కంటే ఎక్కువ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్కు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించాలంటే మరింత సమర్థమైన ఐటీ సేవలందించాలి. దాంతో ఫిర్యాదులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ విధానాల్లో మార్పులు వస్తున్నాయి. ఏటా యూపీఐ, నగదు రహిత చెల్లింపులు పెరుగుతున్నాయి. కొవిడ్ తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. మార్కెట్లో కొత్త ఫిన్టెక్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఆ పోటీని తట్టుకోవాలంటే బ్యాంకులు అవి అందించే ఐటీ సర్వీసులను అప్డేట్ చేసుకోవాలని నివేదిక సూచిస్తుంది. -
ర్యాన్సమ్వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ
హానికర సాఫ్ట్వేర్ (ర్యాన్సమ్వేర్) దాడికి గురైన సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ సర్వీసులను తిరిగి పునరుద్ధరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 300 సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కస్టమర్లకు ఉపశమనం లభించింది.ఎన్పీసీఐ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ సీ-ఎడ్జ్ టెక్నాలజీస్పై ఇటీవల ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. దాంతో వెంటనే స్పందించి దాడి జరిగిన సర్వర్ను డిస్కనెక్ట్ చేశారు. తిరిగి సర్వీస్ ప్రొవైడర్ సేవలను తాజాగా పునరుద్ధరించారు. వినియోగదార్లు ఏటీఎంల నుంచి నగదు స్వీకరణ, యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్పై ర్యాన్సమ్వేర్ దాడి!కస్టమర్లకు నిధుల బదలాయింపు, ఏటీఎంల వద్ద నగదు స్వీకరణ, యూపీఐ చెల్లింపు సేవల కోసం బ్యాంకులు సీ-ఎడ్జ్పై ఆధారపడ్డాయి. సీ-ఎడ్జ్ హానికర సాఫ్ట్వేర్ దాడికి గురికావడంతో లావాదేవీల విషయంలో కొన్ని సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వినియోగదార్లు సోమవారం నుంచి అంతరాయం ఎదుర్కొన్నారు. సీ-ఎడ్జ్లో ర్యాన్సమ్వేర్ విస్తరణకు అవకాశం ఉండడంతో పేమెంట్ సిస్టమ్లను వేరు చేసినట్టు ప్రకటించారు. అయితే ఈ దాడి కేవలం టెక్నాలజీ సిస్టమ్లకే పరిమితమైందని, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సొంత మౌలిక సదుపాయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
రైతు భూమిలో బ్యాంకు ఫ్లెక్సీ!
సాక్షి, కామారెడ్డి/లింగంపేట: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంపై బ్యాంకు అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. తనఖా పెట్టిన భూములను వేలం వేస్తామంటూ ఆ భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలోని పోల్కంపేట, పర్మల్ల, శెట్పల్లి సంగారెడ్డి తదితర గ్రామాల రైతులు 2010 ప్రాంతంలో పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. కొందరు కొన్ని వాయిదాలు చెల్లించి మానుకోగా, మరికొందరు అసలే చెల్లించలేదు. కొందరు మాత్రం పూర్తిగా చెల్లించారు. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు కొన్నేళ్లుగా రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులిచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. అయితే అప్పులు తీసుకుని పది పదిహేనేళ్లు కావడంతో వడ్డీలు పెరిగిపోయాయి. అప్పట్లో రూ.5 లక్షలు అప్పు తీసుకుంటే ఇప్పుడది రూ.15 లక్షలు దాటింది. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం రైతులకు భారంగా మారింది. వడ్డీ తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అప్పులు చెల్లించడం లేదంటూ బ్యాంకర్లు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. పోల్కంపేటలో ఓ రైతు పొలంలో భూమిని వేలం వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా ఆందోళనకు గురవుతున్నారు. వడ్డీలు తగ్గిస్తే అప్పు తిరిగి చెల్లిస్తామని పేర్కొంటున్నారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నాం బ్యాంకుకు భూమి తనఖా పెట్టి అప్పు తీసుకున్న రైతు తిరిగి చెల్లించకపోవడమే గాక, ఆ భూమిని అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. బ్యాంకు తనఖాలో ఉన్న భూమిని ఎలా అమ్ముకుంటారు? ఆ భూమిపై బ్యాంకుకే హక్కు ఉంటుంది. లింగంపేట మండలంలో దాదాపు 7 వందల మంది రైతులు దీర్ఘకాలిక రుణాలు తీ సుకున్నారు. వారిలో చాలామంది అప్పులు తి రిగి చెల్లించలేదు. సహకార చట్టం ప్రకారం వా రందరికీ నోటీసులిచ్చాం. వారి ఆస్తులను జప్తు చేయడం, లేదా వేలం వేయడం జరుగుతుంది. – కుమారస్వామి, బ్రాంచి మేనేజర్, ఎన్డీసీసీబీ, లింగంపేట -
ఇకపై బ్యాంక్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్లుండవు.. ఎవరికంటే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు పంపించే ఎస్ఎమ్ఎస్లపై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ వినియోగదారులు చేసే యూపీఐ డెబిట్, క్రెడిట్ లావాదేవీలకు కొత్త నిబంధన వర్తిస్తుందని చెప్పింది.బ్యాంక్ యూపీఐ డెబిట్, క్రెడిట్లు ఉపయోగించి రూ.100లోపు లావాదేవీలు చేస్తే ఇకపై ఎస్ఎమ్ఎస్లు పంపబోమని తెలిపింది. 2024 జూన్ 25 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ చెప్పింది. అయితే అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ సందేశాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా పరిమితి ప్రకారం.. రూ.100కు పైన ఎవరికైనా నగదు పంపినా/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తే ఎస్ఎమ్ఎస్ అలర్ట్లు అందుతాయి. దాంతోపాటు రూ.500కు మించి నగదు అందుకున్నప్పుడు మాత్రమే ఎస్ఎమ్ఎస్ సదుపాయం ఉంటుంది.ఇదీ చదవండి: క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలుఅధిక మొత్తంలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నందున బల్క్ ఎస్ఎమ్ఎస్లు పంపేందుకు అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం..2023లో యూపీఐ లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఏడాది చివరినాటికి దాదాపు 118 బిలియన్లకు చేరుకున్నాయి. -
టీసీఎస్కు కువైట్ బ్యాంక్ డీల్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రముఖ కువైట్ బ్యాంకు డీల్ను దక్కించుకుంది. కువైట్లోని ప్రముఖ వాణిజ్య బ్యాంకు అయిన బుర్గాన్ బ్యాంక్ యొక్క కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీని ఆధునీకరించడానికి డీల్ కుదుర్చుకున్నట్లు టీసీఎస్ ప్రకటించింది.ఈ డీల్లో భాగంగా బుర్గాన్ బ్యాంక్ బహుళ స్వతంత్ర లెగసీ అప్లికేషన్లను సమకాలీన సార్వత్రిక బ్యాంకింగ్ సొల్యూషన్గా ఏకీకృతం చేయడంలో టీసీఎస్ సహాయం చేస్తుంది. 160కి పైగా శాఖలు, 360 ఏటీఎంల ప్రాంతీయ నెట్వర్క్తో కువైట్లోని అతి తక్కువ కాలంలో ఏర్పాటైన వాణిజ్య బ్యాంకులలో బుర్గాన్ బ్యాంక్ ఒకటి. అధిక లావాదేవీల వాల్యూమ్లను నిర్వహించడానికి, ఆటోమేషన్ను మెరుగుపరచడానికి, సిబ్బంది ఉత్పాదకతను మెరుగుపరచడానికి టీసీఎస్ అందించే పరిష్కారాన్ని బుర్గాన్ బ్యాంక్ అమలు చేయనుంది.బుర్గాన్ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ డాహెర్ మాట్లాడుతూ కస్లమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తమ కోర్ సిస్టమ్ల ఆధునికీకరణపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. బుర్గాన్ బ్యాంక్ వంటి ప్రగతిశీల సంస్థతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని టీసీఎస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ గ్లోబల్ హెడ్ వెంకటేశ్వరన్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్డేట్ కార్యక్రమంలో ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి. ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది. -
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్ అప్గ్రేడబుల్ ఏటీఎం మెషీన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏటీఎంలను ఎప్పుడైనా నగదు రీసైక్లింగ్ మెషిన్ (CRM)కి అప్గ్రేడ్ చేయవచ్చు. ఇది దేశంలోనే మొదటి అప్గ్రేడబుల్ ఏటీఎం అని హిటాచీ సంస్థ పేర్కొంది.' మేక్ ఇన్ ఇండియా ' చొరవ కింద తయారు చేసిన ఈ ఏటీఎంలు బ్యాంకులకు మెరుగైన సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న 2,64,000 ఏటీఎంలు/సీఆర్ఎంలలో, హిటాచీ 76,000కు పైగా నిర్వహిస్తోంది. రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు 1,00,000 అప్గ్రేడబుల్ ఏటీఎంల మార్కెట్ను కంపెనీ అంచనా వేసింది.ఏంటీ సీఆర్ఎం మెషీన్లు?సీఆర్ఎం మెషీన్లు అంటే క్యాష్ రీసైక్లింగ్ మెషీన్. దీని ద్వారా నగదు డిపాజిట్, విత్డ్రా రెండు సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఈ నగదు రీసైక్లింగ్ మెషీన్ల ద్వారా తమ శాఖల వద్ద రౌండ్-ది-క్లాక్ నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆఫ్సైట్ ప్రదేశాల్లో బ్యాంకులు సాధారణంగా ఏటీఎంల ద్వారా 24 గంటలూ నగదు ఉపసంహరణ సేవలను మాత్రమే అందిస్తాయి. ఇలాంటి చోట్ల అప్గ్రేడబుల్ ఏటీఎంలను ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు తమ వారి వ్యాపార అవసరాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిపాజిట్, విత్ డ్రా సేవలు విస్తరించడానికి బ్యాంకులకు వీలు కలుగుతుంది. -
ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే..
ఏప్రిల్ 1నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి. ఎన్పీఎస్ లాగిన్తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్వ్వవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్పీఎస్లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ)లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది.ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపుదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది.ఫ్రీలాంజ్ యాక్సెస్..ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి.పాలసీ డిజిటలైజేషన్ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. -
ఈ నెలలో బ్యాంకులు పని చేసేది 16 రోజులే..!
ఏప్రిల్ 1 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ నెలలో వివిధ పండగలు, పర్వదినాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం లావాదేవీలన్నీ డిజిటలైజ్ అయినా, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో బ్యాంకుకు వెళ్లేముందు ఏయే రోజుల్లో వాటికి సెలవులు ఉన్నాయో చెక్ చేసుకోవడం మంచిది. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం వివిధ రాష్ట్రాలతో కలిపి బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 1: వార్షిక బ్యాంకు ఖాతాల క్లోజింగ్ సందర్భంగా దేశమంతా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే చండీగఢ్, సిక్కిం, మిజోరం, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు పని చేస్తాయి. ఏప్రిల్ 5: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమాత్ ఉల్ విదా సందర్భంగా తెలంగాణ, జమ్ముల్లో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 9: ఉగాది, తెలుగు సంవత్సరాది, గుడిపడ్వ, సాజిబు నాంగపంబా (చీరావుబా) తొలి నవరాత్రి సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 10: బొహగ్ బిహు, బైశాఖీ, బిజూ ఫెస్టివల్ సందర్భంగా త్రిపుర, అసోం, జమ్ముకశ్మీర్ల్లో బ్యాంకులు పని చేయవు. ఏప్రిల్ 15: బొహగ్ బిగు, హిమాచల్ దినోత్సవం సందర్భంగా అసోం, త్రిపుర, మణిపూర్, జమ్ముకశ్మీర్ల్లో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 16: శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 20: గరియా పూజ పండుగ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు! ఏప్రిల్ 13న రెండో శనివారం, 27న నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఆదివారాలు కలుపుకుంటే ఈ నెలలో బ్యాంకులు పనిచేసేది 16 రోజులేనని గమనించాలి. -
‘నేరుగా బ్యాంకు నుంచే రుణాలు ఇప్పించండి’
బ్యాంకుల నుంచి నేరుగా రుణాన్ని పొందే సదుపాయాన్ని కల్పించాలని భారత స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్స్) పరిశ్రమ ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ)ను కోరింది. దాంతోపాటు రీట్స్ను ఈక్విటీలుగా వర్గీకరించాలని తెలిపింది. ప్రస్తుతం బాండ్ల జారీ లేదా బ్యాంకింగేతర సంస్థలు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం రీట్స్కు ఉంది. బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి లేదని ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ) తెలిపింది. కొత్తగా ఏర్పాటైన ఐఆర్ఏలో 5 నమోదిత సంస్థలు ఉన్నాయి. ఐఆర్ఏకు ఛైర్మన్గా వ్యవహరిస్తున్న ఎంబసీ రీట్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అరవింద్ మైయా మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి పొందే విషయమై ఆర్బీఐతో చర్చిస్తున్నామని తెలిపారు. స్థిరాస్తి పరిశ్రమకు నిధులు భారీ స్థాయిలో కావాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుతం రీట్స్ను ‘హైబ్రిడ్’ పెట్టుబడి మార్గంగా వర్గీకరించారని, ఇది మదుపర్లను అయోమయానికి గురి చేస్తోందని బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణ అధికారి అలోక్ అగర్వాల్ వెల్లడించారు. రీట్స్ను ఈక్విటీలుగా వర్గీకరిస్తే.. ఇవి కూడా సూచీల్లో (ఇండెక్స్) చేరే వీలుండి, రీట్స్లోకి నిధుల రాక పెరిగేందుకు తోడ్పడుతుందని తెలిపారు. భారత్ రీట్స్ నిబంధనల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్తో పాటు అమెరికాలో రీట్స్ను ఈక్విటీగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్లో రీట్స్ రంగ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, స్థిరాస్తి రంగంలో గిరాకీ పెరుగుతూనే ఉందని ఐఆర్ఏ తెలిపింది. ఇదీ చదవండి: హైదరాబాద్లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం -
బ్యాంకును కొల్లగొట్టిన పిల్లలు!
పిల్లలకు ఆటలంటే ఎంతో ఇష్టమనే సంగతి మనందరికీ తెలిసిందే. కొందరు పిల్లలు ఇండోర్ గేమ్స్ను ఇష్టపడతారు. మరికొందరు పిల్లలు బయట ఆడుకుంటారు. అయితే టైమ్ పాస్ కోసం బ్యాంకును కొల్లగొట్టిన చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఎప్పుడు ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నకిలీ పిస్తోళ్లతో దొంగ, పోలీసు ఆట ఆడే వయసు కలిగిన ముగ్గురు చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. ఈ పిల్లల వయస్సు కేవలం 11, 12, 16 ఏళ్లేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమెరికాలోని టెక్సాస్లో ఈ వింత కేసు వెలుగు చూసింది. ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం ముగ్గురు బాలులు కలిసి టెక్సాస్లోని హ్యూస్టన్లోని స్థానిక బ్యాంకును దోచుకున్నారు. మార్చి 14న గ్రీన్పాయింట్ ప్రాంతంలోని వెల్స్ ఫార్గో బ్యాంక్కు వెళ్లి క్యాషియర్కు బెదిరింపు నోట్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. తరువాత వారు బ్యాంకులోని డబ్బు కొల్లగొట్టి, అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీటీవీని పరిశీలించగా చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారని తెలిసి ఆశ్చర్యపోయారు. రిటైర్డ్ జువెనైల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి మైక్ ష్నైడర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారన్నారు. హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం చిన్నారులు దోపిడీకి పాల్పడిన సమయంలో క్యాషియర్కు తుపాకీ చూపించలేదు. అయితే వారు తమ వద్ద ఆయుధం ఉందని పేర్కొంటూ క్యాషియర్కు బెదిరింపు నోట్ ఇచ్చారు. తరువాత డబ్బు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ సంఘటన తర్వాత ఈ ముగ్గురు దొంగల(పిల్లల) చిత్రాలతో కూడిన పోస్టర్లను పోలీసులు వివిధ ప్రదేశాలలో అతికించారు. ఈ పోస్టర్లను చూసిన ఆ చిన్నారుల తల్లిదండ్రులు వారిని పోలీసులకు అప్పగించారు. -
Ganta : గంటా కంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
ఎందెందు వెతికినా.. వాడు అందందే గలడు అన్నట్టు ఏ నేరం చూసినా.. దాని బ్యాక్గ్రౌండ్లో టిడిపి నేతలే బయటకు వస్తున్నారు. బ్యాంకు కేసుల నుంచి డ్రగ్స్ దాకా, ఓటుకు కోట్లు నుంచి పేకాట శిబిరాల దాకా టిడిపి క్రైం లిస్టు పెరిగిపోతోంది. గంట మోగింది. టిడిపి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువులు బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యూష కంపెనీ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ఎగవేశారు గంటా శ్రీనివాసరావు అండ్ కో. ఏకంగా రూ. 390 కోట్ల 7 లక్షల 52 వేల 945 రుణం ఎగవేసినట్టు ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ప్రత్యూష కంపెనీ పేరిట గతంలో కూడా ఓ బ్యాంకుకు టోకరా పెట్టారు గంట శ్రీనివాసరావు అండ్ కో. అప్పుకు సంబంధించి జప్తుగా పెట్టిన జీవీఎంసీ సమీపంలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో గంటా అండ్ కో ఆస్తులను వేలంపాట వేయాలని బ్యాంకు ఇవ్వాళ నోటీసులిచ్చింది. పద్మనాభం మండలం అయినాడ వద్ద స్థిరాస్తిని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు నోటీసులో తెలిపింది ఇండియన్ బ్యాంక్. 16-04-24 తేదీన 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది బ్యాంకు. -
భారీగా పెరిగిన ఫిర్యాదులు! సమస్య పరిష్కారం కావాలంటే..
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్న సేవల్లో పారదర్శకత, వినియోగదారులకు మరింత జవాబుదారీగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంబుడ్స్మన్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద 2022-23లో 7.03 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇవి 68% పెరిగాయి. మొబైల్/ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, రుణాలు, ఏటీఎమ్/డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్స్, పారా బ్యాంకింగ్ తదితరాలకు సంబంధించి ఈ ఫిర్యాదులు వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్(ఆర్బీ-ఐఓస్)-2021 కింద ఆర్బీఐకి చెందిన 22 అంబుడ్స్మన్ కార్యాలయాలు(ఓఆర్బీఐఓలు), సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్(సీఆర్పీసీ), కాంటాక్ట్ సెంటర్లకు వచ్చిన ఫిర్యాదులతో తొలి స్టాండలోన్ వార్షిక నివేదిక(2022-23) వెలువడింది. ఈ నివేదిక ప్రకారం.. 2022-23లో మొత్తం 7,03,544 ఫిర్యాదులు వచ్చాయి. ఓఆర్బీఐఓల్లో సగటున 33 రోజుల్లో ఫిర్యాదులకు పరిష్కారం లభించింది. అంతక్రితం ఏడాది (2021-22) ఇది 44 రోజులుగా ఉంది. ఆర్బీ-ఐఓస్ కింద పరిష్కరించిన ఫిర్యాదుల్లో మెజారిటీ(57.48%) భాగం మ్యూచువల్ సెటిల్మెంట్, మధ్యవర్తిత్వం ద్వారానే జరిగాయి. చండీగఢ్, దిల్లీ, హరియాణ, రాజస్థాన్, గుజరాత్ నుంచి అత్యధిక ఫిర్యాదులు అందగా మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపుర్, అరుణాచల్ప్రదేశ్ నుంచి అతి తక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఏంటీ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్? బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఇప్పటి వరకు మూడు వేర్వేరు అంబుడ్స్మన్ పథకాలు పనిచేస్తున్నాయి. బ్యాంకింగ్ సంబంధించిన ఫిర్యాధుల కోసం బ్యాంకింగ్ అంబుడ్స్మన్ స్కీమ్ (బీఓఎస్) 1995 నుంచి పని చేస్తోంది. బ్యాంకింగ్-యేతర ఆర్థిక సంస్థల కోసం.. ద అంబుడ్స్మన్ స్కీమ్ ఫర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018 నుంచి, డిజిటల్ లావాదేవీల కోసం.. ద అంబుడ్స్మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 నుంచి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూడింటిని ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్మెన్’ వ్యవస్థగా ఏకీకృతం చేసి సేవలు అందిస్తున్నారు. రూ.50 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లున్న నాన్-షెడ్యూల్డ్ ప్రాథమిక సహకార బ్యాంకులూ ఈ వ్యవస్థ కిందకే వస్తాయి. వినియోగదారుడు ఆర్థిక సంస్థ అంతర్గత ఫిర్యాదుల పరిష్కార విధానంతో సంతృప్తి చెందకపోతే అంబుడ్స్మెన్ను సంప్రదించవచ్చు. అక్కడా పరిష్కారం కాకపోతే అప్పిలేట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్పిలేట్లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్తో కూడిన బృందం ఉంటుంది. ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి? ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ https://cms.rbi.org.in లో వినియోగదారులు వారి ఫిర్యాదులను ఫైల్ చేయవచ్చు. చండీగఢ్లోని సెంట్రలైజ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్కి ఇమెయిల్ లేదా భౌతికంగా లేఖను పంపడం ద్వారా కూడా ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఇదీ చదవండి: అసలే వేసవికాలం.. కరెంట్ సరఫరా ప్రశ్నార్థకం! అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబరు - 14448 ద్వారా కాల్ సెంటర్కు కాల్ చేసి హిందీ, ఇంగ్లీష్తో పాటు ఎనిమిది ప్రాంతీయ భాషలలో ఫిర్యాదు చేయవచ్చు. ఇతర భారతీయ భాషలలో త్వరలోనే ఈ సేవలు అందుబాటులో తీసుకురానున్నట్లు ఆర్బీఐ గతంలో తెలిపింది. -
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై వారానికి 5 రోజులే పని!
ఉద్యోగులకు శుభవార్త. త్వరలో బ్యాంకుల్లో వారానికి ఐదురోజు పనిదినాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కొత్త పనిదినాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం, బ్యాంకులు నెలలో మొదటి, మూడవ శనివారాలు పని చేస్తాయి. రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే కేంద్రం నోటిఫికేషన్ విడుదలతో బ్యాంక్ ఉద్యోగులు త్వరలో వారానికి ఐదురోజుల మాత్రమే పనిచేసే వెసలు బాటు కలగనుంది. అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు బ్యాంకులు పనిచేయగా.. శని, ఆదివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ తరుణంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఓ పత్రికా ప్రకటనలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ మధ్య చర్చలు విజయవంతంగా ముగిశాయని, జాయింట్ నోట్పై సంతకం చేయడంతో చర్చలు సఫలమైనట్లు పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ పెండింగ్లో ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పని గంటలు అమలులోకి రానున్నాయి. కొత్త బ్యాంక్ పనివేళలు ఎలా ఉండబోతున్నాయ్ ఐదురోజుల పనిదినాల్లో అమల్లోకి వచ్చిన వెంటనే బ్యాంక్ పనివేళలు ఎలా ఉండనున్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంటుంది. పలు నివేదికల ప్రకారం ఉద్యోగులు ఉదయం 9:45 బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు కొనసాగనున్నాయి. తద్వారా బ్యాంక్ ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయనున్నారు. -
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతనం పెంపు
బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం పెంచాలని కొద్దిరోజులుగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి శుక్రవారం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం వెలువడింది. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17% పెరగనుంది. ఇందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా రూ.12,449 కోట్లు ఖర్చు అవ్వనున్నట్లు తెలిసింది. ఈ వేతన పెంపు 2022 నవంబరు నుంచి అమలుకానుంది. దీంతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేసేలా, అన్ని శనివారాలను సెలవుగా గుర్తించడానికి ఆలిండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒప్పుకుంది. ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పనిగంటలు అమల్లోకి వస్తాయి. కొత్త డీఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను రూపొందించారు. దీని ప్రకారం.. మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించకుండానే నెలకు ఒక సిక్ లీవ్ తీసుకునే సౌలభ్యం ఉంది. ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో 255 రోజుల వరకు ప్రివిలేజ్డ్ లీవ్లను నగదుగా మార్చుకోవచ్చు. విధుల్లో మరణించినా, ఈ మొత్తం సంబంధీకులకు చెల్లిస్తారు. ఇదీ చదవండి: ‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్తో పాటు నెలవారీ ఎక్స్గ్రేషియా అందిస్తారు. 2022 అక్టోబరు 31న, అంతకుముందు పెన్షన్ అందుకునేందుకు అర్హత ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. -
41 వేల ఖాతాల్లో రూ.820 కోట్లు జమ.. ప్రముఖ బ్యాంకులో సీబీఐ సోదాలు
యూకో బ్యాంక్లో గతంలో జరిగిన ఇమిడియట్ పేమెంట్ సిస్టమ్(ఐఎంపీఎస్) లావాదేవీల కుంభకోణంలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరుపుతోంది. తాజాగా రాజస్థాన్, మహారాష్ట్రల్లోని 67 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే.. బ్యాంకులో గతేడాది నవంబరు 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్కు చెందిన 41 వేల మందికి పైగా ఖాతాదార్ల అకౌంట్ల్లోకి తప్పుగా డబ్బులు జమైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా జమ అయిన మొత్తం నిధుల విలువ రూ.820 కోట్లని తేల్చింది. 7 ప్రైవేటు బ్యాంకుల్లోని 14,600 ఖాతాదారుల నుంచి ఐఎంపీఎస్ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులోని 41,000కు పైగా ఖాతాదారులకు తప్పుగా నిధులు జమ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. సంబంధిత బ్యాంకు ఖాతాల్లో మాత్రం డబ్బులు కట్ అవకుండానే, యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి డబ్బు జమైనట్లు గుర్తించారు. ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమ అయిన తేదీల్లోనే, యూకో బ్యాంకులో వేల సంఖ్య లో కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై ఆరా తీస్తున్నారు. తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును చాలామంది విత్డ్రా చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల నిర్వహించిన దాడుల్లో యూకో బ్యాంకు, ఐడీఎఫ్సీకి చెందిన 130 నేరారోపణ పత్రాలు, 40 మొబైల్ ఫోన్లు, రెండు హార్డ్ డిస్క్లు, ఇంటర్నెట్ డాంగుల్ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం సీజ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. -
మహిళలకు బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మహిళా ఖాతాదార్లకు ఆఫర్లు ప్రకటించింది. బీఓబీ మహిళా శక్తి సేవింగ్స్ ఖాతా లేదా బీఓబీ వుమెన్ పవర్ కరెంట్ ఖాతాలను జూన్ 30లోగా తెరిచి, డిసెంబరు 31 వరకు రుణం పొందేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలు తెరిచిన మహిళలకు అందించే రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల (0.25%) వరకు వడ్డీ రాయితీ ఇవ్వనుంది. ఇదీ చదవండి: రూ.75కే సినిమాలు.. దేశంలోనే తొలి ఓటీటీ ప్రారంభించిన ప్రభుత్వం ద్విచక్ర వాహన రుణాలకైతే 0.25%, విద్యా రుణాలకైతే 0.15%, వాహన, గృహ, తనఖా రుణాలపై 0.1% వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు బీఓబీ ప్రకటించింది. రిటైల్ రుణాలపై (వ్యక్తిగత రుణాలతో సహా) ప్రాసెసింగ్ రుసుమును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వార్షిక సురక్షిత డిపాజిట్ లాకర్ ఛార్జీలపై 50% రాయితీ ఇవ్వనున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. -
మళ్లీ అందరూ బ్యాంకుల్లో కేవైసీ అప్డేట్ చేయాలి..?
ఆర్థిక అవసరాలకు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. దానికి బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. చాలామందికి ఒకటికి మించి బ్యాంకు ఖాతాలుండడం సహజం. అయితే వేర్వేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరచిన పలు ఖాతాలను కనిపెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. దానికి అదనపు గుర్తింపులు కావాలని ప్రత్యేక కమిటీ సూచించింది. బ్యాంకుల్లో ఖాతాలను, ఖాతాదార్లను గుర్తించడానికి అదనపు ధ్రువీకరణ ప్రక్రియలను అమలు చేయనున్నారు. వినియోగదారు సమాచారాన్ని (కేవైసీ-నో యువర్ కస్టమర్) మరింత బలోపేతం చేయడంపై బ్యాంకులు దృష్టి సారించాయి. ప్రస్తుత ఖాతాలన్నిటికీ ముఖ్యంగా పలు ఖాతాలు లేదా జాయింట్ ఖాతాలకు ఒకే ఫోన్ నంబరు ఉన్న ఖాతాలకు దీనిని వర్తింపజేయాలని భావిస్తున్నాయి. వేర్వేరు పత్రాలతో పలు ఖాతాలను తెరచిన ఖాతాదార్ల నుంచి మరిన్ని ధ్రువీకరణలను కోరవచ్చు. ఇదీ చదవండి: కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్ ఆర్థిక రంగంలో కేవైసీ నిబంధనలను ప్రామాణీకరించడం కోసం ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని గతంలోనే ఏర్పాటు చేసింది. పాన్, ఆధార్, మొబైల్ నంబరు తదితరాలను అదనపు గుర్తింపుల కింద పరిశీలిస్తున్నట్లు ఒక బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెబుతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. వేర్వేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరచిన పలు ఖాతాలను కనిపెట్టడానికి, అదనపు గుర్తింపులతో వీలవుతుందని బ్యాంకులు భావిస్తున్నట్లు తెలిసింది. -
ఎఫ్డీ రేట్లు పెంచిన ప్రముఖ బ్యాంక్
ప్రైవేటు రంగంలో సేవలందిస్తున్న బంధన్ బ్యాంక్ తన వినియోగదారులకు మరింత సేవలందించేలా చర్యలు తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. 500 రోజుల ప్రత్యేక డిపాజిట్పై వయో వృద్ధులకు(సీనియర్ సిటిజన్లు) 8.35 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నట్లు తెలిపింది. సాధారణ వ్యక్తులకు 7.85 శాతం వడ్డీ ఇస్తోంది. ఏడాది నుంచి వివిధ కాల వ్యవధులకు వడ్డీ రేటును 7.25 శాతంగా నిర్ణయించింది. 5-10 ఏళ్ల వ్యవధికి 5.85 శాతం వడ్డీని అందిస్తోంది. ఇదీ చదవండి.. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ పసిడి రుణాలపై ఆర్బీఐ నిషేధం సీనియర్ సిటిజన్లకు 6.60 శాతంగా నిర్ణయించింది. పొదుపు ఖాతాలో రోజువారీ నిల్వ రూ.10 లక్షలకు మించి ఉన్న వారికి 7 శాతం వడ్డీనిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్లో కొత్తగా రెండు శాఖలను ప్రారంభించినట్లు బంధన్ బ్యాంక్ వెల్లడించింది. దీంతో తెలంగాణలో మొత్తం శాఖల సంఖ్య 142కు చేరినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుకు 1664 శాఖలున్నాయి. -
బ్యాంక్ ఉద్యోగులకు ఇకపై వారానికి 5 రోజులే పని! ఎప్పటినుంచంటే
వారానికి 5 రోజుల పని కల్పించాలన్న బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. జూన్ 2024లో బ్యాంకు ఉద్యోగులకు జీతం పెంపుతో పాటు వారానికి 5 పని దినాలు కల్పించేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం ఇవ్వనుందని సమాచారం. ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల కూటమి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశాయి. బ్యాంకింగ్ రంగానికి 5 రోజుల పనివారాన్ని అనుమతించాలని కోరాయి. అదే సమయంలో ఖాతాదారుల కోసం బ్యాంకింగ్ పనిగంటల్లో కానీ, ఉద్యోగులు, అధికారుల పనివేళల్లో పని గంటలలో గానీ ఎలాంటి తగ్గింపు ఉండదని బ్యాంకు ఉద్యోగుల సంఘం హామీ ఇచ్చింది. ఈ అంశంపై సానుకూలంగా సమీక్ష జరిపి, తదనుగుణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)ని ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్లు ఈటీ నివేదిక హైలెట్ చేసింది. ప్రస్తుతం, బ్యాంకు శాఖలు రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే, 2015 నుంచి అన్ని శని, ఆదివారాల్లో ఆఫ్లు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2015లో సంతకం చేసిన 10వ ద్వైపాక్షిక సెటిల్మెంట్ ప్రకారం,ఆర్బీఐ, ప్రభుత్వం ఐబీఏతో ఏకీభవించాయి. రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాయి. జీతంపై, ఐబీఏ, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు గత సంవత్సరం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)లో 17శాతం జీతాల పెంపునకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈటీ నివేదిక ప్రకారం.. కేంద్రం త్వరలో బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల్ని కల్పించడంతో పాటు జీతాల పెంపు జరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా. జీతాల పెంపును కేంద్రం ఆమోదించినట్లయితే, అన్ని పీఎస్బీఐ, ఎంపిక చేసిన పలు ప్రైవేట్ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. -
ఈ రెండు బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్
ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు భద్రత ఎక్కువ, రిస్క్ తక్కువ. అందుకే పెట్టుబడి దారులు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతుంటారు. మీరు కూడా ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఎఫ్డీలపై 7.75శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తూ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్లు వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమలులోకి వస్తాయి. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.5శాతం నుండి 7.75శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది కాకుండా, బ్యాంక్ 18 నెలల కాలపరిమితికి వడ్డీ రేట్లను పరిమిత కాలానికి 21 నెలల కంటే తక్కువకు పెంచింది. సాధారణ పౌరులకు, వడ్డీ రేటు 7.25శాతం. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు, అదే టెన్యూర్ కాలానికి వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఫిబ్రవరి 17, 2024 నుండి రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుండగా.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పౌరులకు సంవత్సరానికి 7.2శాతం వడ్డీని అందిస్తుంది. . సాధారణ పౌరులకు, ఫిక్స్డ్ డిపాజిట్ అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుండి 2 సంవత్సరాల టెన్యూర్ కాలానికి 7.2శాతం వరకు ఉంటుంది. మరోవైపు, సీనియర్ సిటిజన్లకు అదే టెన్యూర్ కు 7.75శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొంది. -
మార్చి 15 తర్వాత పని చేసేవి.. పని చేయనివి ఇవే..
ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ముందుగా 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన ఆర్బీఐ తేదీని సవరించింది. ఈ నేపథ్యంలో ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఇటీవల ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్థానంలో యాక్సిస్ బ్యాంక్తో ఒన్97 కమ్యునికేషన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రీఛార్జ్లు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు పేటీఎంను ఉపయోగించవచ్చా? ప్రజలు అన్ని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్ల కోసం పేటీఎం యాప్ని ఉపయోగించవచ్చని కంపెనీ తన FAQ పేజీలో ధ్రువీకరించింది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ.. వంటి అధీకృత బ్యాంకులకు తమ పేటీఎంను లింక్ చేసిన వారిపై తాజా నిషేధం ఎలాంటి ప్రభావం చూపదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఖాతా తెరిచిన వినియోగదారులపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్బాక్స్, కార్డ్ మెషిన్ ఎప్పటిలాగే పని చేస్తాయా? కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం పేటీఎం క్యూఆర్, సౌండ్బాక్స్, కార్డ్ మెషీన్లపై ఎలాంటి ప్రభావం చూపదు. మార్చి 15 తర్వాత కూడా ఇవి కొనసాగుతాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ని ఉపయోగించవచ్చా? పేటీఎం వాలెట్లో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు దాన్ని ఉపయోగించుకోవచ్చు.. ఉపసంహరించుకోవచ్చు.. మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. మార్చి 15, 2024 తర్వాత ఎలాంటి డిపాజిట్లు మాత్రం చేయలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్ని ఉపయోగించవచ్చా? ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్ని ఉపయోగించవచ్చు. అయితే, మార్చి 15, 2024 తర్వాత రీఛార్జ్ చేయలేరు. అందులో డబ్బును డిపాజిట్ చేయలేరు. అందులో ఉన్న నగదును ఉపయోగించవచ్చు. లేదా గడువులోపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్ని మూసివేయవచ్చు. అందులో ఉన్న నగదు రీఫండ్ కోసం బ్యాంక్ని కోరవచ్చు. ఇదీ చదవండి: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే.. పేటీఎం పేమెంట్ బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ ఎలా? వాలెట్లో ఉన్న నగదును ఉపయోగించడం, విత్ డ్రాయిల్ లేదా, బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మార్చి 15, 2024 తర్వాత మీ పేటీఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయలేరు. డిపాజిట్ చేయలేరు. అయితే, ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వరకు యూపీఐ/ ఐఎంపీఎస్ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి మీ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. -
బ్యాంకులే కస్టమర్లకు ఫైన్ కట్టాలి.. ఎందుకో తెలుసా?
సాధారణంగా బ్యాంకులకు కస్టమర్లకు పైన్ కడుతుంటారు. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెన్ టైన్ చేయకపోవడమో లేదా తీసుకున్న లోన్ సరైన సమయంలోగా చెల్లించకపోయిన బ్యాంకులు పెనాల్టీ వేస్తుంటాయి. మరి బ్యాంకుల నుంచి కస్టమర్లు కూడా ఫైన్ కట్టించుకోవచ్చని తెలుసా ? నిబంధనలు పాటించకపోతే ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులు కూడా ఫైన్ కట్టాల్సిందే. అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ వాడకం బాగా విస్తృతం అయింది. దాదాపు అందరూ వీటిని ఉపయోగిస్తుంటారు. చేతిలో డబ్బు లేనప్పుడు వాటిని ఉపయోగించి వస్తువులు కొనుకోవడం, ఇతరత్రా అవసరాలకు డబ్బు వాడుకుంటుంటారు. క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకున్న అమౌంట్ సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వాడుకున్న డబ్బు సరైన సమయానికి చెల్లించని పక్షంలో పెనాల్టీల ద్వారా బాంకులు కస్టమర్ల నుంచి అధిక ఫైన్ వసూలు చేస్తుంటాయి. అయితే ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులు ఉన్నవారు, వాటి అవసరం లేదనుకున్నవారు క్లోజ్ చేస్తుంటారు. ఇలా క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తుంటాయి. ఎందుకంటే వాటి నుంచి ఫీజ్ ల ద్వారా వచ్చే ఆదాయం పోతుందనే భావనతోనో లేదా మరేదైనా కారణంతో బ్యాంకులు కొంత ఆలస్యం చేస్తుంటాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలని బ్యాంకును ఆశ్రయించిన తరువాత వారం రోజుల్లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. వారం రోజులు దాటినప్పటికి ఆ బ్యాంకు నిర్లక్ష్యం వహిస్తే ఆ క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు సంబంధిత బ్యాంక్ పై ఫిర్యాదు చేయవచ్చు. అలా చేస్తే ఆ బ్యాంకు నిర్లక్ష్యం చేసిన రోజులన్నిటికి రోజుకు రూ. 500 చొప్పున పెనాల్టీ రూపంలో బాధిత కస్టమర్లకు చెల్లించాల్సి ఉంటుంది. -
హెలికాప్టర్ ప్రమాదం: ప్రముఖ బ్యాంక్ సీఈఓ దుర్మరణం!
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నైజీరియాలోని అతిపెద్ద access bank సీఈఓతో సహా 9 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. కాలిఫోర్నియాలోని నిప్టన్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో కూలిపోయిన సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వారిలో access bank యాక్సెస్ బ్యాంక్ గ్రూప్ సీఈఓ హెర్బర్ట్ విగ్వే ఉన్నారని, ఆయన మరణాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకోంజో ఇవెలా ఎక్స్లో పోస్ట్ చేశారు. నైజీరియన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ మాజీ చైర్మన్ అబింబోలా ఒగున్బాంజో సైతం విగ్వే మరణాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా.. ప్రమాద స్థలం హాలోరాన్ స్ప్రింగ్స్ రోడ్డు సమీపంలోని 15-ఫ్రీవేకు తూర్పున ఉందని నిర్ధారించామని శాన్ బెర్నార్డినో కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. ఈ హెలికాప్టర్ను యూరోకాప్టర్ ఈసీ 130గా గుర్తించిన ఎఫ్ ఏఏ.. నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో కలిసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాగా, లాస్ వెగాస్కు వెళ్తుండగా నెవాడా- కాలిఫోర్నియా సరిహద్దు నగరం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. -
వేలాదిగా ఏటీఎంలు, బ్రాంచ్లు మూసేస్తున్న ప్రముఖ బ్యాంక్.. ఏం జరుగుతోంది?
ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన కామన్వెల్త్ బ్యాంక్ వేలాదిగా ఏటీఎంలు, బ్రాంచ్లు మూసేస్తోంది. రికార్డ్ స్థాయిలో లాభాలు ఉన్నప్పటికీ వేలాదిగా ఏటీఎంలు, బ్రాంచ్లను ఎందుకు మూసేస్తోందా అన్నది అంతుబట్టడం లేదు. కామన్వెల్త్ బ్యాంక్ గత ఐదేళ్లలో 354 శాఖలను మూసివేసింది. తాజాగా మూడు ప్రధాన నగరాల్లోని అత్యంత జనాభా ఉన్న ప్రాంతాల్లో వచ్చే నెలలో మరో మూడు బ్రాంచ్లను మూసివేయాలని యోచిస్తోందని డైలీ మెయిల్ కథనం పేర్కొంది. రికార్డ్ లాభాన్ని ఆర్జించినప్పటికీ ఆస్ట్రేలియా అతిపెద్ద హౌసింగ్ బ్యాక్ అయిన కామన్వెల్త్ బ్యాంక్కి 2018 జూన్ నాటికి 1,082 బ్రాంచ్లు ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాటిలో మూడవ వంతు బ్రాంచ్లను మూసివేసింది. నగదు వినియోగంలో బాగా క్షీణించిన సమయంలో అయితే ఈ బ్యాంక్ ఏకంగా 2,297 ఏటీఎంలను తొలగించింది. దీంతో ఆ బ్యాంక్ ఏటీఎంల సంఖ్య 54 శాతం పడిపోయింది. కామన్వెల్త్ బ్యాంక్ ఇప్పుడు సెంట్రల్ అడిలైడ్లోని తన రండిల్ మాల్ శాఖను , గోల్డ్ కోస్ట్లోని కూలన్గట్ట, సిడ్నీలోని కూగీలో అవుట్లెట్లను మార్చి 1న మూసివేయాలని యోచిస్తోంది. ఇటీవలి సమీక్ష తర్వాత, మా రండిల్ మాల్ అడిలైడ్, కూలంగాట్ట, కూగీ బ్రాంచ్లను శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు బ్యాంక్ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు డైలీ మెయిల్ పేర్కొంది. కామన్వెల్త్ బ్యాంక్ అనుబంధ సంస్థ బ్యాంక్వెస్ట్ కూడా రాబోయే వారాల్లో పెర్త్, పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రాంతీయ శాఖలను మూసివేస్తోంది. ఆస్ట్రేలియన్ మల్టీ నేషనల్ బ్యాంక్ అయిన కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ( CBA) ఆస్ట్రేలియాతోపాటు న్యూజిలాండ్ , ఆసియా , యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అంతటా వ్యాపారాలను నిర్వహిస్తోంది. రిటైల్, బిజినెస్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్, ఫండ్ మేనేజ్మెంట్ , సూపర్యాన్యుయేషన్ , ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ బ్రోకింగ్ సేవలతోపాటు వివిధ రకాల ఆర్థిక సేవలను అందిస్తోంది. 1911లో ఆస్ట్రేలియా ప్రభుత్వం దీన్ని స్థాపించగా 1996లో పూర్తిగా ప్రైవేటీకరించారు. ఇది ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ మహిళల జట్టుకు జర్సీ స్పాన్సర్గా కొనసాగుతోంది. -
ఈ బ్యాంకుల్లో 2 సంవత్సరాల డిపాజిట్లపై 7.25% వడ్డీ
-
సేవింగ్స్ ఖాతాలపై 7.75 శాతం వడ్డీ కావాలా..! ఈ బ్యాంకుల్లో ఇస్తున్నారు
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సేవింగ్ అకౌంట్లపై అందించే వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తెలిపింది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకారం.. రూ.20 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని రూ.5లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని అందిస్తున్నట్లు వెల్లడించింది. యూనిటీ బ్యాంక్ రూ. 1 లక్ష వరకు డిపాజిట్లపై సంవత్సరానికి 6.00 శాతం, రూ. 1 లక్ష కంటే ఎక్కువ రూ. 5 లక్షల వరకు ఉన్న నిల్వలకు సంవత్సరానికి 7.00శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఖాతాలను ఉంచే హెచ్ఎన్ఐలకు 7.75శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ప్రతి స్లాబ్పై నెలవారీ వడ్డీని అందిస్తుంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య వడ్డీ రేట్లను 4.50శాతం నుండి 9శాతం వరకు అందిస్తున్నట్లు తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై, యూనిటీ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 9.50శాతం, సాధారణ పెట్టుబడిదారులకు 1001 రోజులకు 9.00శాతం వడ్డీ రేటును అందిస్తోంది. -
వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే..
దేశీయంగా బ్యాంకుల స్థూల పారు బాకీలు(గ్రాస్ ఎన్పీఏలు) గత పదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరినట్లు ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగ ఆర్థిక స్థితి మెరుగైందన్నది కాదనలేని సత్యం. కానీ అందుకు చాలామార్పులు తీసుకురావాల్సి వచ్చింది. డిపాజిట్దారుల నుంచి డబ్బు తీసుకుని, వారికి చెల్లించే వడ్డీకన్నా కాస్త ఎక్కువకు రుణగ్రహీతలకు అప్పులు ఇచ్చి లాభాలు ఆర్జించడమే బ్యాంకుల ప్రధాన వ్యాపారం. అప్పులు తీసుకున్నవారు వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోతే పారు బాకీలు (ఎన్పీఏలు) ఎక్కువై బ్యాంకులు నష్టాలపాలవుతాయి. భారతీయ బ్యాంకులు 2014-15 నుంచి రూ.14.56 లక్షల కోట్ల పారు బాకీలను రద్దు చేశాయని కేంద్రం ఇటీవల పార్లమెంటులో తెలిపింది. అందులో రూ.7.40 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు, బడా సర్వీసు కంపెనీలకు ఇచ్చినవే. గడచిన మూడేళ్లలో బ్యాంకులు పారుబాకీల కింద చూపిన రూ.5.87 లక్షల కోట్లలో 19శాతాన్ని అంటే, 1.09 లక్షల కోట్ల రూపాయలను మాత్రమే తిరిగి వసూలు చేయగలిగాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. గత పదేళ్లలో బ్యాంకుల పారుబాకీలు బాగా తగ్గినట్లు రిజర్వు బ్యాంకు తాజాగా వెల్లడించింది. అయితే, భారీ కంపెనీలకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాక నష్టాలపాలైన బ్యాంకులను మళ్ళీ నిలబెట్టడానికి క్యాపిటల్ మానిటైజేషన్ పేరుతో బడ్జెట్లలో వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు కేటాయించడం ఆనవాయితీగా మారింది. ఇదీ చదవండి: ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..? ఇలా 2016-21 మధ్య కేంద్రం దాదాపు రూ.3.10 లక్షల కోట్లు ఇచ్చింది. 2022-23, 2023-24 బడ్జెట్లలో మాత్రమే కేటాయింపులు జరపలేదు. ఈసారి బడ్జెట్లో పరిస్థితి ఎలాఉండబోతుందో చూడాలని నిపుణులు చెబుతున్నారు. -
అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు
బ్యాంక్ఖాతా ఉండి ఎలాంటి లావాదేవీలు జరపని వినియోగదారులపై విధించే ఛార్జీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏళ్లు గడుస్తున్నా బ్యాంక్ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరపని వారి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలు వేస్తూంటారు. ఇకపై ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇన్ఆపరేటివ్గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలు వేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులను ఆదేశించింది. అలాగే స్కాలర్షిప్ నగదును పొందడం కోసం లేదా ప్రత్యక్ష నగదు బదిలీల కోసం ఓపెన్చేసిన బ్యాంక్ఖాతాల్లో రెండేండ్లకుపైగా ఎలాంటి లావాదేవీలు జరగకపోయినా వాటిని ఇన్ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు అన్క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్లను తగ్గించే చర్యల్లో భాగంగా, ఇన్ఆపరేటివ్ ఖాతాలపై విడుదల చేసిన తాజా సర్క్యులర్లో బ్యాంకులకు ఆర్బీఐ ఈ సూచనలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడానికి, సదరు డిపాజిట్లు వాటి నిజమైన హక్కుదారులు/ వారసులకు చేరడానికి బ్యాంకులు, ఆర్బీఐ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడుతాయని సర్క్యులర్ ద్వారా తెలిసింది. -
నిరర్థక ఆస్తులు తగ్గితేనే డివిడెండ్..! ఆర్బీఐ కొత్త నిబంధన
ముంబై: వాటాదారులకు డివిడెండ్ పంపిణీ విషయంలో బ్యాంక్లకు ఆర్బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. నికర నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) 6 శాతం కంటే తక్కువగా ఉంటే, అవి డివిడెండ్ పంపిణీ చేసుకోవచ్చని పేర్కొంది. చివరిగా 2005లో సవరించిన నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు బ్యాంక్లు వాటి నికర ఎన్పీఏలు 7 శాతంలోపుంటే డివిడెండ్ పంపిణీ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ పంపిణీ చేసుకోవాలంటే నికర ఎన్పీఏలు 6 శాతంలోపు ఉండాలని ముసాయిదా ప్రతిపాదనల్లో ఆర్బీఐ పేర్కొంది. అలాగే, డివిడెండ్ పంపిణీలో గరిష్ట పరిమితిని లాభాల్లో 40 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. కాకపోతే ఈ గరిష్ట పరిమితి మేరకు డివిడెండ్ పంచాలంటే నికర ఎన్పీఏలు సున్నాగా ఉండాలి. డివిడెండ్ పంపిణీకి సంబంధించి తాత్కాలిక ఉపశమనం అభ్యర్థనలను అమోదించేది లేదని పేర్కొంది. ఇదీ చదవండి: అన్నింటికి ఒకే కార్డు.. ప్రత్యేకతలివే.. డివిడెండ్ పంపిణీకి అర్హత పొందాలంటే వాణిజ్య బ్యాంక్ క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 11.5 శాతంగా ఉండాలి. అదే ఫైనాన్స్ బ్యాంక్లు, పేమెంట్ బ్యాంక్లకు 15 శాతంగా, లోకల్ ఏరియా బ్యాంక్లు, రీజినల్ రూరల్ బ్యాంక్లకు 9 శాతంగా ఉండాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. విదేశీ బ్యాంక్లు ఆర్బీఐ అనుమతి లేకుండానే తమ లాభాలను మాతృ సంస్థకు పంపుకునేందుకు కూడా అనుమతించనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రతిపాదిత నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటిని బ్యాంక్ల బోర్డులు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. బాసెల్ 3 ప్రమాణాలు, కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) అమలు నేపథ్యంలో మార్గదర్శకాలను ఆర్బీఐ సమీక్షించింది. -
అన్నింటికి ఒకే కార్డు.. ప్రత్యేకతలివే..
మెట్రో, బస్సు, రైలు, ఏటీఎం, టోల్, పార్కింగ్.. ఇలా ప్రతిదానికి ప్రత్యేకించి కార్డులుంటాయి. వీటన్నింటిని వెంటతీసుకుని వెళ్లడం కొంత చికాకుతో కూడిన వ్యవహారం. అయితే అన్ని రకాల చెల్లింపులకు ఒకే కార్డు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ) రూపే రీలోడబుల్ ప్రీపెయిడ్ కార్డ్ను తీసుకొచ్చింది. ‘వన్ నేషన్, వన్ కార్డ్’ చొరవతోనే ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఎన్సీఎమ్సీ కార్డుతో మెట్రో, బస్సు, రైలు, క్యాబ్ ప్రయాణాల టికెట్లను కొనుగోలు చేయొచ్చు. టోల్, పార్కింగ్ లాంటి సమయంలోనూ ఈ కాంటాక్ట్లెస్ కార్డు ఉపయోగపడుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఏటీఎం విత్డ్రాతో పాటూ పాయింట్ ఆఫ్ సేల్, ఈ-కామర్స్ చెల్లింపుల కోసం కూడా ఈ కార్డును ఉపయోగించవచ్చని చెప్పారు. ఇదీ చదవండి: దేశంలో ఎన్నికలే ఎన్నికలు!,ఎస్బీఐ కీలక నిర్ణయం ఈ ఎన్సీఎమ్సీ కార్డుతో ఆన్లైన్, ఆఫ్లైన్ లావాదేవీలు చేసుకోవచ్చని బ్యాంకు పేర్కొంది. ఆన్లైన్ వాలెట్ బ్యాలెన్స్ గరిష్ఠంగా రూ.లక్ష వరకు, ఆఫ్లైన్ వాలెట్లో అయితే రూ.2వేలుగా పరిమితిని నిర్ణయించింది. బ్యాంక్ ప్రత్యేక పోర్టల్ ద్వారా కార్డు దారులు డబ్బును లోడ్/ రీలోడ్ చేసుకోవచ్చు. -
2024లో బ్యాంక్ సెలవులు ఇవే..
ఒకప్పుడు బ్యాంక్కు వెళ్లనిదే పనులు జరిగేవి కావు. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు మెబైల్లోనే దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. ఖాతా తెరవడం దగ్గర నుంచి ఇతరులకు నగదు పంపించడం వరకు చాలా పనులు దీంతోనే చెక్కబెట్టేస్తున్నారు. అయితే, బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలన్నా, లాకర్లో వస్తువులు దాయాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఏదైనా పని మీద బ్యాంకుకు వెళ్లాల్సి వస్తే.. ముందుగా ప్లాన్ చేసుకోవాలి. తీరా ఆ రోజు సెలవు అని తెలిస్తే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. కాబట్టి బ్యాంకు శాఖలు పనిచేసే రోజులు తెలుసుకోవాలి. తాజాగా కొత్త ఏడాదికి సంబంధించి ఆర్బీఐ సెలవు తేదీలను ప్రకటించింది. సంక్రాంతి, మహా శివరాత్రి, దీపావళి వంటి పండగలు, ఆదివారాలు, ప్రతి నెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. ఆయా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. 2024లో బ్యాంకు సెలవులు ఇలా ఉన్నాయి.. జనవరి.. జనవరి 1- సోమవారం- నూతన సంవత్సరం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు జనవరి 11- గురువారం- మిషనరీ డే- మిజోరం జనవరి 12- శుక్రవారం- స్వామి వివేకానంద జయంతి- బంగాల్ జనవరి 13- రెండో శనివారం/లోహ్రి- దేశవ్యాప్తంగా సెలవు జనవరి 14- ఆదివారం- సంక్రాంతి- దేశవ్యాప్తంగా హాలిడే ఉంది. జనవరి 15- సోమవారం- పొంగల్, తిరువళ్లూర్ డే- తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో సెలవు జనవరి 16- మంగళవారం- తుసు పూజ- బంగాల్, అసోంలో సెలవు జనవరి 17- బుధవారం- గురు గోవింద్ సింగ్ జయంతి- పలు రాష్ట్రాల్లో సెలవు జనవరి 23- మంగళవారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి- పలు రాష్ట్రాల్లో ఉంది. జనవరి 25- గురువారం- స్టేట్ డే- హిమాచల్ ప్రదేశ్ జనవరి 26- శుక్రవారం- రిపబ్లిక్ డే- దేశవ్యాప్తంగా సెలవు జనవరి 27- నాలుగో శనివారం- దేశవ్యాప్తంగా సెలవు జనవరి 31- బుధవారం- మి-డామ్-మే-ఫి- అసోం ఇదీ చదవండి: దేన్నీ వదలని ‘డీప్ఫేక్’ ముఠా..! ఫొటోలు వైరల్ ఫిబ్రవరి.. ఫిబ్రవరి 10- రెండో శనివారం ఫిబ్రవరి 15- గురువారం- లుయ్-ఎంగయ్-ని - మణిపుర్ ఫిబ్రవరి 19- సోమవారం- శివాజీ జయంతి- మహారాష్ట్ర ఫిబ్రవరి 24- నాలుగో శనివారం మార్చి.. మార్చి 8- శుక్రవారం- మహాశివరాత్రి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు) మార్చి 23- శనివారం- భగత్ సింగ్ మార్టిర్డమ్ డే - పలు రాష్ట్రాల్లో సెలవు మార్చి 25- సోమవారం- హోలీ (గెజిటెడ్ హాలిడే) మార్చి 29- గుడ్ఫ్రైడే- శుక్రవారం (గెజిటెడ్ హాలిడే) ఏప్రిల్.. ఏప్రిల్ 9 - మంగళవారం- ఉగాది - కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో సెలవు ఏప్రిల్ 10- ఈద్- ఉల్- ఫితుర్- బుధవారం (గెజిటెడ్ హాలిడే) ఏప్రిల్ 13- రెండో శనివారం ఏప్రిల్ 14- ఆదివారం- అంబేడ్కర్ జయంతి- దేశవ్యాప్తంగా సెలవు ఏప్రిల్ 17- శ్రీరామనవమి- బుధవారం- చాలా రాష్ట్రాల్లో సెలవు ఏప్రిల్ 21- ఆదివారం ఏప్రిల్ 27- నాలుగో శనివారం ఇదీ చదవండి: ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే.. మే.. మే 1- బుధవారం- దేశవ్యాప్తంగా సెలవు (మే డే) మే 11- రెండో శనివారం మే 25- నాలుగో శనివారం జూన్.. జూన్ 8 - రెండో శనివారం జూన్ 16- ఆదివారం జూన్ 22- నాలుగో శనివారం జులై.. జులై 13- రెండో శనివారం జులై 17- బుధవారం- మొహర్రం- దేశవ్యాప్తంగా సెలవు (కొన్ని రాష్ట్రాల్లో మినహా) జులై 27- నాలుగో శనివారం ఆగస్టు.. ఆగస్టు 10- రెండో శనివారం ఆగస్టు 15- గురువారం- స్వాతంత్య్ర దినోత్సవం- దేశవ్యాప్తంగా సెలవు ఆగస్టు 19- సోమవారం- రాఖీ- యూపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా ఆగస్టు 24- నాలుగో శనివారం ఆగస్టు 26- సోమవారం- కృష్ణాష్టమి- చాలా రాష్ట్రాల్లో సెప్టెంబర్.. సెప్టెంబర్ 7 - శనివారం- వినాయక చవితి- దేశవ్యాప్తంగా సెలవు సెప్టెంబర్ 8- ఆదివారం సెప్టెంబర్ 16- సోమవారం- ఈద్- ఇ- మిలాద్- దేశవ్యాప్తంగా సెలవు సెప్టెంబర్ 28- నాలుగో శనివారం. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? అక్టోబర్.. అక్టోబర్ 2- గాంధీ జయంతి- దేశవ్యాప్తంగా సెలవు- బుధవారం అక్టోబర్ 10- మహాసప్తమి- గురువారం- దేశవ్యాప్తంగా సెలవు అక్టోబర్ 11- మహా అష్టమి- శుక్రవారం- పలు రాష్ట్రాల్లో అక్టోబర్ 12- రెండో శనివారం- విజయదశమి అక్టోబర్ 26- నాలుగో శనివారం నవంబర్.. నవంబర్ 9 - రెండో శనివారం నవంబర్ 23- నాలుగో శనివారం డిసెంబర్.. డిసెంబర్ 14- రెండో శనివారం డిసెంబర్ 25- బుధవారం- క్రిస్మస్- దేశవ్యాప్తంగా సెలవు డిసెంబర్ 28- నాలుగో శనివారం -
‘బ్యాడ్ బ్యాంక్’లు మంచివే..?
రూ.లక్ష లేదా రెండు లక్షల రూపాయలు బ్యాంకులు అప్పుగా ఇవ్వాలంటే సవాలక్ష పత్రాలు అడిగి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తాయి. కానీ కార్పొరేట్లు అప్పుకోసం బ్యాంకులకు వెళితే మర్యాదలు చేసిమరీ కోరి అప్పిస్తాయి. కానీ లక్షల్లో అప్పుతీసుకునే సామాన్యులే నెల కిస్తీలు సవ్యంగా చెల్లిస్తారు. కోట్లల్లో అప్పులు తీసుకునే కొందరు కార్పొరేట్లు, ఇతరులు పూర్తిగా చెల్లించేవరకు అనుమానమే. అలా తీసుకున్న అప్పు చెల్లించకుండా బ్యాంకుల వద్ద పోగవుతున్న నిరర్ధక ఆస్తుల(తిరిగి చెల్లించని అప్పులు) చిట్టా 2019 వరకు ఏకంగా రూ.9,33,779 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి కరాద్ తెలిపారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద ఇచ్చిన లోన్లను కలుపుకొని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏలు) 2019 మార్చి 31 నాటికి రూ.9,33,779 కోట్లుగా రికార్డయ్యాయని కేంద్ర మంత్రి కరాద్ ఇటీవల పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది బ్యాంకుల అడ్వాన్స్ల్లో 9.07 శాతానికి సమానం. ద్రవ్యోల్బణం కారణంగా పరిస్థితులు దిగజారితే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మరింత పెరగొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే భారత బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగ సంక్షోభం పెను సవాల్గా పరిణమించే అవకాశం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు చూపిస్తున్న మార్గమే బ్యాడ్ బ్యాంక్. బ్యాడ్ బ్యాంక్ అంటే.. సాధారణంగా వాణిజ్య బ్యాంకులు వాటి రుణాలపై వచ్చే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా అంటే.. మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్పీఏలను దీనికి బదిలీ చేస్తారు. ఏమిటి లాభం.. బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు వల్ల ఆయా ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది. ఎన్పీఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంక్కు వెళ్లడంతో వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితీరు మెరుగుపడుతుంది. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి. ఏఆర్సీ ఉండగా బ్యాడ్ బ్యాంక్ ఎందుకు? బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్పీఏలను క్లియర్ చేసుకునేందుకు ‘అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ’(ఏఆర్సీ)లను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్పీఏలను కొని వాటి ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్సీలకు ఎంతో కొంతకు ఎన్పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి. బ్యాడ్ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్సీ లాంటిదే. కానీ, బ్యాడ్ బ్యాంక్లకు వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏలను విక్రయించవు. కేవలం బదిలీ మాత్రమే చేస్తాయి. తద్వారా సాధారణ బ్యాంకులు వాటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. ఇక బ్యాడ్ బ్యాంకు ఎన్పీఏలపై పనిచేసి తిరిగి వాటిని ఎలా రాబట్టాలి... అందుకు ఉన్న వెసులుబాట్లపై దృష్టి సారిస్తుంది. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసి వీలైనంత మొత్తాన్ని రాబట్టేందుకు కృషి చేస్తాయి. దీని ఏర్పాటు ఇలా.. ఎన్పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే ‘పబ్లిక్ సెక్టార్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(పారా)’ను ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ప్రభావం బ్యాంకులపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. ప్రముఖులు ఏమంటున్నారంటే.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో బ్యాడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడాన్ని ఆయన రాసిన ‘ఐ డూ వాట్ ఐ డూ’ పుస్తకంలో వ్యతిరేకించారు. ప్రభుత్వానికి చెందిన ఓ ఖజానా నుంచి రుణాలను మరో ఖజానాను మార్చడం తప్ప పెద్దగా మార్పేమీ ఉండదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వ బ్యాంకులు వసూలు చేసే అసమర్థత మాత్రమే బ్యాడ్ బ్యాంకులకు బదిలీ అవుతుందని విమర్శించారు. అయితే బ్యాడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ‘ఇండియన్ బ్యాంక్స్: ఏ టైం టు రిఫార్మ్’ పుస్తకంలో రాజన్ సూచించారు. అప్పుడు ఎన్పీఏలను బ్యాడ్ బ్యాంకులకు తరలించాలన్నారు. మరోవైపు, ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనపై ఓ సందర్భంలో అఇష్టతను చూపించారు. రికవరీలు భారీగా చేయగలిగితే తప్ప వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనను బలంగా సమర్థించారు. ఇదీ చదవండి: కస్టమర్లకు రూ.5800 కోట్లు చెల్లించనున్న గూగుల్.. ఎందుకంటే.. పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తున్నవారే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనను సమర్థిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఎగవేతదార్లకు అండగా నిలవడమే దీని లక్ష్యమని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేయడం కంటే ఎగవేతదార్లపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం చేతిలో బ్యాడ్ బ్యాంక్ కీలుబొమ్మగా మారితే ఇప్పటికే రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లకు మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. -
చనిపోయినవారి ఖాతాలో డబ్బులు ఏమౌతాయి..?
బ్యాంకుల వద్ద క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన డిపాజిట్లు ఏటా పెరుగుతున్నాయి. అందులో కొందరు ఖాతాదారులు చనిపోయి ఉంటారు. మరికొందరు ఇతర కారణాల వల్ల వారి డబ్బుకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేయరు. దాంతో అవి ఎవరు క్లెయిమ్ చేయకుండా అలాగే బ్యాంకుల్లో పోగవుతాయి. అలా అని ఆ డబ్బును బ్యాంకు వాటి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు మాత్రం నిబంధనలు ఒప్పుకోవు. కచ్చితంగా ఆ డబ్బును సదరు ఖాతాదారులకే చెల్లించేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే ఎవరు క్లెయిమ్ చేయని (అన్క్లెయిమ్డ్) డిపాజిట్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.42,270 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది కాలంతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉన్న అకౌంట్లలోని డిపాజిట్లను అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. కిందటేడాది మార్చి 31 నాటికి రూ.32,934 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అవి ఈ ఏడాది మార్చి నాటికి రూ.42,272 కోట్లకు చేరిందని ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ పార్లమెంట్లో వెల్లడించారు. ఈ ఫండ్స్ను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ)ఫండ్లో ఉంచుతారు. ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తిరిగి సదరు ఖాతాదారులకు పంపేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోందని కరాద్ వెల్లడించారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకులు తమ వెబ్సైట్లో ఉంచాలని ఇప్పటికే ఆర్బీఐ సూచించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఖాతాలకు సంబంధించి కస్టమర్లను సంప్రదించాలని, ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి లీగల్ వారసులకు వివరాలు అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించేందుకు బోర్డు ఆమోదంతో కొన్ని రూల్స్ రెడీ చేయాలని, గ్రీవెన్స్ రిడ్రస్సల్ మెకానిజంను ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని ఆర్బీఐ సలహా ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రూ.1,432.68 కోట్లు రిటర్న్.. డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు సెంట్రలైజ్డ్ వెబ్సైట్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టూ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చిందని కరాద్ అన్నారు. దీనికి తోడు ‘100 డేస్ 100 పేస్’ క్యాంపెయిన్ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాల్లోని టాప్ 100 అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను 100 రోజుల్లో బ్యాంకులు సెటిల్ చేయనున్నాయి. ఈ ప్రచారం ఈ ఏడాది జూన్ 1న మొదలై సెప్టెంబర్ 8 వరకు కొనసాగిందని మంత్రి వెల్లడించారు. క్యాంపెయిన్ ముగిసే సమయానికి 31పెద్ద బ్యాంకులు రూ.1,432.68 కోట్లను నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారికి రిటర్న్ చేసినట్లు వివరించారు. ఇదీ చదవండి: జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి -
విద్యార్ధులకు బ్యాంక్ ఆఫ్ బరోడా బంపరాఫర్!
విద్యార్ధులకు ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. బీఆర్ఓ పేరిట విద్యార్థుల కోసం కొత్త సేవింగ్స్ జీరో బ్యాంక్ అకౌంట్ని తీసుకొచ్చింది. ఈ ఖాతాను 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన విద్యార్థులు తెరవొచ్చు. ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. విద్యార్ధుల అర్హతను బట్టి జీవిత కాలం ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డును అందిస్తారు. త్రైమాసికానికి రెండు సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ సదుపాయం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సేవింగ్ అకౌంట్పై ఇతర ప్రయోజనాలు 👉16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయస్సు గల వారికి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా 👉ప్రముఖ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లతో జీవితకాల ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ 👉 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ 👉యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రూ.2 లక్షలు 👉ఆటో స్వీప్ సౌకర్యం అందుబాటులో ఉంది 👉డిజిటల్ ఛానెల్లు, బ్రాంచ్ ద్వారా ఉచిత ఎన్ఎఫ్టీ,ఆర్టీజీఎస్,ఐఎంపీఎస్,యూపీఐ సర్వీసులు 👉అపరిమిత ఉచిత చెక్ లీవ్లు 👉ఉచిత ఎస్ఎంఎస్, మెయిల్స్ అలెర్ట్ 👉డీమ్యాట్ ఏఎంసీలో 100శాతం వరకు రాయితీ 👉సున్నా ప్రాసెసింగ్ రుసుముతో విద్యా రుణాలపై రాయితీ వడ్డీ రేట్లు 👉అర్హతకు లోబడి ప్రత్యేకమైన క్రెడిట్ కార్డ్ ఆఫర్లు -
వీటిని తెగవాడుతున్నారు..!
ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్లు కనిపిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్తో చెల్లింపులు సాగిస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కచ్చితంగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ఉంటున్నాయి. చిటికెలో ట్రాన్సాక్షన్ పూర్తి చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిన క్రమంలో డిజిటల్ పేమెంట్లలో యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు యూపీఐ పేమెంట్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాద్ పార్లమెంట్లో కీలక విషయాలు వెల్లడించారు. యూపీఐ పేమెంట్లు పెరగడంతో గతేడాది చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 7.8 శాతానికి తగ్గినట్లు చెప్పారు. 2017-18 ఏడాదిలో యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య 92 కోట్లుగా ఉండగా.. అది 2022-23కు ఏకంగా 8,357 కోట్లకు చేరినట్లు చెప్పారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్యాపరంగా వార్షిక వృద్ధి 147 శాతంగా ఉందని పేర్కొన్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ 2017-18లో దాదాపు రూ.1 లక్ష కోట్లుగా ఉండగా.. అది 168 శాతం పెరిగి 2022-23లో రూ.139 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో డిసెంబర్ 11 వరకు యూపీఐ మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్య 8,572 కోట్లుగా తెలిపారు. 2022-23లో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్లలో యూపీఐ లావాదేవీలే 62 శాతంగా ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వ సంస్థ.. చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 2021-22లో 9.9 శాతంగా ఉండగా.. 2022-23లో 7.8 శాతానికి తగ్గిందన్నారు. యూపీఐతో రూపే క్రెడిట్ కార్డులు లింక్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల క్రెడిట్ కార్డులను తమతో తీసుకెళ్లకుండానే చిన్న విక్రయ కేంద్రాల్లోనైనా చెల్లింపులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉండగా.. గత తొమ్మిదేళ్లలో 57 బ్యాంకులను మూసివేసినట్లు మంత్రి చెప్పారు. మూడు బ్యాంకులు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంకులను పునరుద్ధరించినట్లు చెప్పారు. -
రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం..
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఎదురవుతున్న సైబర్ సెక్యూరిటీ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ చెప్పారు. కేంద్ర ఆర్థికశాఖ సమక్షంలో ఇటీవల జరిగిన భేటీలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సన్నద్ధత గురించి చర్చించామని మంత్రి కరద్ పేర్కొన్నారు. సైబర్ దాడులు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి అవకతవకలపై పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్థిక మోసాలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబరు 4, 2023 వరకు జరిగిన 4 లక్షలకు పైగా సంఘటనల్లో ఈ వ్యవస్థ మొత్తం రూ.1,000 కోట్లకు మించి ఆదా చేసిందని పేర్కొన్నారు. పలువురి ఖాతాల్లో నవంబర్, 2023లో పొరపాటున జమ అయిన రూ.820 కోట్లకు గాను రూ.705.31 కోట్లను యూకో బ్యాంక్ రికవరీ చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ ఈ సమావేశంలో వెల్లడించారు. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ ఛానెల్లో సాంకేతికలోపంతో 41,000 యూకో బ్యాంక్ ఖాతాల్లోకి పొరపాటున ఈ నిధులు జమ అయినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి నవంబర్ 15న యూకో బ్యాంక్ ఇద్దరు సపోర్ట్ ఇంజినీర్లు, ఇతర వ్యక్తులపై సీబీఐ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటకలోని 13 ప్రదేశాల్లో డిసెంబర్ 5న సీబీఐ సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిళ్లకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టింది. ఇదీ చదవండి: ఆఫీస్లో కాసేపు పడుకోనివ్వండి! ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, ఏటీఎంలు, బ్యాంక్ బ్రాంచ్లతో సహా వివిధ ఛానెల్ల ద్వారా యాక్సెస్ చేయగల 24/7 ఇంటర్బ్యాంక్ మొబైల్, ఐఎంపీఎస్లో లోపం ఏర్పడినట్లు విచారణలో తేలిందని అధికారులు వివరించారు. -
బ్యాంకులో పెట్టిన బంగారం పోతే ఎంతిస్తారంటే...
బంగారం ఆర్థికంగా ఆపదలో ఆదుకుంటుందని అందరూ చెబుతారు. అవసరాలకు డబ్బు అందనపుడు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి అప్పు తెస్తుంటారు. ప్రైవేటు వ్యాపారులు, ఎన్బీఎఫ్సీలు, ప్రభుత్వ బ్యాంకులు బంగారం తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తుంటాయి. అయితే ఇతర సంస్థలు కంటే ప్రభుత్వరంగ బ్యాంకులు బంగారం తనఖాపై తక్కువే రుణం ఇస్తుంటాయి. అయినా తమ సొమ్మకు భరోసా ఉంటుందని భావించి ప్రజలు ప్రభుత్వ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. సదరు బ్యాంకులో దురదృష్టవశాత్తు నగలు ఎవరైనా దొంగలిస్తే తనఖాపెట్టిన బంగారానికి గ్యారెంటీ ఎవరనే ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా? అయితే ఓ బ్యాంకు అధికారి ఇలా తనఖా పెడుతున్న బంగారానికి సంబంధించి భద్రత ఎవరిపై ఉంటుందనే అంశాలను వెల్లడించారు. తనఖా పెట్టిన ఆభరణాల బాధ్యత బ్యాంకుదే అవుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందకూడదన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఖాతాదారులు తనఖా పెట్టిన ఆభరణాలను బ్యాంకు అధికారులు ‘సేఫ్’లో భద్రపరుస్తారు. బ్యాంకుశాఖలోని ఎకౌంటెంట్తో పాటు క్యాష్ ఇన్ఛార్జి (క్లర్క్) లేదా మరో అధికారి సంయుక్తంగా వీటికి బాధ్యత వహిస్తారు. ఈ సేఫ్ తాళాలు ఇద్దరి దగ్గరే ఉంటాయి. ఒకరిని గుడ్డిగా నమ్మి, వేరొకరు ఇతరులకు తాళాన్ని ఇస్తే తప్పా సొత్తును అపహరించడం కష్టం. ఇదీ చదవండి: భోజన సమయంలో కింద కూర్చుంటే రూ.220 జరిమానా..! బ్యాంకు శాఖల్లో ఆడిట్ జరిగినప్పుడు ఆభరణాలు ఏమైనా తగ్గితే.. వెంటనే పరిశీలన జరిపి, లెక్క తేలుస్తారు. కొందరు రుణం తీర్చేసినప్పుడు వారికి ఆభరణాలు ఇచ్చేసినా.. పొరపాటున సేఫ్లోనూ ఉన్నట్లు అధికారులు రాసుకుంటారని పదవీవిరమణ చేసిన మరో బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. ఏదైనా కారణాలతో బ్యాంకులోని బంగారం కనిపంచకుండాపోతే రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకులో నమోదయ్యే బంగారం బరువు మేరకు ఖాతాదార్లు పరిహారం పొందొచ్చని తెలిపారు. ఉదాహరణకు 100 గ్రాముల ఆభరణం తనఖా పెడితే, 98 గ్రాములను పరిగణనలోకి తీసుకుని.. దానికి సరిపడా బంగారం గానీ, దాని విలువ మేరకు నగదును కానీ పొందే హక్కు ఖాతాదార్లకు ఉంటుంది. తనఖా పెట్టినప్పటి ధర, చోరీ జరిగినట్లు గుర్తించినప్పటి ధరలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం చెల్లిస్తారని సీనియర్ అధికారి వివరించారు. -
ఐదేళ్లలో రూ.10.57 లక్షల కోట్ల రుణ మాఫీ.. ఎన్పీఏల రికవరీ ఎంతంటే?
దేశంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2018–19 నుంచి 2022–23) రూ.10.57 లక్షల కోట్లను మాఫీ (రైటాఫ్.. పద్దుల్లోంచి తొలగింపు) చేశాయని, అందులో రూ.5.52 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు సంబంధించిన రుణాలని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు గత ఐదేళ్ల కాలంలో రూ.7,15,507 కోట్ల నిరర్థక ఆస్తులను (ఎన్పీఏ) కూడా రికవరీ చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల కాలంలో మోసాలకు సంబంధించి జరిగిన రైటాఫ్ల విలువ రూ.93,874 కోట్లని ఈ సందర్భంగా వెల్లడించారు. మాఫీతో రుణ గ్రహీతకు ప్రయోజనం ఉండదు... సంబంధిత బ్యాంక్ బోర్డుల మార్గదర్శకాలు– విధానాలకు అనుగుణంగా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్ను క్లీన్ చేస్తాయని కరాద్ పేర్కొన్నారు. పన్ను ప్రయోజనాలను పొందేందడం, మూలధనాన్ని తగిన విధంగా వినియోగించుకోవడం వంటి అంశాలకు సంబంధించి బ్యాంకులు రైట్–ఆఫ్ల ప్రభావాన్ని క్రమం తప్పకుండా అంచనా వేస్తాయని కరాద్ చెప్పారు. ‘‘ఇటువంటి రైట్–ఆఫ్లు రుణగ్రహీతల తిరిగి చెల్లించాల్సిన బాధ్యతల మాఫీకి దారితీయదు. రైట్–ఆఫ్ రుణగ్రహీతలకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు. రుణగ్రహీతలు బ్యాంకులకు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిందే. బ్యాంకులు వాటికి అందుబాటులో ఉన్న యంత్రాంగాల ద్వారా రికవరీ చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి’’ అని కరాద్ స్పష్టం చేశారు. 21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు: నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు 21,791 నకిలీ జీఎస్టీ రిజి్రస్టేషన్లను ఇందుకు సంబంధించి రూ.24,000 కోట్లకు పైగా పన్ను ఎగవేతలను గుర్తించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రెండు నెలలపాటు సాగిన స్పెషల్ డ్రైవ్లో అధికారులు ఈ విషయాలను గుర్తించినట్లు వెల్లడించారు. గుర్తించిన నకిలీ రిజి్రస్టేషన్లలో స్టేట్ ట్యాక్స్ న్యాయపరిధిలోని రిజి్రస్టేషన్లు 11,392 కాగా (రూ.8,805 కోట్లు), సీబీఐసీ న్యాయపరిధిలోనివి 10,399 (రూ.15,205 కోట్లు) అని ఆమె వివరించారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను కాపాడటానికి, పన్ను చెల్లింపుదారులు ఎటువంటి తీవ్ర ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ అవుతుంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అధికారాల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నట్లు తెలిపారు. -
ఆ మూడు బ్యాంకుల్లో కోట్ల రూపాయల కుంభకోణం.. సీబీఐ విచారణకు ఆదేశం
కర్ణాటకలోని మూడు సహకార బ్యాంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిగియని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. త్వరలో ఈ బ్యాంకులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీఈఐ) విచారణ జరపనున్నట్లు తెలిపారు. అందుకు సీబీఐకు విచారణ చేపట్టేందుకు ఆమోదం లభించినట్లు ముఖ్యమంత్రి తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్, వశిష్ఠ బ్యాంక్, గురు సావరిన్ బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాల్లోని బాధ్యులు త్వరలోనే బయటపడతారని తెలిపారు. ‘వేలాది మంది డిపాజిటర్లు ఎన్నో కలలతో తమ కష్టార్జితాన్ని ఈ బ్యాంకుల్లో పొదుపు చేసుకున్నారు. బ్యాంకర్ల మోసగించడంతో వారి భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మోసపోయిన డిపాజిటర్లకు న్యాయం చేయాలని పోరాడాను. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇప్పటికి అది సాకారమైంది' అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. శ్రీ గురు రాఘవేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, వశిష్ఠ క్రెడిట్ సౌహార్ద కో-ఆపరేటివ్ లిమిటెడ్, గురు సార్వబహుమ సౌహార్ద క్రెడిట్ మేనేజ్మెంట్ పై సీబీఐ విచారణ జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయా బ్యాంకుల బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, సిబ్బంది చేసిన కోట్లాది రూపాయల మోసాలను బయటపెట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. -
బ్యాంకులో పట్టపగలే రూ.18.80 కోట్ల దోపిడీ
ఇంఫాల్: మణిపూర్లోని ఓ బ్యాంకులో గురువారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని సాయుధ దుండగులు సుమారు రూ.18.80 కోట్లను దోచుకెళ్లారు. ఉఖ్రుల్ పట్టణంలోని వ్యూలాండ్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. రిజర్వు బ్యాంకు అధికారులు ఉఖ్రుల్ జిల్లాలోని అన్ని ఏటీఎంలకు అవసరమైన నగదును వ్యూలాండ్ బ్రాంచిలో నిల్వ ఉంచుతుంటారు. గురువారం సాయంత్రం 5.40 గంటల సమయంలో అత్యాధునిక ఆయుధాలతో ముసుగులు ధరించిన దుండగులు బ్యాంకు సిబ్బంది ప్రవేశించే గేట్ గుండా లోపలికి ప్రవేశించారు. ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదిరించి వాష్రూంలో బంధించారు. క్యాషియర్కు తుపాకీ గురిపెట్టి, క్యాష్ వాల్ట్ను తెరిపించారు. మొత్తం రూ.18.80 కోట్లను ఎత్తుకెళ్లి పోయారు. -
Bank Holidays: డిసెంబర్లో బ్యాంకు సెలవులు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
డిసెంబర్ 2023లో బ్యాంకులకు 18 రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెలలో ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఈ ఐదు ఆదివారాలు, రెండు,నాలుగో శనివారాలతో కలిపి ఈ నెలలో 18 రోజులు బ్యాంకులు బంద్ అవ్వనున్నాయి. ఇందులో ఆర్బీఐ హాలిడే లిస్టుతో పాటు ప్రాంతీయ సెలవులు, సమ్మె దినాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డిసెంబర్ నెలలో బ్యాంకులకు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, క్రిస్మస్తో కలిపి 8 రోజులు సెలవులు ఉన్నాయి. పనుల నిమిత్తం నేరుగా బ్యాంకుకు వెళ్లేవారు ఏయే తేదీల్లో బ్యాంకులు మూతపడుతాయో తెలుసుకుంటే మేలు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు మాత్రం యథావిధిగా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే? డిసెంబర్లో బ్యాంక్ సెలవులు డిసెంబర్ 1: రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం ఇటానగర్, కోహిమా బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 3: ఆదివారం సెలవు డిసెంబర్ 4: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ, గోవాలోని పనాజీలో సెలవు. డిసెంబర్ 9: రెండో శనివారం సెలవు. డిసెంబర్ 10: ఆదివారం సెలవు. డిసెంబర్ 12: లోసంగ్/ పా తోగన్ కారణంగా షిల్లాంగ్లో సెలవు. డిసెంబర్ 13, 14: లోసంగ్/ పా తోగన్ కారణంగా గాంగ్టక్లో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 17: ఆదివారం సెలవు. డిసెంబర్ 18: షిల్లాంగ్లో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 19: గోవా విమోచన దినోత్సవం, పనాజీలో సెలవు. డిసెంబర్ 23: నాలుగో శనివారం. డిసెంబర్ 24: ఆదివారం సెలవు. డిసెంబర్ 25: క్రిస్మస్ సెలవు. డిసెంబర్ 26: ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్లలో క్రిస్మస్ సెలవు. డిసెంబర్ 27: క్రిస్మస్ కారణంగా కోహిమాలో సెలవు. డిసెంబర్ 30: యు కియాంగ్ కారణంగా షిల్లాంగ్లో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 31: ఆదివారం సెలవు. -
రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు!
భారతీయ రిజర్వ్బ్యాంక్ రూ.2000 నోట్లను తిరిగి బ్యాంకులు సేకరించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చలామణీలో ఉన్న 97.26 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చేశాయని ఆర్బీఐ వెల్లడించింది. రూ.2 వేల నోటును ఉపసంహరించుకుని ఆరు నెలలు దాటినప్పటికీ.. రూ.9,760 కోట్లు విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. రూ.2 వేల నోటు ఇప్పటికీ లీగల్ టెండర్గా కొనసాగుతుందని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది. రూ.2వేల విలువైన నోటును ఆర్బీఐ ఈ ఏడాది మే 19న ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ నిర్ణయం వెలువడే నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి/ డిపాజిట్కు ప్రజలకు తొలుత సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత అక్టోబర్ 7 వరకు ఆ గడువును పొడిగించారు. ప్రస్తుతం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే నోట్లను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 30 నాటికి 97.26 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికీ రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుందని, ఆర్ఐబీ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను ఎక్స్ఛేంజీ/ డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు చేరుకోలేనివారు రూ.2 వేలు నోట్లను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపించొచ్చని పేర్కొంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, బేల్పుర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగడ్, చెన్నై, గువాహటి, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, నాగ్పూర్, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. -
ప్లాస్టిక్పై కొత్త ఉద్యమం బర్తన్ బ్యాంక్!
పెళ్లి అనగానే డిస్పోజబుల్ ప్లాస్టిక్ను విపరీతంగా వాడాల్సి వస్తుంది. ఇది పర్యావరణానికి హాని. అంతే కాదు పల్లెల్లో వాటి వల్ల పేరుకున్న చెత్తతో ఎక్కడలేని మురికి. జబ్బులు. అందుకే ఉత్తరాదిలో చాలామంది మహిళా సర్పంచ్లు ‘బర్తన్ బ్యాంక్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఊరికి ఇంతని స్టీలు పెళ్లి సామాను ఇచ్చి అందరూ వాటిని ఫ్రీగా వాడుకునేలా చేస్తున్నారు. ఇది దక్షిణాదికి అందుకోవాల్సి ఉంది. ఇండోర్లో మునిసిపల్ అధికారులు రెగ్యులర్గా కేటరింగ్ వాళ్లను, పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్ హాళ్లను, రెస్టరెంట్లను సందర్శిస్తారు. ఎక్కడైనా ప్లాస్టిక్ వాడితే మొహమాటం లేకుండా ఫైన్ వేస్తారు. ఈ ఫైన్ ఐదు వందలతో మొదలయ్యి 12 లక్షల వరకూ ఉంటుంది. హోటళ్ల వారికి వాళ్లు ఒకటే చెబుతారు– ‘మీరు రోజూ వన్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల చేసే ఖర్చును స్టీలు వాడకం ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు’ అని. ఇండోర్కు క్లీన్ సిటీగా పేరు ఉంది. ఆ పేరును నిలబెట్టాలని అధికారుల తాపత్రయం. అంతే కాదు, వారు ఒక ‘బర్తన్ బ్యాంక్’ను కూడా ఏర్పాటు చేశారు. బర్తన్ అంటే గిన్నెలు. పెళ్లికి కావాల్సిన వంట, వడ్డన కోసం కావాల్సిన అన్ని పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు, గరిటెలు అన్నీ ఒక చోట పెడతారు. 24 గంటల ముందు చెప్పి ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఉపయోగించుకున్నాక శుభ్రం చేసి తిరిగి చెల్లించాలి. ఏవైనా డ్యామేజీ అయినా పోయినా డబ్బు కట్టాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఈ బ్యాంక్కు పోటెత్తుతున్నారు. ఇదంతా ఎలా మొదలైంది? రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా తదితర రాష్ట్రాలలో కొత్తగా పదవుల్లోకి వచ్చిన మహిళా సర్పంచ్లు పల్లెల్లో చెత్తగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ను చూసి ఇది మొదలెట్టారు. రాజస్థాన్లోని జున్జును అనే పల్లెకు నీరూ యాదవ్ అనే ఆవిడ సర్పంచ్ అయ్యాక ఈ సంవత్సరం మొదలులో ‘బర్తన్ బ్యాంక్’ మొదలెట్టింది. ఊరి పెద్దలను ధిక్కరించి నిధులను ఇలాంటి పనులకు ఉపయోగించడం మొదలెట్టిన నీరూ యాదవ్ ‘బర్తన్ బ్యాంక్’ వల్ల ఊరు ఎంత శుభ్రంగా ఉంటుందో ప్రాక్టికల్గా చూపించాక అందరూ ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. అలా ఈ ఉద్యమం రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ‘ప్లాస్టిక్ వద్దు చెత్త వద్దు’ నినాదంతో మహిళా సర్పంచ్లు తమ గ్రామాల్లో బర్తన్ బ్యాంక్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామానికి 1000 స్టీలుప్లేట్లు, రెండు వేల కూర గిన్నెలు, రెండు వేల స్టీలు గ్లాసులు, 2 వేల స్పూన్లు, 50 మంచి నీటి జగ్గులు, ఐదారు వంట డేగిసాలు ఏర్పాటు చేస్తూ... గ్రామంలో ఎవరి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఈ బ్యాంక్ నుంచి ఉచితంగా గిన్నెలు పొందే సదుపాయం కల్పిస్తున్నారు. . దీదీ బర్తన్బ్యాంక్ చత్తిస్గఢ్లోని సర్గుజా జిల్లా అంబికా పూర్లో స్వయంఉపాధి మహిళా బృందాలు తమ ఇళ్లల్లో శుభకార్యాల కోసం ‘దీదీ బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ మహిళల ఈ బ్యాంక్లో ఏర్పాటు చేసుకున్న పాత్రలను ఉచితంగా వాడుకోవచ్చు. అయితే రాను రాను జిల్లా అంతా అందరు ప్రజలూ వాడుకునేలా ఈ ‘దీదీ బర్తన్ బ్యాంక్’లు విస్తరించాయి.‘ప్లాస్టిక్ చెత్త మురుగు నీటికి పెద్ద ప్రతిబంధకం. అది మట్టిలో కలవదు. దానిని రీసైకిల్ చేయడం కూడా వృథా. ఇలాంటి ప్లాస్టిక్కు స్టీలు వస్తువులతో విరుగుడు చెప్పాలి’ అంటారు ఈ మహిళలు. ఒడిస్సాలో ఒడిస్సాలో బర్తన్ బ్యాంక్ ఉద్యమం జోరు మీద ఉంది. నౌపాడ జిల్లాలో భలేస్వర్ అనే పంచాయితీ సర్పంచ్ అయిన సరోజ్ దేవి అగర్వాల్ ఊరి పెద్దలను ఎదిరించి మరీ పంచాయితీ నిధుల నుంచి 75 వేలు మంజూరు చేసి ‘బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసింది. ‘ప్రతి ఊళ్లో ఇలాంటి బ్యాంక్ ఉండాలి’అంటుందామె. అయితే ఈ బర్తన్ బ్యాంక్లు రెండు విధాలుగా పని చేస్తున్నాయి. కొన్ని చోట్ల కామన్గా పాత్రలను ఉంచేస్తే మరికొన్ని చోట్ల ఇంటికి ఇన్నని స్టీలు సామాన్లు ఇచ్చేస్తున్నారు. అంటే పెళ్లికి ఎవరికి పళ్లాలు వాళ్లు తెచ్చుకుని తిని తీసుకెళ్లిపోయేలా. ఇది కూడా బాగానే ఉందంటున్నారు కొందరు. ఏమైనా ఉత్తరాది సంప్రదాయం దక్షిణాదికి కూడా వ్యాపిస్తే బాగుండు. (చదవండి: ఎవరీ గుర్మిత్ కౌర్!..ఆమె గురించి యూకేలో ఎందుకు పోరాటం..? -
ఐడీబీఐ బ్యాంక్ వేల్యుయర్ బిడ్డింగ్ ప్రక్రియ రద్దు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసే అసెట్ వేల్యుయర్ ఎంపికకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను కేంద్రం రద్దు చేసింది. బిడ్డింగ్కు అంతగా స్పందన లభించకపోవడమే ఇందుకు కారణం. బిడ్డర్లను ఆకర్షించే విధంగా బిడ్డింగ్ నిబంధనలను మెరుగుపర్చి, త్వరలోనే కొత్త ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)ని జారీ చేయనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) పేర్కొంది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి 94.72 శాతం వాటాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా, రెండు కలిసి సుమారు 61 శాతం వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసేందుకు అసెట్ వేల్యుయర్ను నియమించడానికి సెప్టెంబర్ 1న దీపమ్ .. బిడ్లను ఆహ్వానించింది. బిడ్ల సమర్పణకు అక్టోబర్ 9 గడువు అయినప్పటికీ అక్టోబర్ 30 వరకు పొడిగించారు. అయినప్పటికీ ఒకే ఒక్క బిడ్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఆర్ఎఫ్పీని జారీ చేయాలని దీపమ్ నిర్ణయించుకున్నట్లు వివరించాయి. వాటాల విక్రయం తర్వాత బ్యాంకులో ప్రభుత్వానికి 15 శాతం, ఎల్ఐసీకి 19 శాతం వాటాలు ఉండనున్నాయి.